Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 33

Bhagavat Gita

2.33

అర్జున ఉవాచ:

{2.54}
స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్థస్య కేశవ

స్థితధీః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిమ్

కేశవా! సమాధియందున్న స్థితప్రజ్ఞునకు లక్షణమేమి? అతడెట్లు భాషించును? ఎట్లు కూర్చొనును? ఎట్లు సంచరించును?

గాంధీ గీత అంతర్మధనం గురి౦చి చెప్తుందనేవారు. స్వార్థం-నిస్వార్థం, మంచి-చెడు మొదలగు ద్వంద్వాలు మనకనుభవమే. మన మనస్సులో అవి రేపే ధుమారాలు మనను పరిష్కారానికై ప్రేరేపిస్తాయి. అలాగే ఇంద్రియాలు మనల్ని అన్ని దిక్కుల వెళ్ళమంటాయి. ధ్యానంవలన, ఆధ్యాత్మిక చింతన వలన మాత్రమే వాటిని స్వాధీనంలో పెట్టుకోగలం.

అర్జునుడు అడుగుతున్నది: స్థితప్రజ్ఞుడు -- అనగా స్వయంప్రతిపత్తిలో స్థిరంగా ఉన్నవాడు--ఎలాంటి వ్యక్తి? అట్టివాడు సమాధి ఎలా పొందుతాడు, దేవునితో ఎలా ఐక్యం అవుతాడు? అతడు బాహ్య చేష్టలు --కూర్చోవడం, మాట్లాడడం మొదలైనవి-- ఎలా ఉంటాయి?

ఇక్కడ శ్రీకృష్ణుడు అర్జునుని వేదాలు లేదా పురాణాలు చదవమని చెప్పవచ్చు. కానీ గీత వాటి సారం అనబడేదిగా ఎందుకు వుందంటే రాబోయే శ్లోకాల్లో శ్రీకృష్ణుడు అర్జునుని సందేహాలు -- అనగా మనికి కూడా కలిగేవి--18 శ్లోకాల్లో నివృత్తి చేస్తాడు. ఇంత నిక్షిప్తంగా మరెవ్వరూ చెప్పలేదు, చెప్పబోరు. 105

No comments:

Post a Comment

Is America Heaven and India Hell?

Many in India say "America is Heaven and India is Hell". It results in the act of applying for an American visa that, of late, ha...