Saturday, April 9, 2022

Eknath Gita Chapter 10 Section 13

Bhagavat Gita

10.13

పురోధసా౦ చ ముఖ్యం మాం విద్ధి పార్థ బృహస్పతి౦ {10.24}

సేనానీనామహం స్కంద స్సరసామస్మి సాగరః

పార్థా! పురోహితులలో నేను ప్రముఖుడగు బృహస్పతిని. సేనాధిపతులలో కుమారస్వామిని. సరస్సులలో సముద్రుడను

బృహస్పతి దేవతలకు గురువు. మనకు తెలిసో తెలీకో ఇతరులకు గురువులుగా ఉంటాం. ముఖ్యంగా పిల్లల విషయాల్లో. పిల్లలు మనం చెప్పే మాటలకన్నా , మనం ఆచరించే విధానాన్ని అనుసరిస్తారు. మనం ఓర్పు మీద వ్రాసిన ఒక పుస్తకాన్ని మన పిల్లవాడికి ఇవ్వవచ్చు. కానీ మనం ఓర్పువహించనంతకాలం ఆ పిల్లవాడు ఓర్పు గురించి నేర్చుకోడు. సహనం, భద్రత, నిస్స్వార్థం మన పిల్లలకు అబ్బాలంటే మనం వాళ్ళకు వాటిని ఆచరించి చూపించాలి.

శ్రీకృష్ణుడు తాను ఉత్తమమైన గురువేకాక, సర్వోత్తమమైన యోధుడు కూడా అని చెప్పేడు. స్కందుడు మన పురాణాలలో దుష్ట శక్తులను సంహరించిన ఒక గొప్ప యోధుడు. అలాగే మన ఆధ్యాత్మిక సాధనలో మనలోని మిక్కిలి పౌరుషంతో కూడన గుణములను యోధులమై నియంత్రించుకోవచ్చు.

కవి కాళిదాసు స్కందుడు మీద ఒక గొప్ప కావ్యం వ్రాసాడు. ఒకప్పుడు తారకుడనే అసురుడు దేవతలతో యుద్ధాలు చేసి వారిని అష్టకష్టాలు పెట్టేడు. పెద్దలు తారకుడుని చంపే సామర్థ్యం గలవాడు శివుని పుత్రుడై ఉండాలని చెప్పేరు. కావున దేవతలు శివుని వద్దకు వెళ్ళి తమను రక్షింపమని మొర పెట్టుకున్నారు. కాని శివుడు ఆజన్మ బ్రహ్మచారి. అప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి ఆతనిని తన అందముతో కాక, ఆధ్యాత్మికతతో వశం చేసుకొని పెళ్ళాడి, స్కందునికి జన్మ నిస్తుంది. చివరకు స్కందుడు తారకుని, ఆతని అసుర సేనను సంహరించి స్వర్గంలో శాంతి నెలకొల్పుతాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవలసింది ఏమిటంటే స్కందుడు పార్వతీపరమేశ్వరుల మధ్య గల కామంవలన జన్మించలేదు. అతడు శివుని నిగ్రహమువలన జన్మించి, అందువలన తారకుడిని సంహరించగలిగేడు.

తరువాత శ్రీకృష్ణుడు తనని ఒక పెద్ద సాగరముతో పోల్చుకొంటాడు. పురాణాల్లో అతను సముద్రంమీద శేషశయ్యపై పవళించియున్నాడని చెప్పబడింది. అలాగే మనలోని సముద్రంలో కూడా అతడున్నాడు. సముద్రంలోని ఉప్పనీళ్లు సృష్టి ఆదిలో జీవరాశ్యులకు యోని. అది మన దేహంలోనూ ఉంది. సముద్రాలు భూమి ఉపరితలంపై 70 శాతం కప్పి ఉన్నాయి. అలాగే మన శరీరంలో 70 శాతం జలమే. మనలో ఒక చిన్న సాగరం ఉండి కోట్ల కణాలకు పోషణ ఇస్తోందనడంలో అతిశయోక్తి లేదు.

జీవులను అధ్యయనం చేసే శాస్త్రవేత్త జాక్ కూస్టో నేటి కాలములో సముద్రాలు పెద్ద మురికి గుంటల్లా తయారయ్యాయని చెప్పేరు. ఎందుకంటే పరిశ్రమల వ్యర్థాలను సముద్రాలలో విడుస్తున్నారు. ఎవరైనా సముద్రంలో ఈతకెళ్తే లేనిపోని వ్యాధులు తెచ్చుకుంటారు. ఎలాగైతే సముద్రాలు కాలుష్యంతో నిండి ఉన్నాయో, మనలో కూడా క్రోధం, భయం, దురాశ వంటి కాలుష్యాలు ఉన్నాయి. వాటిని ధ్యానం ద్వారా నిర్మూలించవచ్చు. 230

No comments:

Post a Comment

Wendy Doniger Rig Veda on Death - III

Telugu English All Table Of Contents CREATION CREATION - II Death Death - 2 సృష్టి సృష్టి -- II మృత్య...