Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 21

Bhagavat Gita

6.21

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి {6.30}

తస్యాహం న ప్రణశ్యామి స చ మే ప్రణశ్యతి

ఎవడు నన్ను సర్వభూతముల యందును, సర్వభూతములను నా యందును గాంచుచున్నాడో అట్టి వానికి నేను ప్రత్యక్షమే, నాకు వాడు ప్రత్యక్షమే

శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఎవరైతే దేవుని అన్ని జీవులలోనూ దర్శిస్తారో; ఇతరులు తమకేమి చేసినా, వారిని గౌరవంతో చూస్తారో, వారికి ఎన్ని అవాంతరాలు వచ్చినా దేవుని రక్షణను పొందుతారు. దేవుని అన్ని జీవులలోనూ చూస్తే, మనం సమతా దృష్టి కలిగి ఉంటాము.

మనకు సమస్యలు ఎదురైనప్పుడు మంత్ర జపం ఉత్తమం. నిద్రకు ఉపక్రమించే ముందు మంత్ర జపం చేస్తూ పడుకోవాలి. దానివలన మరుసటి రోజు ఆహ్లాదంగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరించ గలిగే శక్తిని పొందుతాము. నాకు వందలాది మందిని ధ్యాన మార్గంలో నడిపించే బాధ్యత ఉంది. అది కొన్నేళ్ళగా చేస్తూ, ప్రతి రాత్రీ నిద్ర పోయేముందు, నా బాధ్యతలను దేవునికి అప్పజెప్తాను. మంత్ర జపం నిద్రలో కూడా వినబడుతూ ఉండి, దేవుని దర్శిస్తూ ఉంటాను. మరుసటి రోజు దేహం, మనస్సు ఉత్తేజితమై ఉత్సాహంతో కర్మలు చేస్తాను. ఎందుకంటే నా బరువును దేవుని పాదాలముందు వేసేను కాబట్టి. 374

No comments:

Post a Comment

Viveka Sloka 35 Tel Eng

Telugu English All శ్రోత్రియోఽవృజినోఽకామహతో యో బ్రహ్మవిత్తమః । బ్రహ్మణ్యుపరతః శాంతో నిరింధన ఇవానలః ।| 34 || అహేతుకదయాసి...