Shvetashvatara Upanishat
శ్వేతాశ్వతర ఉపనిషత్ మొదటి భాగము సృష్టికి కారణమేమిటి? అది బ్రహ్మనా? మనమెక్కడనుంచి వచ్చేము? ఎలా జీవిస్తాము? శాంతి ఎక్కడ దొరుకుతుంది? మనల్ని చుట్టుముట్టే సుఖదుఃఖాలనే ద్వంద్వాలకు ఏ శక్తులు కారణము? కాలము, ప్రకృతి, ఆవశ్యకత, యాధృచ్చికము, భూతాలు, శక్తి, బుద్ధి మొదటి కారణము కావు. అవి ఆత్మని సుఖదుఃఖాలనుండి విముక్తము చేసే కార్యాలు మాత్రమే. గాఢ ధ్యానంలో జ్ఞానులు ప్రతి జీవి హృదయంలోనూ వసించే పరమాత్మను దర్శించేరు. హృదయ లోతుల్లో, త్రిగుణాల--సాత్విక, రాజస, తామస--తెర వెనుక పరమాత్మ వసిస్తాడు. అతడే ఏక స్వరూపుడు. దేశకాలకారణాలను పరిపాలించేవాడు అతనే. ప్రపంచం పరమాత్మ తిప్పే చక్రం. దాని అంచులలో జీవులు స్థితమై ఉన్నారు. ప్రపంచం ఒక నది వంటిది--పరమాత్మ నుండి పుట్టి, పరమాత్మలోనే లయమవుతుంది. సదా తిరిగే చక్రంలో మానవుడు తిరుగుతూ, ఒక జన్మ నుంచి మరొక జన్మను పొంది, తాను ఒక ప్రత్యేకమైన జీవినని తలచి, చివరకు పరమాత్మ స్వరూపాన్ని తెలిసికొని, అఖండమైన అమృతత్వాన్ని పొందుతాడు. అతడే మారని సనాతన సత్యం; శాస్త్రాలను వల్లించండి; మన భూమి గూర్చి పాడ౦డి. ఎవరైతే పరమాత్మని అన్ని జీవులలో