|
|
|
శిష్యప్రశంస శ్రీగురురువాచ :_ ధన్యోఽసి కృతకృత్యోఽసి పావితం తే కులం త్వయా । (పాఠభేదః - పావితం) యదవిద్యాబంధముక్త్యా బ్రహ్మీభవితుమిచ్ఛసి ॥ 52 ॥
శ్రీ గురుః - శ్రీగురువు, ఉవాచ - పలికెను, ధన్యః = ధన్యుడవు, అసి - అయినావు, కృతకృత్యం - కృతకృత్యుడవు, అసి = అయినావు, త్వయా - నీచేత, తే - నీ యొక్క, కులం - వంశము, పాలితం = పవిత్రము చేయబడినది, యత్ - ఏ కారణమువలన, అవిద్యాబంధముక్త్యా= అవిద్యాబంధము యొక్క ముక్తిచే, బ్రహ్మీభవితుం - బ్రహ్మయగుటకు, ఇచ్చసి - కోరుచున్నావో
"శ్రీయుతః గురుః శ్రీగురుః - 'శ్రీ'కల గురువు.
శ్రు. ఋచ స్సామాని యజూంపి, సాహి శ్రీరమృతా సతామ్ - ఋక్కులు, సామములు, యజుస్సులు (అనగా వేదములు) సత్పురుషుల యొక్క అమృతమగు సంపద అను శ్రుతిచే శబ్ద రూపములగు ఋగాదులే అమృతను సంప్రద్రూపములై నపుడు, సకలవేదాన్తములను, వాటిచే ప్రతిపాదితమగు అర్థమును సాక్షాత్కరించుకొనిన గురువు శ్రీమంతుడు అని వేరుగ చెప్పవలెనా?
సూర్యాది సకలతేజస్సుల భావమునకు హేతువగు బ్రహ్మతేజస్సుతో సంపన్నుడు అని యర్ధము.
శిష్యుని అంతఃకర ణములోనున్న అంధకారమును తొలగింపగలిగిన, అట్టి శ్రీగురువు శిష్యుని ప్రశ్నకు ఉత్తరమును చెప్పెను. మొదట అతని మనస్సును వికసింప జేయుటకై (ఆనందింప జేయుటకై) శ్లాఘించుచున్నాడు. ధన్యః = ధనమునకు తగినవాడు.
న ఖలు ధనత్వం జాతిః యస్య యదిష్టం తదేవ తస్య ధనమ్, తత్తదిన పామరాణాం ఆకించన్యం ధనం విదుషామ్.
ధనత్వమనునది ఒకజాతి కాదుకదా! ఎవరికి ఏది ఇష్టమో అదే వారికి ధనము. సామాన్య జనులకు ఆ యా వస్తువులు ధనమైనట్లు విద్వాంసులకు లేమియే ధనము అని చెప్పినట్లు, విద్వాంసులు ధనమని అంగీకరించిన వైరాగ్యాది భాగ్యము నీ కున్నది అని అర్థము. అందుకు కారణము 'కృతకృత్యో అ సి ' అనునది. శాస్త్రవిహితములగు కర్మల ననుష్ఠించుటచే శుద్ధచిత్తుడవైనావు అని యర్థము.
చిత్తశుద్ధి లేనిచో సంసారముపై వైరాగ్యము కలుగదుకదా? యేన = ఎవనిచే, కృత్యాని = శాస్త్రవిహితములును, స్వవర్ణాశ్రమాద్యుచితములును అగు కర్మలు, కృతాని = చేయబడినవో అతడు కృతకృత్యుడు.
ఈ విధముగ కృతకృత్యుడవై, చిత్తమును శుద్ధము చేసికొని, తీవ్ర వైరాగ్యమును సంపాదించుకొని మోక్షేచ్ఛ కలవాడవైనావు. ఇట్టి నీచే నీ వంశమంతయు పవిత్రము చేయబడినది. కావుననే -
కులం పవిత్రం జననీ కృతార్థా విశ్వంభరా పుణ్యవతీ చ తేన, అపారసచ్చిత్సుఖసాగరే అ స్మిన్ లీనం పరే బ్రహ్మణి యస్య చేతః
ఎవని మనస్సు అపారసచిత్సుఖ సాగరమగు ఈ పరబ్రహ్మయందు లీనమైనదో అతని కులము పవిత్రమగును; తల్లి పవిత్రు రాలగును; ఈ భూమి పవిత్ర మగును అనియు,
స్నాతం తేన సమస్తతీర్థసలిలే సర్వాపి దత్తావని యజ్ఞానాం చ సహస్రమిష్టముఖిలా దేవాశ్చ సంపూజితాః, సంసారాచ్చ సముద్ధృతాః స్వపితరస్త్రైలోక్యపూజ్యో అ ప్యసా, యస్య బ్రహవిచారణే క్షణమపి స్థైర్యం మనః ప్రాప్నుయాత్ .
ఎవ్వని మనస్సు క్షణకాలమైనను బ్రహ్మ విచారణమునందు స్థిరముగ నుండునో అతడు సమస్త తీర్ధోదకమునందను స్నానము చేసినట్లే. భూమినంతను దానము చేసినట్లే. వేయి యజ్ఞములు చేసినట్లే. సకల దేవతలను పూజించినట్లే, అతడు తన పితృదేవతలనందరిని సంసారమునుండి ఉద్ధరించును. అతడే ముల్లోకములలో పూజ్యుడు అనియు చెప్పుదురు.
అతనికి ఇప్పుడింకను జ్ఞానము కలుగకపోయినను, అతడుత్తమాధికారియగుటచే గురూపదేశమును వినినవెంటనే జ్ఞానవంతు డగును.
పరిపక్వమతేః సచ్చృతం, జనయేదాత్మథియం శ్రుతేర్వచః.
పరిపక్వమైన బుద్ధికలవానికి, ఒక్కమాటు విన్నను శ్రుతివాక్యము ఆత్మజ్ఞానమును కలిగించును అని మాధవీయ శంకర విజయములో శ్రీమదాచార్యులు చెప్పియున్నారు.
"అత్యనవైరాగ్యవతః సమాధిః ” అని ఈ గ్రంథమునందు గూడ చెప్పనున్నారు. శ్రీఘ్రముగనే బ్రహ్మ విలీనమగు మనస్సు కలవాడై కులమును భూమిని గూడ పవిత్రీకరింపచేయును అని భావము.
న విషయభోగో భాగ్యం, యోగ్యం ఖలు యత్ర జన్తుమాత్ర మాత్రమపి బ్రహ్మేన్ద్రరుద్రమృగ్యం భాగ్యం విషయేషు వైరాగ్యమ్.
విషయముల భోగము భాగ్యముకాదు. అట్టి భాగ్యము ననుభవించు ప్రతిపాణికి యోగ్యత యున్నది.
విషయముల యందు వైరాగ్యమును, భాగ్యమును, బ్రహ్మేంద్రరుద్రులు గూడ అన్వేషించుచుందురు అని చెప్పబడిన వైరాగ్యమను భాగ్యము కలవాడగుటచే, మహాపుణ్య శాలి గాన అతనికి వంశపావనత్వము ఇప్పుడుకూడ ఉన్నది.
అందులకు హేతువు చెప్పుచున్నాడు. యత్ - ఏ కారణమువలన, అవిద్యా బంధ ముక్త్యా = అవిద్యాకృతమగు అహంకారాది దేహపర్యంతమగు బంధ మును త్యజించుటచేత, బ్రహ్మీభవితుం = బ్రహ్మ స్వరూపము తోడనే ఉండుటకు కోరుచున్నావో, అందువలన;
దీనిచే తీవ్ర వైరాగ్యానన్తరము కలిగిన తీవ్ర ముముక్ష చెప్పబడినది. ఇట్టి వారు ఈ జన్మలోనే పరబ్రహ్మ సాక్షాత్కారము సంపాదించుకొని కులమును, జగత్తును పవిత్రము చేయుదురు అని అభిప్రాయము.
(అశంక) 'బ్రహ్మీభవితుం' అను పదము "అభూతతద్భా వే చ్విః" - అట్లు లేనిది అట్లు అయినది అను నర్థమున ద్విప్రత్యయము వచ్చును అను నియమము ననుసరించి ద్విప్రత్యయము చేర్చుటచే ఏర్పడినది. కావున పూర్వములేని బ్రహ్మత్వము ఇపుడు సిద్ధించినది అను నర్థము వచ్చును. అ పక్షమున బ్రహ్మభావము అగంతుకము గాన ( లేనిది వచ్చినది గాన) తద్రూపమగు మోక్షముగూడ అనిత్యము రావలసి వచ్చును కదా ?
(సమాధానము) బ్రహ్మయే జీవుడుగా నుండుటచే సర్వదా బ్రహ్మభావముండనే ఉన్నది. కాని అది ఉన్నదను విషయము తెలియుటలేదు. ఆ విషయము తెలిసినపుడు బ్రహ్మీభావము వచ్చినట్లు కేవలము గౌణ ప్రయోగముచే ద్విప్రత్యయము ప్రయోగింపబడినది. అనగా ఇపుడు అజ్ఞానవశముచే బ్రహ్మయే అబ్రహ్మవలె నున్నది.
జ్ఞానము కలిగిన తరువాత బ్రహ్మ బ్రహ్మగానే ఉన్నట్లు గోచరించును. కావున బ్రహ్మ భావము పూర్వము లేనిదీ కొత్తగా వచ్చినదను ఆశంక నిరాకృతమైనది.
అవ. ఎల్లరును భవబంధవిముక్తి కై ప్రవర్తింపవలెనను నభిప్రాయముతో, ఆ విముక్తి వారివారి ప్రయత్నముచేతనే సాధ్యమగు నను విషయమును, లోకానుగ్రహబుద్ధిచే, ముందుగనే గురువు ఉపదేశించుచున్నాడు.
జనులు దాని (ముక్తి) విషయమున నిర్లక్ష్య భావముతో నుండి, ఈశ్వరానుగ్రహ లబ్ధమగు మనుష్య జన్మను వ్యర్థము చేసికొని దుఃఖ పరంపరను అనుభవింప కుందురుగాక యనునది ఈ ఉపదేశము చేయుటలోని ప్రధానోద్దేశ్యము.
śrīguruvācha । dhanyō'si kṛtakṛtyō'si pāvitaṃ tē kulaṃ tvayā । (pāṭhabhēdaḥ - pāvitaṃ) yadavidyābandhamuktyā brahmībhavitumichChasi ॥ 52॥
This sloka has to be interpreted as Guru's primary fulfillment in life. Adi Sankara had the famous four disciples: Suresvara, Padmapaada, Totaka and Hastamalaka. We surmise whatever Sankara taught was initially for the benefit of the four. Had he waited for a larger flock to begin teaching, it would have been quite a loss as none could be sure of how long it would take for a fifth disciple to appear at his door step.
If you ask how many attended Jesus Christ's Last Supper, most would say a dozen, out of 72 disciples. This is what Michael Angelo had depicted in his famous art. When Jesus had so many disciples, why did Sankara have so few? There are several answers:
1) Though Jesus and Sankara lived unto their thirties, Sankara came from a guruparampara and didn't claim divinity
2) The "admission" process was far stricter for Sankara. To be his disciple, he expected a severe case of mumukshatva or extreme longing for liberation. On the other hand, anyone who accepted Jesus as the son of God was welcomed as his disciple
3) A disciple of Sankara had to give up all relationships, practice severe austerities and follow him wherever he went. Only bondage with the Guru was acceptable.
The flip side of the sloka is, the Guru waxing with joy for having met a disciple so well prepared to seek his knowledge, might not have met anyone like him before. For all we know, he could be the first one seeking the Guru's advice. The Guru thought the disciple was genuine and perfect to receive his tutelage based on the erudite queries put forth by the disciple.
It is common to treat a youngster embracing sannyasa as an outlier. Some would say: if not for fame, why else would a child do it, as sannyasi's are not known to garner anything pecuniary? Anticipating this argument, the Guru promises welfare of the kula, or clan, that includes not just immediate family, when one takes up tutelage under a guru.
However, if everyone in a village took up sannyasa, there would be no one left to tend fields, cattle, and so on. The entire village soon would face extinction, as there would be no economic output. If indeed that happens, the criteria for admitting one to sannyasa would be made stricter or more stringent. Hence mumukshatva was tested and only the well prepared were selected.
This is not unlike modern education system where stundents have to clear an entrance test. But there are no supply-demand constraints. Suppose there are too many unemployed engineering graduates, little is done to curtail the eligibility. In the olden times, this has been efficiently enforced when it comes with children seeking sannyasa by choosing only the most desirous of moksha or the academic process leading up to the liberation.