Saturday, April 9, 2022

Eknath Gita Chapter 9 Section 13

Bhagavat Gita

9.13

గతిర్భర్తా ప్రభుస్సాక్షీ నివాసశ్శరణం సుహృత్ {9.18}

ప్రభవః ప్రలయః స్థానం నిధానం బీజమవ్యయమ్

ఈ జగత్తునకు గతియు, భర్తయు, ప్రభువును, సాక్షియు, ప్రాణుల నివాసమును, ఆశ్రయమును, మిత్రుడును, సృష్టిస్థితి లయ కర్తయు, నిక్షేపమును, అవ్యయ బీజమును నేనే

భగవంతుడు జీవులన్నీటికీ ఆధారము. మనము భగవంతుని మీద భక్తితో ఉంటే మన అవసరాలు, కోరికలు, తీరి స్వస్థతతో ఉంటాము. శ్రీకృష్ణుడు చెప్పేది: "నేను నీ జీవిత లక్ష్యం; నీ జీవనాధారం; నేను తప్ప వేరే యజమాని లేడు. నిన్ను అందరూ వదలి వెళ్తే నేను నీ సాక్షిని, నిజమైన గృహమును, ఆశ్రయాన్ని. నేను నీ నిజమైన మిత్రుడిని". జీసస్ "నన్ను అనుసరించు. నేనే మార్గము, జీవితము, సత్యము" అని చెప్పెను.

సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా ఇలా వ్రాసెను:

ఏదీ నిన్ను కష్టపెట్ట కూడదు

ఏదీ నిన్ను భయపెట్ట కూడదు

ప్రతీదీ మారుతోంది

దేవుడొక్కడే మారనిది

సహనం గమ్యానికి చేరుస్తుంది

దేవుడ్ని నమ్మిన వానికి లేమి లేదు

దేవుడే అన్ని అవసరాలనూ తీరుస్తాడు

ఏదీ నిన్ను కష్టపెట్ట కూడదు: అంటే మనము ఎన్నటికీ చికాకు పడం. మన శక్తి వృధా కాక జీవితాంతము దేవుని సేవకై దానిని వినియోగిస్తాము

ఏదీ నిన్ను భయపెట్ట కూడదు: ప్రతి ఒక్కరి జీవితంలో విషాదం ఉంటుంది: డబ్బు, పరువు, ప్రియమైన వారిని పోగొట్టుకోవడం వంటివి. చివరకు జీవితమే అంతం అవుతుంది. మనం దుఃఖించవచ్చు, కానీ అది మనలను అణచివేయదు. ఎందుకంటే మనకు దేవునిమీద నమ్మకమున్నది.

ప్రతీదీ మారుతోంది: మనము నడి వయస్సు దాటితే, మన మిత్రుల, పెద్దల మరణ వార్తలను వింటూ ఉంటాం. కఠోపనిషత్తు "జొన్న గింజ వలె మానవుడు వృద్ధాప్యంలో రాలిపోతాడు" అని చెప్తుంది. ప్రతీదీ మార్పు చెందుతోంది. మారేది ఎప్పటికైనా మరుగున పడేదే.

దేవుడొక్కడే మారనిది: మారే ప్రపంచంలో ఒక్క భగవంతుడే మారనిది. అతనిని ఆశ్రయించి, ప్రేమించి సేవిస్తే మనము ఎప్పటికీ భద్రంగా ఉండి, ఎక్కడికి వెళ్ళినా ఆహ్లాదంగా ఉంటాము.

సహనం గమ్యానికి చేరుస్తుంది: పరిస్థితులు ఎంత విషమించినా, జీవితం ఎంత క్లిష్టమైనప్పటికీ, సహనానికి అందరూ తల వంచ వలసిందే. అది అన్ని అవరోధాలను దాటిస్తుంది. ప్రతి తుఫాను మధ్యలో మార్పులేనట్లు, మన జీవితంలో కలిగే తుఫాను వంటి క్లేశాల మధ్యలో ఎన్నటికీ మారని భగవంతుడున్నాడు. మనమెప్పుడు మనపై క్రోధము పెంచుకున్నవారియందు క్రోధము పెంచుకోకుండా వారిని నమ్మితే, వారిలో నమ్మకం పెరిగి ఆత్మ వైపు దృష్టి మరలుతుంది. మనని ఎదిరించేవారు, మనతో విభేదాలున్నవారు, మన జీవితాన్ని బరువు చేసిన వారు, ఎప్పటికైనా మనతో స్పందిస్తారు.

దేవుడ్ని నమ్మిన వానికి లేమి లేదు : భగవంతుని నమ్మిన వాని దగ్గర అందరూ నిర్భయంగా ప్రవర్తిస్తారు. వారికి లేమి ఏమీ లేదు, కాబట్టి ఇతరుల వద్దనుంచి ఏమీ ఆశించరు. వారు పరోపకారానికై బ్రతుకుతారు. మనము వారి దగ్గరనుంచి ఏమి తీసుకొన్నా వారిలో వెలితి లేదు. వారు ఇతరులకు ఏమిచ్చినా సంపూర్ణంగా ఉంటారు. వారికి ఎటువంటి కష్టం కలిగించినా వారు నిండుగా ఉంటారు. ఎందుకంటే భగవంతుడు వారి అవసరాలను తీరుస్తాడు. 170

Eknath Gita Chapter 9 Section 12

Bhagavat Gita

9.12

పితా అహమస్య జగతో మాతా ధాతా పితామహః {9.17}

వేద్యం పవిత్రమోంకార ఋక్సామ యజురేవ

ఈ జగత్తునకు తండ్రిని తల్లిని నేనే, తాతయు నేనే. నేనే ఓంకారమును, ఋక్సామ యజుర్వేదములును నేనే.

మన పిల్లలు ఎదిగి మన బంధువున్న వూరులో కాలేజీలో ప్రవేశము లభిస్తే, వారు ఆ బంధువు ఇంట్లో ఉండి చదువుకుంటారు. దీనిని బంధువులు బరువుగా చూడరు. ఎందుకంటే మన పిల్లలు కాలేజీనుంచి ఉత్తీర్ణులై, ఉద్యోగాలు చేసి, సంసారం మొదలుపెడితే వారూ అలాగే చేస్తారు. ఈ విధంగా డబ్బు ఆదా కన్నా ముఖ్యాంశం మన పిల్లలు కుటుంబ వ్యవస్థలో పెరుగుతారు. మన బంధువులు వారి బాధ్యతను తీసుకొంటారు.

ఈ శ్లోకంలో భగవంతుడు మన బాధ్యతను వహిస్తున్నానని చెప్పుచున్నాడు. మనం ఎంత వయస్సున్నవారమైనా, ఎన్ని తప్పులు చేసినా, ఆయన మనని కాపాడుతాడు. చెప్పక చెపుతున్నదేమిటంటే మనము స్వార్థముతో, తప్పుడు పనులు చేస్తే, అతడు మనము నిస్వార్థముగా మారనంతవరకూ, పశ్చాత్తాపము పడనంతవరకూ జన్మరాహిత్యము ఇవ్వడు.

నేటి శాస్త్రజ్ఞులు చెప్పే విషయమేమిటంటే విశ్వంలోని అన్ని శక్తులూ ఒకే చోట కేంద్రీకరింపబడినవి అని. ఆ కేంద్రాన్ని మనము భగవంతుడంటాము. విశ్వమంతా ఒకే సిద్ధాంతముతో నడుస్తోంది. భూమి మీది కణాలు, శక్తి విశ్వమంతా కనిపిస్తుంది. కాబట్టి శ్రీకృష్ణుడు "నేను సంపూర్ణమైన జ్ఞానాన్ని. నన్ను తెలుసుకొంటే, జీవులకు ఆధారమైన శక్తిని తెలిసికొన్నట్టే" అని చెప్పెను. ఛాందోగ్య ఉపనిషత్తులో ఇట్లు చెప్పబడినది: "ఎలాగైతే మట్టి గూర్చి తెలిసికొంటే, దానిలోంచి ఆవిర్భవించిన నామ రూపాత్మకమైన ప్రతి వస్తువు -- కుండ, ముంత మొదలగునవి-- తెలియబడతాయో, ఆధ్యాత్మిక జ్ఞానంతో జీవులన్నీ ఒకటే నని తెలిసికొంటాము". 169

Eknath Gita Chapter 9 Section 11

Bhagavat Gita

9.11

అహం క్రతురహం యజ్ఞః స్వధా అహ మహమౌషధ౦ {9.16}

మంత్రో అహ మహమేవాజ్యం అహమగ్నిరహం హుతమ్

నేను క్రతువును, యజ్ఞమును, పితృపిండమును, ఔషధమును, మంత్రమును, హవిస్సును, అగ్ని హోత్రమును, హోమకర్మమునై యున్నాను

ఇక్కడ శ్రీకృష్ణుడు పురాతనమైన వైదిక కర్మలు గూర్చి చెప్పుచున్నాడు. కానీ శ్రీకృష్ణుని దృష్టిలో త్యాగ మనగా మన మాటే నెగ్గాలన్న పట్టుదలని, అహంకారాన్ని వీడడం. నేను ధ్యానంలో పురోగతిని తెలుసుకునేటప్పుడు, అంతరంగంలో మాటలు వినబడుతున్నాయా లేదా దృశ్యాలు కనబడుతున్నాయా అని అడగను. నేను తెలుసుకొనేది నా ఇష్టం వచ్చినట్లు చేస్తాననే అహంకారంకి ఎదురీత ఎలా సాగిందని. ఇదే సాధనలో పురోభివృద్ధి పొందడం అంటే.

గాఢమైన ధ్యానంలో అచేతన మనస్సును శోధించడమంటే, స్ప్రింగ్ కి తగిలి౦చిన తలుపును తెరవడం వంటిది. దానిని తెరిచి ఉంచడం చాలా కష్టం. ఎప్పుడైతే మనము దాన్ని కొంచెం తెరుస్తామో స్ప్రింగ్ దాన్ని మూసేస్తుంది. అది మొదట్లో నిరాశా, నిస్పృహలను కలుగజేస్తుంది. ఇలా అనేకమార్లు చేస్తే మీ ఏకాగ్రత తలుపుకావల దానిమీద ఉంటుంది. దేవుడు తలుపు వెనకాల ఉండి మీతో దాగుడు-మూతలు ఆడుతున్నాడాని అనిపిస్తుంది. మీకు కొంతకాలమైన తరువాత ఎలాగైనా ఆ తలుపును తెరిచి ఉంచాలనే పట్టుదల అధికమౌతుంది. రాత్రింబవళ్ళు అదే ఆలోచిస్తూ ఉంటారు.

దీన్ని సాధించాలంటే మొదట మన ఇష్ట౦ వచ్చినట్టు చేద్దామనే భావనను నియంత్రించుకోవాలి. మనకు దినంలో ఇలా చేయడానికి అనేక అవకాశాలు దొరుకుతాయి. ఉదాహరణకు: మన ఆహార విషయాల్లో ఇష్టాయిష్టాలు; పరులతో బాంధవ్యాలు.

రెండవది, బలమైన కోరికను తిరస్కరించడం. సిగరెట్ కాల్చాలనో, మద్యం తాగాలనో, లేదా పరులకుపకరించని కర్మ చేయాలనో గాఢమైన కోరిక రావచ్చు. అలాటప్పుడు దానికి ఎదురు తిరగాలి. ఎందుకంటే ఆ కోరికలో అమితమైన శక్తి నిరుపయోగంగా ఉంటుంది. ధ్యానంలో అవరోధం కలిగినప్పుడు, దాన్ని దాటలేమనే నిరాశ కలిగినప్పుడు, మీరు కోరికకు, పట్టుదలకు ఉన్న అవినాభావ సంబంధం తెలుసుకొంటారు. బలమైన కోరిక కూడా పట్టుదలే. మన పట్టుదల యొక్క శక్తి ఆ కోరికలో మన స్వాధీనంలో లేక బందీ అవుతుంది. ఉదాహరణకు లైంగిక కార్యము తప్పక చేయాలనే కోరిక. ఎప్పుడైతే ఆ కోర్కెకు ఎదురు తిరుగుతామో మన పట్టుదల పెరుగుతుంది. అది మీరు ధ్యానంలో కూర్చోగానే తెలుస్తుంది. మీ ఆరోగ్యం మెరుగుపడి, బంధు మిత్రులతో వైరము లేకుండా, మానసిక పరిస్థితి చక్కబడి, మీరు ధ్యానంలో పురోభివృద్ది చెందుతున్నారనే భావన కలుగుతుంది.

ఒక కోరిక అత్యంత గాఢమైనదయితే -- అనేక సంవత్సరాలుగా ఉన్నదైతే -- దాన్ని ఎదిరిస్తూ పోతే గొప్ప శక్తిని కూడబెట్టుకుంటారు. ఇది తెలిసికొన్నాక, మీరు ఆ గాఢమైన కోరిక రావడానికై వేచిచూడరు. మీరే దానిని రాకుండా నియంత్రిస్తారు.

కోర్కెలకు ఎదురు తిరగాలనే కోర్కె అత్యంత ఉత్తమ మైనది. నాలో ఒక బలమైన కోరిక తలెత్తుతే, నేను దానిని ఎదుర్కొంటాను. ఆ తరువాత నా భుజాన్ని నేనే తట్టుకొని మందుకు సాగుతాను. ఇది చాలా ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. ఎందుకంటే నా చిన్న మనస్సును నియంత్రించే యాజమానిని నేనే కాబట్టి.

ఈ విధంగా ఒక గాఢమైన కోరికను నియంత్రిస్తూ ఉంటే కొన్నాళ్ళకు దాని మూలాన్ని తెలుసుకొంటాం. దాన్ని వేళ్ళతో పీకి అవతల పారేస్తా౦. దాని స్థానంలో చైతన్యం ఒక ధారలా వచ్చి మనని ఉత్తేజపరుస్తుంది. మన సహనం అధికమౌతుంది; బాంధవ్యాలు గట్టి పడతాయి. ధ్యానంలో మనం తప్పక పురోగమించామని తెలియడానికి కొన్ని చిహ్నాలు ఉన్నాయి. మనను చాలా కాలం నుంచి బాధ పెడుతున్న శారీరిక, మానసిక సమస్యలు-- అజీర్ణము, ఆస్తమా, తీవ్రమైన తలనొప్పి, రక్తపు పోటు మొదలైనవి -- తొలగుతాయి. ఇదే శ్రీకృష్ణుడు నేను ఔషధాన్ని అని చెప్పడంలో అంతరార్ధం. అతనికి ఎంత దగ్గర అయితే, అతనంత స్వస్థత నిస్తాడు. అది బాహ్యంగానే కాదు, అంతర్గతంలో కూడా.

నా ఇష్టం వచ్చినట్టు చేస్తాననే పట్టుదల తగ్గించుకోవడానికి మంత్రం బాగా సహకరిస్తుంది. ధ్యానంలా కాక మంత్రాన్ని ఎవరైనా జపించవచ్చు. దానికి ఎక్కువ క్రమశిక్షణ అవసరం లేదు. మనము బయట అనేక ప్రకటనలు చూస్తాం. ఉదాహరణకు సిగరెట్ సంస్థలు చేసే ప్రకటనలు. కొన్ని కోట్ల మంది పొగత్రాగడం అపాయకరమని తెలిసినా ప్రకటనల వలన మోసపోయి దానికి బానిసలవుతున్నారు. ఎందుకంటే ఆ ప్రకటనల లోని మాటలు మన చేతన మనస్సులో హత్తుకు పోతాయి. మనము మంత్ర జపము చేసుకుంటూ ఉంటే అటువంటి దురాలోచనలు సమసి పోతాయి.

ఇది చాలా సులభమైన పద్దతి. దానిని ఒకమారు ఆచరణలో పెడితే మీకే తెలుస్తుంది అది ఎంత శక్తిమంతమో. మీకు ఇంట్లో ఎక్కువ కోపం వచ్చినపుడు, బయటకు వెళ్ళి, మంత్రాన్ని జపించుకొంటూ నడవండి. మీ కోపాన్ని ఇతరులమీద చూపకండి. దాని శక్తిని మంత్ర జపానికై ఉపయోగించండి.

మీకు ఒక పిండివంటను తినాలనే గాఢమైన కోర్కె కలిగినప్పుడు మంత్ర జపం చేస్తూ కొద్ది సేపు బయట నడవండి. ఒక గంటలో ఆ కోర్కె పోతుంది. అలా కాక పోతే ఆ కోర్కెను తీర్చుకోకపోతే, నేను చస్తాను అన్న భావన కలిగితే దైవ నామస్మరణ చేసుకోండి. ఇది ధూమపానం, మద్యం, మాదక ద్రవ్యాలకు బానిస అయినవారికి చాలా సహాయపడుతుంది. కొన్నిమార్లు మంత్రం చాలా కాలం వాడబడని కారులా పనిచేస్తుంది. పాత కారుని అనేక మార్లు ప్రయతనిస్తే కానీ దాని ఇంజిన్ మొదలవ్వదు. కానీ ఒక మారు ఇంజిన్ మొదలైతే, అది బాగా నడవగలదు. 167

Eknath Gita Chapter 9 Section 10

Bhagavat Gita

9.10

జ్ఞానయజ్ఞేన చాప్యన్యే యజ౦తో మాముపాసతే {9.15}

ఏకత్వేన పృథక్త్వేన బహుధా విశ్వతోముఖమ్

మరికొందరు జ్ఞాన యజ్ఞముతో నన్నారాధించుచున్నారు. విశ్వరూపుడనైన నన్ను కొందరు ఏకరూపుని గను, మరి కొందరు బహు రూపునిగను నానా విధములుగ పూజించుచున్నారు

ఈ శ్లోకంలో ఏదో జ్ఞాన౦ గుప్తమై ఉందని చాలా మంది తలుస్తారు. ఇది ధ్యానంలో చివర కలిగే సృష్టి అంతా భగవంతుడే అన్న భావన వ్యక్త పరుస్తున్నాది. మనం ప్రకృతిలో సౌ౦దర్యాన్ని చూస్తూ, అది భగవంతుని వేర్వేరు రూపాలని అనుకోవాలి. సూఫీలు చెప్పినట్లు భగవంతుడు "ముఖం వెనుకనున్న ముఖం". ఒక హసిడిక్ యోగి ప్రపంచంలో వివిధ వ్యక్తులున్నారని కళ్ల అద్దాలు పెట్టుకుంటేనే గానీ తెలియదన్నాడు. అంటే కళ్ల అద్దాలు పెట్టుకోకపోతే అన్నీ ఒకలాగే ఉంటాయి. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఇలా ఉంది:

భగవంతుడు విశ్వం యోక్క యోనిలో ఉన్నాడు,

సృష్టికర్త అన్ని జీవులలోనూ ఉన్నాడు

పుట్టినవన్నీ, పుట్టబోయేవన్నీ అతడే

ఆయన ముఖము అన్ని చోట్లా ఉంది

ఒకమారు నారదుడు అన్నిటికన్నా గుహ్యమైన ఆధ్యాత్మిక విషయము చెప్పమని శ్రీకృష్ణుడిని అడిగేడు. దానికి బదులుగా శ్రీకృష్ణుడు మందహాసము చేసి అంతర్ధాన మయ్యేడు. నారదునికి కొంతసేపటికి ఆకలి వేసి పొరుగునున్న ఇంటికెళ్ళి తలుపు తట్టేడు. ఒక అందమైన యువతి తలుపు తీసి నారదునికి బిక్ష పెట్టింది. ఆమె కళ్ళు అచ్చం శ్రీకృష్ణుని కళ్ల వలె ఉన్నాయి.

నారదుడు వెళ్ళి ఇంకో ఇల్లు తలుపు తట్టేడు. ఒక ఇల్లాలు తలుపు తెరిచింది. ఆమె వెనకి నుంచి ఒక చిన్న పిల్లవాడు దూసుకు వచ్చి "మీరు ఎప్పుడైనా శ్రీకృష్ణుని చూసేరా? ఆయన గురించి పాడండి" అని అడిగేడు. వాని కన్నులు కూడా అచ్చం శ్రీకృష్ణుని కళ్ళలా ఉన్నాయి. ఈ విధంగా నారదుడు ఆ వీధిలోని అన్ని ఇళ్ల తలుపులను తట్టి శ్రీకృష్ణుని ఏదో విధంగా దర్శించేడు. నారదుడు తాను చూసిన వారలలో వయస్సులో లేదా బాహ్యంగా తేడాలున్నా ఆ గ్రామంలో శ్రీకృష్ణుడు తప్ప ఇంకెవరూ లేరని గ్రహించేడు. అలా జ్ఞానోదయము అయిన తడవుననే ఆ గ్రామం మాయమై నారదుడు వైకుంఠంలో శ్రీకృష్ణుని చెంత ఉన్నాడు. 164

Eknath Gita Chapter 9 Section 9

Bhagavat Gita

9.9

సతతం కీర్తయంతే మాం యతంతశ్చ దృడవ్రతాః {9.14}

నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే

సదా నన్ను కీర్తించవారును, ధృడవ్రతులై ప్రయత్నించు వారును, నన్ను భక్తితో నమస్కరించువారును నైన నిత్యయుక్తులు సదా నన్ను సేవించుచున్నారు

ధ్యానంలో పురోగమించాలంటే ప్రతి నిమిషం కష్ట పడాలి. ప్రతి ఉదయం మన ఆధ్యాత్మికతను గుర్తు తెచ్చుకోవాలి.

ధ్యానంలో మొదటి అడ్డంకు ఆహారం. మనం తగినంత ఆహారమే తినాలి. భోజనాల మధ్య ఆకలి వేసినప్పుడు పట్టుదలతో బయట నడవడంవంటివి చెయ్యాలి. ఏదైనా కళా ప్రదర్శనకి వెళ్లాలనుకుంటే, దాని ప్రవేశ రుసుమును ఎవరికైనా దానం చెయ్యచ్చు. జీసస్ "మమ్మల్ని వాంఛల వైపు త్రిప్పకు" అని భగవంతుడిని ప్రార్థించమన్నాడు. కాబట్టి పట్టుదల సడలే స్థితిలో ఉండకూడదు.

భౌతికమైన వాంఛలనుండి బయట పడితే, ఇక మానసిక పరిస్థితులు వస్తాయి. ధ్యానం మొదట్లో మన సమస్యలు కలుపు మొక్కలు లాంటివి. వాటి వేర్లు లోపలకు చొచ్చుకొని ఉంటాయి. ఇంకా లోతుగా వెళ్తే ఆ వేర్లు ఒక పది వేర్లలోంచి వస్తున్నాయని తెలుస్తుంది. ఇలా పరిశీలన చేసికొని పోతే చివరకు తల్లి వేరు కనబడుతుంది. అది మన చిత్త చాంచల్యానికి ప్రతీక. దీనివలన తెలిసేది మన౦ అహంకారం అనబడే కారాగారంలో బంధింపడి ఉన్నామని. దానినుండి విముక్తి పొందితే గానీ ముందుకు పోలేం.

ధ్యానం కొనసాగించు కొద్దీ అహంకారంతో యుద్ధం చేయాలి. నేను అహింసా వాదిని, శాంతి దూతను అంటే లాభంలేదు. అహంకారంతో యుద్ధంలో గెలిచే మార్గం వెతుక్కోవాలి. దానితో ఆఖరి రక్తపు బొట్టువరకు పోరాడాలి.

నేను ఇద్దరు వ్యక్తులు కొండ నెక్కడం చూసేను. వాళ్ళు తాళ్ళతో, పెద్ద మేకులతో బయల్దేరారు. మేకును కొండ శిలలో కొట్టి, దాని మీదకు మొలకు కట్టుకొన్న తాడును బిగించి, ఆ తాడును చేతితో పట్టుకొని కాళ్లతో శిలను ఎక్కి మీదకు వెళ్తున్నారు. ఒక మారు, మేకు కొట్టడానికి వీలు లేకపోయింది. అప్పుడు వాళ్ళు పూర్వపు గడియారాలలో లోలకము (pendulum) వలె తాడు సహాయంతో ప్రక్కలకు వెళ్ళి మేకుని బిగించి కొండ ఎక్కేరు. వారు ఎక్కడైనా మేకును సరిగ్గా బిగించక పోతే కొండ మీదనుంచి క్రిందకు పడే అవకాశం ఉంది. వారి పట్టుదలే వారిని కొండ పైకి చేర్చింది.

ధ్యానంలో కూడా ఇటువంటి పట్టుదల ఉండాలి. కొండను తాళ్లతో, పెద్ద మేకులతో మీదకు ఎక్కుతున్నట్టు మనం మన సాధనను సాగించాలి. ఎక్కడైనా మన ప్రగతికి నిరోధం వస్తే, వాళ్ళు లోలకం వలె వేళ్ళాడినట్టు, మన మొక ప్రణాళిక చేసుకొని దానిని అధిగమించాలి. మన బాధ్యత కృషి చేయడమే. తక్కినది దేవుడి మీద భారం వేయాలి. దేవుడు మన దీక్షను, పట్టుదలను మెచ్చితే, మన సమస్యకు పరిష్కారం దొరుకుతుంది.

సెయింట్ తెరెసా ఆఫ్ ఆవిలా 16 వ శతాబ్దంలో స్పైన్ దేశంలో ఉండేది. ఆవిడ అనేక మత పరమైన సంస్థలను ఎంత దూరమున్నా, వాతావరణ పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా, బహు దూరం ప్రయాణించి ప్రారంభించేది. దానికి ఇతర శాఖల వారు అడ్డం వచ్చినా వారితో ఆమె సామరస్యంతో వ్యవహరించేది. ఒకమారు ఆవిడ ఫ్లూ జ్వరంతో మంచాన పడింది. చలికాలం మధ్యలో ఆమెను ఒక క్రొత్త సంస్థను ప్రారంభించమని అడిగేరు. ఆమె ఫ్లూ జ్వరంతో దేవుని ప్రార్ధించగా ఆమెలో ప్రత్యక్షమైన దేవుడు "నేను నిజమైన వెచ్చదనం ఇచ్చేవాడిని; నీకెందుకు భయం" అన్నాడు.

సెయింట్ తెరెసా గుర్రం బగ్గీ ఎక్కి సుదూర ప్రయాణం సాగించింది. ఒకచోట నది నిండుగా పారుతోంది. దాన్ని దాటడానికి ఒక ఇరుకైన వంతెన మీదనుంచి బండి వెళుతోంది. ఆమె ప్రయాణిస్తున్న బండి ప్రక్కకు వంగి ఆమె బండిలో౦చి బయటకు విసర బడింది. ఆమె వంతెనను పట్టుకొని వేలాడుతోంది.

ఆమె "భగవంతుడా, నాకున్న అస్వస్థతో పాటు ఈ కష్టాన్ని ఎందుకిచ్చేవు?" అని ప్రార్ధించింది.

ఆమె చేతన మనస్సు లోతులలో భగవంతుని సమాధానం వినబడింది "నువ్వు బాధపడుకు. నేను నా మిత్రులను ఇలాగే చూస్తాను".

"దేవుడా, అందుకే కాబోలు నీకు ఇంత తక్కువ మంది మిత్రులు ఉన్నారు" అని అనుకొంది.

దేవుని కృపతో ఆమె తన లక్ష్యాన్ని నెరవేర్చుకొంది.

తెరెసా గొప్ప సెయింట్. అందుకే భగవంతుడు ఆమెకు ఎక్కువ బాధ్యతను ఇచ్చేడు. మనలాంటి సామాన్యులను కుటుంబ పరమైన లేదా సామాజిక పరమైన అంశాలలో తన నామ స్మరణ చేసుకోమని మాత్రమే కోరుతాడు. మనలో చాలా మందికి అది ఒక పెద్ద సవాలు. 163

Eknath Gita Chapter 9 Section 8

Bhagavat Gita

9.8

మహాత్మానస్తు మాం పార్థ! దైవీం ప్రకృతి మాశ్రితాః {9.13}

భజం త్యనన్యమనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయమ్

పార్థా! మహాత్ములైనవారు దైవీ ప్రకృతిని ఆశ్రయించినవారై, ఆదియు, అవినాశియునైన నన్ను తెలిసికొని, అనన్య చిత్తముతో భజించుచున్నారు

మన మనస్సు సాధారణంగా పరిపరి విధాలుగా పోతుంది. పండగల వచ్చినపుడు వస్తువులు కొనడానికి బజారుకి వెళ్ళి ఇది కొందామా, అది కొందామా అని తర్జన భర్జన పడుతూ ఉంటాం. అలాగే కొన్నిరోజులు వీణ నేర్చుకొని దానిలో క్రొత్తదనము లేదని వీణ వాయించడం మానేస్తాం. ఈ విధంగా మనస్సు చంచలంగా ఉంటే జీవితంలో ఏమీ సాధించలేము. క్రొత్తవాటికి ఒక పరిమితి ఉంటుంది. మనము నూతన విషయాలకై సదా పరిగెడుతూ ఉంటే, దేనిలోనూ ప్రావీణ్యం రాదు.

అలా కాకూడదు అని అనుకొంటే, ఒకే విషయం మీద ఏకాగ్రత పెట్టాలి. మన విసుగు, మానసిక బాధ మన మనస్సులో కలిగే భావాల వలననే కాని బాహ్య ప్రపంచము వలన కాదు. వీణ నేర్చుకోవడం మొదలుపెట్టి, దాని మీద ఏకాగ్రత లేకపోవడంవలన వదిలేస్తాం. వీణ స్వతహాగా ఉత్తేజ పరిచేది, విసుగు కలిగించేది కాదు. దానిని వాయించడానికి కావలసిన ఏకాగ్రత, ఉత్సాహం ఉండాలి. ఈ విధంగా మనస్సును ఒకే విషయంపై కేంద్రీకరిస్తే, మనం చేసే ప్రతి కర్మ సంతృప్తి కరంగా ఉండి, మంచి ఫలం ఇస్తుంది.

చిన్నప్పుడు పాఠశాలలో మా ఉపాధ్యాయుడు ఒక భూతద్దాని సూర్యుని వైపు పెట్టి, దాని ముందు కొన్ని కాగితాలను పెట్టి, వాటిని మండేటట్టు చేసేడు. అప్పుడు తెలిసింది సూర్యుని కిరణాలను భూతద్దం కాగితంపై కేంద్రీకరించి౦దని. అలాగే మన మనస్సు, ఆలోచనలు కూడా సూర్య కిరణాలు, భూతద్దం వలె పనిచేస్తాయి.

ధ్యానంవలన మన మనస్సును, ఆలోచనలను నియంత్రింప వచ్చు. సాధారణంగా మనస్సు అనేక విషయాలపై పరుగులెడుతూ వుంటుంది. దాని వలన ఉపయోగం లేదు. మనస్సును ఒకానొక విషయంపై కేంద్రీకరించినప్పుడే శుభ ఫలితాలు వస్తాయి. కానీ మనస్సును కేంద్రీకరించడం ఎలా?

ధ్యానంలో ఆలోచనా పరంపరలను తగ్గించుకోవాలి. ఒకానొక ఆలోచనను పట్టుకొని దాని మీద శ్రద్దతో మనస్సు నిలపాలి. క్రమంగా మన ఆలోచనలు నెమ్మదిగా రావడం మొదలుపెడతాయి. దాని వలన మనలోని వొత్తిడి, ఘర్షణ తగ్గుతుంది. ఇలాగ కొన్నేళ్ళు సాధన చేస్తే మన మనస్సును, బాహ్యంగా లేదా అంతర్గతంలో కానీ ఎటువంటి ఘర్షణలు ఉన్నా శాంతంగా, స్పష్టంగా, ఏకాగ్రతతో ఉంచుకోవచ్చు.

ఆలోచనల పరంపరను నెమ్మది చేయడం ధ్యానంలో చాలా ముఖ్యాంశం. వస్తున్న ప్రతి ఆలోచనను బుద్ధితో పరిశీలించి, అది చెడ్డదయితే విడనాడి, మంచిదయితే దానిమీద దృష్టి కేంద్రీకరించాలి.

మన మనస్సు అన్ని దిక్కులకూ పోతూ వుంటే మన ఆలోచనా శక్తి వృధా అవుతుంది. అదే మనస్సు ను ఒకే విషయము మీద కేంద్రీకరిస్తే మన ఆలోచనా శక్తిని సద్వినియోగం చేస్తాము. ఉదాహరణకి మనం విచారంగా ఉంటే చాలా శక్తి వృధా అవుతుంది. అనేకమంది గూర్చి ఆలోచించి, వారిని ఒకరితో ఒకరిని పోల్చి, మన ప్రణాళికలకు ఎవరు ఆటంకం కలిగిస్తున్నారని విశ్లేషణం చేస్తూ ఉండి, మన మీద మనమే జాలి పెంచుకుంటూ ఉంటే ఆలోచనా శక్తి వృధా అవుతుంది.

మా ఇంటిలో చలికాలంలో వేడికై కర్రలను నిర్ణీత ప్రదేశంలో మండించేవారము. నేను దానికై అనేక కర్రలను వాడవలసి వచ్చేది. అందుకు నేను ఒక పెద్ద కర్రల పోగును పెట్టేవాడిని. నా మిత్రుడు మా ఇంటికి వచ్చినపుడు అది చూసి, అన్ని కర్రల బదులు ఒక దుంగను వాడమని సలహా ఇచ్చేడు. దానిని పాటించి తెలుసుకొన్నదేమిటంటే అనేక కర్రల పోగుక౦టే, కొన్ని దుంగలే మేలు. దుంగలలో అత్యంత ఉష్ణ శక్తి కేంద్రీకరించబడి, వాటిని మండించినపుడు కావలసినంత ఉష్ణమే విడుదలవుతుంది. మన చైతన్యం కూడా ఒక దుంగ లాంటిదే. మన ఆలోచనలను విచ్చలవిడిగా పోనిస్తూ ఉంటే, దాని వలన ఏమీ లాభం లేదు. దాన్ని తెలుసుకోవాలంటే బజారులో ఏమీ కొనకుండా ఒక మారు నడిచిచూడండి. మన ఆలోచనలు, ఇంద్రియాలు అనేక కోర్కెలతో నిండి ఉంటాయి. అదే ఒక విషయం మీద ఏకాగ్రతతో పని చేస్తే మన ఆలోచనా శక్తి వృధా అవ్వదు. 159

Eknath Gita Chapter 9 Section 7

Bhagavat Gita

9.7

అవజావంతి మాం మూఢా మానుషీ౦ తమ మాశ్రితాం {9.11}

పరం భావ మజానంతో మమ భూతమహేస్వరమ్

సర్వ భూత మహేశ్వరుడగు నా వైభవమును తెలియని మూఢులు మానవ దేహమును ఆశ్రయించిన నన్ను అలక్ష్యము చేయుచున్నారు

మోఘాశా మోఘకర్మణో మోఘజ్ఞానా విచేతనః {9.12}

రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీ౦ శ్రితాః

వ్యర్థములైన కోరికలు గలవారు, వ్యర్థమైన కర్మల నాచరించువారు, అజ్ఞానులు, అవివేకులు మోహ సంబంధమైన ఆసురీ ప్రకృతిని పొందుచున్నారు ఀ

ఇక్కడ శ్రీకృష్ణుడు కొందరిని మూఢులని చెప్పుచున్నాడు. అట్టివారు జీవితమును పైపైనే చూసి, సుఖానుభవమునకై వస్తువులను కాంక్షిస్తారు. వారు మేధతో ఆలోచించలేరు. జీవితమంతా ఇంద్రియ సుఖాలకి, వస్తువులను పోగుచేసుకోవటానికి వ్యచ్చి౦చి దేహంతో తాదాత్మ్యం చెంది, జీవితాన్ని వ్యర్థం చేసుకొంటారు. దాని వలన ఎటువంటి సంతృప్తి ఉండదు. భౌతిక ప్రపంచం పరిమితమైనది; సదా మార్పు చెందునది. జీవితాన్ని పైపైనే బ్రతుకుతే ఇతరుల మేలుకై పాటుపడరు. ఇటువంటివారు, వారి ఉద్దేశాలు మంచివైనప్పటికీ, ఇతరులకు హాని కలిగించే కర్మలు చేయవచ్చు.

ఉదాహరణకి కొందరు ఎక్కువ ఉత్పత్తి చేసి, దానిని వినియోగించి తమ గమ్యాన్ని చేరాలని తలుస్తారు. శ్రీకృష్ణుడు దానిని మోఘాశా మోఘకర్మణో అంటాడు. అనగా "వ్యర్థమైన ఆశలు, వ్యర్థమైన కర్మలు". ఎవరైతే లాభానికై ఉత్పత్తి చేస్తూ, ఆనందానికై వస్తువులను వినియోగిస్తూ ఉంటారో వారు చివరకు నిరాశా నిస్పృహలు పొందుతారు. పెద్ద పెద్ద సంస్థలు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక వస్తువులను తయారు చేస్తూ, గ్రహించినదేమిటంటే మన భూమికున్న వనరులు పరిమితమైనవని. యోగులు వనరుల గురించి కాక, వాటిని ఉపయోగించు విధానము వ్యర్థమని చెప్పుచున్నారు.

సామాన్య జీవితము ఆనందదాయకము. సామాన్య జీవితమనగా పూర్వ కాలం లాగా విద్యుత్తు లేక, మోటార్ వాహనాలులేక బ్రతకడం కాదు. సామాన్య జీవితం ఎక్కువ సృజనాత్మకత, ఆచారణాత్మకత కూడి ఉంటుంది. అది వ్యక్తుల లక్షణాలను ముఖ్యముగా చూసి, కుటుంబంతోనూ, మిత్రులతోనూ, సమాజంతోనూ దృఢమైన బంధాలు ఏర్పరిస్తుంది.

నేటికాలంలో నివసిస్తున్న దంపతులకు అన్నీ వేర్వేరుగా ఉంటాయి. వాళ్ళకు రెండు వాహనాలు, వేర్వేరు పడక గదులు మొదలగునవి ఉండాలి. ఎందుకంటే వారి మధ్య సామరస్యం లేదు. అలాగే వారు తమ జీవితంలో మంచి ఎన్నిక చేసికోలేరు. ఇంటికి ప్రతీ సంవత్సరం క్రొత్త హంగులు చేయాలి; క్రిందటేడు కొన్న వాహనాన్ని అమ్మి క్రొత్త వాహనాన్ని కొనాలి వగైరా. కొన్నేళ్లలో వాళ్ళు తెలిసికొనేది జీవితం క్లిష్టమైనదని; దానివలన సంతృప్తి లేదని.

కొన్ని జాపనీస్ ఇళ్ళు చాలా సామాన్యంగా ఉంటాయి. అవి చాలా అందంగాకూడా ఉంటాయి. మనమెంత వస్తువులను పోగుచేసుకొంటామో, అంత వ్యధ ఉంటుంది. ఎందుకంటే అవి మనకి, మన సంతృప్తికి మధ్య అవరోధంగా ఉంటాయి.

మన ఇష్టాలకై, విధేయతకై, క్రియలకై సమయాన్ని ఎంత ఎక్కువ వెచ్చిస్తే బ్రతకడానికి అంత తక్కువ సమయం ఉంటుంది. సామాన్య జీవన మనగా నిరాశగా బ్రతకడం కాదు; మన సమయాన్ని, ఏకాగ్రతను ముఖ్యమైన పనులు చేయడానికే వ్యచ్చి౦చడం. అలాగే తలిదండ్రులు పిల్లలతో ఎక్కువ కాలం గడిపి వాళ్ళను సమాజానికి ఉపయోగకరమైన వ్యక్తులుగా తీర్చి దిద్దాలి. మిత్రులతో అభిమానంగా, విశ్వాసంతో ఉండాలి. ముఖ్యంగా వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోవాలి. మనకు బాగా తెలిసిన మిత్రుడు మనకు తీరని నష్టం కలిగిస్తూ ఉంటే వానిని నేర్పుతో హెచ్చరించాలి. అటువంటి బంధాలు చాలా సమయాన్ని తీసికొంటాయి. మనం ఒక వ్యక్తి గురించి పూర్తి అవగాహన ఒక్క రోజులో పొందలేము. దానికై కృషి చెయ్యాలి. రోజులో 8 గంటలు పనిచేసి, మిగతా సమయం టివి దగ్గర, వంటయింట్లో లేదా షాప్ లలో గడుపుతే మైత్రికి సమయం ఎక్కడ? కానీ మన జీవితాన్ని సామాన్యంగా మార్చుకొంటే, మన౦ బంధు మిత్రులతో ఎక్కువ కాలం గడిపి, నిత్యం ఉత్సాహంగా ఉంటాము. 156

Family Photos

Marriage Photo Amma Pellikooturu Amma, Satya, Self ...