Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 28

Bhagavat Gita

2.28

యోగస్థః కురు కర్మాణి సంగం త్వక్త్వా ధనంజయ {2.48}

సిద్ద్య సిద్ద్ధ్యో స్సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే

ధనంజయా బుద్ధియోగము కంటెను కామ్య కర్మలు నికృష్టములు గదా! కనుక నిష్కామకర్మమునే ఆశ్రయింపుము. ఫలమును గోరువారు దీనులు. ఀ

ఇక్కడ శ్రీకృష్ణుడు సమత్వం --అనగా ఎట్టి పరిస్థితులలోనూ దేహే౦ద్రియాలను స్వాధీనంలో ఉంచుకొని నిశ్చలంగా ఉండడం -- గురించి చెప్తున్నాడు. యోగాభ్యాసం చేసేవారు తమ మిత్రుల యందు, తమను తూలనాడే వారి యందు, వారేమి చేసినా, సమ దృష్టి కలిగి యుంటారు. గాంధీ మహాత్ముడు సమత్వాన్ని పాటించి, తనపై నిందలు వేసినా, తనను అటకాయించినా, లేదా ప్రజలు తనను పొగిడి, అందలం ఎక్కించినా ఎప్పుడూ ఒకేలాగ ఉండేవారు. ఆయనను స్పూర్తిగా తీసికొని మనము ఎప్పటికీ ఆందోళన పడక, ఆత్మ జ్ఞానమును పొంది, పరిస్థితులు ప్రతికూలంగా ఉ౦టే నిరుత్సాహ పడక, లేదా పరిస్థితులు సానుకూలంగా ఉంటే మైమరచి ప్రవర్తించక ఉండాలి. యోగులకు ఒకరి ఆసరా అక్కరలేదు. ఎందుకంటే వారు స్వయంప్రతిపత్తితో బ్రతికేవారు.

శ్రీకృష్ణుడు యోగస్తః కురు కర్మాణి -- అనగా ముందు నాయందు మనస్సు లగ్నము చేసి, పరోపకారానికై నిస్వార్థమైన సేవ చెయ్యి--అని బోధిస్తున్నాడు. జయాపజయాల, లాభనష్టాల, మంచిచెడ్డల వలన ఒత్తిడి చెందకూడదు.

సంగం త్యక్త్వా -- అంటే ఒక కార్యం చేసిన తరువాత దాని ఫలితం గురించి విచారపడకూడదు. అంటే "కార్యం ఎప్పుడు సఫల మౌతుంది? నేను ఆశించిన ఫలితం లభిస్తుందా? లేదా అది రావడం ఆలస్యమవుతుందా?" అనే ప్రశ్నలతో సతమతమవ్వకూడదు. ఎందుకంటే మనకు ఫలితంతో సంబంధము లేదు. ఇదే 20 వ శతాబ్దపు కర్మ యోగి గాంధీజీ యొక్క రహస్యం. గీత వలన ప్రేరితులై, నిస్వార్థమైన కోరికతో, మంచి సాధనాలతో, ఫలితం గురించి ఆందోళన పడకు దేశ భవిష్యత్తుకై ఆయన పాటు పడ్డారు.

అలాగే శ్రీకృష్ణుడు సిద్ధ సిద్ద్యోః -- అనగా జయాపజయాలలో ఒకేలాగ ఉండడం-- అని ప్రవచిస్తున్నాడు. తాత్కాలికంగా మనం గెలిచినా, ఓడినా పొందేది ఏమిట? జయం కలిగినప్పుడు మైమరచి, అహంకారంతో "నేను గెలిచేను. నా శత్రువులను మట్టి కరిపిచ్చేను" అని మెలగవద్దు. దేవుడు మనకు ఒక అవకాశం ఇచ్చేడని సంతోషించి నిర్లిప్తంగా ఉండడం ఉత్తమం. అపజయం కలిగినప్పుడు నిరాశ చెందక, అంతక ముందుకన్నా ఎక్కువ కష్టపడి, మంచి సాధనాలతో, ఉన్నతమైన లక్ష్యానికై పాటు పడాలి. సుఖదుఃఖాలలో, జయాపజయాలలో, పొగడ్తవిమర్శలలో సమంగా ఉండడమే యోగం. ఇదే ఆధ్యాత్మిక జీవనమంటే.

గీత మనల్ని నిస్వార్థమైన లక్ష్యాలను పెట్టుకోమని ప్రోద్భలం చేస్తుంది. శ్రీకృష్ణుడు చెప్పే సాధన -- నిత్యం ధ్యానం చెయ్యడం, మంత్రాన్ని జపించడం -- వలన మనము ఆయనయందు ప్రతిష్ఠితులమై, స్వార్థములేని కర్మలు చేస్తూ, కుటుంబానికి, సమాజానికి, దేశానికి, చివరకి ప్రపంచానికి కూడా సేవ చెయ్యగలం. 99

No comments:

Post a Comment

PPP in Andhra means Prostrate Pray Physicians

Recently there has been much debate about the PPP. If we ask google what is PPP, we will be informed: Purchasing Power Parity, Private Pu...