Thursday, March 10, 2022

Chapter 18 Section 16

Bhagavat Gita

18.16

న తదస్తి పృథివ్యా౦ వా దివి దేవేషు వా పునః {18.40}

సత్త్వ౦ ప్రకృతిజైర్ముఖం యదేభిస్స్యా త్త్రి భిర్గుణ్ఐః

ప్రకృతి నుండి జనించిన ఈ మూడు గుణముల నుండి విడిపడిన వస్తువు భూలోకము నందు గాని, స్వర్గలోకము నందు గాని, దేవతలయందు గాని గోచరించదు

బ్రాహ్మణ క్షత్రియవిశా౦ శూద్రాణాం చ పరంతప {18.41}

కర్మాణి ప్రవిభక్తాని స్వభావప్రభవై ర్గణ్ఐః

అర్జునా! బ్రాహ్మణులకు, క్షత్రియులకు, వైశ్యులకు, శూద్రులకును వారివారి స్వభావము వలన కలిగిన గుణములచేత వారివారి కర్మములు ప్రత్యేకించబడినవి

శమో దమ శ్శౌచం క్షాంతి రార్జనమేవ చ {18.42}

జ్ఞానం విజ్ఞానమాస్తిక్య౦ బ్రహ్మకర్మ స్వభావజమ్

మనోనిగ్రహము, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, శుభ్రత , ఋజుత్వము, సహనము, జ్ఞానము, విజ్ఞానము, ఆస్తిక్యము, బ్రాహ్మణులకు నియమిత కర్మమై యున్నది

శౌర్యం తేజో ధృతి ర్దాక్ష్వ౦ యుద్ధే చాప్యపలాయనం {18.43}

దానమీశ్వరభావశ్చ క్షాత్ర౦ కర్మ స్వభావజమ్

శూరత్వము, తేజస్సు, ధీరత్వము, యుద్ధమున పారిపోకుండా పోరుట, దానము, స్వామి భావము క్షత్రియునకు నియమితమైన కర్మము

కృషి గోరక్ష వాణిజ్యం వశ్యకర్మ స్వభావజ౦ {18.44}

పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజమ్

వ్యవసాయము, పశుపాలన, వర్తకము వైశ్యునకు స్వభావ సిద్దము కాగా, పరిచర్యను చేయుట శూద్రునకు స్వభావ సిద్దమైన కర్మయై యున్నది

ఈ శ్లోకాలు కులవ్యవస్థ గూర్చి చెప్పబడినవి. శతాబ్దాల తరబడి ఈ కుల వ్యవస్థ పాతుకుపోయి ఉన్నది. దానివలన అనేక కోట్ల మంది కుల బహిష్కరణకు గురైనారు. గాంధీ వాళ్ళకు హరిజనులు అని నామకరణం చేసేరు. వారు చాలా హీనమై, మిగతా కులములచే వాడుకోబడిరి.

గాంధీ కులవ్యవస్థకు వ్యతిరేకమైనా కులము గురించి సానుకూలంగా ఉండెను. ఆయన కుల వ్యవస్థ కున్న కఠినత్వమును సమూలంగా తీసివేయాలని సంకల్పించేరు. అలాగే కులవ్యవస్థ నుండి బహిష్కృతము చేయుటను సహించలేదు. కాని కులవ్యవస్థలో ఉన్న మంచి లక్షణములను పెంపొందించాలని చెప్పేరు. ప్రతి వ్యక్తి యొక్క ఆత్మ గౌరవము గురించి పాటు పడే మహాత్మ, పుట్టుకతోనే కులము ఆపాదించిన కులవ్యవస్థను ఎలా సమర్థిస్తారు?

కులవ్యవస్థని సంస్కృతంలో వర్ణ వ్యవస్థ అనేవారు. దాని అవసరం ఎందుకంటే మనము సమంగా బ్రతకడానికి. వర్ణ మనగా మనము పోషించే పాత్ర. వర్ణ వ్యవస్థలో: బ్రాహ్మణులు పురోహితులుగా, జ్ఞాన సముపార్జనమునకై నియమితమైరి; క్షత్రియులు రాజ్య పాలనము, ప్రజా క్షేమము గూర్చి ఉండేవారు; వైశ్యులు వ్యాపరస్థులుగా, రైతులుగా, హస్త కళాకారులుగా ఉండేవారు; శూద్రులు సామాన్య కూలీలగా ఉండేవారు.

వర్ణము పుట్టుకతో వచ్చినది కాదు. ఎలాగంటే ఈ రోజుల్లో ఒక ఆటో రిక్షా నడిపే వాని పుత్రుడు ఒక దుకాణం పెట్టుకొని వస్తువులను అమ్మవచ్చు. ఒక శూద్రుడు ఒకానొకప్పుడు వైశ్యునిగా మారవచ్చు. మహాభారతంలో చూసినట్లు బ్రాహ్మణులు వేదాలను వలనించి, ధ్యానం చేసేవారు. వారు బహుశా అతి ముఖ్యమైన వర్ణము. మిగతా వర్ణాలవారు కూడా వేదాలను చదివి బ్రాహ్మణ వర్ణమును పొందవచ్చు. నేను చారిత్రాత్మక నిజం గురించ చెప్తున్నాను. క్షత్రియుడిగా జన్మించిన బుద్ధునికి తక్కువ కులములకు చెందిన అనేకులు శిష్యులుగా ఉండేవారు. ఒక శతాబ్దం క్రింద శ్రీ రామకృష్ణ బ్రాహ్మణ వంశంలో జన్మించిరి. మహాత్మా వైశ్య కులస్థులు. నా అమ్మమ్మ నామధేయము ఏకనాథ్ క్షత్రియ కులమునకు చెందినది.

వర్ణ వ్యవస్థ ఒక సంప్రదాయమై, కుల వ్యవస్థ గా మారి కొన్ని వేల సంవత్సరాలుగా ఉండేది. దానికి మొదట కారణం సంస్కృతి. కొన్ని వందల తరాలుగా ఒక వర్ణమునకు చెందినవారు తమ అలవాట్లు, విలువలు , ప్రమాణములు పూర్వీకుల నుండి పొంది యున్నారు. భారత దేశంలో అనేక ప్రాంతాలు, భాషలు, సంప్రదాయాలు ఉండి ఒకే కులంలో అనేకా భేదాలు వచ్చేయి. కేరళ బ్రాహ్మణులకు ఉన్న సంప్రదాయం బెంగాలీ బ్రాహ్మణులకు లేదు. నేను కులం పరంగా క్షత్రియుడనైనా శాఖాహారిని. ఎందుకంటే తరతరాలుగా నా వంశస్థులు శాఖాహారులు కాబట్టి. బ్రాహ్మణుల లాగే నా వంశస్థులు ఆధ్యాత్మిక౦గా జీవించేవారు. ఈ కారణాలవలన, నా వంశస్థులలోని వారు -- ఉదాహరణకు నా అమ్మమ్మ --పొరుగున ఉన్న బ్రాహ్మణులను పెళ్ళాడేవారు.

వీటన్నిటినీ చూస్తే ఒక కులం వారు తమ కులస్తులనే ఎందుకు పెళ్ళాడుతారో తెలుస్తుంది. వర్ణ వ్యవస్థ ముఖ్య ఉద్దేశ్యం ఒకే విలువలు యున్న వారిని ఒకే సమూహంగా చేయడం. నేను చెప్పేది ఈ శ్లోకాల సారాంశం. నేను కులవ్యవస్థకు వ్యతిరేకిని.

వర్ణ వ్యవస్థ కొన్ని సమూహాలను చేసి, వారి వారి అభిరుచుల బట్టి ఆత్మ జ్ఞానం పొందటానికి చేయబడినది. కాని కొంతమందికి వేరే ఆలోచనలు, గమ్యం ఉంటుంది. వారివారి గుణాల బట్టి, వారి సంస్కారముల ననుసరించి, పునర్జన్మ వేరొక వర్ణంలో పొందుతారు.

ఇటువంటి వ్యవస్థ జీవితం యొక్క ముఖ్యోద్దేశం: ధనార్జన లేదా ఇతరుల మీద ఆజమాయిషీకై కాక వైరాగ్యం గురించి. చాలామందికి వేరే అభిరుచులు ఉండి తమ జీవితాన్ని గడుపుతారు. కానీ వారికి వైరాగ్యం గూర్చి అన్నిటికన్నా ఉత్కృష్టమైనదని, బ్రాహ్మణులు అలా ఉండాలని తెలుసు.

పూర్వ కాలంలో క్షత్రియుడుకి యుద్ధ భూమిలో పాటించవలసిన అనేక నియమాలు ఉండేవి. ఉదాహరణకి ఆయుధం లేని శత్రువుతో యుద్ధం చేయరాదు, యుద్ధం నుంచి పలాయనం చేయరాదు, స్త్రీలతో పోరాడరాదు. కానీ ఒక బ్రాహ్మణునికి నిషేధించిన కర్మ ఒక క్షత్రియుడు చేయవచ్చు.

నా అమ్మమ్మ దృష్టిలో అమితమైన ప్రమాణం ప్రతి సాధకునికీ ఉండాలి. కొన్నాళ్ళు మాతో ధ్యానం చేసినవారు మన నడవడికను గూర్చి అంచనాలు వేస్తారు. మనం కోపంతో మాట్లాడితే వాళ్ళు ఆశ్చర్యపడతారు.

బ్రాహ్మణుడనగా బ్రహ్మన్ గూర్చి తెలిసికోవాలనుకునేవాడు. బుద్ధుడు ఈ విధంగా వివరించేడు:

నేను ఎవరినైతే బ్రాహ్మణుడంటానో వానికి, కోపం రాదు, వానికి హాని కలిగినా ఇతరులకు హాని చేయడు. అలాగే సుఖాలను కోరడు, ఇతరులను నిర్దయమైన కర్మలతో, వాక్కుతో, ఆలోచనలతో బాధించడు

ఎవరైతే అటువంటి కట్టడులను అనుసరించి బ్రతుకుతారో, ఏ కులంలో పుట్టినా, వారిని బ్రాహ్మణులనవచ్చు. ఒకడు స్వార్థముతో కూడినా, మిక్కిలి భయం లేదా కోపంతో ఉన్నా, తామసిక దశ నుండి రాజసమునకు, రాజసము నుండి సాత్త్వికమునకు ఎదగవచ్చు. ఆ వ్యక్తి చివరికి ఆత్మ జ్ఞానమును పొందవచ్చు.

ఇది ధ్యానానికున్న శక్తి. మనం సూర్యుని శక్తి గురించి ఆలోచిస్తే తల మునకలవుతుంది. కొన్ని కోట్ల టన్నుల ఇంధనం సూర్యుని ఉపరితలం మీద ఉండి, తద్వారా చేయబడిన కాంతి, ఉష్ణము మనకి అందుతోంది. ఇలాగ సూర్యుడు వద్ద కొన్ని కోట్ల సంవత్సరాలకు సరిపోయే ఇంధనం ఉంది. ధ్యానం కూడా అటువంటిదే. గీత చెప్పేది: మన క్రోధం, భయ౦, దురాశలను ప్రేమగా మార్చుకొని బ్రతకాలని. అలా చేస్తే ఆ శక్తి మనం మరణించిన తరువాత కూడా పని చేస్తూ ఉంటుంది. మనకది అవగాహనకు రాకపోవచ్చు. మనకి దుశ్శక్తి ఎలాగ ప్రభావితం చేస్తుందో తెలుసు. అలాగే మనకి గాంధీ మహాత్ముని గురించి తెలుసు. ఆయన అట్టి శక్తిని ప్రేమగా మార్చి చరిత్రను మార్చెను. సూర్య మండలంలోని హైడ్రోజన్ ఇంధనం హీలియం గా మార్పు చెందుతున్నట్లు, మన అహంకారాన్ని ప్రేమగా మార్చవచ్చు. ధ్యానం వలన ఒక క్రోధి ప్రియమైన వానిగా మారవచ్చు; ఒక పిరికివాడు అమిత ధైర్యాన్ని పొందవచ్చు; ఒక బలహీనుడు శక్తివంతునిగా మారవచ్చు. 429

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...