Thursday, March 10, 2022

Chapter 18 Section 31

Bhagavat Gita

18.31

కచ్చి దేత చ్చృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా {18.72}

కచ్చి దజ్ఞానసమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ

అర్జునా! నిశ్చల చిత్తముతో నీవు గీతా శాస్త్రమును ఆలకించితివా! అజ్ఞానము వలన కలిగిన నీ మోహము నశించినదా?

అర్జున ఉవాచ :

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయా అచ్యుత

స్థితో అస్మి గతసందేహః కరిషే వచనం తవ

కృష్ణా! నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది. {18.73}
సంశయ రహితుడ నైతిని. నీ ఆజ్ఞను శిరసావహింతును ఀ

గీత చెప్పేది: యుద్ధం మరియు భక్తి. సంస్కారాలతో, ఎప్పుడూ విడువకుండా, పోరు సల్పి తక్కిన వాటికై భక్తి సల్ప౦డి. అర్జునుడు "నాకు గత స్మృతి కలిగింది. నేనెవరినో తెలిసికొన్నాను" అని చెప్పెను. మన ప్రస్తుత పరిస్థితి మతిమరుపుతో కూడినది. మన దైవత్వాన్ని మరిచిపోయేం. ఒకరికి మతిమరుపు కలిగితే వాని బంధుమిత్రులు వచ్చి వానికి ఎరుక కల్పించరూ? మన౦ ఆధ్యాత్మిక మరపు నుండి లేచి ఇలా గుర్తు తెచ్చుకుంటాము: మనమొక విడిపడిన జీవి కాదు. మనం ఒక రాజ కుమారులం. మన కర్తవ్యం స్వరాజ్యానికి తిరిగి వెళ్ళడం.

శ్రీకృష్ణుడు మనకొక సవాలు ఇచ్చేడు: మీరు క్షమిస్తే, నిర్దయ కు బదులుగా దయ చూపితే, ప్రేమతో స్పర్థను జయించ గలిగితే, వెలుగులో ఉన్నారు. కానీ మీరు క్షమించ లేక పోతే, హింసను హింసతో ఎదుర్కొంటే, ప్రతిపక్షంలో ఉన్నారు. కావున గీత చెప్పేది: ప్రపంచం యొక్క విధి మీ చేతులలో ఉంది. మన ఎన్నిక చేసికొని, ప్రపంచాన్ని మలచుకోవాలి.

మనలోని క్రూరమైన శత్రువును ఎన్నో ఏళ్లు తెలికోలేదు. మన ప్రవృత్తి, తిరుగుబాటు తనము, భయం లేకుండుట ఇందుకని: మనం ప్రపంచాన్ని ఒంటరిగా పడవలో ప్రయాణించే ధైర్యం, ఎవ్వరూ ఎక్కని కొండని ఎక్కే ధైర్యం, ఎందుకంటే మన అహంకారాన్ని జయించడానికి. ఏ పోరూ దీనికి సరి కాదు. ఏ యుద్ధం ఇంత భీకరంగా ఉండదు. కాని యుద్ధం గెలిచిన తరువాత, మన అచేతన మనస్సులోని క్రోధము, భయము, దురాశ సమసి మన చేతనము కాంతితో నిండి యుంటుంది.

ఉపనిషత్లు చెప్పినట్లు: మనము అవాస్తవము నుంచి వాస్తవమునకు, చీకటినుంచి వెలుగుకు, మరణము నుండి అమరత్వమునకు వెళ్తాం. 480

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...