Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 3

Bhagavat Gita

6.3

యదా హి నేంద్రియార్థేషు న కర్మ స్యనుషజ్ఞతే {6.4}

సర్వ సంకల్ప సన్న్యాసీ యోగారూఢ స్త దోచ్యతే

ఇంద్రియ విషయములందును, కర్మల యందును అపేక్ష నుంచక సర్వ సంకల్పములను త్యాగము చేయువాడు యోగారూఢుడని చెప్పబడుచున్నాడు

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు చేతన మనస్సు శిఖరాలను అధిరోహించి, జీవైక్య సమానతను, జ్ఞానాన్ని, పట్టుదలని, శక్తిని కలిగి సామరస్యంగా బ్రతికే వాని గురించి చెప్తున్నాడు. భౌద్ధులు అట్టి వానిని నిర్వాణమును పొందినవాడు అని అంటారు. అనగా స్వార్థం, అహంకారం, వేర్పాటులతో కూడిన చెర నుండి విడుదల చేయబడినవాడు.

ఎవరైతే తమలో ప్రతిష్ఠితమైన దేవునియందు స్థిరమైన భక్తితో ఉంటారో, వారు స్వార్థ పూరిత కోరికలవలన --అనగా డబ్బు, పేరుప్రఖ్యాతులు మొదలగునవి-- చలించరు. అట్టివారు పూర్తిగా స్వతంత్రులై, ప్రపంచంతో లావాదేవీలు పెట్టుకోకుండా, సంపూర్ణమైన ఆనందంతో, భద్రతతో ఉంటారు. మనం బంగారం, పుస్తకాలు, కంప్యూటర్లు మీద ఆధారపడి, అవి లేకపోతే విచారానికి గురి అవుతాం. ఆ విధంగా బలహీనులమై అనేక క్లేశాలు అనుభవిస్తాం.

మనకు కావలసిన ఏకైక ఊత మనలోని భగవంతుడు. శ్రీకృష్ణుడు (18:66) అన్ని బాహ్య ఊతలను పట్టి వేళ్ళాడక, వాటిని వదిలి, తననే నమ్మి యుండమని చెప్తాడు. మనం దేవునికి అన్నీ సమర్పిస్తే, మనకు అన్నీ కలుగుతాయి; ఆయనపై పూర్తిగా ఆధార పడితే మనం స్వతంత్రుల మవుతాము. ధ్యానం వలన అవి సాధ్యం. ఇంద్రియాలను నిగ్రహించుకొనే శక్తిని పొంది, బాహ్య ఊతలను వదిలి, దేవుని యందే దృష్టి కేంద్రీకరించి ఉంటాం. 340

No comments:

Post a Comment

Explanation of Illusions and Delusions

Introduction Every philosophical tradition grapples with a deceptively simple question: why do we sometimes get reality wrong? In Indian...