Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 27

Bhagavat Gita

4.27

అపి చేదసి పాపేభ్యో స్సర్వేభ్య పాపకృత్తమః {4.36}

సర్వం జ్ఞానప్లవేనైవ వృజినం సంతరిష్యసి

నీవు పాపులందరి కంటెను పాపివి యైనను అట్టి పాపము నంతటిని జ్ఞానమనెడి తెప్ప చేత దాటగలవు

ధ్యానం ద్వారా పొందిన ఆధ్యాత్మిక జ్ఞానం ఒక పడవలాగ అల్లకల్లోలంగా ఉండే సంసార సాగరాన్ని దాటిస్తుంది. శ్రీకృష్ణుడు విచక్షణ, వైరాగ్యం అనే కర్రలతో ఒక తెప్పని చేసి,నీళ్ళను చేతులతో తోస్తూ ఆవలి తీరంలోనున్న ఆనందం, శాంతి, ప్రేమ పొందటానికై పయన మవ్వాలని చెప్తాడు.

బుద్ధుడు తను ఆవలి తీర౦లో నున్న నిర్వాణమునకు చేర్చే పడవ నడిపేవాడినని చెప్పేడు. చాలామంది అది నమ్మరు. వారు ఈ తీరంలోనే ఉండి సదా కలహాలతో, మోసాలతో, వేర్పాటుతో ఉంటారు. కలహాలులేని ఆవలి తీరంకి వెళ్తే సమయాన్ని ఎలా వాడుకోవాలి అన్న సమస్యను కొని తెచ్చుకొ౦టామని భావిస్తారు.

శ్రీకృష్ణుడు తనను కైవర్తకః కేశవః -- అనగా నది దాటించే పడవ వాడు -- అని చెప్పుకున్నాడు. కానీ మనకి ఈ తీరమే ఇష్టం. భద్రత, శాంతి ఇవ్వగలిగే ఆవలి తీరం వైపు ప్రయాణం చెయ్యడానికి ఇష్టపడం. మనం నదీతీరాన ఉన్న ఒక ఊరునుండి, ఇంకో ఊరికి వింతలు విడ్డూరాలూ చూడాలనుకొంటాం. ప్రతి నదీ తీరాన ఉన్న ఊరిలో తిండి, బట్టలు, వింత వస్తువులు ఆశతో కొని పెట్టెలో పెడతాం. కానీ ఆవలి తీరానికి వెళ్లాలంటే పెట్టెను పారేసి వెళ్ళాలి.

దేవుని కృపవలన గాలి మన పడవను నడుపుతూ ఉంటుంది. కానీ మన పెట్టెలు విడిచి పెట్టాలి. ధ్యానం చేస్తున్నా చాలా కాలం పాటు మనం వస్తువులు తెస్తూ వాటిని పోగుచేసుకొంటున్నాం. చాలామంది యోగులు ఈ విధంగానే మొదలుపెట్టి వస్తువులను పడవనుంచి విసిరేసేరు. వైరాగ్యం ఇలాగే మొదలవుతుంది: మనకి అక్కరలేని వస్తువును విడిచి పెట్టడం.

అటుపిమ్మట మనకు అవసరమైన వస్తువులను కూడా పడవనుంచి విసిరేయాలి. కానీ మనకి ఆవలి తీరం కనిపిస్తూ, మనం అక్కడి దృశ్యాలు చూస్తూ ఉన్నప్పడు శ్రీకృష్ణుని వేణునాదం వినిపిస్తే సంకోచించకుండా మన వస్తువులన్నిటినీ విసిరేస్తా౦.

ఆవలి తీరం చేరి, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఇతరులను పడవలో తీసికురావడం చాలా దుఃఖంతో కూడిన పని. ఆనంద తీరం నుండి మళ్ళీ మన తీరం వస్తే యుద్ధాలు, కరవు, స్వార్థం మొదలైనవాటిని మళ్ళీ అనుభవించాలి.

శ్రీ రామకృష్ణ దీనినే ఒక క్రీడ ఉపమానంతో చెప్తారు. ఆ క్రీడ ఏమైనా కావచ్చు: బంతాట, క్రికెట్ మొదలైనవి. కొందరు పిల్లలు బంతాట చూడడానికి ఒక పెద్ద దడి అడ్డంగా ఉంది. అప్పుడు వాళ్ళు ఒకరి భుజాలమీద ఒకరు ఎక్కి, చివరకు ఒకడు దడి కవతల జరుగుతున్న ఆటను వర్ణిస్తూ ఉండేలా ప్రణాళిక వేసేరు. అలాగే వాళ్ళు భుజాలమీద ఎక్కడం ప్రారంభించేరు. కాని చిట్ట చివరివాడు దడి కావలకి గెంతి పడిపోయేడు. ఈ ఉపమానంలో భూమిమీద స్థిరంగా ఉ౦డి బంతాట చూడాలనే ఔత్సాహికులను తన భుజం మీద ఎక్కించుకునేవాడు జీసస్, శ్రీకృష్ణుడు, బుద్ధుడు వంటి వాడు. గొప్ప యోగులైనవారు: శ్రీ రామకృష్ణ, శ్రీ రమణ మహర్షి, అస్సీస్సి కి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్, మైస్టర్ ఎక్హార్ట్, సెయింట్ జాన్ ఆఫ్ క్రాస్, బంతాటాను మనకి వర్ణించి చెప్పేరు. గీత అడుగుతున్నది: "నీవు అందరూ ఏకమయ్యే ఆటను, దేవుని లీల అనే ఆటను, జీవితమనే పరమాత్ముని ఆటను చూస్తావా?" 286

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...