Ramana Maharshi Aatma Vichaarana
నే నెవరిని? ఆత్మ విచారణ ప్రతి జీవి ఆనందాన్నే కోరుతుంది. అలాగే తనయందు మిక్కిలి ప్రేమ కలిగి ఉంటుంది. ఎందుకంటే జీవి స్వతహాగా ఆనంద స్వభావము గలది. గాఢ నిద్రలో ఉండే ఆనందం వేకువలో కూడా పొందాలంటే జీవి తన గురించి తాను తెలిసికోవాలి. దానికై "నే నెవరిని?" అని తనను తాను ప్రశ్నించుకొని ఆత్మ జ్ఞానము పొందాలి. "నే నెవరిని?" నేను దేహము కాదు; పంచేంద్రియాలు, కర్మే౦ద్రియాలు; పంచ ప్రాణాలు; మనస్సు కాదు. అలాగే అజ్ఞానములో కేవలము పూర్వ సంస్కారముల ననుసరించి కర్మలు నిర్వహించి, మనస్సు, కర్మే౦ద్రియాలను౦డి మరియు జ్ఞానేంద్రియాల గ్రాహకములనుండి విడిపడి ఉండేవాడిని కాదు. ఈ విధంగా విచారణ చేస్తే మిగిలేది, అద్వితీయమైనది, శుద్ధమైనది అయిన ఆత్మ. అదే మన స్వస్వరూపము. అది సత్ చిత్ ఆనందము. జ్ఞానమును పొందడానికి , కర్మలు చేయడానికి ఉపయోగపడే మనస్సు ఉపశమిస్తే గాని ప్రపంచము మిథ్య అనే భావము కలుగదు. ఎలాగంటే రజ్జు-సర్పము భ్రాంతి ననుసరించి, సర్ప భావనను తొలగిస్తే గాని, అది రజ్జు అనే జ్ఞానము కలగదు. ఆత్మ మీద ఆరోపింపబడిన ప్రపంచము మిథ్య, అసత్యము అనే జ్ఞానము కలగనంత కాలమ