Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 7

Bhagavat Gita

2.7

న హి ప్రపశ్యామి మామప నుద్యా ద్యచ్చోక ముచ్చోషణ మి౦ద్రియాణా౦ {2.8}

అవాప్య భూమా వసపత్న మృద్ధం రాజ్యం శురాణామపి చా ధిపత్యమ్

ఈ భూలోకమున ఎదురులేని సమృద్ధమైన రాజ్యము లభించినను, స్వర్గలోకాధిపత్యము ప్రాప్తి౦చినను, నా ఇంద్రియములను శోషింపజేయుచున్న ఈ దుఃఖమును ఏది పోగొట్టునో నాకు తెలియుట లేదు

సంజయ ఉవాచ:
ఏవ ముక్త్వా హృషీకేశ౦ గుడాకేశః పరంతపః {2.9}

న యోత్స్య ఇది గోవింద ముక్త్వా తూష్ణీ౦ బభూవ హ

పరంతపుడైన అర్జునుడు హృశీకేశుడైన గోవిందునితో ఈ విధముగా పలికి యుద్ధము చేయనని ఊరకుండెను

తమువాచ హృషీకేశః ప్రహసన్నివ భారత {2.10}

సేనయో రుభయో ర్మధ్యే విషీదంత మిదం వచః

ఓ ధృతరాష్ట్రా! రెండు సేనల నడుమ దుఃఖించుచున్న అర్జునుని జూచి శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇట్లనెను

శ్రీ భగవానువాచ:
అశోచ్యా నన్వశోచ స్త్వ౦ ప్రజ్ఞావాదాంశ్చభాషసే {2.11}

గతాసూ నగతాసూ౦శ్చ నానుశోచన్తి పండితాః

దుఃఖి౦ప దగని వారిని గూర్చి నీవు దుఃఖించుచున్నావు. పైగా పండితవచనములను పలుకుచున్నావు. పండితులగువారు గతించిన వారిని గూర్చి గాని, జీవించియున్న వారిని గూర్చి గాని దుఃఖి౦పరు

శ్రీకృష్ణుడు అర్జునునికి చెప్పక చెప్పేది:"నువ్వు జ్ఞానవంతుడిలా మాట్లాడుతున్నావు. కానీ నీ ఆచరణ వ్యతిరేకముగా ఉంది. నీవు ఆనందాన్ని కోరుతూ దుఃఖ కరమైన మార్గంలో వెళ్ళడానికి పూనుకొంటున్నావు. అలాగే సంతృప్తిగా ఉంటానన్నావు. నీవు ఎన్నిక చేసుకొనే మార్గం నిరాశ కలిగించేది అని తెలియక ఉన్నావు." శ్రీకృష్ణుడు అర్జునుని మనస్తత్వము చేయదలుచుకున్న క్రియలకు వ్యతిరేకంగా ఉందని చెప్పుచున్నాడు.

మనమందరము అడుగవలసిన ప్రశ్న: "మనకు భద్రత, ఆనందం, సంతృప్తి కావాలా, వద్దా?" అలా అడిగి మన లక్ష్యాలను స్థిర పరుచుకోవాలి. మనమందరము శాంతిని కాంక్షిస్తాము. ఏ వ్యక్తీ లేదా దేశం శాంతి వద్దని అనరు. అలాగయితే మనమంతా శాంతికై పాటుపడాలి. అలాకాక యుద్ధం వైపు మొగ్గితే వచ్చేది యుద్ధమే. జర్మనీ అధినేత బిసమార్క్ "నాకు యుద్ధం వద్దు. కానీ విజయం కావాలి" అన్నారు. కొందరు పిల్లలు "నా తలిదండ్రులపై ఎదురు తిరగను. కానీ నా కిష్టమైనట్టు చేస్తాను" అని అంటారు. దానికి శ్రీ రామకృష్ణ పరిష్కారం: "నువ్వు తూర్పు వైపు వెళ్ళాలంటే, ఉత్తరముఖంగా అడుగు పెట్టకు". మనం శాంతి గురించి మాట్లాడితే సరిపోదు. చరిత్ర కారులు నిక్కచ్చిగా చెప్పే గత రెండు వేల స౦వత్సరాల కాలంలో ఎన్నో యుద్ధాలు జరిగేయి. ప్రపంచ దేశాలు ఒక ప్రక్క శాంతి సందేశాలు ఇస్తూ, మరొక ప్రక్క మారణాయుధాలు తయారు చేస్తున్నాయి. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుని నెపంగా పెట్టుకొని "మీకు శాంతి కావాలంటే, శాంతికై ఎందుకు పాటుపడరు?" అని మనల్ని అడుగుతున్నాడు.

అర్జునుడు తనకి అకాల మరణం వద్దని, తన బంధుమిత్రులను చంపనని ముందు చెప్పియున్నాడు. శ్రీకృష్ణుడు దానికి బదులుగా దేహం మాత్రమే మరణిస్తుంది అని చెప్తున్నాడు. మనము ఎప్పటికీ మరణించం, ఎందుకంటే మన ఆత్మ దేహానికే పరిమితం కాదు. మనము శాశ్వతము, అపరిమితము, మార్పులేని వారలము. ఇదే ధ్యానం చివరలో కలిగే భావం: మనము దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి కాము. మనం పరమాత్మ అంశలము.

రమణ మహర్షి 1950 లో అవసాన దశలో ఉన్నప్పుడు అనేక భక్తులు "మీరు వెళ్లిపోతున్నారు. మమ్మల్ని వదిలేస్తున్నారు" అని విలపించేరు. ఆయన "నేనెక్కడికి వెళ్ళ గలను? నేను అన్ని చోట్లా ఉన్నాను. మిమ్మల్ని ఎలా వదిలేయగలను?" అని అన్నారు. ఇదే మనకి సమాధిలో కలిగే జీవైక్య భావం. 59

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...