Eknath Gita Chapter 6 Section 36
Bhagavat Gita 6.36 యోగినా మపి సర్వేషా౦ మద్గతే నాంతరాత్మనా {6.47} శ్రద్ధావాన్ భజతే యో మాం స మే యుక్త తమో మతః ఏ మనుజుడు నా యందు మనస్సు నిలిపి శ్రద్దతో నన్ను సేవించుచున్నాడో అట్టివాడు యోగులందరి కంటెను ఉత్తముడు అని నా అభిప్రాయము ధ్యాన యోగులలో కూడా ఉత్తముడు ఏకాగ్రతతో దేవుని కొరకై కర్మలను చేసేవాడు. శ్రీకృష్ణునికి "ఇది నేను తింటే నా దేహానికి బలమిచ్చి దేవుని సేవ చెయ్యగలనా? నేను ఈ విధంగా స్పందిస్తే నా మనస్సును ఉత్తేజ పరచి దేవుని సేవ చెయ్యగలనా?" అని ప్రశ్నించుకొనేవారు ప్రియము. శ్రీకృష్ణుని తమ చేతన మనస్సులో సంపూర్ణముగా నింపుకొన్నవారు అత్యంత ప్రియులు. మనమందరమూ ఉత్సాహంతో, పద్దతి ప్రకారం, సహనంతో ధ్యానం చేసి శ్రీకృష్ణునికి ప్రియుల మవ్వచ్చు. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు బోధించినది: ధ్యానం చెయ్యకపోతే ఆధ్యాత్మిక జ్ఞానం, నిస్వార్థం తొలగించుకోలేక; మన నడవడిక, వ్యక్తిత్వం, చేతన మనస్సు సన్మార్గంలో పెట్టుకోలేం. అదే ధ్యానం ఎన్ని అవాంతరాలు వచ్చినా చేస్తే, శ్రీకృష్ణుని అభయం సదా ఉంటుంది. ఆయన మనకి స్వస్థత, భద్రత, సృజనాత్మక శక్తితో సమస్యలను పరిష్కరించగలిగే శక్త