Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 5 Section 3

Bhagavat Gita

5.3

సాంఖ్యయోగౌ పృథగ్బాలాః ప్రవదన్తి న పండితాః {5.4}

ఏక మప్యాస్థిత స్సమ్య గుభయో ర్విందతే ఫలమ్

సాంఖ్యము వేరు, యోగమువేరు అని అవివేకులు భావింతురు. పండితులు భావించరు. ఈ రెంటిలో ఒకదానినైనను చక్కగా ఆచరించినవాడు రెండిటి యొక్క ఫలమును పొందును

శ్రీకృష్ణుడు జ్ఞానము, కర్మ వేర్వేరు కాదని చెప్తున్నాడు. ఎవరైతే జ్ఞానమును దైనింద జీవితంలో పాటించక ఉంటారో వారు పిల్లలతో సమానము. ఆధ్యాత్మిక జ్ఞానము దైనింద కార్యాలలో ఉపయోగించాలి. అహంకారంతో ఉండి, అనుబంధాలలో సమస్యలు ఉండి, ఇంద్రియాలు నిగ్రహించుకోలేకపోతే ఆధ్యాత్మిక జీవనం గడుపుతున్నామని చెప్పేవారు పిల్లలతో సమానము.

అస్సీసి కి చెందిన సెయింట్ ఫ్రాన్సిస్ మన జ్ఞానము, కర్మను ఆచరించు విధానము బట్టి ఉంటుంది అని చెప్పేరు. ఉపనిషత్తులలో అపరా విద్య -- అంటే ప్రపంచంలో జీవనం సాగించడానికి ఉపయోగపడేది--గూర్చి చెప్పబడింది. అపరా విద్య వలన మన వ్యక్తిత్వము, నడవడిక మొదలగునవి మార్పు చెంద బడవు. రెండవది పరా విద్య -- అంటే మనకు కావలసిన ఆధ్యాత్మిక పరమైన విద్య.

శాస్త్రజ్ఞానము దైనింద కార్యాలకు ఉపయోగపడదు. ఉదాహరణకు: కొందరు ధూమపానం వలన క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయని తెలిసికూడా దానిని మానరు.

ధ్యానం గాఢమైతే, దేవుని "ఈ వాంఛను కలుగజేయకు" అని అడిగితే, అది పోతుంది. ఇదే ధ్యానంలోని అద్భుతం.

మనం వస్తువులనుండి ప్రేమను వెనక్కి తీసికోలేందే, మన బంధుమిత్రులను ప్రేమించలేము. ఉదాహరణకి: డబ్బే ప్రపంచానికి మూలం అనుకునేవాడు, బంధుమిత్రులను ప్రేమించలేడు. మారక ద్రవ్యాలు వాడే వాడు తన ప్రేమను, విశ్వాసం చూపలేడు. కోరిక ప్రేమకు ముడిసరుకు.

మనస్సు కోర్కెల గొలుసు. ఒక కోరిక తీరితే, ఉంకో కోరిక కలుగుతుంది. మనము వృధా ప్రయాసల యందు బహిర్గితమౌతున్న ప్రేమను వెనక్కు లాక్కొని, మనస్సులో అలజడి రేపే కోరికల వలయాన్ని నిశ్చలం చేసికోవడానికి, బుద్ధి సహకరించదు. డబ్బు, వస్తువులు, ఆహ్లాదం, మారక ద్రవ్యాలు మొదలగు వాటిపై కోర్కె కలిగి ఉంటే, మన ధ్యానంతో చేతన మనస్సు లోతులకు వెళ్ళాలి. చిన్న చిన్న కోర్కెలు -- బట్టలకై, వాహనాలకై, తీపి వస్తువులకై, బహుమతులకై -- ఏకమై వొక పెద్ద కోర్కెగా మారుతాయి. అవి మన౦ ప్రేమించ గలిగే శక్తిని వృధా చేస్తాయి.

బ్యాంకులో డబ్బు ఆదా చేసికోవాలంటే ఒక పెద్ద మొత్తాన్నే జమ కట్టనక్కరలేదు. ఖర్చులు పోను మిగిలిన ఒక చిన్న మొత్తాన్ని రోజూ జమ కడితే, అది కొన్నాళ్ళకు ఒక పెద్ద మొత్తంగా మారుతుంది. అలాగే దేవుడు ప్రత్యక్షమవుతే "నేను యోగులవలె గొప్ప సాధన చేసినవాడను కాను. కొన్ని సార్లు సహనం వహించేను. మరికొన్ని సార్లు నా కుటుంబాన్ని నాకన్నా ఎక్కువ ప్రేమించేను. కొన్ని కోర్కెలు తీరకపోయినా సంతృప్తిగా ఉన్నాను" అని చెప్తే, దేవుడు ఆ చిన్న మొత్తాన్ని జమ కట్ట మంటాడు. ఇలాగే చాలా మంది ఆధ్యాత్మిక జీవనాన్ని చాలా కాలం సాగిస్తారు. అనేకమైన చిన్న నిస్వార్థ కర్మలు పోగై, కాలక్రమేణా మనలో అమితమైన ప్రేమ, ఆధ్యాత్మిక చింతన కలిగిస్తాయి.

ప్రతిరోజూ ఒక మంత్రాన్ని చేతన మనస్సుతో జపిస్తూ ధ్యానం చేస్తే, మనలోని ఆధ్యాత్మికత బహిర్గతమవుతుంది. ఉదాహరణకి: సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన ప్రార్ధన -- "పరులకు దానం చేస్తే, మనము ఎంతో తిరిగి పొందుతాము. ఇతరుల తప్పులను క్షమిస్తే, మన తప్పులు క్షమింప బడతాయి" -- చేస్తే, మన అనుబంధాలలో క్రోధం, ద్వేషం లేక ఇతరులు చేసిన తప్పులను క్షమించి, మరచి పోతాము. ధ్యానం వలన విడుదలైన శక్తి సహజ౦గా వ్యక్తిత్వాన్ని, నడవడికను, చేతన మనస్సును మంచికై మారుస్తుంది. 303

Eknath Gita Chapter 5 Section 2

Bhagavat Gita

5.2

జ్ఞేయ స్స నిత్యసన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి {5.3}

నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధా త్ర్సముచ్యతే

అర్జునా! దేనిని ద్వేషించని వాడు, దేనిని కోరనివాడు నిత్య సన్యాసి యని తెలియదగి యున్నాడు. ద్వంద్వములను విడిచిన అతడు సుఖముగ బంధము నుండి విడిపడుచున్నాడు

సన్యాస మంటే హిమాలయాల్లోకో, అడవుల్లోకో వెళ్ళి నివసించడం అనుకుంటాం. శ్రీకృష్ణుడు అలాగ మనల్ని సన్యాసాన్ని పుచ్చుకోమని పురమాయించడం లేదు. సాధారుణులైన మనకు సన్యాసమంటే అహంకారం, స్వార్థం, వేర్పాటు, ఏవైతే ఆధ్యాత్మిక సాధానకి అడ్డుగా వస్తాయో, వాటిని విసర్జించడం.

పనస పండు కోసి, తినే వాళ్ళకు దానిలోని జిగటను గూర్చి తెలుసు. చేతులకి నూనె రాసుకుంటే తప్ప పనస తొనలను వేరుచేయలేం. అలాగే మనం ఇతరులను ప్రేమించి; కుటుంబంలో, సమాజంలో నిస్వార్థంగా బ్రతికి ఆనందాన్ని పొందాలంటే, సన్యాసమనే నూనెతో అహంకారమనే జిగటను తొలగించుకోవాలి.

మనందరికీ అమితమైన ప్రేమ ఉంది. దూరానికెక్కడకో పోయి ప్రేమించడం నేర్చుకోనక్కరలేదు. ప్రేమ మన గుండెల్లోనే ఉంది. దాన్ని నిరోధించి; మన ఇంటిని, సంఘాన్ని ఆనంద సాగరంలో ముంచక ఉన్నది అహంకారం అనే జిగట.

మనం అహంకారాన్ని జయించి, మనస్సును నిర్మలంగా ఉంచుకొని, వేర్పాటు లేకుండా ఉన్నామని ఎలా నిరూపిస్తాం? శ్రీకృష్ణుడు నిర్ద్వంద్వ౦గా ఉన్నప్పుడు అని సమాధాన మిస్తాడు. అంటే మనము మంచి-చెడు, తప్పు-ఒప్పు, జయం-అపజయం, పుట్టుకు-మరణం అనే ద్వంద్వాలకు అతీతమైనప్పుడు అని అర్థం. ఎంతకాలం మనము ఇష్టాయిష్టాలు అనే నియంతలకు లోబడి ఉంటామో, ఉల్లాసాన్ని సదా కోరి, ఉల్లాసం లేనివాటికి దూరంగా ఉంటామో, అంతకాలం మనస్సు అల్లకల్లోలమై ఉంటుంది.

నా మామయ్య కుటుంబానికి ఇష్టంలేని పెళ్లి చేసుకున్నాడు. అంతకు ముందు నా అమ్మమ్మ అందరికీ సమ్మతంలేని పెళ్లి చేసికోవద్దని సలహా ఇచ్చింది. పెళ్ళయిన తరువాత కుటుంబ సభ్యులెవ్వరూ వారిని పలకరించలేదు. అప్పుడు నా అమ్మమ్మ వాళ్ళని సాదరంగా ఆహ్వానించింది. స్వతంత్రత భావాల్లో కూడా ఉండాలి. అప్పుడప్పుడు ఒక నిర్ణయాన్ని ప్రతిఘటించాలనే భావన మనకుంటుంది. కానీ మనం నాణేనికి రెండు వైపులు ఉన్నట్టే, నిర్ణయాన్ని పునః పరిశీలిస్తే భావనను మార్చుకుంటాం. సహజంగా ఇలా చెయ్యగలిగేవారు అరుదు. కానీ ధ్యానంతో మన ఇష్టాయిష్టాలను మార్చుకోవచ్చు.

దైనింద జీవితంలో ఇష్టాయిష్టాలకు అతీతంగా బ్రతకడం మన సమస్య. బంధు మిత్రులతో కలిసి ఉన్నామంటే అది సాధ్యం. ఎందుకంటే వారిని మనకన్నా ముఖ్యులని తలచడానికి అనేక అవకాశాలు ఉంటాయి. అర్జునునికి అన్నదమ్ములు ఉన్నారు. వారితో కలిసి ఉండడంవలన ఇష్టాయిష్టాలకు అతీతంగా ఉండే అవకాశాలు అనేకం ఉన్నాయి. ఆహారం, వినోదం, సుఖాలు, తదితర విషయాలలో ఇతరులను మనకన్నా ముఖ్యులని తలంచడం మంచిది. ఉదాహరణకి మనము, మిత్రుడితో సినిమాకి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. మనం చూద్దామనుకొన్న సినిమా గురించి చాలా విన్నాం, చదివేం. కానీ మన మిత్రుడు వేరే సినిమాకి వెళ్దాం అని అన్నాడు. మనం అనుకున్న సినిమాకే వెళ్లాలని పేచీ పెట్టడానికి అనేక కారణాలు ఉండచ్చు. కానీ సర్దుకు పోయి మన మిత్రుడు కోరిన సినిమాకే వెళ్తాం. ఇదే ఆధ్యాత్మిక సాధన వలన కలిగే సమైక్యత. 301

Eknath Gita Chapter 5 Section 1

Bhagavat Gita

5.1

అర్జున ఉవాచ:

సన్న్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ శంససి {5.1}

యచ్చ్రేయ ఏతయో తన్మే బ్రూహి మనిశ్చితమ్

కృష్ణా! నీవు ఒకసారి కర్మసన్యాసమును, ఒకసారి కర్మ యోగమును చెప్పుచున్నావు. ఈ రెంటిలో ఏది శ్రేయస్కరమో నిశ్చితముగ నాకు తెలుపుము

శ్రీ భగవానువాచ: {5.2}

సన్న్యాసః కర్మయోగశ్చ నిశ్శ్రేయసకరా వుభౌ

తయోస్తు కర్మసన్యాసా త్కర్మయోగో విశిష్యతే

కర్మ సన్యాసమును, కర్మయోగమును రెండును మోక్ష దాయకములే. కానీ ఆ రెంటిలోనూ కర్మ సన్యాసము కంటెను కర్మ యోగమే శ్రేష్ఠమైనది

అర్జునుడు కర్మ, యోగం, కర్మ సన్యాసం లలో ఏది ఉత్తమం అని శ్రీకృష్ణుని ప్రశ్నిస్తున్నాడు. ఆ రెండింట్లలో: ఏది వేగంగా గమ్యాన్ని చేర్చేది? ఏది సులభం? ఏది క్షేమం? శ్రీకృష్ణుడు ఇలా సమాధాన మిచ్చేడు "నీకు కర్మ సన్యాసం ఒక గొప్ప ప్రక్రియాలా చూపేను. అలాగే నిస్వార్థ కర్మ కూడా ఒక ప్రక్రియాలా చూపేను. కానీ నీకు వాటిని విశ్లేషించి, ఒకదానితో ఉంకొకటి పోలిక పెట్టే బుద్ధి ఉంది కాబట్టి, నేను నిస్వార్థమైన కర్మే ఉత్తమం అని చెప్తాను."

మనం కర్మ సన్యాసం చెయ్యడానికి సిద్ధంగా లేము. మనము కర్మ చేద్దామని నిర్ణయించుకొన్నా, కర్మ చేయకూడదని నిర్ణయించుకున్నా, మనము కర్మ చేయవలసినదే. అంటే భౌతికంగా కర్మ చెయ్యకపోయినా, మానసికంగా కర్మను చేస్తున్నాము. కాబట్టి మనం ఎన్నిక చేసుకోవలసినది: అందరి క్షేమానికై నిస్వార్థంగా కర్మ చేయడమా లేదా మన స్వార్థానికై కర్మ చేయడమా? మైస్టర్ ఎక్హార్ట్ ఇలా అన్నారు: మనము దేవుని మన కర్మలో భాగంగా చూడాలి లేదా కర్మను చెయ్యడం మానెయ్యాలి. కానీ మానవుడు కర్మను చేయలేక ఉండలేడు కాబట్టి దేవుని మనం చేసే అన్ని కర్మలలో భాగంగా చూడాలి. అది ఎటువంటి కర్మైనా, ఏ పరిస్థితిలో నైనా, దేవుని నమ్మి, మనకి, దేవునికి మధ్య ఎటువంటి అడ్డంకూ లేకుండా చేసికోవాలి.

ధ్యానం గాఢమైన కొద్దీ, నిస్వార్థ సేవ చెయ్యడానికై ప్రయత్నించాలి. ఇతరులతో తగినంత సమయం గడుపుతున్నమా లేదా అని ప్రశ్నించుకోవాలి. ఒకడు ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపస్సు చేసి, ఒక నగరానికి వచ్చేడనుకొందాం. నడుస్తున్నప్పుడు ఎవరైనా తోస్తే "మీ దారికి అడ్డంగా వచ్చినందుకు క్షమించండి" అని అతడు అనడు. కానీ ధ్యానం చేస్తే, రోజూ రోడ్డు మీద తోసుకొని వెళ్ళే వాళ్ళను చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. మనను తోసినవాడి దృష్టి ఒక దుకాణం లోని వస్తువుపై నుండి, మనల్ని అతడు చూసి ఉండక పోవచ్చు. ధ్యానం చెయ్యడంవలన మనకి కోపం రాదు. కానీ ఇతరులకు అలా కాదు. వారికి మన దృక్పథం అర్థం కాదు. కాబట్టి మంత్ర జపం చేస్తూ, ఓర్పు వహించి, గౌరవంగా వారి మాటను విని, మన పరిస్థితి వివరించగలగాలి.

నేటి ప్రపంచం కాలుష్యంతో, హింసతో కూడి ఉండి, నివాసయోగ్యంగా లేదు. కాబట్టి మనము నోరు మెదపకుండా ఉండకూడదు. మనలో చిన్న చిన్న మార్పులు చేసికొని ప్రపంచాన్ని మార్చవచ్చు. మనసా, వాచా, కర్మా అన్ని విషయాలలోనూ, ముఖ్యంగా అనుబంధాలలో, మనము అహింసను పాటించాలి. ద్వేషానికి బదులుగా ప్రేమ, విమర్శకి బదులుగా గౌరవం ఇవ్వగలిగితే మనను మార్చు కోవడమే గాక, మన సంబంధీకులను కూడా మారుస్తాము. మనం పర్యావరణాన్ని మంచికైనా , చెడుకైనా ప్రభావితం చేస్తాం. ఎల్లప్పుడూ మంచి చెయ్యాలంటే, దాన్ని పలు మందికి ఆచరణ యోగ్యము చెయ్యాలంటే, గట్టి ప్రయత్నం నిస్వార్థంగా చెయ్యాలి.

ధ్యానంలో మనం చేతన మనస్సు లోతుల్లోకి వెళ్తాము. అక్కడ నిర్మానుష్యంగా ఉంటుంది కాబట్టి ఇతరులతో మాట్లాడి, కలిసి నవ్వుకొని, కలిసి పాటలు పాడి, జీవితాన్ని సామరస్యంతో గడపాలి. ఆధ్యాత్మిక పథంలో కష్టపడి పనిచెయ్యడం, సత్సంగం ఉంచుకోవడం చాలా అవసరం. వాటివలన మన సాధన మెరుగుపడుతుంది. 298

Eknath Gita Chapter 4 Section 31

Bhagavat Gita

4.31

తస్మా దజ్ఞాన సంభూతం హృత్ స్థ౦ జ్ఞానాసి నాత్మ {4.42}

ఛిత్త్వైనం సంశయం యోగ మాత్తిష్ఠోత్తిష్ఠ భారత

అర్జునా! అజ్ఞానము వలన నీ హృదయమున కలిగిన సంశయములను జ్ఞానమనెడి కత్తితో తెగగొట్టి యోగస్థుడవై కర్మ నాచరింపుము. లెమ్ము.

యోగ అనగా మనలోని ఖండితమైన చేతన మనస్సును ఏకం చేసి, జీవైక్య సమానతను పాటించి, భగవంతునిలో ఐక్యం చెయ్యడం. ఈ మధ్య యోగా అనే పదం వాడుకలోకి వచ్చింది. అది నిజంగా ఆసనాలకు సంబంధించినది.

శ్రీకృష్ణుడు మనల్ని సంశయములు లేకుండా చేసికోమని ప్రేరేపిస్తున్నాడు. కొందరు తమను ఇతరులు ప్రేమిస్తున్నారా లేదా అనే సంశయంలో ఉంటారు. ఎందుకంటే వారు మరొకరిని అఖండిత మనస్సుతో ప్రేమించలేరు గనుక. ప్రేమ యొక్క రహస్యం: మనల్ని ఇతరులు ఎంత ప్రేమిస్తున్నారో అడగక, వారిని సదా ప్రేమిస్తూ ఉండడమే. మనం ఎంత ప్రేమించాలని ప్రయత్నిస్తే, అంత ప్రేమని పంచగలం. కాలక్రమంలో మనమొక వ్యక్తిని 10 ఏళ్ల క్రిందటికంటే ఇప్పుడు ఎక్కువ ప్రేమించాలి. మనం ఇతరుల సౌఖ్యము కోరి, వారిని మనకన్నా ముఖ్యులని తలిస్తే, ప్రతి ఒక్కరిలోనూ ప్రతిష్ఠితమైన దేవుని ప్రేమించగలం.

ధ్యానంలో ప్రవేశించినప్పుడు సహజంగా ఆధ్యాత్మిక సిద్ధాంతాల గురించి కొన్ని సంశయాలు కలుగుతాయి. మనము శాస్త్రజ్ఞులు చెప్పే గురుత్వాకర్షణ వంటి సిద్ధాంతాలని గాఢంగా నమ్ముతాము. కానీ కర్మ సిద్ధాంతాన్ని పూర్తిగా నమ్మకపోవచ్చు. గురువు భౌతిక సిద్ధాంతాలు నమ్మ వద్దని చెప్పడు. వాటిలాగే ఆధ్యాత్మిక సిద్ధాంతాలను నమ్మాలని చెప్తాడు. "భౌతిక ప్రపంచమే నిజం. నేను నా కళ్ళతో చూసినది, చెవులతో విన్నది మాత్రమే నమ్ముతాను" అనేవాళ్ళు ఉంటారు. కానీ ఆధ్యాత్మిక సిద్ధాంతాలను అనుసరించి తమ జీవితాన్ని పునరుద్ధరించికొన్న వారల దృష్టాంతాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకి గాంధీజీ ఇలా చెప్పేరు: "ఏ వ్యక్తి అయినా నేను ప్రయత్నంతో, నమ్మకంతో, ఆశతో సాధించినది, సాధించగలరు" ఆయన తానొక సామాన్యుడనని చెప్పుకొనేవారు. అదే ఆధ్యాత్మిక సిద్ధాంతాలు తెలిసినవారి స్వస్వరూపం. ఆ సిద్ధాంతాలు క్రమ౦ తప్పకుండా పనిచేస్తాయి. వాటిని పాటించి మన వ్యక్తిత్వాన్ని, చేతన మనస్సుని మార్చుకోవచ్చు.

మనం ఆధ్యాత్మిక సిద్ధాంతాలను ఒప్పుకున్నా, లక్ష్యాన్ని చేరడానికై తోడ్పడే ధ్యానం, సాధనల మీద సంశయం ఉండవచ్చు. మన ధ్యానం పురోభివృద్ధి అవుతున్న కొద్దీ ఆ సంశయాలు తీరిపోతాయి. ధ్యానంలో మన చేతన మనస్సు లోతులకెళితే, మన కోర్కెలన్నీ ఏకమౌతాయి. అదే సంశయాన్ని తీర్చే నిరూపణ. మన సంశయాలను దూరం చేసికొని, గీతను అనుసరించడం ఎంతో ముఖ్యం.

శ్రీరామకృష్ణ అనేవారు: గీత, గీత, గీత అని స్మరిస్తే తాగి, తాగి, తాగి అనే శబ్ద ప్రకటమౌతుంది. అనగా త్యాగం చేయుట. గీత మన కుటుంబాన్ని, ప్రపంచాన్ని త్యజించమని చెప్పడం లేదు. కానీ మన అహంకారాన్ని, వేర్పాటును త్యజించ మంటుంది. ఎందుకంటే అవే మనకి, మనలో ప్రతిష్ఠితమైన దేవుని మధ్య ఉన్న అడ్డంకులు.

గాంధీజీని ఒకరు ఆయన జీవిత రహస్యం మూడు ముక్కల్లో చెప్పమని అడిగేరు. ఆయన ఈశావాస్య ఉపనిషత్తు నుండి: తేన త్యక్తేన భుంజితాః అన్నారు. అంటే త్యాగం చేసి ఆనందించు. ఆయన ఉద్దేశ్యం మన స్వార్థ పూరిత బంధాలను వదులుకోకపోతే జీవితంలో ఆనందం పొందలేమని. ఎప్పుడైతే మన చిన్న అహంకారాన్ని విడచి, పరోపకారము చేయబూనుతామో, మనం అపరిమితమైన ఆనందాన్ని అనుభవిస్తాము. మనల్ని సున్నా చేసికొంటే మన ప్రవీణతను అపరిమితం చేసికొని, ఇతరులను మనకన్నా ఎక్కువగా ప్రేమిస్తాము.

ఇది మన కుటుంబంతో మొదలుపెట్టవచ్చు. మన తలిదండ్రులయందు, సహధర్మచారిణియందు, పిల్లల యందు, మిత్రుల యందు ప్రేమతో వ్యవహరించి, వారి ఆనందాన్ని మన ఆనందంకన్నా మిన్న అని చేతన మనస్సులో కోరి, మన ఆనందం ఆఖరిగా పెట్టుకోవచ్చు. మొదట్లో అది కష్టమనిపించవచ్చు. కానీ త్వరలో కుటుంబంలోని, సమాజంలోని ప్రతివొక్కరి ప్రేమ, గౌరవము చూరుగొంటాము. క్రమంగా మన సాధనతో , నిస్వార్థ జీవిత౦తో మనతో కలిసిన ప్రతివారినీ ప్రభావితం చెయ్యచ్చు. 293

Eknath Gita Chapter 4 Section 30

Bhagavat Gita

4.30

యోగ నన్న్యస్త కర్మాణాం జ్ఞానసంఛిన్న సంశయం {4.41}

ఆత్మవంతం స కర్మాణి నిబద్నన్తి ధనంజయ

ధనంజయా! యోగము ద్వారా కర్మలను త్యజించిన వానిని, జ్ఞానము ద్వారా సంశయములను నివృత్తి చేసికొనిన ఆత్మవిదునిని కర్మలు బంధించవు. ఀ

మనము డబ్బుకై, వసతులకై పనిచేయకపోతే, దానిలోని ఆనందం అనుభవిస్తాము. ధనం ఆశించక, పరోపకారానికై పని చేస్తే మనలోని ఒత్తిడి, నిరాశ మట్టు మాయమౌతాయి. మనం సమయాన్ని, కౌశల్యాన్ని ఇతరులకై వెచ్చించవచ్చు. అలాగే ఉపయోగపడే వస్తువులను, ఉచిత సలహాను ఇవ్వవచ్చు. ఈ విధంగా స్వంత లాభం, పేరు ప్రఖ్యాతులను ఆశించక ఇతరుల బాగోగులకై మన వనరులు కొన్ని దానం చెయ్యడం ఉత్తమం. అటువంటి దానం భగవంతునికి అర్పించినట్లే.

ఒకరు అలజడితో ఉన్నారంటే వారు సహాయం కోరుతున్నారు. వారు కోపంతో మాట్లాడితే, మనమూ అలాగనే ప్రతిస్పందించకూడదు. దానివలన వారిని ఇంకా దూరం పెట్టం. కోపంతో ఉన్నవారి యందు సహనం చూపించాలి. మొదట్లో వారు పైచేయి కలిగి ఇలా అనుకుంటారు: "వీరెవరో ఓర్పుతో ఉన్నారు. నా కోపానికి ఒక పొయ్యేదారి ఉండాలి. కాబట్టి వీరి మీద నా కోపం తీర్చుకొంటాను". కానీ మనం కోపాన్ని, కోపంతో ఎదిరించి పరిస్థితిని చక్కబెట్టలేము. అలాగని వారి మనల్ను ఇష్టం వచ్చినట్లు బాధ పెడితే ఊర్కొని ఉండకూడదు. వారికి కోపంవలన, అహంకారం వలన తమకి, ఇతరులకి అపాయం కలిగిస్తున్నారనే అవగాహన కల్పించాలి. 291

Eknath Gita Chapter 4 Section 29

Bhagavat Gita

4.29

శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర స్స౦యతే౦ద్రియః {4.39}

జ్ఞానం లబ్ద్వా పరాం శాంతి మచిరేణాధి గచ్ఛతి

శ్రద్ధగలవాడు, తత్పరుడు, ఇంద్రియములను నియమించిన వాడు ఈ జ్ఞానమును పొందుచున్నాడు. జ్ఞానమును పొందిన వెంటనే శాంతిని పొందుచున్నాడు

ఆజ్ఞ శ్చా శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి {4.40}

నాయం లోకో అస్తి న పరో సుఖం సంశయాత్మనః

జ్ఞానశూన్యుడు, శ్రద్ధాహీనుడు, సంశయాత్ముడు తప్పక నశించును. సంశయచిత్తునకు ఇహము లేదు. పరము లేదు. సుఖమూ లేదు.

నాలో ప్రతిష్ఠితమైన దేవుని యందు నమ్మకం లేకపోతే కలిగే సంశయాలు: నా ఆత్మ ఎవరు? నేను శాంతితో ఎలాగ ఉండగలను? ఇతరుల కొరకై ఎలా సేవ చేయగలను? నేను అందరిచే ఎలా కొనియాడబడగలను? ఇక్కడ శ్రద్ధ అంటే మూఢ నమ్మకమనికాదు; స్వీయానుభవంతో కూడిన గాఢమైన నమ్మకము. ఆధ్యాత్మిక పథంలో స్థిర పడినప్పుడ మనలోని అనిర్వచనీయమైన శక్తి, ముఖ్యంగా మిక్కిలి క్లిష్ట పరిస్థితులలో, మన దిశ నిర్దేశిస్తూ, మనల్ని రక్షిస్తూ ఉంటుందని తెలిసికొ౦టాము. అదే పలు మార్లు గ్రహిస్తే మనలోని దేవునిమీద శ్రద్ధ కలుగుతుంది. స్మృతులలో చెప్పిన, యోగులు చెప్పిన మాటలలో శ్రద్ధ ఉండడం మంచిదే కాని, వాటిని స్వీయానుభవం లోకి తెచ్చుకోవాలి. బుద్ధుడు చెప్పినట్లు గురువు దిక్కు చూపిస్తాడు, కానీ ప్రయాణం చేయవలసినది మనమే.

గాంధీజీ ఆఫ్రికా లో ఉన్నప్పుడు, కొంతమంది క్రిస్టియన్ లు ఆయనను తమ మతంలో చేరమని ఒత్తిడి చేసేరు. వారు "నిన్ను జీసస్ అన్ని పాపాలనుంచి విముక్తి చేస్తాడు" అని చెప్పేవారు. అప్పుడు గాంధీజీ "నేను చేసిన పాపాలనుంచి విముక్తి కోరటం లేదు. పాపం చేయించే ఆలోచనల నుండి, లేదా పాపం నుంచి, విముక్తి కోరుతున్నాను" అని చెప్పేవారు.

ఆధ్యాత్మిక సాధన యొక్క లక్ష్యం మనమెవరమో తెలిసికోవడం. ధ్యానంలో ఆఖరి మెట్టు సమాధిలో నాకు తెలిసింది: మీరు, నేను వేర్వేరు కాదు. మనమందరమూ దైవసంబంధమైన ఐక్యతతో కలిసి ఉన్నాము. ఇది తెలిసికొ౦టే, మన౦ ఇతరులను బాధ పెట్టక, వారి పురోగతికై పాటు పడుతూ, అందరితో సామరస్యంగా జీవిస్తాము.

శ్రీకృష్ణుడు ఇచ్చే బోధ: మనలోని దేవుని గూర్చి కొంతైనా అవగాహన లేకపోతే -- అనగా శ్రద్ధ, మనలోని దేవునిపై నమ్మకము, ప్రతి ఒక్కరిలోనూ దేవుడు ఉన్నాడనే నమ్మకము, జీవైక్య సమానత మీద నమ్మకము--శాంతితో బ్రతకలేము. హింసాకాండ దీనికి పూర్తిగా వ్యతిరేకము. హింస మనల్ని వేర్పడేటట్టు చేసి, మనల్ను విడదీస్తుంది. ప్రతీ కుటుంబంలోనూ, సమాజంలోనూ కలహాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఒకరు తప్పు చెయ్యవచ్చు. కానీ శ్రద్ధ ఉంటే కుటుంబాన్ని, సమాజాన్ని ఐకమత్యంతో ఒకే త్రాటి మీద నడిపించవచ్చు. 289

Eknath Gita Chapter 4 Section 28

Bhagavat Gita

4.28

యాథైధాంసి సమిద్ధో అగ్ని ర్భస్మసా త్కురుతే అర్జున {4.37}

జ్ఞానాగ్ని స్సర్వకర్మాణి భస్మసా త్కురుతే తథా

అర్జునా! మండుచున్న అగ్ని కట్టెలను భస్మము చేయునట్లు, జ్ఞానమనెడి అగ్ని సమస్త కర్మలను భస్మము చేయును

న హి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే {4.38}

తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి

జ్ఞానముతో సమమైనది, పవిత్రమైనది ఈ లోకమున మరొకటి లేదు. ఈ జ్ఞానమును పొందినవాడు కాలక్రమమున తన ఆత్మనుండే దానిని పొందుచున్నాడు

శ్రీకృష్ణుడు మనము గతంలో ఎంత హీనమైన కర్మలు, ఇతరులను బాధించి, చేసినా, జ్ఞానం వాటిని తుడిచిపెట్టేస్తుందని చెప్తున్నాడు. గతం గురించి విచారించకూడదు. దాని వలన ఒత్తిడి కలిగించుకోకూడదు. మనము మన ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరడానికై మన దృష్టిని కేంద్రీకరిస్తే, పాత తప్పులు మన మార్గానికి అడ్డురావు.

జ్ఞానం పొందాలంటే నాకు ధ్యానంతప్ప వేరే ఉత్తమమైన మార్గం తెలీదు. అన్ని మతాలలోనూ ధ్యానం ఒక్కటే దేవుని చేర్చే మార్గం, నిచ్చెన అని అంటారు. ధ్యానం బదులు ఇంద్రియ నిగ్రహం, పరోపకారం అదే దిశలో ఉండవచ్చు. వాటిని పొందుటకై ధ్యానం మొదలపెట్టకపోయినా అవి కలిసి వస్తాయి.

ధ్యానానికి శాఖాహారం ఎంతో అవసరం. మన తోటి జీవులను హింసించి మన పొట్ట నింపుకోవడం తప్పు. ధ్యానం గాఢమవుతున్నప్పుడు మిగతా జీవుల దృక్పథాన్ని అర్థంచేసికొనే జ్ఞానం వస్తుంది. శాస్త్రజ్ఞులు చెట్లు, చేమలు వంటి ప్రకృతి వనరులను సమంగా ఉపయోగించాలని హెచ్చరిస్తునారు. గాంధీజీ పూల మాలలను నిరాకరించేవారు. ఆయన దృష్టిలో పూలు మొక్కల మీద ఉంటేనే వాటి అందం.

ప్రకృతితో, జీవులతో సమంగా ఉండడంతో పాటు మన బంధు మిత్రులయందు కూడా సమంగా ఉండాలి. చెట్లు, జీవులు మాట్లాడవు. వాటి బాధను చెప్పుకోలేవు. అవి మూగ జీవులు. కానీ మనం ఒక వ్యక్తిని పలకరించి "ఇప్పుడు నేను చెప్పేది విను" అంటాం. అతడు స్పందించి "మొదట నేను చెప్పేది విను" అని అనవచ్చు. అలాటప్పుడు మనం సహనం పాటించాలి. మన చుట్టూ ఓర్పు లేని వ్యక్తులు లేకపోతే మనం సహనం ఎలా నేర్చుకుంటాం? మనకైతే "నిశ్శబ్దంగా ఉండు" అని చెప్పడం ఉత్తమమనిపిస్తుంది. కొందరికి లేదు, వద్దు అనే పదాలు నచ్చవు. మన మనస్సును శుద్ధి చేసికొని, సహనం అలవరచుకొని, మనలోని, ఇతరులలోనూ, ప్రతిష్ఠితమైన దేవుని దర్శించవచ్చు. 288

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...