Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 36

Bhagavat Gita

2.36

య స్సర్వత్రానభిస్నే హస్తత్త త్ప్రాస్య శుభాశుభమ్ {2.57}

నాభినందతి స ద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

ఎవడు సమస్త విషయము లందును అభిమానము లేనివాడై, తత్స౦బంధమైన మంచి చెడులు కలిగినపుడు సుఖ దుఃఖముల నొందక యుండునో అట్టివాని బుద్ధి స్థిరమైనది

యోగులు మన అహంకారం, మనమే ముఖ్యులమనే భావన వలన నిరాశ, నిస్పృహ, విచారము పొందుతామని చెప్తారు. మనం అహంకారంతో ఉన్నంత కాలం స్వంతంత్రులమని తప్పుగా భావిస్తాం. ధ్యానం ద్వారా ప్రతి చిన్న బాంధవ్య౦లోనూ మన అహంకారం అచేతనంగా, అప్రయత్నంగా ప్రభావితం చేస్తున్నాదనే జ్ఞానం పొందుతాము.

మనను 5 ఏళ్ల లోపు పిల్లలను దేవుళ్ళుగా చూడమంటారు. అంటే వాళ్ళకి లొంగి ఉండమని కాదు. వారిని హత్తుకొని, ముద్దులిచ్చి, బుజ్జగించి, లాలించి పెంచమని. ఈ విధంగా చేస్తే వారికి మానసికంగా మరియు భౌతికంగా మనతో బంధం ఏర్పడి, అది పెద్దయ్యేవరకూ కొనసాగుతుంది.

మనము మన పిల్లలకి ఆదర్శంగా ఉండాలి. ధూమ పానం మొదలగు చెడు అలవాట్లను వీడకపోతే పిల్లలు ఎదిగి అలాగే చేస్తారు. జీసస్ "నీవు మళ్ళీ చిన్న పిల్ల వాడిగా మారకపోతే, స్వర్గాన్ని చేరలేవు" అన్నారు. వర్డ్స్ వర్త్ అనే కవి "స్వర్గం బాల్యం లో గడిపేది" అని అన్నారు.

ఇకపోతే 5 నుంచి 16 ఏళ్ల వరకు పిల్లలను సేవకులుగా చూడాలంటారు. అది కొంచం కఠినమనిపించవచ్చు. కానీ నమ్రత, వినయం వంటి మంచి గుణాలు అలా చేస్తేనే వారిలో వస్తాయి. మానసిక శాస్త్రవేత్తలు పిల్లల మంచికై తలిదండ్రులు నిర్ణయం తీసికోలేకపోతే అది వారిని ఆశ్చర్యపరుస్తుందని చెప్తారు. ఈ వయస్సు పిల్లలు నిరసనతో తలుపులు బాదినా, బుద్ధితో సున్నితంగా హెచ్చరించే తలిదండ్రులను గౌరవిస్తారు. వారు తలిదండ్రులకు విధేయతతో ఉండకపోతే పెద్దయ్యేక ఆత్మకు కూడా విధేయులై ఉండరు. తలిదండ్రులు వారికి ఆత్మల వలె పనిచెయ్యాలి. అందుకే ధ్యానం చేసేవారిలో తలిదండ్రులకు ఎక్కువ విలువ.

పిల్లలు 16 ఏళ్లు దాటితే వాళ్ళని మనతో సమానంగా చూసుకోవాలి. వారిని శిక్షించక, వారికి వివరణ ఇవ్వగలగాలి. వారి బుద్ధిని పెంచే విధంగా ప్రవర్తించాలి. మన దృక్పథాన్ని వారికి వివరించి, వారి మనోభావాలను తెలిసికోవాలి. ఎందుకంటే తలిదండ్రులు, పిల్లలు తమ మనో భావాలతో విడిబడక ఉంటే వారి మధ్య బేధాభిప్రాయాలు కలుగుతాయి.

మనను వ్యతిరేకించే ఇతరుల మనోభావాలను గౌరవంతో ఆలకిస్తే, ఎప్పుడో ఒకప్పుడు మన ప్రత్యర్థిగురించి సదభిప్రాయం కలుగుతుంది. మన తలిదండ్రులను ఖండించకుండా, వారు చెప్పేది ఒప్పని చెప్పగలిగితే మనలోని జంకు, భయం తగ్గుతాయి. తిరిగి వాళ్ళు మనతో ఏకీభవించి మన అభిప్రాయాన్ని లేదా నిర్ణయాన్ని అంగీకరించవచ్చు. దీని వలన తలిదండ్రుల, పిల్లల మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా ఉంటుంది. "నేను తప్పు పడ్డాను" అని చెప్పగలిగే నమ్రత ధ్యానం వలన పొందవచ్చు. "నాకు తెలీదు" అని ధైర్యంగా చెప్పగలిగితే జీవితంలో చాలా సమస్యలు పరిష్కరింపబడతాయి. 114

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...