Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 3 Section 24

Bhagavat Gita

3.24

యే త్వత దభ్యసూయంతో నానుతిష్ఠ౦తి మే మతం {3.32}

సర్వ జ్ఞాన విమూఢాం స్తాన్ విద్ధి నష్టా నచేతనః

అసూయపరులై నా ఉపదేశమును అనుసరించని వారు మూర్ఖులు, జ్ఞాన హీనులు, భ్రష్ఠులని గ్రహింపుము ఀ

శ్రీకృష్ణుడు మనకో హెచ్చరిక చేస్తున్నాడు: ఆధ్యాత్మిక సిద్ధాంతాలను పాటించకుండా, తన స్వార్థానికే ఎవడైతే బ్రతుకుతాడో, వాని సామర్థ్యం క్షీణిస్తుంది. అట్టివారి మనస్సు సంకుచితమై, ప్రతి చిన్న దానికీ విసుక్కొ౦టారు. అలాంటి వారికి దూరంగా ఉండాలని ఇతరులు తలుస్తారు. ఇతరులను సేవించాలా లేదా స్వార్థానికై బ్రతకాలా అని ఒక ఎన్నిక చేసుకోక తప్పదు. అహంకారాన్ని వదులుకోక ఇతరులను సేవించ దలిస్తే దానివలన మనకు లాభం లేదు, ఇతరులకూ లాభం అంతకన్నా లేదు.

అజ్ఞానము, నాస్తిక భావం ఉన్నా ఆధ్యాత్మిక సిద్ధాంతాలు వర్తిస్తాయి. కొందరు ఇలా అంటారు: "నాకు ఈ సిద్ధాంతాల గురించి ఏమీ తెలియదు. నాకు తెలిసిందల్లా నా కాళ్ళ మీద నేను నిలబడగలిగితే చాలు. అలాగే నా గురించి నేను చాటితే నా వ్యక్తిత్వాన్ని పెంచుకోగలనని అనుకున్నాను. కాబట్టి నాకు తెలియని సిద్ధాంతాలు నాపై వర్తింప జేయకూడదు". శ్రీకృష్ణుడు వారికి చెప్పేది: లోక జ్ఞానం అందరికీ ఎంతో కొంత ఉండాలి. ఆ జ్ఞానంతో ఎవరు క్షేమంగా ఉన్నారో, మనశ్శాంతితో ఉన్నారో, ఇతరులకు మేలు చేస్తున్నారో వారి గురించి తెలిసికోవాలి.

నిస్వార్థంగా బ్రతకడమంటే అనుభవంతో, ఇంగిత జ్ఞానంతో బ్రతకడం. గాంధీజీకి మక్కువైన ఒక గుజరాతీ గీతం: "దేవా నాకు విశ్వాసాన్నివ్వు, భక్తినివ్వు, కానీ ఇంగిత జ్ఞానాన్ని ఇవ్వకుండా ఉండద్దు". ఆధ్యాత్మిక మార్గంలో చరించేవార్లలో ఇంగిత జ్ఞానం ఎంత తక్కువ వుంటే అంత ఎక్కువ పురోగతి పొందేమనే తప్పుడు భావన ఉంది. ఆధ్యాత్మికత అలవరచు కొన్నవాడు మిక్కిలి అనుభవజ్ఞుడు. ఆధ్యాత్మికత లేనివాడు, ఎంత డబ్బు సంపాదించినా, యాంత్రికంగా జీవితం గడిపి అభద్రతతో సతమతమౌతాడు. 188

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...