Bhagavat Gita
11.22
శ్రీ భగవానువాచ:
మయా ప్రసన్నేన తవార్జునే దం రూపం పరం దర్శితమాత్మ యోగాత్
{11.47}
తేజోమయం విశ్వమనంతమాద్య౦ యన్మే త్వదన్న్యేన న దృష్టపూర్వమ్
తేజోమయ మైనదియు, అంతము లేనిదుయు, ఆది యందున్నదియు నగు ఈ విశ్వరూపమును దయచేసి నీకు దర్శింపచేసితిని. నీవు తప్ప మరెవ్వరు గతములో ఈ రూపమును దర్శించలేదు
న వేదయజ్ఞాధ్యయన్నైర్న దానైః న చ క్రియాభిర్న తపోభిరుగ్రైః
{11.48}
ఏవంరూపశ్శక్య అహం నృలోకే ద్రష్టు౦ త్వదన్యేన కురుప్రవీర!
అర్జునా! మానవ లోకము నందు నీవు దప్ప అన్యులెవ్వరు వేదాధ్యయనము వలనగాని, యజ్ఞములు, దానములు వైదిక కర్మలు, ఉగ్ర తపస్సులు మొదలగువాని చేతగాని నన్ను చూడలేరు. ఀ
మనం ఏ యోగినైనా దేవుని ఎలా కనబడతాడు అని అడిగితే వారు చెప్పేది: మేము అర్హుల మైనందుకు కాదు; ఆయన దయ వలన. మనం చెయ్యగలిగిందల్లా చిత్తశుద్ధితో ధ్యానం. చిట్ట చివరకి అహంకారాన్ని జయించి, మనమి౦క ముందుకు సాగలేకుంటాము. అప్పుడు మన నమ్మకంతో "నీవు ప్రత్యక్షం కాకపోయినా ఫరవాలేదు. నిన్ను మనసారా ప్రేమిస్తే చాలు. నాకు బదులుగా ఏమీ వద్దు" అని వేడుకొంటాం. సూఫీ యోగిని రబియా ఇట్లు చెప్పెను:
దేవా! నేను నిన్ను నరకం అంటే భయంవలన ప్రేమిస్తే
నన్ను నరకంలో పడేయ్
నేను స్వర్గ సుఖాలకై నిన్ను ప్రేమిస్తే
నన్ను స్వర్గం లోకి రానీయకు
కానీ నీ మీద ఉన్న ప్రేమతో ప్రేమిస్తే
నన్ను ఒంటరి దాన్ని చెయ్యద్దు
మనమిలాగ సంపూర్ణమైన ప్రేమతో దేవుడ్ని -- అల్లా, జీసస్, బుద్ధుడు, శ్రీకృష్ణుడు ఎవరినైనా -- ప్రార్థిస్తే క్రమంగా దేవునిలో ఐక్య మవుతాం.
"ఓ దేవా నేను మంచి కార్యాలు చేయడం మొదలు పెట్టడానికి, వాటిని చేయడానికి, విజయం పొందటానికి నీ కరుణ ఎంతో అవసరం. నీ కరుణ లేనిదే నేనేమీ చెయ్యలేను. కానీ నీ కరుణ నన్ను బలోపేతం చేస్తే నేనన్ని పనులు చేయగలను"
అని ది ఇమిటేషన్ ఆఫ్ క్రైస్ట్ చెపుతుంది.
సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా చెప్పేరు:
మనమెంత ధ్యానం చేసినా, అహంకారాన్ని జయించినా, ఆనంద భాష్పాలు ధ్యానంలో రాల్చినా మనకి దైవ కృప లభించక పోవచ్చు. అది దేవుడు ఇష్టం మీద ఆధారపడేది. మనమంతా ఆయన బంటులం. ఆయన మనను తన కిష్టమైన రీతిలో నడిపిస్తాడు.
సూఫీ జలాలుల్ దిన్ రూమి "మనం బాణాన్ని ప్రయోగించే వారలము కాదు; మనము విల్లు మాత్రమే. విలుకాడు భగవంతుడు" అని వ్రాసెను. 316
No comments:
Post a Comment