Thursday, March 10, 2022

Chapter 18 Section 19

Bhagavat Gita

18.19

బుద్ధ్యా విశుద్దయా యుక్తో ధృత్యా ఆత్మానాం నియమ్య చ {18.51}

శబ్దాదీన్ విషయా౦ స్తక్త్వా రాగద్వేషౌ వ్యుదస్య చ

వివిక్తసేవీ లఘ్వాశీ యతవాక్కాయ మానసః {18.52}

ధ్యానయోగపరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః

విశుద్ధమైన బుద్ధితో కూడినవాడై, ధైర్యముతో మనో నిగ్రహమును పొంది, శబ్దాది విషయములను మరచి, రాగ ద్వేషములకు దూరుడై, ఏకాంత వాసియు, మితాహారియు, స్వాధీనమైన మనో వాక్కాయములు కలవాడు, సదా ధ్యాన యోగ పరాయణుడై యుండువాడు, వైరాగ్యమును చక్కగా ఆచరించినవాడు, అహంకారమును, బలమును, దర్పమును, కామమును, క్రోధమును, ద్రవ్య సంగ్రహమును విడిచినవాడు, మమకార రహితుడు, శాంతుడు నగువాడు బ్రహ్మత్వమును పొందుటకు అర్హుడగుచున్నాడు.

ఆత్మ జ్ఞానం పొందటానికి నాలుగు అవరోధాలు ఉన్నాయి: శరీరము మరియు ఇంద్రియములతో తాదాత్మ్యము, మనస్సు, బుద్ధి, అహంకారం.

వీటిని ఆత్మను కప్పి పుచ్చిన 4 పొరలులాగ ఊహించవచ్చును. ఇంద్రియములు భౌతిక శరీరాన్ని అంటిపెట్టుకున్న పై పొర. దాని తరువాత మనస్సు: భావోద్వేగం, భావాలు. అటు తరువాత బుద్ధి: అభిప్రాయాలు, ఎన్నికలు. చివరిగా అహంకారం. అది నేను, నాది అనే భావనని కలిగిస్తుంది. ఆత్మ జ్ఞానాన్ని పొందాలంటే వీటన్నిటిని వదిలి వేయాలి.

వీటిని వదిలివేస్తే కలిగే నష్టం ఏమీ లేదు. ఇంద్రియాలు క్షీణించవు. అవి ప్రాణాధారమై, చైతన్యవంతమై, ప్రతిస్పందించి, విధేయతతో ఉంటాయి. మనస్సు నిర్మలమై, బుద్ధి పదునై ఉంటాయి. అందుకే జాన్ ఆఫ్ ది క్రాస్ "మీకు ఒకటి కలిగి ఉండాలంటే, ఏమీ కలిగి ఉండకుండా ఉండాలని కోరుకోండి" అన్నారు.

ఇంద్రియాలను విడనాడితే మనము అన్నిటితో ఆనందిస్తాము. కానీ ప్రస్తుతు కాలంలో ఇంద్రియ తాదాత్మ్యం వలన ఆనందం కలుగుతుందనే నమ్మకం ప్రబలమైయున్నది. కొన్నేళ్ళ క్రితం ఐస్ క్రీమ్ తినాలంటే ఒకేఒక రకం ఉండేది. ఇప్పుడు ఐస్ క్రీమ్ లలో వందల రకాలు ఉన్నాయి.

ఇంద్రియ తాదాత్మ్యము వలన మన వ్యక్తిత్వాన్ని వీడుతాం.

ధ్యానంతో ఇంద్రియాలలో నిక్షిప్తమైన ప్రాణాన్ని వెనక్కు లాగుతాం. ఈ విధంగా ఇంద్రియాలు స్వాధీనంలో ఉంటాయి. ఒక చిహ్నం ఏమిటంటే ఇంద్రియాలు నిర్మలమై, ధృడమై ఉంటాయి. ఉంకో చిహ్నం భద్రత, మనలో వృద్ధిచెందుతున్న సఖ్యత.

రుచులు మన జన్యువులవలన కలిగినవి కావు. అవి మన అలవాట్లు బట్టి వస్తాయి. మొదటిసారి మనకి ఒక క్రొత్త రుచి వచ్చినపుడు, ఎక్కువ ప్రాణ శక్తి వ్యచ్చించ కుండా, తక్కువగా స్పందిస్తాము. రెండవమారు, ప్రాణ శక్తిని ఎక్కువ వెచ్చించి ఆ పదార్థాన్ని ఆశ్వాదిస్తాము. ఈ విధంగా క్రమంగా మనం క్రొత్త రుచిని అలవాటు చేసికొ౦టాము. ఇది ఆరోహణ క్రమ మైతే, అవరోహణ క్రమము ఇలాగ ఉంటుంది. మొదటిసారి మనమొక పదార్థాన్ని తిరస్కరిస్తే, తృష్ణ కలిగి, మన ఇంద్రియాలచే బాధింప బడతాము. రెండవసారి, ఇంద్రియాలు తగ్గుతాయి. మూడవమారు మనమా అలవాటునుండి విముక్తి పొందుతా౦.

ధ్యానం ఒక స్క్రూ డ్రైవరు లాంటిది. ఇంద్రియాలు స్క్రూలు. స్క్రూ డ్రైవరు వాడే ముందు స్క్రూలు ఎక్కడున్నాయో తెలిసికోవాలి. మన పంచే౦ద్రియాలు స్క్రూలై ఎంతో కాలం నుంచి గట్టిపడ్డాయి. ధ్యానం ద్వారా ఆ స్క్రూలను విప్పుకొని, మనస్సును స్వాధీనంలో పెట్టుకొంటాం.

ఈ విధంగా ధ్యానం ద్వారా మన పంచేంద్రియాలను జయించ వచ్చు. వాటిలో ధృడత్వం లేకపోతే, ఉద్రిక్తత ఉండదు.

ఇంద్రియాల క్రింద నున్నది మనస్సు. ఇంద్రియాలు తమ ప్రాణ శక్తిని దాని ద్వారా పొందుతాయి. అది విశ్రాంతిగా ఉంటే ఇంద్రియాలు కూడా విశ్రాంతితో ఉంటాయి; లేకపోతే ఉద్దీపన చెందుతాయి. శరీరంలోని ప్రతి అవయవము మనస్సుచే ప్రభావితమైనది. నిజమైన ఆరోగ్యం, పటిష్టమైన నాడీ వ్యవస్థ ఉండాలంటే మన శరీరంతో పాటు మనస్సుకు కూడా తర్ఫీదు ఇవ్వాలి. మనస్సు నిర్మలమై, దయతో కూడి ఉండాలి. ధ్యానంలో మనస్సు విశ్రాంతిని పొంది, సమస్యల చిక్కు విడిపడి, అలజడి లేక ఉంటాము.

భావోద్వేగముల పై నిర్లిప్తత, ప్రస్తుత కాలంలో కలిగే మానసిక ఒత్తిడిని జయించడానికై కాక, ప్రపంచానికి మేలు చేద్దామనే వారికి కూడా చాలా అవసరము. నిర్లిప్తమైన వాడే ఒక సంక్షోభమును పరిష్కరించగలడు.

మనస్సు నిర్లిప్తముగా ఉంటే భావోద్వేగాలను జయించవచ్చు. 439

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda on Death - III

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 సృష్టి సృష్టి -- II మృత్య...