Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 23

Bhagavat Gita

3.23

యే మే మతమిదం నిత్య మనుతిష్ఠన్తి మానవాః {3.31}

శ్రద్ధావన్తో అనసూయంతో ముచ్యన్తే తే అపి కర్మభిః

శ్రద్దగలవారై, అసూయలేనివారై నా ఈ అభిప్రాయమును సదా అనుసరించు మనుజులు కర్మల నుండి విడిపడు చున్నారు ఀ

దేవుని సిద్ధాంతాలు మన అణువణువునా నిక్షిప్తమై ఉన్నాయి. అందుకే వాటిని ఉల్లంఘిస్తే ఎంతో దుఃఖం కలుగుతుంది. గీత ఇది చెయ్యి, అది చెయ్యకు అని చెప్పదు. గీత రెండు మార్గాలు ప్రబోధిస్తుంది: ఒక మార్గంలో వెళితే ఆనందం, సుఖం, పరోపకారం చెయ్యగలిగే శక్తిని పొందుతాము; వేరే మార్గంలో వెళితే దుఃఖం, అభద్రత, ఇతరులకు బాధ కలిగించుట మొదలైనవి పొందుతాము. "నీవు అహంకారాన్ని తొలగించుకోలేకపోతే, ఈ లోకానికి శాపమవుతావు. అలా కాక నీ ఆనందాన్ని, స్వలాభాన్ని, పేరుప్రతిష్ఠలను కుటుంబానికై, సమాజానికై, ప్రపంచానికై ఉపయోగిస్తే ఈ ప్రపంచానికి వరమౌతావు" అని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు.

మనమే దేశవాసులమైనా, ఎటువంటి పదవి కలిగియున్నా, మన మొకరి గురించి లేదా మన గురించి మనుగడ సాగించవచ్చు. ఆ ఎన్నిక మన చేతిలోనే ఉంది.

ముచ్యన్తే తే అపి కర్మభిః --అనగా వారు కూడా కర్మ బంధాన్ను౦చి విడువబడతారు. మనము పరోపకారానికై బ్రతుకుతే దేవుడు మన కుటుంబ క్షేమం తన బాధ్యతగా స్వీకరిస్తాడు. శ్రీకృష్ణుడు అర్జునిని హృదయపూర్వకంగా లోక కళ్యాణార్థం సేవ చేస్తే, తాను స్వయంగా అతని అవసరాలను చూసుకొంటానని అంటున్నాడు.

మనం ధ్యానం అవలంబిస్తే మన అవసరాలు తగ్గుతాయి. ఉదాహరణకు, మితమైన నిద్రతో, ఆహారంతో పర సేవచేయగల శక్తి వస్తుంది. ఈ విధంగా మనం పరోపకార్యార్థం పని చేస్తే దేవుడు మన బుద్ధిని వికసింపచేస్తాడు. మనకి ఇద్దరు, ముగ్గురు సంతానం సరిపోదు. మనకి ఒక ఖండంలోని వారంతా కుటుంబ సభ్యులనే భావన కలుగుతుంది. కస్తూరీబా గాంధీని ఒకరు ఆమెకి ఎంతమంది సంతానం అని అడిగేరు. ఆమె "నాకైతే నలుగురు. కానీ నా భర్తకు కోట్లాను కోట్లు" అని సమాధానమిచ్చేరు. ధ్యానం కొనసాగుతున్న కొద్దీ అహంకారం తగ్గి, మనము ప్రతి ఒక్కరినీ "మన వాళ్ళు" అనుకొంటాం. వాళ్ళకి సమస్యలొస్తే అవి మనవిగా భావిస్తాము. ఈ విధంగా ప్రపంచమంతా మన కుటుంబమనుకుంటే, మనలోని అపరిమితమైన ప్రేమ, జ్ఞానము వ్యక్తమవుతాయి.

మనము శ్రీకృష్ణుని బోధను కుటుంబ క్షేమం పట్టించుకోనక్కరలేదని తప్పుగా అర్థం చేసుకోకూడదు. మనం కుటుంబాన్ని తక్కువగా ప్రేమించం. కానీ ప్రపంచాన్ని కుటుంబం లాగ ప్రేమిస్తాం. కొందరు గాంధీజీ సంఘసంస్కర్తగా మారి, తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసేరని అంటారు. అది తప్పు. ఆయన ప్రేమ ఎంత గొప్పదంటే, అది ప్రపంచాన్ని కప్పేస్తుంది. భారత దేశంలోనే కాక, విదేశాల్లో కూడా ఆయన సిద్ధాంతాలను ఆదరించి, గౌరవించి, పాటిస్తున్నారు.

ఇక్కడ అర్జునుడు మనలాంటివాడే. శ్రీకృష్ణుడు మన శక్తి అద్వితీయంగా మారుతుందని చెప్పడం మనలో ఆశను కలిగిస్తుంది. అతను సృజనాత్మక శక్తిని, ప్రేమను పెంచుకోవాలంటున్నాడు. మనలాగే అతనికి అవి అపరిమితంగా పెరగాలనే ఆశ ఉంది. 187

No comments:

Post a Comment

PPP in Andhra means Prostrate Pray Physicians

Recently there has been much debate about the PPP. If we ask google what is PPP, we will be informed: Purchasing Power Parity, Private Pu...