Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 30

Bhagavat Gita

6.30

శ్రీ భగవానువాచ:

{6.40}
పార్థ నై వేహ నా ముత్ర వినాశస్తస్య విద్యతే

న హి కల్యాణ కృ త్కశ్చి ద్దుర్గతిం తాత గచ్ఛతి

పార్థా! యోగభ్రష్టునకు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశము కలుగనేరదు. పుణ్యాత్ముడైన వాడెవడు దుర్గతి పాలుకాడు కదా!

శ్రీకృష్ణుడు ఇలా బోధించెను: "ఎంత తక్కువ సమయమైనా నాయందు చేసిన ధ్యానము ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆధ్యాత్మిక పథంలో ఎటువంటి చిన్న అడుగైనా ఎన్నటికీ నిరుపయోగము కాదు". మన మతంలో ఎవ్వరూ దిక్కులేకుండా ఉండరు. మనమంతా దేవుని బిడ్డలము. మనము దేవునికి దూరంగా, నిర్జన ప్రదేశంలో బ్రతకవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దేవునితో ఐక్యమవుతాం.

మన మతంలో మనమెవ్వరమూ ఎన్నటికీ దేవుని బిడ్డలము కాకుండా ఉండం. మనకు నిరాశ, నిస్పృహలు కలిగినప్పుడు, లేదా మన బాహ్య కర్మలు ఎలాగ ఉన్నా, మన పరిపూర్ణులం, శుద్ధమైన వారలం, దేవుని అంశలం.

అందరూ యోగులవ్వగలరు. మనకు జ్ఞాని లక్షణాలు మొదట్లో లేకపోయినా, మనము వంగి వాటిని అలవరచుకొంటాము. కానీ మనను కించపరిచితే మన దృక్పథం అలాగే ఉంటుంది. నేను చెప్పేది: మీరు పిల్లలు దైవస్వరూపులని చెప్పండి. పెద్దలు కూడా కొన్నాళ్ళకు దైవస్వరూపులుగా మారవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంది. మనము ఓర్పుతో, సహనంతో ఉంటే ఇతరులు మన అంచనాకి ఎదుగుతారు. 385

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...