Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 4 Section 4

Bhagavat Gita

4.4

అర్జున ఉవాచ:

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః {4.4}

కథ మేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి

నీవు సూర్యుని తరువాత పుట్టినావు. సూర్యుని జన్మ అతి ప్రాచీనమైనది. నీవు సూర్యునికి ఉపదేశించితి వను విషయము నేనెట్లు గ్రహించగలను?

శ్రీ భగవానువాచ:

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున {4.5}

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప

అర్జునా! నీకును, నాకును అనేక జన్మలు గడచినవి. పరంతపా! ఆ జన్మములు నన్నిటిని నేనెఱుగుదును. నీ వెరుగవు

అర్జునుడు శ్రీ కృష్ణుని ఇలా ప్రశ్నిస్తున్నాడు: "కృష్ణా! నీవూ, నేనూ సమ వయస్కులం . కానీ నువ్వు పూర్వకాలంలో మునిపు౦గవులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేనని చెప్తున్నావు. ఇది నాకు అర్థం కావటం లేదు. నీవెందుకు మథురలో జన్మించి వేల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు చెప్తున్నావు?"

శ్రీకృష్ణుడు మందహాసంతో "నీకూ, నాకూ అనేక జన్మలు ఈ భూమి మీద కలిగినవి. నీవు భూమి మీద మొదటిసారి ఉండి లేవు" అని చెప్పెను.

ఆధ్యాత్మికత అలవరచుకోవడానికి పునర్జన్మ ఉందని నమ్మనక్కరలేదు. మనము పలు జన్మలు ఉంటాయని నమ్మినా ధ్యానం, ఇంద్రియ నిగ్రహం మొదలైనవి ఉపయోగపడతాయి. పునర్జన్మ ఉందని మూఢ౦గా నమ్మితే ఒక ప్రమాదమున్నది. ఒక పని ఈ జన్మలో సాధ్యంకాదని వదిలేసి ఉదాసీనంగా ఉంటాము. తక్షణమే చేయవలసిన పనులను పునర్జన్మ ఉంది కదా అని వాయిదావేయవచ్చు.

విశ్వవిద్యాలయ చదువుని ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సాధారణంగా సంవత్సరానికి రెండు క్లాసులు ఉంటాయి. వాటిని సెమిస్టర్ అంటారు. కొందరు మనమొక సెమిస్టర్ పూర్తి చేసి స్వర్గానికై దరఖాస్తు పెట్టుకోవచ్చు. అప్పుడు శ్రీకృష్ణుడు, జీసస్, లేదా బుద్ధుడు మనల్ని భూమి మీద ఏమి చేసేమని అడగవచ్చు. మనము తలిదండ్రులను, సంతానాన్ని, మిత్రులను, చివరకు శత్రువులను కూడా మనకంటే ముఖ్యులుగా తలంచక పోతే దేవుడు మనల్ని వచ్చే సెమిస్టర్ కి దరఖాస్తు పెట్టుకోమని చెప్తారు. టిబెట్ దేశస్థులు బార్డో అనే త్రిశంకు స్వర్గంలో ఎన్నో ఏళ్లు మనం నిరీక్షించాలని నమ్ముతారు.

మన జీవిత లక్ష్యం, విశ్వవిద్యాలయంలో స్వార్థాన్ని, వేర్పాటుని, వదులుకొని పట్ట భద్రులవ్వడం. మనకు పట్టాలిచ్చేవారు శ్రీకృష్ణుడు, లేదా జీసస్, లేదా బుద్ధుడు. వారు మనల్ని ఉత్తీర్ణులమని చెప్తే గాని మన లక్ష్యం చేరినట్టు కాదు.

శ్రీకృష్ణుడు అర్జునుడు భూమి మీద అనేక జన్మలు ఎత్తేడని చెప్తే నమ్మశక్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పేడు: "నీకు పూర్వ జన్మల జ్ఞాపకాలు లేవు. నేనూ ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని. కానీ నాకు ఇప్పటికీ నా గత జన్మలు గుర్తున్నాయి. ఎందుకంటే నేను ఆత్మ జ్ఞానము పొందేను కాబట్టి."

మనము దేహంతో తాదాత్మ్యం చెందినంత సేపూ చేతన మనస్సును అఖండంగా చేసికోలేము. అలా కాక మన నిజ స్వరూపము, దేహము కాదని, ఆత్మ అని తెలుసుకొంటే మన చేతన మనస్సు అఖండమౌతుంది. జలాలుద్దీన్ రూమి ఇలా వ్రాసేరు:

నేనో ఖనిజాన్ని, అలాగ ఎదిగి మొక్క నయ్యేను

మొక్కగా నేను మరణించేను; తర్వాత జంతువుగా పుట్టేను

జంతువుగా మరణించేను; మానవునిగా పుట్టేను

నాకు ఏమి పోగొట్టుకుంటానని చావంటే భయం?

మళ్ళీ నేను మానవుడిగా మరణించి

దేవ దూతల బృందంలో చేరుతాను

కాని నేను వాళ్లకనా ఉన్నత స్థానంలో ఉండాలి

పరమాత్మ తప్ప అందరూ మరణించవలసినవారే

నేను దేవదూతగా మరణిస్తే ఊహాతీతమైన స్థితిని పొందుతాను

నా అహంకారాన్ని వదిలి మరణిస్తే "ఆ దేవుని దగ్గరకే వెళ్తాను"

యోగులు చెప్పే సమాధి స్థితి ఇదే. ధ్యానం వలన దీన్ని పొందవచ్చు. 219

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...