Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 4 Section 5

Bhagavat Gita

4.5

అజో అపి సన్నవ్యయాత్మా భూతానా మీశ్వరోపి సన్ {4.6}

ప్రకృతి౦ స్వా మధిష్ఠాయ సంభవా మ్యాత్మమాయయా

నేను పుట్టుకలేనివాడను, నశింపనివాడను, సర్వభూతములకు నాథుడ నైనను స్వకీయమైన ప్రకృతిని ఆశ్రయించి నా మాయాశక్తి చేత జన్మమెత్తుచున్నాను

యదా యదాహి ధర్మస్య గ్లాని ర్భవతి భారత {4.7}

అభ్యుత్థాన మధర్మస్య తదా ఆత్మానాం సృజామ్యహమ్

భారతా! ఎప్పుడు ధర్మమునకు హానియు, అధర్మమునకు వృద్ధియు కలుగుచుండునో అప్పుడు నన్ను నేను సృజించు కొనుచుందును ఀ

దేవుడు అమరుడు, అపరిముతుడు అయినప్పటికే మానవాళి విపత్తులో ఉన్నప్పుడు అవతారం దాలుస్తాడు. ఆయన ప్రతి వొక్కని దేహంలో ప్రతిష్ఠితుడైనప్పటికీ, ఒకానొక వ్యక్తిలో -- ఏ దేశమైనప్పటికీ, ఏ కాలంలోనైనా-- వ్యక్తమై మానవాళిని తిరిగి ఆధ్యాత్మికత మార్గం వైపు త్రిప్పుతాడు.

ధర్మమనగా ఇతరుల కొరకై జీవించి, మనకన్న ఇతరులను ఎక్కువగా ప్రేమించడం. దానిని నిరూపించాలంటే స్వార్థ పరుల జీవితాల్ని చూడవచ్చు. వారు అభద్రతో, ఆందోళనతో కూడి ఉంటారు. మనము పరోపకారం చేసినప్పుడే మిక్కిలి ఆనందంతో, భద్రతతో జీవించగలం. జీసస్ ఇట్లు చెప్పెను: "నిన్ను నిందించినవారిని ఆశీర్వదించు; నిన్ను ద్వేషించిన వారికి మంచిని చెయ్యి". అలా చెయ్యడం వలన వారిని, మనల్ని ఉద్దరించుకుంటాం.

ఏ తగవులోనైనా మితిమీరకూడదు. అలా చేస్తే తగవు హింసాకాండగా మారుతుంది. మానవ చరిత్రలో సమస్యలు పరిష్కరించ బడ్డాయి అంటే దానికి కారణం: సహనం, క్షమా గుణం. తలిదండ్రుల పిల్లలు మధ్య; భార్యాభర్తల మధ్య; మిత్రుల మధ్య మనము ఇతరులను మనకంటే ముఖ్యులని తలంచాలి.

గాంధీజీ పెరుగుతున్నప్పుడు అనేక పొరపాట్లు చేసేరు. చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళడానికి బదులు ఆటలు ఆడేవారు. యుక్త వయస్సులో పాశ్చాత్యులను వేషభాషలలో అనుకరించేవారు. వారుచేసే నాట్య విన్యాసాలకి , దుస్తులకు ముగ్దులైపోయేవారు. కానీ అతనిలో దైవ కృప కలిగి ఒక మహత్తర మనిషిగా మారేరు. దానివలన దేశము బానిసత్వం నుంచి విడుదలై, సూర్యుడస్తమించని బ్రిటిష్ రాజ్య౦ కలవర౦ చెందింది. దానికై ఒక్క తూటా కూడా గాంధీజీ, ఆయన అనుచరులు వెచ్చించలేదు.

యోగిగా మారుతానంటే మన బంధుమిత్రులు మొదట్లో నమ్మరు. అది వొకరోజు ఉండి, మరో రోజు పోయే వేషం అంటారు. గాంధీజీని మొదట్లో ఒక మోసగాడు, పిచ్చివాడు, మూర్ఖుడు అని అనేవారు. రమణ మహర్షిని మొదట్లో తప్పుగా అర్థం చేసికొన్నవారు నిర్వికల్ప సామాధి ఆయనకు సాధ్యము కానిదని అనేవారు. ఈ విధంగా నిరశన, సంశయం ఉన్నప్పుడు మనము ఓర్పుతో, నిశ్చలంగా ఉండి, మన భద్రత మనలోనే ఉందని తెలిసికోవాలి.

మనలాంటి సాధారణ వ్యక్తులపై దైవ కృప కలిగిందని మొదట్లో నమ్మలేము. ఎందుకంటే దానికి తగమని నమ్ముతాము. మనము దుర్భలులం, స్వల్పమైన వాళ్ళం, స్వార్థపరులం కాబట్టి మనని దేవుడు కరుణించడు అని అనుకొంటాం. కాలక్రమేణ మనలో భద్రత పెరిగి, ఇతరులకై పాటుపడి, మనము దేవుని కృపను నమ్మి, ఆయన మనల్ని తన కార్య సిద్ధికి ఎన్నుకొన్నాడాని నమ్ముతాము. అది మనని ఆశ్చర్య చకితులను చేసి, జీవితమంతా సాధనకై అంకితం చేస్తాం. కలల్లో శ్రీకృష్ణుడు, లేదా జీసస్ క్రైస్ట్ మనకు దర్శనమిచ్చి వాత్సల్యం చూపుతారు. మనము దాన్ని ఇష్టంగా, వినమ్రతతో స్వీకరిస్తే ఎటువంటి భయం లేకుండా ఉండవచ్చు. ఈ విధమైన మార్పు వస్తే, మనము అల్పుల మైనప్పటికీ, ప్రపంచ శాంతికై ఉద్యమించవచ్చు. మన హృదయాలలో శాంతిని ఏర్పరుచుకొని, మన కుటుంబ, సమాజ ఉద్ధరణకై జీవిస్తే, మనము ప్రపంచాన్ని మార్చ గలిగిన వారలమౌతాము. 222

No comments:

Post a Comment

Atheism in Yoga Vasishtyam?

Sage Vasishta in Book 5, Chapter 13, Verse 9-10: They who place their reliance upon faith in gods and depend upon them to fulfill their de...