Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 42

Bhagavat Gita

2.42

రాగద్వేష వియుక్తైస్తు విషయా నింద్రియై శ్చరన్ {2.64}

ఆత్మవశ్యై ర్విధేయాత్మా ప్రసాద మధిగచ్ఛతి

రాగద్వేష రహితుడై, తనకు వశమైన ఇంద్రియముల చేత విషయములందు ప్రవర్తించు చున్నను యోగయుక్తుడు ప్రశాంతతను పొందుచున్నాడు

ప్రసాదే సర్వ దుఃఖానా౦ హాని రస్యో పజాయతే {2.65}

ప్రసన్న చేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతి

మనసు నిర్మలమైనప్పుడు సమస్త దుఃఖములు నశించుచున్నవి. ప్రసన్న చిత్తము గలవారికి బుద్ధి త్వరగ స్థిరపడుచున్నది. ఀ

బాధలను అధిగమించి, పరులకు ఉపయోగపడే జీవనం గడపడానికి దేవుడు, ఎన్ని అవరోధాలున్నా, పరోపకారానికి కావలసిన వనరులు ఇస్తాడనే నమ్మకం ఉంటే, మనం ఇష్టాయిష్టాలను వదులుకోవాలి. మనకి "నాకిది ఇష్టం. నాకది అసహ్యం. నాకు అతను నచ్చాడు. నేను వానిని ద్వేషిస్తాను" అనే ఆలోచనలు రాకూడదు. మన నాడీ వ్యవస్థ మనకు నచ్చిన విషయ౦వైపే ప్రసరిస్తుంది. అలర్జీలు నాడుల ప్రతికూలత వలన కలిగేవి. మనకిష్టంలేని పనులు చేస్తే కడుపులో పుళ్ళు వస్తాయి లేదా వేళ్ళు స్వాధీనంలో ఉండవు. చివరికి మనం అపస్మారకంగా "నన్నెందుకు దూషిస్తారు?" అంటాము. మనం పూర్తిగా ఎదగాలంటే మన కిష్టం లేని ప్రదేశాలకు, మనుష్యుల వద్దకు వెళ్ళాలి. అలా చెయ్యడంలో మనకి ఆనందం కలుగుతుంది. ఎందుకంటే మనం ఇతరులకొరకై -- ఒక తల్లి పిల్లకై, భర్త భార్యకై, భార్య భర్తకై, మిత్రుడు మిత్రుడుకై--చేస్తున్నాము. నాడీ వ్యవస్థను ఇతరుల సేవకై ఉపయోగిస్తూ ఉంటే, మనము ఇష్టాయిష్టాలు లేకుండా అన్నిటినుంచీ ఆనందం పొందుతాము.

తలిదండ్రులు పిల్లల యందు, భార్యాభర్తలు, ఇలాంటి భావనను ప్రదర్శించవచ్చు. మనం ఇతరులను మనకన్నా ముఖ్యులుగా చూడవచ్చు. భార్యాభర్తలు హోటల్ కి వెళ్తే భర్త భార్యకు ఇష్టమైన ఆహారాన్ని, లేదా భార్య భర్తకి ఇష్టమైన వంటకాన్ని తెప్పించుకోవచ్చు. మొదట్లో ఇది కష్ట మనిపించ వచ్చు. కానీ ధ్యానంతో, మంత్ర జపంతో మనము ఇతరుల మంచి గురించి పాటుపడవచ్చు. ఇలాగ మన మన్ని విషయాల్లో -- జుత్తు అలంకరణలో, పుస్తకాలలో, సినిమాలలో, మనోభావనలలో -- పాటించవచ్చు. నన్ను 5000 ఏళ్ల క్రితం నాటి మనిషినని కొందరంటారు. నేను వారితో అంగీకరిస్తాను. ఎందుకంటే నేను మన ఋషులు చెప్పిన విధంగా బ్రతుకుతాను. వారు చెప్పిన విలువలకు కాలంతో సంబంధంలేదు. అవి 5000 ఏళ్ల క్రితం వర్తి౦చేయి. వర్తమాన కాలంలో వర్తిస్తాయి. రాబోయే 5000 ఏళ్ళకు కూడా పనికివస్తాయి. వ్యక్తులను, కుటుంబాలను, సమాజాన్ని ఐకమత్యంతో నడిపేది ఆధ్యాత్మిక జ్ఞానం. అదే వారికి కలిగిన గాయాలకు ఉపశమనం కలిగించేది.

శ్రీరామకృష్ణ ఇష్టాయిష్టాలకు అతీతుడైన వ్యక్తి ఒక గాలిలో తేలే ఆకులాంటి వాడు అని అన్నారు. అది గాలిలో ఇక్కడకు, అక్కడకు కదిలింపబడి చివరకు నేలన పడుతుంది. చాలా విషయాల్లో మన సిద్ధాంతాలను ఉల్లంఘించకుండా పరిస్థితులకు వంగవచ్చును. కొందరు సాధారణ విషయాల్లో వంగినా, ఒక క్లిష్ట పరిస్థితి వస్తే మాత్రం దృఢ సంకల్పంతో ఉంటారు. కొన్నిసార్లు అది మంచిని కలిగిస్తుంది. మరి కొన్ని సార్లు దానికి చెడు పర్యావసానము ఉంటుంది. ఆ రెండిటివలనా మనము క్రొత్త పాఠాలు నేర్చుకోవచ్చు. మన వద్ద ఎటువంటి సవాలునైనా ఎదుర్కొన గలిగే వనరులు ఉన్నాయి. దీనివలన మనం సుఖదుఃఖాలలో సమంగా, సంతోషంగా ఉంటాము. 130

No comments:

Post a Comment

PPP in Andhra means Prostrate Pray Physicians

Recently there has been much debate about the PPP. If we ask google what is PPP, we will be informed: Purchasing Power Parity, Private Pu...