Thursday, March 10, 2022

Chapter 18 Section 30

Bhagavat Gita

18.30

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్య౦ సంవాదవయోః {18.70}

జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః

మన ఈ ధర్మరూపమైన సంవాదమును ఎవరు చదువునో వాడు జ్ఞాన యజ్ఞముతో నన్ను పూజించిన వాడగుచున్నాడు. ఇది నా అభిప్రాయము

శ్రద్ధావాననసూయశ్చ శృణుయోదపి యో నరః {18.71}

సో అపి ముక్తశ్శుభాన్ లోకాన్ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్

ఈ గీతాజ్ఞానమును శ్రద్ధావంతుడై, అసూయా రహితుడై ఆలకించెడి మనుజుడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందెడి లోకములను పొందుచున్నాడు ఀ

సంప్రదాయం ప్రకారం సంతోషమైన ప్రపంచం అనగా స్వర్గం, మరణించిన తరువాత పొందేదని చెప్పబడుచున్నది. గీతా పారాయణం చేసినంత మాత్రాన స్వర్గం వస్తుందని నమ్మేవారిని చూసి పండితులు నవ్వుతారు. ధ్యానం చేయక పోయినా ఒక శాస్త్రాన్ని ఔపాసన భక్తితో, శ్రద్ధతో చేస్తే మనస్సు శుద్ధి చెందుతుంది. ఆ విధంగా మన కర్మలు కూడా శుద్ధమవుతాయి.

శ్రీకృష్ణుడు "ఎవరైతే గీతని భక్తితో, శ్రద్ధతో చదువుతారో, వాళ్ళు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. ఇది మూఢ నమ్మకము కాదు. శ్రద్ధ గలవారు--అనగా తమను భౌతికంగా కాక, ఒక రసాయన సముదాయము కాక చూచువారు -- దానిని నమ్ముతారు. ఇది జ్ఞానమనే ఒక కిటికీని తెరవడానికి చాలు. అటువంటివారు తమకు జీవితం లేదా మనుష్యుని గూర్చి పూర్తి అవగాహన లేదని నిజాయతీగా చెప్తారు. వారు మేమి౦కా వెదుకుతున్నామని చెప్పవచ్చు. హృదయం అంగీకరిస్తే అది చాలు. గీత మొదలైన శాస్త్రాలను నిష్కపటంగా చదివి, వానిని నిజ జీవితంలో పరీక్షిస్తే గొప్ప ఆశను పొందుతారు.

శ్రీకృష్ణుడు వారు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు అని ప్రమాణం చేయలేదు. వారు ప్రపంచ సమస్యలు: పేదరికం, కాలుష్యం, జాత్యాహంకారం, కుటుంబంలో స్పర్థలు, అహంకారం మొదలైనవాటిని స్పష్టంగా చూస్తారు. కానీ ఎన్నిక చేయడానికి అవకాశం ఉందని తెలుసుకొంటారు. వారు తమ జీవితానికి ఒక లక్ష్యం ఉందని, ప్రపంచానికి సహాయ పడగలమని తెలుసుకొంటారు. దానికి కావలసిన పనిముట్లుతో -- ధ్యానం మొదలగునవి-- తమ అంతర్గత శక్తిని వెలికి తీయగలగుతారు. శ్రీకృష్ణుడు "అటువంటివారు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. నేననేది "వారు ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా చేస్తారు." బాధల మధ్యలో ఇతరులకు సహాయం చేయడం వలన ఆనందాన్ని పొందుతారు.

విపష్చిత్ అనే ఒక రాజు పూర్వం ఉండేవాడు. అతను అశోకుడి లాగ తన దేశ ప్రజల సౌఖ్యముకై పాటుపడ్డాడు. ప్రజలు అతన్ని ప్రేమించి గౌరవించేవారు. అతను మరణించిన తరువాత శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై స్వర్గానికి తీసికువెళతానన్నాడు. కానీ విపష్చిత్ కు ఒక ప్రశ్న కలిగింది. "దేవా నేను స్వర్గ సుఖాలు అనుభవించే ముందు, నరకంలో కలిగే దుఃఖాలను చూడవచ్చా?"

శ్రీకృష్ణుడు అలాగే అని, ఒక దూతనిచ్చి నరకానికి తీసికెళ్లమన్నాడు. కాని అతడు ఎక్కడకి వెళ్ళినా జనులు ఆనందంతో వచ్చి ఆయనను ఆదరించేరు. ఆయన దూతని "నేను నరకాన్ని చూడాలనుకొన్నాను. నన్ను స్వర్గానికి ఎందుకు తీసికు వచ్చేవు?" అని అడిగేడు.

దూత "మహానుభావా, ఇదే నరకం" అన్నది.

"నాకు అర్థమవ్వటంలేదు. నేను నరకం దుఃఖ మయం అనుకొన్నాను. కానీ ఇక్కడ అందరూ ఎందుకు ఆనందంగా ఉన్నారు?"

"ప్రపంచం దుఃఖంతో కూడియున్నది. నీవు వాళ్ళను చూడడానికి వచ్చినందుకు అంత ఆనందం పొందుతున్నారు"

"నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను. నా స్వర్గం ఇక్కడే" అని విపష్చిత్ అన్నాడు 478

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...