Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 4 Section 4

Bhagavat Gita

4.4

అర్జున ఉవాచ:

అపరం భవతో జన్మ పరం జన్మ వివస్వతః {4.4}

కథ మేత ద్విజానీయాం త్వమాదౌ ప్రోక్తవానితి

నీవు సూర్యుని తరువాత పుట్టినావు. సూర్యుని జన్మ అతి ప్రాచీనమైనది. నీవు సూర్యునికి ఉపదేశించితి వను విషయము నేనెట్లు గ్రహించగలను?

శ్రీ భగవానువాచ:

బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున {4.5}

తాన్యహం వేద సర్వాణి న త్వం వేత్థ పరంతప

అర్జునా! నీకును, నాకును అనేక జన్మలు గడచినవి. పరంతపా! ఆ జన్మములు నన్నిటిని నేనెఱుగుదును. నీ వెరుగవు

అర్జునుడు శ్రీ కృష్ణుని ఇలా ప్రశ్నిస్తున్నాడు: "కృష్ణా! నీవూ, నేనూ సమ వయస్కులం . కానీ నువ్వు పూర్వకాలంలో మునిపు౦గవులకు ఆధ్యాత్మిక జ్ఞానం అందించేనని చెప్తున్నావు. ఇది నాకు అర్థం కావటం లేదు. నీవెందుకు మథురలో జన్మించి వేల సంవత్సరాల ముందు జరిగిన విషయాలు చెప్తున్నావు?"

శ్రీకృష్ణుడు మందహాసంతో "నీకూ, నాకూ అనేక జన్మలు ఈ భూమి మీద కలిగినవి. నీవు భూమి మీద మొదటిసారి ఉండి లేవు" అని చెప్పెను.

ఆధ్యాత్మికత అలవరచుకోవడానికి పునర్జన్మ ఉందని నమ్మనక్కరలేదు. మనము పలు జన్మలు ఉంటాయని నమ్మినా ధ్యానం, ఇంద్రియ నిగ్రహం మొదలైనవి ఉపయోగపడతాయి. పునర్జన్మ ఉందని మూఢ౦గా నమ్మితే ఒక ప్రమాదమున్నది. ఒక పని ఈ జన్మలో సాధ్యంకాదని వదిలేసి ఉదాసీనంగా ఉంటాము. తక్షణమే చేయవలసిన పనులను పునర్జన్మ ఉంది కదా అని వాయిదావేయవచ్చు.

విశ్వవిద్యాలయ చదువుని ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవచ్చు. సాధారణంగా సంవత్సరానికి రెండు క్లాసులు ఉంటాయి. వాటిని సెమిస్టర్ అంటారు. కొందరు మనమొక సెమిస్టర్ పూర్తి చేసి స్వర్గానికై దరఖాస్తు పెట్టుకోవచ్చు. అప్పుడు శ్రీకృష్ణుడు, జీసస్, లేదా బుద్ధుడు మనల్ని భూమి మీద ఏమి చేసేమని అడగవచ్చు. మనము తలిదండ్రులను, సంతానాన్ని, మిత్రులను, చివరకు శత్రువులను కూడా మనకంటే ముఖ్యులుగా తలంచక పోతే దేవుడు మనల్ని వచ్చే సెమిస్టర్ కి దరఖాస్తు పెట్టుకోమని చెప్తారు. టిబెట్ దేశస్థులు బార్డో అనే త్రిశంకు స్వర్గంలో ఎన్నో ఏళ్లు మనం నిరీక్షించాలని నమ్ముతారు.

మన జీవిత లక్ష్యం, విశ్వవిద్యాలయంలో స్వార్థాన్ని, వేర్పాటుని, వదులుకొని పట్ట భద్రులవ్వడం. మనకు పట్టాలిచ్చేవారు శ్రీకృష్ణుడు, లేదా జీసస్, లేదా బుద్ధుడు. వారు మనల్ని ఉత్తీర్ణులమని చెప్తే గాని మన లక్ష్యం చేరినట్టు కాదు.

శ్రీకృష్ణుడు అర్జునుడు భూమి మీద అనేక జన్మలు ఎత్తేడని చెప్తే నమ్మశక్యం కాలేదు. అప్పుడు శ్రీకృష్ణుడు ఇలా చెప్పేడు: "నీకు పూర్వ జన్మల జ్ఞాపకాలు లేవు. నేనూ ఒకప్పుడు ఇలాగే ఉండేవాడిని. కానీ నాకు ఇప్పటికీ నా గత జన్మలు గుర్తున్నాయి. ఎందుకంటే నేను ఆత్మ జ్ఞానము పొందేను కాబట్టి."

మనము దేహంతో తాదాత్మ్యం చెందినంత సేపూ చేతన మనస్సును అఖండంగా చేసికోలేము. అలా కాక మన నిజ స్వరూపము, దేహము కాదని, ఆత్మ అని తెలుసుకొంటే మన చేతన మనస్సు అఖండమౌతుంది. జలాలుద్దీన్ రూమి ఇలా వ్రాసేరు:

నేనో ఖనిజాన్ని, అలాగ ఎదిగి మొక్క నయ్యేను

మొక్కగా నేను మరణించేను; తర్వాత జంతువుగా పుట్టేను

జంతువుగా మరణించేను; మానవునిగా పుట్టేను

నాకు ఏమి పోగొట్టుకుంటానని చావంటే భయం?

మళ్ళీ నేను మానవుడిగా మరణించి

దేవ దూతల బృందంలో చేరుతాను

కాని నేను వాళ్లకనా ఉన్నత స్థానంలో ఉండాలి

పరమాత్మ తప్ప అందరూ మరణించవలసినవారే

నేను దేవదూతగా మరణిస్తే ఊహాతీతమైన స్థితిని పొందుతాను

నా అహంకారాన్ని వదిలి మరణిస్తే "ఆ దేవుని దగ్గరకే వెళ్తాను"

యోగులు చెప్పే సమాధి స్థితి ఇదే. ధ్యానం వలన దీన్ని పొందవచ్చు. 219

Eknath Gita Chapter 4 Section 3

Bhagavad Gita

4.3

స ఏవాయం మయాతే అద్య యోగః ప్రోక్త స్సనాతనః {4.3}

భక్తో అసి మే శాఖా చేతి రహస్యం హ్యేతదుత్తమమ్

పురాతనమైన ఈ యోగమును నాకు భక్తుడవు, సఖుడవునగు, నీకు ఇప్పుడు చెప్పితిని. ఇది గొప్ప రహస్యమైనది

అర్జునుడు కృష్ణుని మిత్రుడు, భక్తుడు. దానిగురుంచి కథాకళిలో ఒక కథ చెప్తారు. శివుడు మారు వేషంలో అర్జునునితో ఇలా సంభాషణ చేస్తాడు:

"నీవు నీ గురించి ఏమనుకుంటున్నావు?"

అర్జునుడు "నేను ప్రాచీనమైన పాండవులనబడే రాజ వంశీయుడను"

"ఎప్పుడూ వినలేదు"

అర్జునుడు తన గురించి, తన కుటుంబం గురించి, తన రాజ్యం గురించి చెప్తాడు. అన్నిటికీ శివుడు "ఎప్పుడూ వినలేదు" అని అంటాడు.

అప్పుడు అర్జునుడు: "నాకో మిత్రుడున్నాడు" అంటాడు.

"ఎవరు?"

"కృష్ణుడు" అని అర్జునుడు అంటాడు.

అప్పుడు శివుడు "వెన్నని దొంగిలించే, వేణువును ఊదే, అవతార పురుషుడననుకునే పశువుల కాపరా నీ మిత్రుడు?" అని అడుగుతాడు. అప్పుడు అర్జునుడు మారు వేషంలోనున్న శివునిపై పడతాడు.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునిపై తనకున్న వాత్సల్యాన్ని ప్రకటించేడు: "అప్పుడప్పుడు ఆధ్యాత్మిక సంస్కృతి అంతమయినట్టు అనిపిస్తుంది. కానీ నేను నీ చెవిలో బోధ చేసి మేల్కొలుపుతాను. ఎందుకంటే నువ్వు నన్ను ఎంతో ప్రేమిస్తున్నావు". దానినే జీసస్ వేరే విధంగా చెప్పేరు: "నీవు నీ దేవుని హృదయపూర్వకంగా, ఆత్మతో, మనస్సుతో, శక్తితో ప్రేమిస్తావు". మనము ఇతరులకు ప్రాముఖ్యతనిచ్చి, మనసారా ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టే. 217

Eknath Gita Chapter 4 Section 2

Bhagavat Gita

4.2

ఏవం పరంపరా ప్రాప్త మిమ౦ రాజర్షయో విదుః {4.2}

స కాలే నేహ మహతా యోగో నష్టః పరంతప

పరంతపా! ఇట్లు పరంపరగా వచ్చిన ఈ యోగమును రాజర్షులు తెలిసికొని యుండిరి. చాలాకాల మగుటచేత ఈ యోగము ఇపుడు గోచరించుట లేదు

శ్రీకృష్ణుడు పరంపర అనే పదాన్ని ఈ శ్లోకంలో వాడేడు. పరంపర అంటే ఒక వంశంలో ఒక తరం నుంచి ఉంకో తరంకి ఇచ్చిన జ్ఞానం, వస్తువులు, మొదలైనవి. నే పెరిగిన గ్రామంలో బాగా పాడే బాలకుడు ఉండేవాడు. మేము వాడ్ని "నువ్వు ఇంత బాగా పాట పాడడం ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడిగేం. "మీరు పాడడం నేర్చుకోనక్కరలేదు. నేను పుట్టడం పాడడం కోసమే" అని వాడు సమాధానమిచ్చేడు. వాడి పితృదేవతలు మంచి సంగీత విద్వాంసులు అవ్వచ్చు.

ఆధ్యాత్మికతకూడా ఒక తరం నుంచి ఉంకో తరానికి అందించవచ్చు. వంశంలో ఒకడు ధ్యానం అలవరుచుకుంటే, అతడు పరంపరను మొదలు పెడతాడు. కొన్నేళ్ళ తరువాత ఒక వంశీయుడు, మిత్రుడు, లేదా నాస్తికుడు ఉత్తేజితుడై ఆధ్యాత్మిక చింతన వానినుంచి అలవరుచుకోవచ్చు. ఒక్కొక్కప్పుడు పరంపర భగ్నం అవుతుంది. ఒక కూతురు సాహిత్య వేత్త అవ్వవచ్చు, కొడుకు కుండలు చేసేవాడు అవ్వవచ్చు. కానీ అది ఎన్నటికీ మాటు మాయం అవ్వదు. మన దేశంలో ఋషుల పరంపర 5000 ఏళ్ల నాటినుంచి కొనసాగుతోంది. మనమీదకి ఎంత మంది దండయాత్రలు చేసినా, శ్రీ రామకృష్ణ, రమణ మహర్షి, మహాత్మా గాంధీ లాంటివారు మనల్ని ఉద్ధరించడానికై పుట్టేరు.

నేటి కాలంలో పర్యాటకులు దేశంలో అన్ని చోట్లా ఆధ్యాత్మికత ఉందని తలుస్తారు. వారు విమానం దిగినవెంటనే దేవుని గీతాలు, ధ్యానం చేస్తున్న ఋషులు విమానాశ్రయంలో ఉంటారని తలుస్తారు. నగరంలో ఎక్కడికి వెళ్ళి చూసినా ఆధ్యాత్మికత కనపడదు. అలా చూసుకుంటూ పోతే ఏదో ఒకనాడు రమణ మహర్షి లాంటివారు ఏ చెట్టు కిందో కూర్చొని ధ్యానం చేస్తూకనపడతారు.

రాబోయే శ్లోకాలలో శ్రీకృష్ణుడు చెప్పేది: అధర్మం చెలరేగినప్పుడు ఒక గొప్ప మత గురువు, సరైన సమయంలో, మనం డబ్బు, దస్కం, పేరుప్రతిష్ఠలు కాక పరోపకారానికై బ్రతకాలని చెప్పడానికి ఉద్భవిస్తాడు. 215

Eknath Gita Chapter 4 Section 1

Bhagavat Gita

4.1

శ్రీ భగవానువాచ:

{4.1}
ఇమం వివస్వతే యోగం ప్రోక్తవా నహ మవ్యయమ్

వివస్వాన్ మనవే ప్రాహ మను రిక్ష్వాకవే బ్రవీత్

అవ్యయమగు ఈ యోగమును మొదట నేను సూర్యునకు చెప్పితిని. సూర్యుడు మనువునకు చెప్పెను. మనువు ఇక్ష్వాకునకు చెప్పెను

శ్రీకృష్ణుడు ఈ రహస్యాన్ని వివస్వత్ కు చెప్పేననడంలో అంతరార్థం వివస్వత్ నకు తనపై ధ్యానం చేసి ఇంద్రియాలను స్వాధీనంలో పెట్టుకొనే, ఇతరులను తనకంటే ముఖ్యులుగా చూసుకొనే, అంతర్గతంలో ఉన్న దేవుని దర్శించుకొనే స్పూర్తి కలిగించేడు. వివస్వత్ తన జ్ఞానాన్ని మనువుకు అందించేడు. అతనూ ధ్యానం చేసి భగవంతుని దర్శించేడు. మనువు ఇక్ష్వాకునికి బోధించేడు. అతనూ ధ్యానం చేసి ఆత్మజ్ఞానం పొందేడు.

అన్ని మతాలు దేవుని కృప గూర్చి చెప్తాయి. ఒక్కొక్కప్పుడు మన మీద దేవునికి కృప అనుకోకుండా కలుగుతుంది. మయిస్టెర్ ఎక్ హార్ట్ చెప్పినట్లు మనము బెస్తవాడి గాలంలో చిక్కుకున్నచేపలా అవుతాం. ఎంత ప్రయత్నించినా గాలం నుండి బయటపడలేని చేప వలె మనం కొట్టుమిట్టాడుతాం.

కానీ దేహమనే గృహాన్ని వదలలే౦. దేవుని కృప పొందినా, ఆయనే అంతా చేస్తాడని అనుకోకూడదు. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు సాగాలంటే మన మనస్సు యొక్క కృప కూడా ఉండాలి. అందుకై మంచిని ఎన్నుకోవాలి. నా అమ్మమ్మ చెప్పినట్లు: "దేవుడు వరమిచ్చినా, పూజారి వరమివ్వాలి".

కృప ఒక అస్త్రంలాగ పని చేసి మనస్సును అతలాకుతలం చేస్తుంది. డబ్బు, దస్క౦, పేరుప్రతిష్ఠలు మనను సంతృప్తి పరచవు. నాలుక కూడా రుచులు కోరదు.

అసంతృప్తితో మనశ్శాంతి కలుగదు. మనము తిన్నగా కూర్చోలేము, పడుకోలేము. ఇది మన అంతర్గత దేవుడు ధ్యానం చెయ్యమనే ఇచ్చే సూచన. అశాంతిని మనము ధ్యానం వైపు మళ్ళించి ఉపశమనం పొందాలి. 214

Eknath Gita Chapter 3 Section 33

Bhagavat Gita

3.33

ఏవం బుద్ధేః పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మాన మాత్మనా {3.43}

జహి శత్రు౦ మహాబాహో కామరూపం దురాసదమ్

అర్జునా! ఈ విధముగ బుద్ధికంటెను శ్రేష్ఠమైన ఆత్మను తెలిసికొని, బుద్ధి చేత దేహేంద్రియ మనస్సులను నిగ్రహించి జయించుటకు సాధ్యము కాని కామమనెడి శత్రువును సంహరింపుము

మన ఇంద్రియాలు, బుద్ధి, మనస్సు ఆత్మతో అనుసంధానము కాకపోతే మనలో అలజడి, విచారము కలుగుతాయి. ఎన్నటికీ ఆనందం కలుగదు. ధ్యానం ఈ విషయంలో చాలా ఉపయోగపడుతుంది. ధ్యాన౦లో విడుదలయ్యే శక్తితో ఇంద్రియాలు, మనస్సు, బుద్ధులకు అతీతంగా మారవచ్చు.

దానికై గాంధీజీ చెప్పినట్టు ఒక గిన్నెతో సముద్రాన్ని ఖాళీ చేసేంత ఓపిక మనకుండాలి. కానీ ప్రతి యుగంలోనూ, ప్రతి దేశంలోనూ అతి కొద్ది సాధనతో నిస్వార్థులుగా మారే మహానుభావులు౦టారు. వారు మా ధ్యాన మందిరం లాంటి వారు. మొదట్లో మా ధ్యాన మందిరం యొక్క కప్పును మాత్రమే మార్చాలని అనుకున్నాము. కానీ అధికారులు తనిఖీ చేసి దాని పునాదిని కూడా మార్చాలని చెప్పేరు. దానికై ఎన్నో పనిముట్లతో, ఎంతో శ్రమతో పని చెయ్యవలసి వచ్చింది. అలాగే మనలో చాలామంది తమ పునాదిని --అనగా స్వలాభము, సుఖములు, పేరు ప్రతిష్ఠలకై ప్రాకులాట --పూర్తిగా మార్చుకోవాలి.

ధ్యానం గాఢమైనప్పుడు మనము అహంకారము ఒక పెద్ద లంపటమని తెలుసుకొంటాము. మనకందరికీ తెలిసిన విషయం: ఎప్పుడూ తమ గురించే మాట్లాడేవాళ్ళకు దూరంగా ఉండాలని. మన స్వార్థం వలన మనకు తప్ప వేరే వారికి ఉపయోగం లేదు. మన అహంకారం కూడా అంతే. మన గత చరిత్ర ఎలాగ ఉన్నా, అహంకారాన్ని నిర్మూలించుకుంటే, మనము జ్ఞానంతో, సహనంతో, ఓర్పుతో ఇతరులకు సేవ చెయ్యగలం.

ఈ అధ్యాయాన్ని శ్రీకృష్ణుడు ఇలాగ అంతం చేస్తున్నాడు: "నీలో స్వార్థాన్ని జయించు. అహంకారాన్ని నిర్మూలించు." ఇదే నిర్వాణమంటే . అలా చేస్తే ఆత్మ జ్ఞానము కలిగి, జీవైక్య సమానతను తెలుసుకొంటాం 212

Eknath Gita Chapter 3 Section 32

Bhagavat Gita

3.32

ఇంద్రియాణి పరాణ్యాహు రి౦ద్రియేభ్య పరం మనః {3.42}

మానసస్తు పరా బుద్ధి ర్యో బుద్ధేః పరతస్తు సః

దేహము కంటెను ఇంద్రియములు గొప్పవి. ఇంద్రియముల కంటెను మనస్సు గొప్పది. మనస్సు కంటెను బుద్ధి గొప్పది. బుద్ధి కంటెను ఆత్మ శ్రేష్ఠమైనది

మనలో చెలరేగుతున్న ఇంద్రియాలను ఆత్మతో అనుసంధానము ధ్యానం ద్వారా చెయ్యవచ్చు. మన దేహానికి తగినంత ఆహారము, వ్యాయామము ఇచ్చి స్వాధీనంలో పెట్టుకోవచ్చు. అలాగే ఇంద్రియాలను విచక్షణా జ్ఞానంతో నిగ్రహించాలి. గీత మనలను విషపూరితం చేసేది మన నాలుకతో పాటు కళ్ళు, చెవులు కూడా అని చెప్తుంది. ఈ నేపధ్యంలో మన పిల్లలకు ఏ సినిమాలు చూడాలో, ఏ టివి కార్యక్రమాలు చూడాలో, ఏ పుస్తకాలు చదవాలో చెప్పాలి. వాళ్ళకు స్వతహాగా వాటి గురించి తెలీదు. పెద్దయ్యేక వారి నిర్ణయాలు వారే చేసుకొంటారు.

ఎలాగైతే దేహానికి, ఇంద్రియాలకు ఆత్మతో అనుసంధాన దిశగా నేర్పుతామో, మనస్సు, బుద్ధులకు కూడా అలాగే నేర్పవచ్చు. మన మనస్సులోని నిరాశతో కూడిన భావాలను, ద్వేషాన్ని వదిలించుకొనే దిశలో ప్రయత్నించాలి. బుద్ధికి మనం నేర్ప వలసింది మన స్థిర భావాల గురించి వైరాగ్యం. శాస్త్రజ్ఞానాన్ని పొందాలన్నా మన౦ బుద్ధితో తాదాత్మ్యం చెందకూడదు.

మనము మన తలిదండ్రులను ఎలా ఆదరిస్తామో, పిల్లలు కూడా మనం వృద్ధులు అయినప్పుడు అలాగే ఆదరిస్తారు. మనము విప్లవకారులుగా, ఉంటే, మన మనుమలు "అదిగో సంఘ సంస్కర్త వస్తున్నాడు" అని వెటకారం చేస్తారు. ఎవరైతే స్థిర భావాలతో ఉంటారో, కాల క్రమేణా ప్రత్యర్థుల భావాలను కూడా పట్టుకొని వేలాడుతారు. కొందరు వృద్ధాప్యంలో తమ విప్లవ భావాలను వదిలి ప్రతికూలంగా మారుతారు. కానీ మనకు ప్రత్యర్థుల యందు గౌరవము౦టే, కాలం, పరిస్థితులు ఎంత ప్రభావితం చేసినా, సహనంతో ఉంటాము. మన మనుమలు చెప్పేది విని, వారు చెప్పినదానిలో సత్యము౦టే వారితో ఏకీభవించాలి.

మన ప్రత్యర్థులు చెప్పేది గౌరవంతో, ప్రేమతో వినగలిగితే మనమే సమస్యనైనా పరిష్కరించవచ్చు. గాంధీజీ ప్రత్యర్థులతో సంభాషణ చెయ్యడంలో ప్రావీణ్యత గలవారు. ఒక ప్రత్యర్థి ఆయన చెప్పే ప్రతి మాటను ఖండించేవాడు. అతను గాంధీజీ చెప్పిన ప్రతి పరిష్కారంలోని లోపాలు ఎత్తి చూపేవాడు. కానీ గాంధీజీ ఆయనయందు ప్రేమతో. గౌరవముతో నుండి తన దృక్పథాన్ని స్పష్టంగా వివరించేవారు. 211

Eknath Gita Chapter 3 Section 31

Bhagavat Gita

3.31

తస్మా త్త్వ మి౦ద్రియా ణ్యాదౌ నియమ్య భరతర్షభ {3.41}

పాప్మానం ప్రజహి హ్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనమ్

ఓ భారతా! కనుక నీవు మొదట ఇంద్రియములను నియమించి, జ్ఞాన విజ్ఞానములను నాశనము చేయు ఈ కామ మనెడి పాపిని త్యజింపుము

మనం కామాన్ని వదలించుకోవాలంటే ఇంద్రియాలను, ముఖ్యంగా నాలుకను, అదుపులో పెట్టుకోవాలి. ఇది ఒక కుక్క పిల్లను పెంచి, తర్ఫీదు ఇచ్చినట్లే. నేను ఒకమారు కొలను చుట్టూ నడుస్తూ ఉంటే, ఒకావిడ తన పెంపుడు కుక్కతో నడుస్తూ, అది చెప్పినమాట విననప్పుడు దూషిస్తూ ఉన్నది. కానీ సర్కస్ లో కుక్కలతో ప్రదర్శన చూసినప్పుడు, వాటికి తర్ఫీదు ఇచ్చే బాలిక, అవి సరిగ్గా మాట వింటే వాటిని పొగిడి, ముద్దు పెట్టుకొనేది. ఇదే విధంగా మన ఇంద్రియాలకు క్రమక్రమంగా తర్ఫీదు ఇచ్చి, మనము పూర్తిగా నిరాడంబరముగా కాక, పూర్తిగా ఆడంబరముగా కాక మధ్యలో ఉండవచ్చు.

శ్రీకృష్ణుడు, అర్జునుని నెపంతో, మనకు స్వలాభము, స్వీయ ఆనందము, పేరుప్రతిష్ఠలకు దురాశతో ప్రవర్తించ వద్దని బోధిస్తున్నాడు. అది మన బద్ద శత్రువు. ఎందుకంటే మనల్ని ఉల్లాసంగా, భద్రతతో ఉంచక జ్ఞాన సంపాదనకి ప్రతిబంధక మవుతుంది.

రామాయణంలో శ్రీరామునికి, రావణాసురుడుకి మద్య జరిగిన భీకర యుద్ధం మన మనస్సులో జరిగే అలజడికి తార్కాణం. "నాది, నేను" అనే భావనలను విసర్జించి, దేవుని పొందడానికి ప్రయత్నించాలి. దైనింద జీవితంలో మనము ఇతరులను ముఖ్యులుగా తలచి, వారి ఆనందాన్ని పెంపొందించాలి. 209

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...