Posts

Showing posts with the label Eknath Gita Book 2

Eknath Gita Chapter 12 Section 16

Bhagavat Gita 12.16 యే తు ధర్మ్యుమృతమిదం యథోక్త౦ పర్యుపాసతే {12.20} శ్రద్ధధానా మత్పరమాః భక్తాస్తే అతీవ మే ప్రియాః ఎవరయితే శ్రద్ధావంతులై, నేనే పరమగతియని భావించిన వారై, నేను ఇంతవరకు తెలిపిన విధముగ ఈ ధర్మ స్వరూపమైన అమృతమును సేవించుచున్నారో వారు నా కత్యంత ప్రియులు ఀ ఋగ్వేదంలో ఒక మంత్రం చెప్తారు నన్ను అవాస్తవం లోనుంచి వాస్తవంలోకి తీసికెళ్ళు నన్ను అంధకారం నుండి కాంతి పథంలోకి నడిపించు నన్ను మరణం నుంచి అమృతత్వానికి తీసికెళ్లు ఇదే అన్ని మతాలలోనీ సందేశం. నేను ధ్యానం మొదలు పెట్టే ముందు, అమృతత్వం అంటే కవులు వాడే ఒక పదమనుకునేవాడిని. మరణం మీద నా అమ్మమ్మ యొక్క దృక్పథం తెలిసికొన్న తరువాత అమృతత్వం వాస్తవమని తెలిసికొన్నాను. దానికై ఉత్సాహం, సాహసం ఉన్న వారు ప్రయత్నించవచ్చు-- మరణం తరువాత కాదు, ఇప్పుడే, ఇక్కడే. అనేక యోగులు ఇది తెలిసికొని దేశకాలాలకి అతీతంగా బ్రతికేరు. అటువంటివారికి మరణం లేదు. వారి దేహం పడిపోవచ్చు. కానీ వారి చేతనం ఖండింపబడదు. ఎందుకంటే వారు దేహంతో తాదాత్మ్యం చెందలేదు. గాఢమైన ధ్యానంలో చేతన మనస్సును దేహేంద్రియాల నుండి వెనక్కి తీసుకొంటే, మనం దేహా

Eknath Gita Chapter 12 Section 15

Bhagavat Gita 12.15 సమశ్శత్రౌ చ మిత్రే చ తథా మానావమానయో {12.18} శీతోష్ణసుఖదుఃఖేషు సమ స్స౦గ వివర్జితః తుల్యనిందాస్తుతి ర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ {12.19} అనికేతః స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః శత్రుమిత్రుల యందును, మానావ మానముల యందును, శీతోష్ణ సుఖ దుఃఖముల యందును, నిందాస్తుతుల యందును సమబుద్ధి గలవాడై, సంగరహితుడై, మనన శీలుడై, లభించిన దానితో తృప్తి చెందువాడై, ఇల్లు లేనివాడై స్థిరబుద్ధి కలిగియుండు భక్తుడెవడో వాడు నాకు ఇష్టుడు గాంధీ మహాత్ముడు "నేను ఇంట్లో మిత్రులొక్కరితోనే కాదు, శత్రువులతోనూ కలసి ఉంటాను" అని చెప్పేరు. మనకు ఒకరితో స్పర్థ కలిగినప్పుడు, వానిని శత్రువుగా చూడక, సమస్యను పరిష్కరి౦చే మార్గాన్ని కలిసి వెదకాలి . గాంధీ పరిష్కరించలేని సమస్య ఏదీ లేదని అనేవారు. ఎందుకంటే ఆయన నిరాడంబరముగా నుండి తన ప్రత్యర్థి గౌరవాన్ని చూరుగొంటారు. బేదాభిప్రాయాలు కలిగినప్పుడు, ఉన్న సమస్య మన ప్రత్యర్థి. ఒక సమస్య కలిగినప్పుడు ఎవరిని నిందించాలి అని చూడకోడదు. "వివాదంలో పెళ్ళిలాగే ఇద్దరు౦టారు" అనే నానుడి ఉంది. ఎటువంటి పరిస్థితులోనైనా

Eknath Gita Chapter 12 Section 14

Bhagavat Gita 12.14 యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి {12.17} శుభాశుభ పరిత్యాగీ భక్తి మాన్య స్స మే ప్రియః ఎవడు సంతసించడో, ద్వేషింపడో, దుఃఖి౦పడో, అభిలషి౦చడో, శుభాశుభకర్మములను విడిచినవాడో అట్టి భక్తుడు నాకు ఇష్టుడు మనం జీవితంలో నచ్చినదాని వెనుక పరిగెత్తి, నచ్చనిదానివైపు చూడకుండా ఉంటే మనము సంకెళ్ళు వేసుకొని ఇతరులతో స్వేచ్ఛగా ఉండనట్లే. "నాకు ధృడమైన అభిప్రాయాలు ఉన్నాయి", లేదా "నాకు ఏది కావాలో తెలుసు. నేను స్వేచ్ఛగా ఉన్నాను" అనుకునేవారు నిజంగా సంకెళ్ళు వేసికొన్నవారు. మామూలుగా అడ్డదిడ్డంగా వెళ్ళే కొన్ని సూక్ష్మక్రిములు ఉద్దేశపూరకంగా కొన్ని పదార్థాలవైపు వెళతాయి. అది వాటికి నచ్చితే ఉంటాయి, లేకపోతే వెళ్ళిపోతాయి. అలాగే మనలో చాలా మంది ఉంటారు. కాని మనకు ఆలోచనా శక్తి ఉండి, బుద్ధిపూర్వకంగా మన నడవడికను మార్చుకోవచ్చు. ఇక్కడ అహంకారం యొక్క పాత్ర ప్రధానమైనది. అది "నాకిది ఇష్టం", "నాకిది అయిష్టం" అని నిర్ధారణ చేస్తుంది. అందుకే బుద్ధిని ఉపయోగించి ఏది శ్రేష్ఠమో నిర్ణయించాలి. మనం ఒక క్రొత్త వ్యక్తిని కలిసినపుడు

Eknath Gita Chapter 12 Section 13

Bhagavat Gita 12.13 అనపేక్షః శుచిర్దక్షః ఉదాసీనో గతవ్యథః {12.16} సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తస్స మే ప్రియః అపేక్షలేనివాడును, పరిశుద్ధుడును, సమర్థుడును, నిర్లిప్తుడును, బాధలుడిగినవాడును, కర్మలయందు కర్తృత్వబుద్ధిని వదలిన వాడును నైన భక్తుడు నా కిష్టుడు ఀ పై శ్లోకంలో శ్రీకృష్ణుడు అనపేక్ష అనే పద ప్రయోగం చేస్తున్నాడు. అనపేక్ష అనగా ఎదురు చూపు లేకుండుట. దాన్నే అనుకోని విధంగా వచ్చునది అని కూడా అర్థం చెప్పవచ్చు. అంటే "నాకు మంచైనా, చెడైనా, ఆనందమైనా, దుఃఖమైనా ఇవ్వండి, సర్దుకు పోతాను" అని చెప్పడం. అనపేక్షకు వ్యతిరేక పదం కఠినం. మనకి ఎదురు చూసే ఫలితం కలిగితే మంచిదని అనుకుంటాం. కాని దానికి వ్యతిరేకంగా ఉంటే బిగుసుకు పోతాం. కాబట్టి ఎదురు చూపు లేకుండా బ్రతకడం అంటే స్వేచ్ఛ. ముఖ్యంగా మనము అనుబంధాలలో మనకు అనుకూలంగా ఇతరులు ప్రవర్తించాలని ఎదురు చూస్తాం. వారు అనుకోని విధంగా ప్రవర్తిస్తే మనకు ద్వేషం, కోపం, నిరాశ, దుఃఖం మొదలగునవి కలుగుతాయి. మనము కోరే ప్రతిస్పందన మనకనుగుణంగా లేకపోతే మన స్పందన కూడా అలాగే ఉంటుంది. అంటే, ఉదాహరణకి, కోపాన్ని, కోపంతో ప్రతిఘటిస్తామ

Eknath Gita Chapter 12 Section 12

Bhagavat Gita 12.12 యస్మానో ద్విజతే లోకో లోకాన్నోద్విజతే చ యః {12.15} హర్షామర్ష భయోద్వేగైః ముక్తో యస్స చ మే ప్రియః ఎవని వలన లోకమునకు భయము కలుగదో, లోకమువలన ఎవడు భయము నొందడో, సంతోషము, క్రోధము, భయము, ఉద్వేగము నుండి ఎవడు ముక్తుడో వాడు నాకు ప్రియుడు. నా అమ్మమ్మ "నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఒడిదొడుకులు ఉంటాయి. నిన్ను ప్రేమించేవారు, నిన్ను ఖాతరు చెయ్యని వారు ఉంటారు" అని చెప్పేది. జీవితం సహజంగా ఎత్తుపల్లాలతో ఉంటుంది. గీత చెప్పేది మనమలా ఉండనక్కరలేదని. ఈ మధ్య బయోరిథమ్ మీద చాలా ఎక్కువగా చదువుతున్నాను. ఈ సిద్ధాంతం ప్రకారం మనలోని భావాలు కొన్నాళ్ళు పైకి కొన్నాళ్ళు క్రిందకి వెళ్తూఉంటాయి. ఒక వారం ఆనందంగా ఉండి, మరో వారం విచారంగా గడపడమన్నమాట. మనమీ ఒడుదొడుకులను ఒక పఠం మీద గీస్తే, మన లక్ష్యాలను ఒక ప్రణాళికతో సాధించవచ్చు. కానీ జీవితం మన ఒడుదొడుకుల మీద ఆధారపడి లేదు. గీత చెప్పినట్టు జీవిత మనకణుగుణముగా ఉంటే ఆనందపడి, మనకి వ్యతిరేకంగా ఉంటే ఇంకా ఆనందపడడం సాధ్యం కాదు. అనగా ఎత్తుపల్లాలను పట్టించుకోకుండా నిరంతరం ప్రసన్నంగా ఉండలేము. మనలో చాలామంది ఆనందం ఒక సమస్య

Eknath Gita Chapter 12 Section 11

Bhagavat Gita 12.11 అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ {12.13} నిర్మమో నిరహంకారః సమ దుఃఖసుఖః క్షమీ సంతుష్ట స్సతతం యోగీ యతాత్మా దృఢనిశ్చయః {12.14} మయ్యర్పిత మనోబుద్ధిః యో మద్భక్తస్స మే ప్రియః సర్వ ప్రాణులపై ద్వేషము లేనివాడును, మైత్రి గలవాడును, దయామయుడును, అహంకార మమకారములు లేనివాడును, సుఖ దుఃఖములను సమముగ చూచువాడును, సహన శీలుడును, నిత్య తృప్తుడును, యోగియును, ఆత్మ నిగ్రహము కలవాడును, దృఢ నిశ్చయము కలవాడును, మనోబుద్ధులను నా యందే సమర్పించిన వాడును అగు భక్తుడు నాకు ఇష్టుడు. ఀ ఇక్కడ శ్రీకృష్ణుడు తన భక్తుల సద్గుణాలను వివరిస్తున్నాడు. ముఖ్యంగా అందరియందు దయ, కారుణ్యంతో ఉండాలి. మనమెప్పుడు క్రోధంతో ఉండకూడదు. అలాగే నేను, నాది అనే భావనలను వదులుకోవాలి. కొందరు ఒక వాహనమును నాది అనుకుంటారు. వారి వాహనాన్ని విమర్శిస్తే దానిని వారిని విమర్శిస్తున్నట్టుగా అపార్థం చేసికొంటారు. మనలోని స్థిరమైన భావనలను ఇతరులకై మార్చు కోవాలి. వ్యతిరేక భావాలున్నవారి దృక్పథం పూర్తిగా వినాలి. వారు చెప్పేది మనకు వేరుగా ఉంటే వారిని కించపరచ కూడదు. ఈ విషయంలో కొంత వైరాగ

Eknath Gita Chapter 12 Section 10

Bhagavat Gita 12.10 శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాద్ధ్యానం విశిష్యతే {12.12} ధ్యానాత్కర్మఫలత్యాగః త్యాగాచ్చా౦తి రనంతరమ్ అభ్యాసము కంటెను జ్ఞానము శ్రేయోదాయకము. జ్ఞానము కంటెను ధ్యానము ఉత్తమము. ధ్యానము కంటెను కర్మ ఫలత్యాగము ఉన్నతము. కర్మఫల త్యాగముచే శాంతి కలుగును ఀ ఎక్కడైతే జీవైక్య జ్ఞానం ఉన్నాదో అక్కడ ప్రేమ ఉంది. అలాగే ఎక్కడైతే ప్రేమ ఉందో, అక్కడ జీవైక్య భావన ఉంది. మనస్సు నిశ్చలంగా లేకపోతే ఇంద్రియాతీత జ్ఞానం లేదా ప్రేమ లేదు. సాధనలో ఇవి కలసి వస్తాయి. కాబట్టి సాధనలో వాటినన్నిటినీ కలిపి పట్టుకోవాలి. సాధన మొదట్లో యాంత్రికంగా చేయడంలో తప్పులేదు. కొందరు అప్పుడే ధ్యాన మార్గంలో ప్రవేశించి నన్ను "మీరు మంత్రాన్ని యాంత్రికంగా జపించమని అంటున్నారా?" అని అడిగేవారు. నేను అవునని చెప్పేవాడిని. మంత్రాన్ని భక్తితో మననం చెయ్యడానికి మన స్వచ్ఛంద భావాలు తక్కువగా ఉండాలి. మనము ఉత్సాహంతో, ఎప్పుడు వీలయితే అప్పుడు, మంత్రాన్ని జపిస్తూ పోతే, క్రమంగా అది మన చేతన మనస్సు లోతులలో ప్రసరిస్తుంది. ఈ విధంగా సాధన చేస్తే మనకు ప్రావీణ్యం వస్తుంది. మనము వేర్పాటుతో బ్

Eknath Gita Chapter 12 Section 9

Bhagavat Gita 12.9 అథైటదప్యశక్తో అసి కర్తుం మద్యోగమాశ్రితః {12.11} సర్వకర్మఫలత్యాగం తతః కురు యతాత్మవాన్ నా నిమిత్తమైన కర్మ నాచరించుటకు కూడా ఆశక్తుడవైనచో ఆత్మనిగ్రహము కలిగి, నన్నే ఆశ్రయించుచు, కర్మఫలాసక్తిని త్యజించి కర్మల నాచరింపుము ఈ శ్లోకంలోని అంశాలను అనుభవంలోకి తెచ్చుకోవడం అతి దుర్లభం. అది తేలిక అనుకొంటే మనము శరణాగతి అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసికోలేదు. శరణాగతి అంటే ఏమీ చెయ్యకుండా ఉండడం కాదు. గీత ముఖ్యంగా కర్మ చెయ్యమని చెప్తుంది. కాని ఆ కర్మ నిస్వార్థమై -- అంటే ఫలాపేక్ష లేకుండా-- ఉండాలి. అనగా క్రియ లేదా ప్రయత్నాన్ని దేవునికి సమర్పించడం కాదు. మన స్వీయ ఇచ్ఛయించుట సమర్పణం చెయ్యాలి. సదా మన కర్మలను శ్రద్ధతో చెయ్యాలి. వాటి ఫలిత౦ మన చేతిలో లేదు. శ్రీకృష్ణుడు కర్మ ఫలాన్ని ఆశించక కర్మలు చెయ్యడం మానక ఉండాలి అని బోధ చేయుచున్నాడు. శ్రీరామ చంద్రుడు రాజ్యాన్ని వదిలి వనవాసానకి వెళ్ళడానికి మూల కారణం కర్మ సిద్ధాంతం. మన౦ మనసా, వాచా, కర్మా జీవితాన్ని మలచుకొంటున్నాము. దశరథుడు ఒకప్పుడు ఒక ముని కుమారుని సంహరించేడు. ఆ ముని ఇచ్చిన శాపంవలన రాముని పట్టాభి

Eknath Gita Chapter 12 Section 8

Bhagavat Gita 12.8 అభ్యాసే అప్యసమర్ధో అసి మత్కర్మపరమోభవ {12.10} మదర్థమపి కర్మాణి కుర్వన్ సిద్ధి మవాప్న్యసి అభ్యాసయోగము నాచరించుట కూడా నీవు అసమర్థుడ వైనచో నా నిమిత్తమైన కర్మయందు నిరతుడవు కమ్ము. నా కొరకు కర్మ లాచరించినను నీవు సిద్ధిని పొందగలవు ఀ మనము వేరొకరి సంతోషం కోరి వారిని మనస్సులో పెట్టుకొని ఏ పనైనా చెయ్యాలి. ఒక తల్లి, కొడుకుల అనుబంధంలో, లేదా అన్న, చెల్లెలి అనుబంధంలో ఇలా చేయడం తేలిక. కాని ఇతరులను మనకంటే ఎక్కువగా చూసుకోవడం కష్టం. ఎందుకనగా మన౦ మన సంస్కారాలు వలన మలచబడ్డా౦. సంస్కారమంటే మన వ్యక్తిత్వంలో ఎప్పటికీ మార్పు లేకుండా, యాంత్రికంగా జరిగే స్పందన. అది ఒక ప్రక్రియ: ఒకే ఆలోచన వేల సార్లు కలిగి, ఆ ఆలోచనతో వాక్కు ప్రభావితమై, తద్వారా క్రియను ఆచరించడం. ఒక కోపిష్టికి కోపం రావడం సహజం. వానిని ఏ విధంగా పలకరించినా వానికి కోపం కలుగుతుంది. అది వాని సంస్కారం. వాని ఆలోచనలు కోపంతో కూడినవై, మాటలు నిర్దయతో కూడినవై, నడవడిక దురుసుగా ఉండి, చివరకు కోపిష్టి అయ్యాడు. వ్యక్తిత్వమనగా సంస్కారాల పోగు. అనగా మనము మన సంస్కారాలతో చేయబడ్డాము. మనమేమి ఆలోచిస్తామో, మాట

Eknath Gita Chapter 12 Section 7

Bhagavat Gita 12.7 అథ చిత్తం సమాధాతు౦ న శక్నోషి మయి స్థిరం {12.9} అభ్యాసయోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ అర్జునా! ఇంకను నీ మనస్సును నా యందు స్థిరముగ నిలుపుటకు అశక్తుడవైనచో అభ్యాసయోగముచే నన్ను పొందుటకు యత్నించుము అభ్యాసము కూసువిద్య అన్నారు పెద్దలు. ధ్యానం అభ్యాసంవలననే అలవడుతుంది. మొదట్లో మనస్సు పరిపరి విధాలా పోతుంది. అలాగే మనలోని క్రోధం, భయం మొదలైన దుర్గుణాలు మనస్సును తప్పు ద్రోవ పట్టిస్తాయి. వాటికి కారణం మన అహంకారం. ఇలాటి సమయాలలో మంత్రజపం తప్ప వేరే మార్గం లేదు. మంత్రం ఆలోచనకి, సావధానతకి మధ్యనున్న బంధాన్ని తెంపుతుంది. ఆలోచనలు పలు రకాలుగా ఉండచ్చు. కానీ వాటిని పరిశీలించేది మన సావధానత. మనమెప్పుడైతే ఒక ఆలోచన మీద శ్రద్ధ చూపమో అది మననేమి చేయలేదు. సావధానత ఒక దీపస్తంభం లాంటిది. సాధారణంగా అది అన్ని వైపులా తిరగగలదు. మన సావధానత తరచు భగ్నమైతే, ఆ దీపస్తంభం ఒక చోట ఆగిపోయింది. ఎన్నో ఏళ్లు గడిస్తే అది ఇక తిరగలేదు. అలాటప్పుడు ధ్యానం ద్వారా ఒక చోట చిక్కుకుపోయిన శ్రద్ధను విడిపించుకోవాలి. అది ఎలాగంటే, మనకిష్టంలేని పనులు ఆనందంగా స్వీకరించాలి. ఏపని చేసినా శ

Eknath Gita Chapter 12 Section 6

Bhagavat Gita 12.6 మయ్యేవ మన ఆధత్స్వ మయి బుద్ధిం నివేశయ {12.8} నివసిష్యసి మయ్యేవ అత ఊర్థ్వ౦ న సంశయః నీ మనస్సును నా యందు నిలుపుము. నీ బుద్ధిని నాయందు ప్రవేశపెట్టుము. ఆ తరువాత నీవు నా యందే వసి౦తువు. ఇందులో సంశయము లేదు ఒక క్రీడాకారుడు ఎంతో ఆలోచించకుండా యాంత్రికంగా తన క్రీడను ఆడవచ్చు. ఆధ్యాత్మిక సాధనలో అలాగే మనస్సును నిశ్చలంగా ఉంచుకోవాలి. ఎందుకంటే మనలో ఆవేదన అహంకారం వలన కలుగుతుంది. అది నిశ్చలంగా ఉంటే మనచే ఏ పనీ బలవంతంగా చేయబడదు. అలాగే మన అనుబంధాలకు అవరోధాలుండవు. మన మాటే నెగ్గాలి, అంతా మన ఇష్టమే అనే భావనలు ఉంటే అవి మన అనుబంధాలకు అడ్డు వచ్చి ఇతరులపై ప్రేమ కలుగజేయవు. ఆ భావనలను ఎంత తగ్గించుకుంటే మన నుండి మనము అంత ఎక్కువగా వైరాగ్యము చెందుతాము. అట్టి వైరాగ్యము లేకపోతే ఇతరులయందు అసూయ, క్రోధము మొదలగు అవలక్షణాలు కలుగుతాయి. మన మనస్సు మనకు కావాలసినట్టు జరిగితే ఉవ్విళ్ళూరుతుంది. అలా కాకపోతే క్రుంగిపోతుంది. మనకు స్వీయ వైరాగ్యం కలిగితే మనస్సులోని చలనం తగ్గుతుంది. అప్పుడు మనము జీవైక్యముతో ఉంటాము. దాని సహజ లక్షణం ఒక వ్యక్తి యందే కాక, అన్ని జీవులమీ

Eknath Gita Chapter 12 Section 5

Bhagavat Gita 12.5 యే తు సర్వాణి కర్మాణి మయి నన్న్యస్య మత్పరాః {12.6} అనన్యేనైవ యోగేన మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్తా మృత్యుసంసార సాగరాత్ {12.7} భవామి న చిరాత్పార్థ మయ్యావేశిత చేతసామ్ అర్జునా! సర్వకర్మములను నా యందే సమర్పించి, నేనే పరమగతి యని భావించి, అనన్య యోగముచే నన్నే ధ్యానించుచు సేవించుచుందురో, నా యందు చిత్తముంచిన అట్టివారలను జనన మరణ సంసార సాగరమునుండి అతి శీఘ్రకాలములోనే నే నుద్ధరి౦తును ఀ మనం ఒకచేత్తో పరమపదాన్ని పట్టుకోదలచుతాము, రెండవ చేతితో మన వస్తువులను పట్టుకుంటాము. పరమపదం కావాలంటే వస్తువులను జార విడవాలి. దానికై శ్రీకృష్ణుడు ఇలా చెప్పుచున్నాడు: మత్పరః -- అనగా నన్నే నీ లక్ష్యంగా పెట్టుకో. ఏదీ మన ఆనందానికి లేదా ఇతరుల సంతోషానికి కాక దేవునికై, మనలోను, ఇతరులలోను ఉన్న పరమాత్మకై చెయ్యాలి. ఇంకా శ్రీకృష్ణుడు సర్వ కర్మాణి అన్నాడు. అంటే మనం చేసే ప్రతి కర్మ దైవార్పణ చెయ్యాలి. ఇందులో వెసులుబాటు లేదు. మనమిది చేతన మనస్సు ఉపరితలంలో కాక, స్వార్థ పూరిత కోర్కెలతో నిండి ఉాన్న లోతుకు వెళ్తేనే సాధ్యం. దీనికి ధ్యానం ఒక్కటే సరిపోదు. ఒకమారు

Eknath Gita Chapter 12 Section 4

Bhagavat Gita 12.4 క్లేశో అధికతరస్తేషా౦ అవ్యక్తాసక్త చేతసా౦ {12.5} అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భి రవాస్యతే అక్షరపరబ్రహ్మ చింతనము బహు కష్టసాధ్యము. దేహాభిమానులచే అవ్యక్తోపాసన అతి కష్టముగ పొందబడుచున్నది ఀ కొన్ని శతాబ్దాల క్రిందట ఒక యోగి "ఎవరి ఇంద్రియాలైతే స్వాధీనంలో ఉంటాయో వారికి మాత్రమే జ్ఞాన యోగ మార్గం తేలిక" అని చెప్పెను. అంటే ఇంద్రియాలు మన ఆధీనంలో లేకపోతే జ్ఞాన యోగం పనికిరాదు. మనకు ఇంద్రియ నిగ్రహం చాలా కష్టంతో కూడిన పని. కాబట్టి జ్ఞాన యోగం ఆది శంకరులు, మైస్టర్ ఎక్హార్ట్, ఆనందమయిమా వంటి వారికే సాధ్యం. ఇది జ్ఞాన యోగ౦పై విమర్శ కాదు. ఇది మనలో ఇంద్రియ నిగ్రహం లేక పోవడమనే బలహీనత వలన. మనము ఎంత ఇంద్రియాలకు లోబడి ఉంటే అంత ఎడంగా ఉంటాము. అలాగే అనిశ్చిత, నిరాశ, అసూయ మొదలగునవి కలుగుతాయి. ఈ సమస్యలను అధిగమించవచ్చు. కాని అది భౌతికంగా కాదు. ధ్యానంలో చేతన మనస్సును విశ్లేషించ తద్వారా పరిష్కారం పొందవచ్చు. అబ్రహం మాస్లో "మన దగ్గర సుత్తి తప్ప వేరే పనిముట్టు లేకపోతే, మనకి ప్రతి సమస్య మేకులా కనిపిస్తుంది" అని చెప్పెను. మనమిలాగే సమస్యలను భ

Eknath Gita Chapter 12 Section 3

Bhagavat Gita 12.3 యే త్వక్షర మనిర్దేశ్య౦ అవ్యక్తం పర్యుపాసతే {12.3} సర్వత్రగ మచింత్యంచ కూటస్థ మచలం ధృవమ్ సంనియమ్యే౦ద్రియగ్రామం సర్వత్ర సమబుద్ధయః {12.4} తే ప్రాప్నునంతి మామేవ సర్వభూతహితే రతాః ఎవరయితే ఇంద్రియములను నిగ్రహించి, అంతటను సమబుద్ధి కలిగి, సర్వ ప్రాణులకు మేలు చేయుటయందు పరమాసక్తి గలవారై అక్షరము, అనిర్దేశ్యము, అవ్యక్తమును, సర్వత్రగము, చింతించుటకు వీలు కానిదియు, కూటస్థము, అచలము, ధృవము నైన బ్రహ్మమును ఉపాసించుచున్నారో వారే నన్ను పొందుచున్నారు. ఀ నిర్గుణ దైవాన్ని ఊహించలేం. కానీ దాన్ని నమ్మేవాళ్ళు ఉన్నారు. ఉపనిషత్తులలో అట్టి దైవాన్ని బ్రహ్మన్ అని అంటారు. ఈ రోజుల్లో గుణములతో కూడిన దైవాన్ని పూజించడం మూఢ నమ్మకం లేదా మేధ యొక్క బలహీనత అని తలిచేవారు చాలా మంది ఉన్నారు. జ్ఞాన యోగం మేధకి సంబంధించినది కాదు. మేధ ద్వంద్వాలని -- ఉదాహరణకు తెలిసికొనేవాడు, తెలిసికోబడేది -- విశ్లేషిస్తుంది. నిర్గుణ దైవాన్ని తెలిసికోవాలంటే ద్వంద్వాలను అధిగమించాలి. అంటే తెలిసికొనేవాడు, తెలిసికొనబడేది ఏకమై ఒకే అఖండమైన బ్రహ్మన్ ఉన్నాడనే జ్ఞానము కలుగుతుంది. దీనినే నిర్వ

Eknath Gita Chapter 12 Section 2

Bhagavat Gita 12.2 శ్రీ భగవానువాచ: {12.2} మయ్యావేశ్య మనో యే మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతా స్తే మే యుక్తతమా మతాః నాయందే మనస్సు నిలిపి, నిత్యయుక్తులై, ఉత్తమమైన శ్రద్ధతో కూడి నన్నే ఉపాసించుచున్నారో వారు యోగి శ్రేష్ఠులని నా అభిప్రాయము ఒక గ్రామస్తుడు ధ్యానం నేర్చుకోవడానికి ఒక గురువు దగ్గరకు వెళ్ళేడు. గురువు అతన్ని ఓంకారం జపించమని చెప్పేడు. ఆ గ్రామస్తుడు కొన్నాళ్ల తరువాత గురువు దగ్గరకు వచ్చి, తనకు ఓంకారం పనిచెయ్యటం లేదని చెప్పేడు. అప్పుడు గురువు నీకిష్టమైనది ఏమిటి అని అడిగేడు. ఆవు అని గ్రామస్తుడు చెప్పేడు. అయితే ఆవు మీద ధ్యానం చెయ్యమని గురువు చెప్పేడు. కొన్ని రోజులు తరువాత గురువు గ్రామస్తుడు ఎలా ఉన్నాడో చూద్దామని వాని ఇంటికి వెళ్ళేడు. ఇంటివాళ్ళు అతను మూడు రోజులపాటు ధ్యానంలో ఉన్నాడని చెప్పేరు. అది విని గురువు ఆశ్చర్యం చె౦ది, గది తలపును కొట్టి బయటకు రమ్మన్నాడు. "నేను ధ్యానం చేస్తున్నాను" అని గ్రామస్తుడు చెప్పేడు. "వెంటనే వెలుపలకు రా. నీతో మాట్లాడాలి" అని గురువు అన్నాడు. "నేను బయటకు వద్దామంటే నా కొమ్ములు అ

Eknath Gita Chapter 12 Section 1

Bhagavat Gita 12.1 అర్జున ఉవాచ: {12.1} ఏవం సతతయుక్తా యే భక్తాస్త్యా౦ పర్యుపాసతే యే చాప్యక్షర మవ్యక్త౦ తేషాం కే యోగవిత్తమాః కొందరు భక్తులు వారి మనస్సును సదా నీయందే నిలిపి నిన్ను ఉపాసించుచున్నారు. మరికొందరు అవ్యక్తమైన అక్షర పర బ్రహ్మమును ధ్యానించు చున్నారు. వీరిలో ఉత్తమ యోగులెవరు? అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వ రూపమును చూసి అతనితో శాశ్వతముగా ఐక్యమవ్వాలని కాంక్షి౦చెను. ఈ విధంగా చాలామంది యోగులు కాంక్షిస్తారు. భగవంతుడు తనపై ప్రేమను పెంపొంది౦టకు కనీకనబడనట్టు ఉంటాడు. మనమా ఆనందాన్ని పొందుతే, మనమాశించేది శాశ్వతంగా ప్రతి ఒక్కరిలోనూ, ప్రతి చోటా, ప్రతి నిమిషం, ఆయన ఎరుక కలిగి ఉండాలని. ఈ శ్లోకంలో అర్జునుడు దేవునితో ఐక్యము పొందడం ప్రేమ వలననా లేదా జ్ఞానం వలననా అని అడుగుతున్నాడు. ఇది చాలా పర్యావసానాలకి దారి తీస్తుంది. ఎందుకంటే దానివలన ఒక ప్రశ్న కలుగుతుంది: మనము ఎవరము మరియు మనము ఏ విధముగ మార్పు చెందగలము? ఇది ఒక తత్త్వ సంబంధితమైన అంశం కాదు. దీనిని మన జీవిత౦లో ప్రతి విషయంలోనూ అన్వయించవచ్చును. పరిసరాలు, భౌతిక, మానసిక స్థితులు మన భౌతిక పరమైన వ్యక్తిత్వము మీద

Eknath Gita Chapter 11 Section 26

Bhagavat Gita 11.26 మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త స్స౦గ వర్జితః {11.55} నిర్వైర స్సర్వభూతేషు యస్స మామేతి పాండవ పాండు తనయా! ఎవడు నా కొరకే కర్మలాచరించుచు, నేనే పరమగతి యని భావించి, నాకు భక్తుడై సంగరహితుడై సకల భూతముల యందును వైర బుద్ధి లేక యుండునో వాడు నన్నే పొందుచున్నాడు ఀ కొందరు గాఢమైన భక్తి గలవారు దేవుడ్ని ప్రత్యక్షంగా చూసి ఉండవచ్చు. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అస్సీసీ, శ్రీ రామకృష్ణ వారలు అట్టివారు. దేవుని ప్రత్యక్షంగా చూడడం, దేవదూతల వాక్కు వినడం మనని ఆశ్చర్య పరచినా, నేను ఒక సాధారణమైన విషయం చెప్తాను. శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో చెప్పేది: ఎవరైతే తమ సర్వ కర్మలు దేవునికి నిస్వార్థంగా, దురాలోచన లేకుండా అర్పిస్తారో, వారు దేవుని సదా స్మరిస్తూ ఉంటారు. మహాత్మా గాంధీ అటువంటి మనీషి. ఆయనకు దేవుడు ప్రత్యక్షము కాలేదు; దేవదూతలు ఆయనతో మాట్లాడలేదు. కానీ ఆయన ఆధ్యాత్మిక జ్ఞానం అమితమైనది. ఆయన తన మిత్రుల, --శత్రువులకై కూడా-- క్షేమానికై తన లాభం చూసుకోకుండా చాలా పాటు పడ్డారు. ఆయన తన ప్రత్యర్థులను బలంతో కాక, ప్రేమతో చూసేవారు. ఇటువంటి దైవ భక్తి మనం ఎప్పుడైనా అలవరచుకోవచ్చు.

Eknath Gita Chapter 11 Section 25

Bhagavat Gita 11.25 శ్రీ భగవానువాచ: సుదుర్ధర్శమిదం రూపం దృష్టవానసి యన్మమ {11.52} దేవా అప్యస్య రూపస్య నిత్యం దర్శనకాంక్షిణః నీవు చూసిన ఈ విశ్వరూపము చూడ శక్యము గానిది. దేవతలు సైతము సదా ఈ రూపమును దర్శింప గోరు చుందురు. నాహం వేదైర్న తపసా న దానేన స చేజ్యయా శక్య ఏవంవిధో ద్రష్టు౦ దృష్టవానసి మాం యథా {11.53} నీవు దర్శించిన ఈ రూపము వేదముల చేత గాని, యజ్ఞదాన తపస్సుల చేత గాని దర్శింప శక్యము గాదు. భక్త్యా త్వనన్యయా శక్య అహ మేవ౦విధో అర్జున జ్ఞాతుం ద్రష్టు౦ చ తత్త్వేన ప్రవేష్టు౦ చ పరంతప {11.54} పరంతపా! విశ్వరూపుడనైన నన్ను వాస్తవముగ గ్రహించుటకు, దర్శించుటకు, ప్రవేశించుటకు అనన్య భక్తియే సాధనము. చిత్తశుద్ధితో ఉన్నవారే భగవంతుని చూడగలరని జీసస్ చెప్పెను. ఎందుకంటే అట్టి వారలకే దేవుని మీద పూర్తి నమ్మకం ఉండి, సృష్టి అంతటా దేవుడ్ని చూస్తారు. హరిదాసు అనబడే ఒక బాలుని తల్లి గొప్ప కృష్ణ భక్తురాలు. ఆ బాలుడు పాఠశాలకు ఒక కీకారణ్యం లోంచి వెళ్ళాలి. దానిలో అనేక కృూర మృగాలు ఉండి హరిదాసుకి మిక్కిలి భయం కలిగించేవి. అతడు అమ్మని సాయం రమ్మంటే, ఆమె హరిదాసు అన్న గోపాల

Eknath Gita Chapter 11 Section 24

Bhagavat Gita 11.24 సంజయ ఉవాచ: ఇత్యర్జున౦ వాసుదేవ స్తథోక్త్వా స్వక౦ రూపం దర్శయామాస భూయః {11.50} ఆశ్వాసయామాస చ భీతమేనం భూత్వా పునస్సౌమ్యవపుర్మహాత్మా మహాత్ముడైన శ్రీకృష్ణుడు ఈ విధముగ పలికి సౌమ్యరూపుడై తన పూర్వ రూపమును మఱల చూపెను. అర్జునుని ఓదార్చెను. అర్జున ఉవాచ: దృష్ట్వేదం మానుషం రూపం తవ సౌమ్య జనార్దన! {11.51} ఇదానీమస్మి సంవృత్త స్స చేతాః ప్రకృతి౦ గతః కృష్ణా! నీ యొక్క ప్రసన్న మానవ రూపమును గాంచి నేను ప్రశాంత చిత్తుడనైతిని. నిర్భయుడనైతిని. ప్రసన్నతను బొందితిని. శ్రీకృష్ణుడు విశ్వరూపమును చాలించి తన సహజ స్వరూపము దాల్చగా, అర్జునుడు మిక్కిలి సంతసించినవాడై శ్రీకృష్ణుని జనార్ధన -- అనగా ప్రజలని మత్తెక్కించు వాడు -- అని పిలిచెను. మత్తు అనగా మద్యము వలనని కాదు. ఇది దేవునిలో అంతర్లీనమైతే కలిగే ఆనందం. జాన్ వూల్ మ్యాన్ అనబడే అమెరికా కు చెందిన క్వేకర్ ఇలా అన్నారు: ఉత్తరానికి, తూర్పుకి మధ్య ఒక కాంతి విహీనమైన పదార్థాన్ని చూసేను. అది అతి దీన స్థితిలో ఉన్న సజీవమైన మానవాళి అని ఒకరు చెప్పేరు. నేను దానిలో ఒక్కడైన౦దున నేను వేర్పాటుతో ఉండలేను. వూల్

Eknath Gita Chapter 11 Section 23

Bhagavat Gita 11.23 మా తే వ్యథా మా చ విమూఢభావో దృష్ట్వా రూపం ఘోర మీదృజ్ఞ్మమేదం {11.49} వ్యపేతభీః ప్రీతమనాః పున స్త్వ౦ తదేవ మే రూపమిదం ప్రపశ్య భయంకరమైన నా ఈ విశ్వరూపామును గాంచి నీవు భయమును, చిత్త సంక్షోభమును పొందవలదు. నీవు భయమును విడచి సంతుష్టా౦తరంగుడవై నా పూర్వ రూపమును దర్శి౦చుము ఀ దేవుడు ప్రేమించేవాడూ, శిక్షి౦చేవాడూ కూడా. కర్మ సిద్ధాంతం దాని పర్యావసానము. మనము ఏ విత్తు నాటేమో, దాని మొక్కే మొలుస్తుంది. ఆపిల్ విత్తు నుండి బొత్తాయి చెట్టు రాదు. ప్రపంచ యుద్ధాలు ఎక్కడో దైవ శక్తితో జరగలేదు. మానవాళే దానికి కారణము. హింసాత్మక ఆలోచనలు ఇతరులలోనే కాదు, మన అంతర్గతంలో కూడా ఉన్నాయి. ప్రపంచం వెళ్ళే దిశకు మనము కూడా బాధ్యులము. జీవించడమంటే మనం చేసే క్రియలకే కాక, మనం చెయ్యని క్రియలకు కూడా బాధ్యత వహించడం. పెళ్లికి ఇద్దరు, జగడానికి ఇద్దర ఉండాలి. అలాగే మారణాయుధాలు అమ్మడానికి, కొనడానికి ఇద్దరు ఉంటారు. ధనిక దేశాలు వర్థమాన దేశాలకు కొన్ని కోట్ల విలువచేసే మారణాయుధాలను ఎగుమతి చేస్తున్నారు. దానికి బాధ్యులు: తయారు చేసేవారు, మంతనాలు జరిపేవారు, రవాణా చేసే