Tuesday, April 5, 2022

Eknath Gita Chapter 2 Section 24

Bhagavat Gita

2.24

యామిమాం పుష్పితాం వాచం ప్రవద స్త్వవిపశ్చితః {2.42}

వేదవాదరతాః పార్థ నాన్య దస్తీతి వా దినః

కామాత్మానః స్వర్గపరా జన్మకర్మ ఫల ప్రదా౦ {2.43}

క్రియావిశేషబహుళా౦ భోగైశ్వర్యగతిం ప్రతి

భోగైశ్వర్య ప్రసక్తానాం తయా అపహృత చేతసామ్ {2.44}

వ్యవసాయాత్మికా బుద్ధిః సమాధౌ న విధీయతే

పార్థా! వేదవాదముల యందు రమించువారును, కామ్య కర్మలే అధికములని వాదించువారును, స్వర్గమే ఉత్కృష్టమైనది యని భావించి పుష్పిత వాక్కులను పలుకువారును, కోరికలతో నిండినవారును, స్వర్గాభిలాషులును, జన్మ కర్మ ఫలముల నొసగు నదియు, భోగైశ్వర్యములు నొసగునదియునగు వివిధ కార్యములను శ్లాఘించువారును నగు అట్టివారి పుష్పితవాక్కులకు అవశులై ఎవరు భోగైశ్యర్యముల యందు అభిలాషను కలిగి యుందురో అట్టివారికి సమాధియందు నిశ్చయాత్మకమైన బుద్ధి యుండదు

గీత ఇది సమ్మతం, అది నిషేధం అని చెప్పదు. శ్రీకృష్ణుడు చెప్పేది మీకు ఆనందం, భద్రత, జ్ఞానం కావాలంటే నేను చెప్పిన మార్గంలో నడవమని. అలాగే విచారం, అభద్రత, దుఃఖం కలిగే మార్గం వేరే. ఈ రెండు మార్గాల సూచనలు ఇచ్చి, భగవంతుడు మనలను ఎన్నిక చేసుకొమ్మన్నాడు.

ఈ శ్లోకాలలో శ్రీకృష్ణుడు సమాధి పొందలేనివారి గూర్చి చెప్తున్నాడు. ఎవరైతే దేవుడు లేడు, జీవితం తిని, తాగి, ఆనందంగా బ్రతికి, చివరికి మరణించడమే అని తలచేవారు సమాధి స్థితికి చేరలేరు. నాకు ఆశ్చర్యం కలిగించే విషయం: ఒకడు నాస్తికుడు అని చెప్పుకోడానికి, అనుభవం ఉండాలి. మన మనస్సులో దేవుడు లేడు అని చెప్పడానికి, దాన్ని ముందు పరిశీలించ గలగాలి. నేను నాస్తికులను అడిగేది: "మీరు మిమ్మల్ని నమ్ముకోరా?" దానికి వారు ఇచ్చిన సమాధానం "తప్పకుండా". "అంటే మీరు దేవుడ్ని నమ్ముతారు" అంటాను. గీత ఈశ్వరుడు, భగవంతుడు అనే పద ప్రయోగం చేసేది, వారు ఎక్కడో "అల వైకుంఠ పురములో, నగరిలో" అన్నట్టు లేరు. వారు మన మనలోనే నిక్షిప్తమై ఉన్నారు.

మన హృదయం స్వార్థంతో, మన౦ ఇంద్రియలోలత్వంతో, ఉన్నప్పుడు సృష్టి యొక్క కార్యకలాపాలు భగవంతుడు చేస్తున్నాడని తెలిసికోలేం. దీన్నే శ్రీకృష్ణుడు కామాత్మనాః అన్నాడు. అనగా -- ఎవడి మనస్సయితే కామ సంకల్పాలతో నిండి ఉందో. శ్రీ రామకృష్ణ ఒకనిలో రాముడు, కాముడు కలిసి ఉండలేరు అని చెప్పేవారు. అది మనలో చాలామందికి అంతుబట్టదు. ఆధ్యాత్మిక సాధన చేస్తే వాటి గురించి తెలిసి, కాముడుని వదిలించుకుంటాం. ఈ నేపథ్యంలో మనము ధ్యానం చేస్తున్నప్పుడు గతంలో మనం కోరుకున్నవి మనస్సుకు వచ్చినా ఆందోళన చెందనక్కరలేదు. మన౦ ధ్యానంతో గాఢమైతే కోరికలను జయించవచ్చు. ఒక్కొక్కప్పుడు బలమైన కోరిక పందికొక్కువలె మన మనస్సును దొలిచెయ్యవచ్చు. అప్పుడు మనం నిశ్చలంగా ఉండి దానిని కనిపెట్టుకొని ఉండాలి. మనము కోరికలతో తాదాత్మ్యం చెందనంత వరకూ భద్రతతో ఉంటాము. కానీ సుదీర్ఘ కాలంలో, గతంలో కలిగిన కోర్కెలు మనస్సుని ఆక్రమించుకొంటే, పాత సంస్కారాలు మనస్సుని చంచలం చేస్తే, నేను ఇచ్చే సలహా మంత్ర జపం. 93

No comments:

Post a Comment

Reflection Symmetry of Mainstream Science and Mainstream Media

Dwelling more on symmetry and Arthanaareeswara, a scientific point of view is available with several references https://pmc.ncbi.nlm.nih.g...