Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 33

Bhagavat Gita

6.33

తత్ర తం బుద్ధిసంయోగం లభతే పౌర్వ దైహికమ్ {6.43}

యతతే చ తతో భూయ స్స౦సిద్ధౌ కురునందన

కురునందనా! అలా జన్మించి, పూర్వ జన్మపు బుద్ధితో సంబంధమును పొందుచున్నాడు. మరల పూర్ణ యోగసిద్ధికి ప్రయత్నము చేయుచున్నాడు.

పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే హ్యవశో అపి సః {6.44}

జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే

అతడు ప్రయత్నము చేయక పోయినను పూర్వ జన్మ యందలి అభ్యాస ప్రభావము చేత యోగమునకు ఆకర్షింపబడుచున్నాడ. యోగమును తెలియగోరువాడు శబ్దబ్రహ్మమును అతిక్రమించుచున్నాడు

మనకి దేవునిక మధ్య ఆకర్షణ ఉంది. మనము చిన్న ఆయస్కాంతాల లాగ జీవనము సాగించి, కొన్నాళ్ళ ఆధ్యాత్మిక సాధన వలన, దేవునివైపు పూర్తిగా ఆకర్షింప బడతాము.

గీత చెప్పేది ఆధ్యాత్మిక చింతన ఎక్కడి నుంచో ఊడిపడి రాలేదు. అది మనలో బీజ రూపంలో ఎప్పటికీ ఉంది. దానిని ఇప్పుడు గుర్తు తెచ్చుకుంటున్నాము. కొన్నేళ్ళు ధ్యానం చేస్తే, మన గతజన్మ స్మృతులు వెలికి వచ్చి, మన విలువలు నిస్వార్థమైన జీవితం గడపడానికి, ఆధ్యాత్మికత గాఢమవ్వడానికి ఉపయోగపడతాయి. అది జరిగితే మనము క్రొత్తగా ఆధ్యాత్మికత అలవరచుకోవటంలేదు. లోన ఉన్నదే వ్యక్తమవుతున్నాది. అందుకే మనలో కొందరు ధ్యానంలో శరవేగిరంగా దూసుకు పోతారు. వారిని చూసి మనము నిరుత్సాహ పడనక్కరలేదు. మనమెంత చెయ్యగలిగితే అంత సాధనను చెయ్యాలి.

కొందరు యువకులు భయాందోళనాలతో కూడి అశాంతితో బ్రతుకుతారు. అది ధ్యానానికి సూచన. గత స్మృతులు వెలికికి వస్తే, గతంలో పొందిన జ్ఞానాన్ని తిరిగి పొంది, వారిలో ఆధ్యాత్మిక సాధన చెయ్యాలనే ఇచ్ఛ ప్రబలుతుంది. మొదటి రెండు మూడేళ్ళు సాధన కష్టమనిపించినా, అటు తరువాత మన పూర్వ జ్ఞానము పొంది, మన సంశయాలన్నీ తొలగిపోతాయి. అది ఎలాగంటే ఒక వైణికుడు కొన్నేళ్ళు సాధన చెయ్యక, తిరిగి వీణ వాయించడం మొదలు పెడితే, కొంత తక్కువ సాధనతో తన పూర్వ ప్రావీణ్యాన్ని తిరిగి పొందుతాడు. 388

Eknath Gita Chapter 6 Section 32

Bhagavat Gita

6.32

అథవా యోగినా మేవ కులే భవతి ధీమతాం

ఏ తద్ధి దుర్లభతరం లోకే జన్మ యదీదృశమ్ {6.42}

లేనిచో, జ్ఞానవంతులైన యోగుల కులమునందు పుట్టుచున్నాడు. ఈ లోకమున ఇట్టి జన్మము కలుగుట దుర్లభముకదా

ఆధ్యాత్మిక సాధన ఎన్నటికీ వృధా కాదు. పునర్జన్మ సిద్ధాంతం ప్రకారం, ఈ జన్మలో సాధన పరిపక్వత కాకపోయిననా, వచ్చే జన్మలో ధ్యాన మొనర్చు దంపతులకు బిడ్డలుగా పుడతాం. మనకింత కన్నా గొప్ప అవకాశం లేదు.

కర్మ సిద్ధాంతం ప్రకారం మన బంధుమిత్రులను, ముఖ్యంగా తలిదండ్రులను, జాగురూకతతో ఎంచుకుంటాము. టిబెట్ భౌద్ధులు మరణము తరువాత మనము బార్డో అనబడే త్రిశంకు స్వర్గంలో ఉంటామని అంటారు. అప్పుడు మనకు పునర్జన్మ నిశ్చయింపబడుతుంది. తలిదండ్రులు, వారి సంతానము ఒకరినొకరు పోలి ఉంటారు. అందుకే మన తలిదండ్రులను విమర్శించడం తప్పు. ధ్యానమాచరించే తలిదండ్రులకు పుట్టడం మన అదృష్టం. అలాగే మన కుటుంబం సాధనను మెచ్చుకుంటే అది మన అదృష్టం. మన తలిదండ్రులు ధ్యానం చెయ్యకపోయినా, వారు మన సాధనను, పరోపకార భావనలను ప్రోత్సాహిస్తే అది ఎంతో అదృష్టం. అందుకే మన ప్రార్ధనను మన తలిదండ్రుల, కుటుంబ సభ్యుల క్షేమమునకై చేసి ఉపసంహరించడం శ్రేష్ఠము. 386

Eknath Gita Chapter 6 Section 31

Bhagavat Gita

6.31

ప్రాప్య పుణ్యకృతాం లోకా నుషిత్వా శాశ్వతీ స్సమాః {6.41}

శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో అభిజాయతే

యోగభ్రష్టుడు పుణ్యాత్ములు వసించెడి లోకములను పొంది, అచ్చట అనేక సంవత్సరము లుండి తరువాత సదాచార సంపన్నులైన శ్రీమంతులలో జన్మించుచున్నాడు

ఇక్కడ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సాధన ఎన్నటికీ వ్యర్థం కాదని అభయమిస్తున్నాడు. ఒకనికి ఒక జన్మలో సాధన వలన కలిగే పుణ్యము పరిపక్వమవ్వకపోతే అతడు మరల మనిషిగా పుట్టినపుడు ఆధ్యాత్మిక దిశలో పయనించడానికి పూర్వ జన్మ పుణ్యాన్ని దేవుడు అందిస్తాడు.

నేను నా అమ్మమ్మకు పుణ్యవశాత్తూ మనవడిగా పుట్టేను. శ్రీకృష్ణుడు ఒక జన్మలో పుణ్యం చేసికొని, మళ్ళీ మనిషిగా ఒక సద్గుణవంతమైన జంటకు బిడ్డగా పుట్టి, వారి సహనంతో, ఓర్పుతో ఆధ్యాత్మిక సాధన చేస్తామని ఢంకా కొట్టి చెప్తున్నాడు.

Eknath Gita Chapter 6 Section 30

Bhagavat Gita

6.30

శ్రీ భగవానువాచ:

{6.40}
పార్థ నై వేహ నా ముత్ర వినాశస్తస్య విద్యతే

న హి కల్యాణ కృ త్కశ్చి ద్దుర్గతిం తాత గచ్ఛతి

పార్థా! యోగభ్రష్టునకు ఈ లోకమున గాని, పరలోకమున గాని వినాశము కలుగనేరదు. పుణ్యాత్ముడైన వాడెవడు దుర్గతి పాలుకాడు కదా!

శ్రీకృష్ణుడు ఇలా బోధించెను: "ఎంత తక్కువ సమయమైనా నాయందు చేసిన ధ్యానము ఎన్నటికీ వ్యర్థం కాదు. ఆధ్యాత్మిక పథంలో ఎటువంటి చిన్న అడుగైనా ఎన్నటికీ నిరుపయోగము కాదు". మన మతంలో ఎవ్వరూ దిక్కులేకుండా ఉండరు. మనమంతా దేవుని బిడ్డలము. మనము దేవునికి దూరంగా, నిర్జన ప్రదేశంలో బ్రతకవచ్చు. కానీ ఎప్పుడో ఒకప్పుడు దేవునితో ఐక్యమవుతాం.

మన మతంలో మనమెవ్వరమూ ఎన్నటికీ దేవుని బిడ్డలము కాకుండా ఉండం. మనకు నిరాశ, నిస్పృహలు కలిగినప్పుడు, లేదా మన బాహ్య కర్మలు ఎలాగ ఉన్నా, మన పరిపూర్ణులం, శుద్ధమైన వారలం, దేవుని అంశలం.

అందరూ యోగులవ్వగలరు. మనకు జ్ఞాని లక్షణాలు మొదట్లో లేకపోయినా, మనము వంగి వాటిని అలవరచుకొంటాము. కానీ మనను కించపరిచితే మన దృక్పథం అలాగే ఉంటుంది. నేను చెప్పేది: మీరు పిల్లలు దైవస్వరూపులని చెప్పండి. పెద్దలు కూడా కొన్నాళ్ళకు దైవస్వరూపులుగా మారవచ్చు. ప్రతి ఒక్కరిలోనూ మంచి ఉంది. మనము ఓర్పుతో, సహనంతో ఉంటే ఇతరులు మన అంచనాకి ఎదుగుతారు. 385

Eknath Gita Chapter 6 Section 29

Bhagavat Gita

6.29

కచ్చిన్నో భయవిభ్రష్ట శ్చిన్నాభ్రమివ నశ్యతి {6.38}

అప్రతిష్ఠో మహాబాహో విమూఢో బ్రహ్మణః

మహాబాహో! ఈ యోగము లభించక జ్ఞాన మార్గము నుండి తప్పి పోయినవాడు రెండు విధముల చెడినవాడై చెదిరిన మేఘము వలె నశింపకుండునా?

ఏతన్మే సంశయం కృష్ణ ఛేత్తు మర్హ స్యశేషతః {6.39}

త్వదస్య స్స౦శయ స్యాస్య ఛేత్తా న హ్యుపద్యతే

కృష్ణా! నా సంశయమును నివారించుటకు నిన్ను మించిన వారెవ్వరూ లేరు

పెద్ద సుడిగాలి మేఘాలను చెల్లాచెదురూ చేస్తుంది. అర్జునుడు తనను అటువంటి మేఘాలతో పోల్చుకొన ఇలా అడిగెను: "ఒక పెద్ద అవాంతరము వచ్చి, నా ఆధ్యాత్మిక చింతనను నా చేతన మనస్సును, నా పట్టుదలను, ఖండ ఖండాలుగా చేసి, నలు దిక్కులా చెల్లా చెదురు చేస్తే ఏమవుతుంది? నేను ఇంద్రియ సుఖము, ఆధ్యాత్మిక ఆనందము పొందక రెంటికీ చెడ్డ రేవటిలా ఉంటానా?" ఇది మనందరిలో కలిగే సంశయము. ముఖ్యంగా ఇంద్రియలోలత్వము, అహంకారము గల వ్యక్తులలో ఇది ప్రకటిత మవుతుంది. అర్జునుడు తన అనుమాలాను ఈ విధంగా వ్యక్త పరచి, శ్రీకృష్ణుని వాటిని పఠాపంచలు చెయ్యమని అడుగుతున్నాడు. సమాధి స్థితిలో దేవుడు మన చేతన మనస్సును ఆవరించి, అటువంటి అనుమాలన్నీ పోయి, మనలో నిశ్చయము కలిగి అందరికీ ప్రకటిత మవుతుంది. 383

Eknath Gita Chapter 6 Section 28

Bhagavat Gita

6.28

అర్జున ఉవాచ:

{6.37}
అయతి శ్శ్రద్ధయోపేతే యోగా చ్చలితమానసః

అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్ఛతి

కృష్ణా! శ్రద్ధగలవాడయ్యును, ప్రయత్నము సరిగ చేయనందున యోగము నుండి చలించిన మనస్సు గలవాడైన మనుజుడు యోగసిద్ధిని పొందనపుడు వాని గతి ఏమి?

అర్జునుడు మనందరి అనుమాలను ప్రతిబింబిస్తున్నాడు. "కొన్నాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసి, అటు పిమ్మట గాడి తప్పితే, చేసిన సాధన అంతా వ్యర్థమా?" అని అర్జునుడు అడుగుతున్నాడు.

కొన్నాళ్ళు ధ్యానం చేసి, దానివలన పొందగలిగే ఫలాలు చవి చూస్తాము. ఇంద్రియాలను నియంత్రించి, ఆనందాన్ని పొందుతాము; అహంకారాన్ని జయించి బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటాము. ఇలాగ చవి చూసి, ధ్యానాన్ని విరమిస్తే, దానికి సరితూగే దేమీలేదని తెలుసుకొంటాము. మనము భోగాలు, సుఖాలకు అలవాటుపడినా మన అంతరాత్మ "నీవు ఆధ్యాత్మిక పథాన్ని విడనాడేవు" అని చెప్తుంది.

నేటి కాలంలో చాలా మంది మాదక ద్రవ్యాలతో ధ్యానం చేస్తున్నారు. సాధువులు గంజా మొదలగు ద్రవ్యాలను వాడుతారనే అభియోగం, దుష్ప్రచారం ఉన్నాయి. అది పెద్ద అబద్దం. మెహర్ బాబా మాదక ద్రవ్యాలు ఆధ్యాత్మికతను పెంపొందించలేవు; పైపెచ్చు అవి మనకున్న ఆధ్యాత్మికతను చంపుతాయి అని చెప్పిరి. అట్టి రసాయన పదార్థాలతో అడ్డ దారి త్రొక్కితే, కొన్నాళ్ళకు మనకు ధ్యానం చేసే శక్తి పోతుంది. ధ్యానం అంతర్గత ప్రయాణం. దానికై బలమైన దేహం, మంచి నాడీ వ్యవస్థ, ప్రశాంతంగా ఉండే మనస్సు, పదునైన బుద్ధి అవసరం. అవి రసాయనాల వలెనే కాక, అతిగా ఇంద్రియలోలత్వం, అహంకారం వలన క్షీణిస్తాయి. 383

Eknath Gita Chapter 6 Section 27

Bhagavat Gita

6.27

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః {6.36}

పశ్యాత్మనా తు యతతా శక్యో అవాప్తు ముపాయతః

మనో నిగ్రహము లేనివాడు యోగసిద్ధిని బొందుట దుర్లభము. మనో నిగ్రహము కలిగి ప్రయత్నించువాడు ఉపాయము వలన పొందగలుగుట సాధ్యమని నా అభిప్రాయము

మనము ధ్యానంలో స్థితులై, శ్రీకృష్ణుని బోధను తూచ తప్పకుండా పాటిస్తే, అతనితో ఐక్య౦ నిస్సందేహంగా పొందుతాము. కానీ బద్దకంతో ఆరంభశూరులవలె ఆర్భాటంతో మొదలుపెట్టి, చివరకు పిల్లిలా తయారవుతే అట్టి ఐక్యం పొందలేము.

ఎవరైతే ఆధ్యాత్మిక సాధన పట్టుదలతో చేసి, ఎన్నటికీ దానిని విడువక చేస్తారో వారు విజయవంతులు అవుతారు. వారికి పరిగెత్తడం వీలుకాకపోతే, చిన్న చిన్న అడుగులు వేస్తారు; అదీ వీలుకాకపోతే, డేక్కుంటూ తమ లక్ష్యం వైపు ప్రయాణిస్తారు. వారికి ఎన్ని అవరోధాలు వచ్చినా దాటుకొని, కనబడిన ఊతను తీసికొని ముందుకు సాగుతారు. మొదట్లో ఈ ప్రయత్నం చాలా కష్టం. ఎందుకంటే మనము ముందు అహంకారాన్ని జయించాలి. కానీ మన లక్ష్యం పై స్థిర చిత్తులమైతే కత్తి పోట్లు చిన్న సూది పోట్లుగా మారి; సూది పోట్లు పింఛ౦తో రాసినట్లు మారుతాయి. లక్ష్యం చేరడానికి సంపూర్ణమైన అర్పణ ఉ౦టే, మనము మిక్కిలి ఆనందం పొంది లక్ష్యాన్ని సాధిస్తాము. 381

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...