Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 21

Bhagavat Gita

4.21

సర్వాణీ౦ద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే {4.27}

ఆత్మ సంయమ యోగాగ్నౌ జుహ్వతి జ్ఞాన దీపితే

మరికొందరు ఇంద్రియ వ్యాపారములను, ప్రాణచేష్టలను జ్ఞానదీప్తమైన ఆత్మసంయమ యోగమనెడి అగ్ని యందు హోమము చేయుచున్నారు.

ద్రవ్య యజ్ఞా స్తపోయజ్ఞా యోగయజ్ఞా స్తథా అపరే {4.28}

స్వాధ్యాయ జ్ఞానయజ్ఞాశ్చ యతయ స్సంశితవ్రతాః

దృఢ దీక్షాపరులై, ప్రయత్న శీలురైన సాధకులు ద్రవ్య యజ్ఞములను, తపో యజ్ఞములను, యోగ యజ్ఞములను, స్వాధ్యాయ యజ్ఞములను, జ్ఞాన యజ్ఞములను ఆచరించుచున్నారు

ఈ శ్లోకంలో యజ్ఞం అంటే దానం చెయ్యడం. ధనవంతులు దేవుని సేవకై తమకున్న ధనంలో కొంత దానం చేస్తారు. డబ్బు దానంతట అది చెడ్డది కాదు. దానిని ప్రేమించడం చెడు స్వభావం.

గాంధీజీ యొక్క ఆస్తి రెండాకులు. కానీ ఆయన మిత్రులలో అనేకమంది ధనవంతులు ఉండేవారు. అందువలన ఆయనను కొందరు విమర్శి౦చేవారు. దానికి బదులుగా ఆయన సంపన్నుల యందు కూడా దేవుడు ప్రతిష్ఠితమై ఉన్నాడని చెప్పేవారు.

గాంధీగారు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు అనేక వైద్యులు దేశ నలుమూలలనుండి వచ్చి ఆయనను పరీక్షించేవారు. వారిలో కొంత మంది పేరు ప్రఖ్యాతులకై వచ్చేవారు. అలాంటి వారితో గాంధీజీ తనను పరీక్షించడానికి నాకు మీరు డబ్బు కట్టండి అనేవారు. మన దేశంలో అనేక స్త్రీలు బంగారు ఆభరణాలు ధరించి ఆడంబరంగా ఉంటారు. గాంధీజీ వారికి తమ స్వస్వరూపంలో ఆనందంగా ఉండమని సలహా ఇచ్చేవారు. వారు ప్రభావితులై, తమ బంగారాన్ని స్వతంత్ర పోరాటానికై దానం చేసేవారు. ప్రపంచంలో పేదవారు, వికలాంగులు ఉన్నంత కాలం మనం ఆడంబరాలికి పోకూడదు. అలాగని నేను పేదరికంలో ఉండమని చెప్పటంలేదు. నేను కోరేది అవసరమైనవి మాత్రమే దగ్గిర పెట్టుకొని సామాన్య౦గా, సంతుష్టితో జీవితం గడపడం. మన ధనం--ఎంత ఎక్కువ లేదా తక్కువ ఉన్నా--నిస్వార్థ సేవకై, అందరి క్షేమానికై వినియోగించవచ్చు.

శ్రీకృష్ణుడు ఉంకో విశేషణము వాడుతాడు. తపోయజ్ఞ -- అనగా బాధ పడడం, ఇంద్రియాలను నిగ్రహించడం, ఉష్ణము మొదలైనవి. గాఢ ధ్యానంలో కుండలిని శక్తి విడుదలై దేహాన్ని వేడి చేస్తుంది. అలాంటప్పుడు గట్టిగా వ్యాయామం చెయ్యడం మంచిది. భౌతికంగా నిస్వార్థంతో ఇతరులకై శ్రమ పడినా ఉత్తమం.

ఉంకో విశేషణం యోగయజ్ఞ -- అనగా ధ్యానంతో సాధన. ఉదయం, సాయంత్రం దీర్ఘంగా ధ్యానం చేసేవారు తమ స్వార్థానికి మాత్రమే చేయటం లేదు. చాలామంది ధ్యానం చేసేవారు తమ జ్ఞానానికై, ముక్తికై చేస్తారని తప్పుగా అర్థం చేసికొ౦టారు. ధ్యానం చేసేవారు నిజంగా కోరేది స్వార్థం, వేర్పాటు తమనుండి తొలగాలని. ధ్యానం చేసే ప్రతి ఒక్కరూ, సర్వ జీవుల క్షేమాన్ని కోరుతారు. కుటుంబంలో ఏ ఒక్కరు ధ్యానం మొదలుపెట్టినా అది తక్కిన కుటుంబ సభ్యులను ప్రభావితం చేస్తుంది. మొదట్లో వారికి అపార్థాలు కలిగినా, క్రమంగా ధ్యానంలోని శక్తిని గ్రహిస్తారు.

ఒకరు మనల్ని ధ్యానం దృష్ట్యా హేళన చేస్తే కలవరం చెంది మనల్ని సమర్ధించుకోనక్కరలేదు. దేవుడు మన తరపు న్యాయవాది. చట్టాన్ని వ్రాసినవాడు కూడా అతడే. మన ధ్యానం మొదట్లో కొంత వైరాగ్యంతో ఉంటే మన బంధుమిత్రులు అపార్థం చేసికోవడం సహజం. కానీ మనము నిస్వార్థంతో, అహంకారము లేకుండా, ప్రేమతో ఆదర్శంగా ఉంటే ఇతరులకు అది మేలు చేకూరిస్తుంది.

ఆధ్యాత్మిక జీవితం గడపడానికి యజ్ఞం సహకరిస్తుంది. అంటే మన సమయం, కౌశల్యం, వనరులు, దక్షత, ప్రేమ కలిగి ఉండడం. మనం అవి ఇతరులకు ఎంత ఎక్కువగా ఇచ్చినా, దాని కన్నా ఎక్కువగా ఇవ్వాలి. ఒకరికి ఎక్కువ ఉంటేనే ధనవంతులు కారు. వారు ఎంత ఎక్కువ ఇయ్యగలిగితే అంత సంపన్నులు. శ్రీకృష్ణుడు అర్జునుని ద్వారా మనకి చెప్పే బోధ మనందరిలో ప్రతిష్ఠితమైన దేవుని అనేక రీతులలో సేవించవచ్చని. 273

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...