Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 8

Bhagavat Gita

4.8

వీత రాగ భయక్రోధాః మన్మయా మా ముపాశ్రితాః {4.10}

బహవో జ్ఞానతపసా పూతా మద్భావ మాగతాః

అనురాగము, భయము, క్రోధము తొలగినవారును, నా యందే మనసు గలవారును, నన్నే ఆశ్రయించిన వారును అగు అనేకులు జ్ఞానమనెడి తపస్సుచే పావనులై నా స్వరూపమునే బొందిరి

వీతరాగభయక్రోధ -- అనగా బంధాలతో, భయంతో, క్రోధంతో ఉండవద్దని శ్రీకృష్ణుడు చెప్తున్నాడు. ఇంకా "వాటిని వదిలేయి. అవి నిన్ను జనన-మరణ చక్రంలో ఉంచి విచారము, దుఃఖము కలిగిస్తాయి" అని చెప్పెను. ప్రతిరోజూ మన౦ వ్యక్తులతోనూ, వస్తువులతోనూ, బంధాలను తగ్గించుకోవాలి. భయం, క్రోధం మొదలైన వాటికి లొంగకూడదు. దీనికై ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. గాఢమైన ధ్యానంలో దేహాభిమానమును వదిలి, బంధ విముక్తులమై, డబ్బు, దస్కం, మొదలైన వ్యాపారాలు లేకుండా చేసుకొంటాం.

వైరాగ్యం వలన విచారం కలుగవచ్చు. తలిదండ్రులు మనకు "కాదు, వద్దు" అని చెప్పకపోతే పెద్ద అయ్యేక ఎవరినీ ఖాతరు చేయం. పిల్లలయందు గల ప్రేమ వలన "కాదు, వద్దు" అని చెప్పగలగాలి.

ప్రతి అనుబంధంలోనూ వైరాగ్యం దుఃఖం కలిగిస్తుంది. ఎందుకంటే మన అహంకారానికి, పాతుకుపోయిన మనోభావాలికి, సంతోషానికి ఎదురు తిరగాలి. మన దగ్గిర సంబంధాలలో అప్పుడప్పుడు వారు మనం చెప్పినట్లు చెయ్యాలని అనుకొంటాం. దీనివలన బంధాలు, ముఖ్యంగా తలిదండ్రులు పిల్లలు మధ్య, చెడతాయి.

తలిదండ్రులు తమ పిల్లలు వేరే తరంలో, కాలంలో పెరుగుతున్నారు కాబట్టి వారి యందు కొంత వైరాగ్యం పెంచుకోవాలి. వారు మమకారం తగ్గించుకొని పిల్లలు పూర్ణమైన వ్యక్తులవ్వాలంటే "నువ్వు స్వార్థంతో పని చేయనంత కాలము మేము నిన్ను ఆదరణతో చూస్తాము" అని చెప్పాలి. ఈ విధంగా పిల్లల్ని మనకన్నా ముఖ్యులని తలిస్తే వారు ఆనందంగా స్పందిస్తారు.

మనలోని స్వార్థ౦, కోర్కెలు , పేరుప్రతిష్ఠలకై ప్రయత్నించే స్వభావము, స్వలాభము తీసేస్తే దేవుడు ఖాళీని జ్ఞానం, ప్రేమ, సద్గుణాలతో నింపుతాడు. ఇదే మన్మయ కి అర్థం.

ఒకమారు రాధకి అసూయ కలిగి శ్రీకృష్ణుని "నీ పెదాలెప్పుడూ ఆ వేణువు మీదే ఉంటాయి. నా పెదాల మీద ఎందుకుండవు?"అని ప్రశ్నించింది. అప్పుడు శ్రీకృష్ణుడు తన వెదురుతో చేసిన మురళిని అటూ ఇటూ ఊపి "చూడు ఇదంతా ఖాళీ. కాబట్టే దీన్ని నా నాదంతో నింపగలుగుతున్నాను" అని సమాధానమిచ్చేడు.

మాం ఉపశ్రితాః -- అనగా నామీదే పూర్తిగా భారం వెయ్యి అని అర్థము. ఆధ్యాత్మిక మార్గంలో మనం చూపవలసినది సంపూర్ణ శరణాగతి. దేవుడు చక్కని రథ సారథి. అలా నమ్మక మనము రథాన్ని మనిష్టమొచ్చినట్లు నడుపుతాం. మనలోని దేవుడు "నన్ను ఎందుకు సారథ్యం చెయ్యనివ్వవు? నువ్వు బుద్ధిగా కూర్చో. నాకు రథమెలాగ నడపాలో చెప్పొద్దు. నన్ను పూర్తిగా నమ్ము" అంటాడు.

అలాగని మనం ముందు జాగ్రత్త లేకుండా ఉండకూడదు. ఉదాహరణకి కారు నడుపుతూ, దేవుడే నడుపుతున్నాడని తలచి ఎర్ర లైట్ దాట కూడదు. మనము శ్రీకృష్ణుని రద్దీగా ఉన్నప్పుడు ఎలాగ నడిపేది అని అడిగితే: రద్దీగా ఉన్న సమయంలో కారు వాడద్దు. అలా వాడవలసి వస్తే ఇతరు వాహనదారులతో కలహాలు పెట్టుకోవద్దు. ఈ విధంగా మనమన్ని ముందు జాగ్రత్తలు తీసికొని "దేవుడా నేను చెయ్యగలిగినంత చేసేను. తక్కిన భారం నీదే" అని ప్రార్థించాలి.

మద్భావం ఆగతాః -- అనగా అతను నన్ను ఆవహిస్తాడు. మనము వస్తువులమీద ప్రేమ వదులుకుంటే, స్వార్థంతో కూడిన బంధాలను త్రె౦పుకుంటే, భయము, క్రోధము నిర్మూలిస్తే దేవుడు: "నిన్ను సర్వ జీవులయందు ప్రేమతో నింపుతాను; ఆ ప్రేమలో ఎటువంటి స్వార్థపూరితమైన సంతోషం, ప్రతిష్ఠ ఉండదు. ఆ ప్రేమను నిస్వార్థ సేవకై ఉపయోగించగలిగే శక్తిని విడుదల చేస్తాను" అంటాడు 230

No comments:

Post a Comment

Viveka Sloka 31 Tel Eng

Telugu English All ఏతయోర్మందతా యత్ర విరక్తత్వముముక్షయోః । మరౌ సలిలవత్తత్ర శమాదేర్భానమాత్రతా ॥ 31 ॥ యత్ర = ఎచట (ఏ వ్యక్త...