Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 1 Section 9

Bhagavat Gita

1.9

దోషై రేతైః కులఘ్నానాం వర్ణసంకర కారకైః {1.43}

ఉత్సాద్యన్తే జాతి ధర్మాః కులధర్మాశ్చ శాశ్వతాః

ఈ కులనాశకుల దోషము చేత శాశ్వతములైన జాతి ధర్మములు, కులధర్మములు నశించిపోవును

ఉత్సన్న కుల ధర్మాణాం మనుష్యాణాం జనార్థన {1.44}

నరకే నియతం వాసో భవతీ త్యనుశుశ్రుమ

జనార్థనా! కులధర్మములను పాడుచేసుకొనిన మనుష్యులకు శాశ్వతముగ నరకము ప్రాప్తించునని మనము వినుచున్నాము

అర్జునడు ఐకమత్యము లేకుండా ఉన్న జీవితం యొక్క పర్యావసానాన్ని చెప్పుచున్నాడు. మనము స్వర్గము, నరకము ఎక్కడో ఉన్నాయని ఊహిస్తాము. నిజంగా అవి భూమి మీద ఉన్న మన పరిస్థితిని వివరించే భావాలు. మనం ఇతరుల సంతోషానికై పాటుపడితే భూతల స్వర్గాన్ని అనుభవిస్తాం. అలా కాక ఇతరుల యందు నిర్దయతో ఉంటే నరకాన్ని ఇక్కడే అనుభవిస్తాం.

హింస, యుద్ధాలు, కాలుష్యం, ఎడబాటు, కఠినత్వం మొదలగునవి ఐకమత్యము లేకుండా ఉంటే కలిగే అనర్థాలు. మనం జీవితాన్ని లోతుగా పరిశీలించక యుండడం వలన మనలోని క్రోధాన్ని, భయాన్ని గ్రహింపలేకున్నాము. కొన్నేళ్ళు ధ్యానం చేస్తే వాటిని ఎదుర్కొని నిర్మూలించగలిగే శక్తి వస్తుంది. ధ్యానం మొదట్లోనే మన వ్యక్తిత్వాన్ని, నడవడికను, చేతన మనస్సును మార్పు చెయ్యగలిగే శక్తిని పొందుతాము. మనలో అలజడి చేసే ఎడబాటును నిర్మూలించే౦దుకు ప్రయత్నిస్తాము. దానివలన మన ఆరోగ్యం, ఇతరులతో సామరస్యం పెరిగి మన మనస్సు నిర్మలమై, మేధ పదునుగా అవుతాయి. అలాగే మనకు భద్రత, స్వస్థత కలిగేయనే భావన గట్టి పడుతుంది. ఎటువంటి సమస్యలు ఎదురైనా, పట్టుదలతో, జ్ఞానంతో వాటిని అధిగమిస్తాం.

జీవైక్యతా భావన సాధారణ వ్యక్తులను కూడా అత్యంత ఆధ్యాత్మిక శక్తి గలవారుగా మారుస్తుంది. సమాధిలో మనము అట్టి భావనలను పొందుతాము. అప్పుడు మన హృదయం, మనస్సు, ఆత్మ దేవుని మీద నిలకడగా ఉంటాయి. స్వామీ రామదాసు ఇలా చెప్పేరు:

"సాధనలన్నీ మనస్సును నిశ్చల౦గా ఉంచడానికై చెయ్యబడతాయి. ఏ మనస్సయితే అచలంగా ఉంటుందో అది పరమాత్మ స్వరూపము. " 41

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda Agastya-Lopamudra

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 Death - 3 Death - 4 Death - 5 ...