Bhagavat Gita
3.15
కర్మణైవ హి సంసిద్ధి మాస్థితా జనకాదయః
{3.20}
లోకసంగ్రహమేవాపి సంపశ్యన్ కర్తు మర్హసి
జనకుడు మొదలగువారు కర్మయోగము నాచరించియే
ముక్తిని బొందిరి. లోక కళ్యాణము కైనను నీవు
కర్మలను చేయవలెను
జనకుని గూర్చి బృహదారణ్యక ఉపనిషత్తులో
చెప్పబడుతుంది. అతడు సీతాదేవి
తండ్రి. అతడు ఒక గొప్ప రాజు. ఎన్నో
బరువుబాధ్యతలు ఉన్నప్పటికీ చివరివరకు
దైవ భక్తి కూడి ఉన్నాడు. అలాగే మనమే
ఉద్యోగం చేసినా దైవ భక్తిని పెంపొందించుకోవచ్చు.
కానీ మనము మారణాశ్త్రాలను తయారు చేసే
ఉద్యోగం చేస్తూ దేవుని రోజూ స్మరించుకున్నా
లాభం లేదు.
ఇక్కడ శ్రీకృష్ణుడు లోకసంగ్రహం అనే పదప్రయోగం
చేసేడు. దేవుడు మనని భూమి మీద పుట్టించడానికి
కారణం జన్మని సద్వినియోగం చేసుకొంటామని.
మనము చిన్న లేదా పెద్ద ఉద్యోగం చేయవచ్చు.
ఆ ఉద్యోగాన్ని సక్రమంగా చేసి, మన బంధు మిత్రులను,
ఇంకా చెప్పాలంటే శత్రువులను కూడా, ఆనందంగా
ఉంచాలి. అంటే మనకైకాక పరులకై నిస్వార్థతతో
పని చెయ్యాలి. ఇది మనకి ప్రతిబంధకమైతే,
ఆధ్యాత్మిక సాధన ఎందుకు అంత కష్టమో
తెలుస్తుంది. ఇది కష్ట సాధ్యం. దేవుని నామము
స్మరిస్తూ మన అహంకారాన్ని తుడిచివేయాలి.
అలాగ చేస్తే చేతులకి మిక్కిలి శక్తి వస్తుంది,
భద్రత పెరుగుతుంది, ఎటువంటి సమస్యలనైనా
పరిష్కరించగల సృజనాత్మక
శక్తి వృద్ధి చెందుతుంది,
మన పిల్లలికి జీవైక్య సమానత గురించి తెలియదని
చెప్పకూడదు. ఎందుకంటే దాని గురించి బోధించడం
మన బాధ్యత. చట్టం తెలీకపోవడం, చేసిన నేరం
ఒప్పుకోవడమే. స్వతంత్ర సమరంలో న్యాయవాది
ముద్దాయికి చట్టం గురించి తెలీద౦టే,
బ్రిటిష్ న్యాయమూర్తి ఇంకా ఎక్కువ శిక్ష ఇచ్చేవాడు.
అలాగే మన పిల్లలు జంతువులపై ఆగడాలు
చేస్తే వారు కర్మ సిద్ధాంతానుసారం శిక్ష
అనుభవిస్తారు. అందుకై తలిదండ్రులు పిల్లలకు
జంతువులను సక్రమంగా చూడాలని
చెప్పాలి.
బుద్ధుడు ఈ విధముగా చెప్పెను: "నువ్వు ఆకాశంలో
లేదా భూగర్భంలో దాగి ఉండ వచ్చు, కర్మ సిద్ధాంతం
నిన్ను వెంటాడుతూనే ఉంటుంది." విలియం
బ్లేక్ ఇలా వ్రాసేరు:
ఒక పంజరంలోని పక్షి, దేవలోకాన్ని కలవర పరుస్తుంది
ఒక కుక్క ఆకలితో తన యజమాని ఇంటి బయట ఉంటే, ఆ దేశం నశిస్తుంది
పిల్లలికి జీవైక్య సమానత గూర్చి చెప్పాలి.
నా అమ్మమ్మ "ఈ చిన్న ఉడుతకు కూడా ఒక అమ్మమ్మ ఉంది.
దాన్ని హింసించేవంటే అది వెళ్ళి తన ఆమ్మమ్మతో
చెప్తుంది" అని నాకు చెప్పేది. పిల్లలకు నోరులేని
జీవుల సంరక్షణకై, ఎందుకంటే అవి మనలాంటి
జీవులు కనుకనే, పాటు పడాలని చెప్పాలి.
శాస్త్రజ్ఞులు జంతువులకు ఎటువంటి మనోభావాలు,
చేతన మనస్సు ఉండవని తలుస్తారు. నిజానికి
అవి ఏమి అనుభవిస్తాయో లేదో చెప్పలేము.
వాటి బాధను మనము కోరిన విధంగా కాక,
వేరే విధంగా వ్యక్త పరుచుకోవచ్చు. కొన్ని
ఆవులు ఎండనక వాననక బయటే ఉంటాయి.
ముఖ్యంగా చలి ప్రదేశాలలో మంచు కురిసి
వాటికి తీవ్ర ఇబ్బంది కలుగవచ్చు.
నా ఉద్దేశంలో చిన్న పిల్లలకు కుక్కలను
పెంచే పద్దతి తెలియదు. తలిదండ్రులు
వారికి కుక్కల పెంపకానికి సరియైన
తర్ఫీదు ఇవ్వాలి.
నా చిన్ననాటి ఇంట్లో ఒక ఆవు ఉండేది. అది
పెయ్యగా ఉన్నప్పటినుంచీ మా ఇంట్లోనే
పెరిగింది. మంచి పాలు కూడా ఇచ్చేది. కొన్నాళ్ల
తరువాత కీళ్లవాతం వచ్చి లేవలేకపోయేది.
పొరుగువాళ్ళు దాన్ని కసాయివాడికి
అమ్మేయమని చెప్పేవారు. అప్పుడు నా అమ్మ
"నాకూ కీళ్ల వాతం ఉంది. నన్నూ కసాయివాడికి
అమ్మేస్తారా?" అని అడిగేది.
నేను ఎవరింటికెళ్ళి భోజనం చేసినా, శాఖాహారిని
కాబట్టి, కొంచెం ఇబ్బంది పడేవాడిని. కొందరు "నీవు
శాఖాహారివి కాబట్టి, చేప నచ్చుతుంది" అనేవారు.
నేను "నాకు చేపలంటే ఇష్టం. అందుకే వాటిని
తినను" అని చెప్పేవాడిని. గీత చెప్పేది:
మీకు దేనిమీదైతే ప్రేమ ఉందో దాన్ని
హింసించరు. అంటే మీకు ఒక పెంపుడు కుందేలు
ఉంటే, కుందేలు మాంసం ఎన్నటికీ తినలేరు.
నా పొరుగింటి వాడికి పూల చెట్ల౦టే ఎంతో
ఇష్టం. బహుశా ఒకానొకప్పుడు చెట్టుగా
పుట్టి పరిణామం చెంది ఇప్పుడు మానవుడిగా
మారేడేమో. ఇదే పునర్జన్మ సిద్ధాంతం కూడా
చెప్తుంది. నేను సముద్రపుటొడ్డున నడుస్తూ ఉంటే
నీళ్ళలో తేలియాడిన సంగతులు మనస్సులోకి
వచ్చేయి. గత స్మృతులలో నేనెంత ఆనందంగా,
చెలాకీగా ఉండేవాడినో గుర్తుకొచ్చింది. అప్పుడు
సముద్రంలో ఈదుతున్న చేపలలో నేనొక
చేపనైతే ఎంత బాగుండునో అనిపించింది.
అక్కడ కొందరు చేపలను గాలంతో పట్టి
రోజు గడిపేవారు. ఆ చేపలలోని నొప్పిని
నేను అనుభవి౦చేను. ఆధ్యాత్మిక
చింతన ఇలాగే కలుగుతుంది. ప్రతి జీవి
బాధ మన బాధ అవుతుంది. మనకు
జీవైక్య సమానత గురించి తెలియనంత కాలం
ఆధ్యాత్మిక సాధన మనమాడే ఒక నాటకం.
173