Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 40

Bhagavat Gita

2.40

తాని సర్వాణి సంయమ్య యుక్త ఆసీతమత్పరః {2.61}

వ శే హి యస్యే౦ద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా

యోగయుక్తు డగువాడు ఇంద్రియములను నిగ్రహించి, మత్పరుడై యుండవలెను. ఎవనికి ఇంద్రియములు నిగ్రహింప బడినవో అట్టివాని బుద్ధియే స్థిరమైనది

"నేను ఇంద్రియాలను దేహాన్ని, అదుపులో పెట్టుకోవాలి" అని అనుకుంటూ ఇంద్రియాలను ఎన్నటికీ స్వాధీనంలో ఉంచుకోలేము. నేతి, నేతి ప్రక్రియ ద్వారా తెలిసేది: నేను దేహాన్ని కాను, ఇంద్రియాలను కాను, మనస్సును కాను, బుధ్ధిని కాను, అహంకారాన్ని కాను. గొప్ప యోగులు ఈ విధంగా ఆత్మ జ్ఞానాన్ని పొందేరు. సాధారణ వ్యక్తులకు వారిలాగ హిమాలయాలకు వెళ్ళి తపస్సుచేయడం సాధ్యము కాదు.

ఏది ఏమైనా గీతలో ఒక్క చెడు వాక్యం లేదు. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు యుక్త ఆసీత మత్పరః అంటాడు. అంటే దేవుడు నాయందు ఉన్నాడు. నేను అతన్ని అడిగేది "నా ముందు ప్రత్యక్షం అవ్వు. నన్ను నీలో ఐక్యం చేసుకో. నీ పాద పద్మాల మీద ఒక అణువుగా చేసుకో".

ఈవిధంగా దేవుని ప్రార్థిస్తే మనలో మంచి మార్పులు కలిగి, మన తలిదండ్రుల లోనూ, సహధర్మచారిణి లోనూ, పిల్లలలోనూ, మిత్రులలోనూ ఆయనను దర్శిస్తాము. మనం ఇతరులకు ఆనందం కలిగిస్తే, ఇంద్రియాలను జయించినట్టే. 123

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...