Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 26

Bhagavat Gita

2.26

యావానర్థ ఉ దపానే సర్వత స్స౦ప్లుతోదకే {2.46}

తావాన్ సర్వేషు బ్రాహ్మణస్య విజానతః

అంతటను నిండియున్న నీరు౦డగా జలాశయమునందు నీటి విషయమై ఎంత ప్రయోజనము కలదో బ్రహ్మ జ్ఞాని యగు బ్రాహ్మణునకు వేదములయందు అంతియే ప్రయోజనము కలదు

నైఋత పవనాలు వచ్చేయంటే ఎండాకాలం పోతున్నాదనే సూచన వచ్చినట్లే. వానలు కురిసి బావులు, చెరువులు, నదులు నిండుగా ఉంటాయి. కానీ మళ్ళీ ఎండాకాలం వచ్చి గడ్డు రోజులు తెస్తుంది. నూతుల్లో, చేరువుల్లో, నదులలో నీరు కరవై ప్రజలకు నీటి ఎద్దడి కలుగుతుంది. కొన్ని గ్రామాల్లో బహు దూరం నుంచి బిందెలతో నీరుని ఇంటికి తెచ్చుకుంటారు. ఎక్కడైతే కొళాయిలు వుంటాయో, అక్కడ నీటి సరఫరా రోజుకు ఒక గంటో, రెండు గంటలో ఉంటుంది.

అలాగే ఆధ్యాత్మిక జ్ఞాన ప్రవాహము మనలో నిరంతరమూ లేకపోతే, బిందెలతో బయటినుంచి తెచ్చుకోవాలి. ధ్యానం చేసే ముందు బిందెలు ఖాళీగా ఉంటాయి. ధ్యానం అయిన తరువాత అవి నిండుతాయి. మరుసటి రోజు బిందె మళ్ళీ ఖాళీ అయిపోతుంది. ఈ చక్రం అలా నడుస్తూ ఉంటుంది. కానీ మనలో దేవుడున్నాడనే వెల్లువ కలిగితే ఇక బిందెలతో పనిలేదు. భగవంతుని ప్రేమ సాగరంలో మునిగిపోయి ఉంటే ఇక బావుల, సరస్సుల అవసరం లేదు. అటువంటప్పుడు మన ధ్యానం చెయ్యనక్కరలేదు. స్మృతుల అవసరం లేదు. మన అచేతన మనస్సులో మంత్రం నిరంతరము జపింపబడి, మన చేతన మనస్సుకు పని లేదు. ఇది ఒక ఊహ. దీనిని అనుభవించగలిగితే మనము ధన్యులము. అంతవరకు మనము ధ్యానం చేసి, మంత్ర జపం చేసి, ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొని, పరోపకారానికై బ్రతుకుదా౦. 96

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...