Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 35

Bhagavat Gita

2.35

దుఃఖే ష్వనుద్విగ్నమనా స్సుఖేషు విగతస్పృహః {2.56}

వీతరాగభయక్రోధః స్థితధీ ర్ముని రుచ్యతే

దుఃఖముల యందు కలత చెందని వాడును, సుఖముల యందు ఆశలేని వాడును, అనురాగము, భయము, క్రోధములను త్యజించిన వాడును స్థిరమైన జ్ఞానము కలవాడని చెప్పబడును

గీత చెప్పేది జీవితం ద్వంద్వాలతో -- అనగా సుఖ-దుఃఖాలు, జయాపజయాలు, జనన-మరణాలు మొదలైనవి--కూడినది. నేను చిన్నప్పుడు ఎల్లప్పుడూ సుఖపడ వచ్చుననే భావంతో ఉండేవాడిని. పెరిగి పెద్దవ్వుతుంటే తెలిసింది సుఖంతో పాటుగా దుఃఖం కలసి వస్తుందని. మనకి దుఃఖం రాకూడదనుకొంటే, సుఖాలని మర్చిపోవాలి.

పై విధంగా గీత చెప్పే బోధ కొంత నిరాశ కలిగించవచ్చు. మన బుద్ధిని ఉపయోగి౦చి ఇంద్రియాలు ఇచ్చే సుఖ-దుఃఖాలను ఎన్నిక చేసుకోవచ్చునని అనుకోవచ్చు. నిజానికి ఇక్కడ ఎన్నిక లేదు. మనం సుఖ-దుఃఖాలు రెండింటినీ దాటితే శాశ్వతమైన, క్షోభలేని, భద్రమైన, మిక్కిలి ఆహ్లాదకరమైన స్థితిని పొందవచ్చు. దీన్నే గాంధీ రామ రాజ్యం అనే వారు. మనము నిజంగా దానిలో నివసించకూడదు. ఎందుకంటే అక్కడ అన్నీ సుఖాలే.

శ్రీకృష్ణుడు నీవు స్థితధి కాలేవా అని అడుగుతున్నాడు. అనగా జీవితం మననొక ఆట బొమ్మలాగ క్రిందకీ, మీదకీ, దుఃఖానికీ, సుఖానికీ త్రిప్పుతున్నది. అలాగే పరుల మెప్పుకై ఆశపడి, విమర్శలు వస్తాయేమోనని భయపడి, ఇతరులను మభ్య పెడుతూ, దయ చూపిన వారియందు నిర్దాక్షిణ్యంగా ఉండడం కూడా చెయ్యకూడదు.

గీత మనకు బోధించేది -- మనము సుఖంగా ఉండాలంటే ఇతరుల సుఖానికై శ్రమ పడాలి. అలాగే మనం దుఃఖంలో కూరుకుపోవడం ఇతరులను దుఃఖితులను చెయ్యడం వలననే. అంతేకానీ దేవుని, విధి వ్రాతని దూషించకూడదు.

మనము చాలా కాలంగా కోర్కెలు, అవసరాలు, ఆశలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటే, ఓర్పుతో ఇతరులకై మన లాభాన్ని, సంతోషాన్ని పంచి పెట్టాలి. ఇది బుద్ధితో చేసే పనికాదు. పట్టుదలతో కూడినది.

నేను ఎదుగుతున్నవారి యందు, వారు ముక్కుతూ మూలుగుతూ ఉన్నా, ఎక్కువ జాలి చూపను. ఎందుకంటే వారు తమ కాళ్ళ మీద నిలబడితేనే నాకు మిక్కిలి ఆనందం. కన్నీళ్ళు, కష్టాలు ఎదుగుతున్నప్పుడు అందరికీ కలిగేవి. శ్రీకృష్ణుడు దుఃఖం వస్తే దాన్ని ఆసరాగా తీసికొని మనం ఎదగాలి అని బోధిస్తున్నాడు. అంటే ఆధ్యాత్మిక చింతన అలవరచుకోవాలి. దుఃఖం ఒక నియంత వలె నుండి మనకు కఠినంగా పాఠాలను నేర్పుతుంది. లేకపోతే మనం జీవితంలో ఏమీ నేర్చుకోలేము. మనం బాధలలో ఉన్నప్పుడు: "భగవంతుడు నన్ను ఆధ్యాత్మిక జీవితం గడపమంటే, నేను సదా అతని దయ, కరుణ ఉంటాయనుకొన్నాను. కానీ ఇప్పుడు నాకు దుఃఖం, ఏడుపు కలిగిస్తున్నాడు. ఒక భక్తుని చూచే విధమిది కాదు" అని అనుకోవచ్చు. దేవునికి మన మీద అమితమైన ప్రేమ ఉంది. ఆయనకు కృత్రిమమైన జాలి లేదు. దేవుడు మనల్ని స్వార్థం నుంచి, వేర్పాటునుంచి బయటకు వచ్చి తనతో తాదాత్మ్యము చెందమంటాడు. అందుకై ఆయనకు తెలిసి దుఃఖం ఒక్కటే మనము అర్థం చేసికొనే భాష. 111

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...