Bhagavat Gita
2.41
ధ్యాయతో విషయాన్ పుంస స్సంగస్తేషూస జాయతే
{2.62}
సంగా త్స౦జాయతే కామః కామా త్క్రోధో అభిజాయతే
క్రోధా ద్భవతి సమ్మోహః సమ్మోహో త్స్మృతి విభ్రమః
{2.63}
స్మృతిభ్రంశా ద్బుద్ధినాశో భుద్ధినాశా త్ప్రణశ్యతి
పురుషుడు శబ్దాది విషయములను చింతించుట
చేత వాని యందు అతనికి సంగత్వము కలుగుచున్నది.
సంగత్వము వలన కోరిక కలుగుచున్నది. కోరిక
వలన క్రోధము పుట్టుచున్నది. క్రోధము వలన
మోహము కలుగుచున్నది. మోహము వలన
విస్మృతి కలుగు చున్నది. విస్మృతి వలన
బుద్ధి నశించు చున్నది. బుద్ధి నశించుట
చేత మనుజుడు తానే నశించు చున్నాడు.
తన స్వీయ చరిత్రలో గాంధీ మహాత్ముడు
ఈ శ్లోకం గురించి పెద్ద వివరణ ఇచ్చేరు.
వాటివలన ఆయన తన ఇంద్రియాలను
నిగ్రహించు కోగలిగేరు. నా అనుభవం
కూడా అలాటిదే. ఈ శ్లోకాలు
మనను నిందించడానికి కావు. వాటి
ఉద్దేశ్యము మనలోని ప్రేమ, జ్ఞానము,
నిస్వార్థ కర్మ మేల్కొలిపి వాటిని
స్వాధీనంలో ఉంచుకోవడం.
ధ్యాయతో విషయాన్ పుంస అంటే --
ఇంద్రియ లోలత్వం. ఉదాహరణకు
కొందరు శృంగార భరితమైన
పుస్తకాలను చదవుతారు. మనలో
చాలామందికి ఈ బలహీనత
ఉంది. మనం దేహంతో తాదాత్మ్యం
చెంది, ఇంద్రియాలకు లొంగి ఉంటే
ప్రేమను పొందగలము, ప్రేమను ఇవ్వ గలము,
సౌందర్యముతో కూడి ఉండగలము,
తృప్తిని పొందగలము అని అనుకొంటాం.
నేను సంస్కృత, ఆంగ్ల పుస్తకాలు
చదివి తెలిసికొన్నదేమిటంటే
శృంగారాన్ని ఒక్క చెడు పదం వాడకుండా
వర్ణించవచ్చు. నేనీమధ్య సత్యజిత్
రే దర్శకత్వం చేసిన శృంగార భరిత
సినిమాను చూసేను. అందులో
నాయకీ నాయకులు వ్యంగ్యంగా
ఒకరినొకరు ముద్దు పెట్టుకొని
లేదా కౌగలించుకొని నటించ లేదు.
ఆ సినిమాలో శృంగారం అతి సున్నితంగా,
గంభీరంగా చూపబడినది. మన
స్మృతులలో ఉన్న పెద్ద రహస్యం
శృంగారాన్ని పరిచయం చేస్తారు గాని
దాన్ని అదేపనిగా వర్ణించరు.
మనం ప్రసార మాధ్యమాల విషయంలో
మనను మభ్యపెట్టే ఊహలు, సమాచారము
పట్టించుకోకూడదు. పత్రికలను
విచక్షణతో చదవాలి. వాటిలో
ఇతరులపై అపనిందలు చేసి, వారిని మిక్కిలి నిర్దయతో
వర్ణిస్తారు.
నా భార్య నేను సినిమాల సమీక్షలను
దినపత్రికల్లో చదివి గొప్ప విమర్శకుడునని
అనుకొంటుంది. ఒక్కొక్కప్పుడు సమీక్షలు
బాగా ఉన్న సినిమాలకు వెళ్ళి తీరా
చూస్తే వాటిలో పచ్చి శృంగారాన్ని
చూపించేవారు. ఆ సన్నివేశాలు వచ్చినపుడు
నేను కళ్ళు మూసుకొని మంత్రం జపించు
కొనేవాడిని. మనము ఆధ్యాత్మిక
సాధనలో అప్పుడే మొదలపెడితే
అటువంటి సినిమాలు
ఇంద్రియాలను ఉద్రేక పరిచి సాధనకు అవరోధాలు
కలిగిస్తాయి. శృంగార సన్నివేశాలు
మన అచేతన మనస్సులో ముద్రింపబడి
రాత్రి కలల్లోకి వస్తాయి. ప్రకటన
కర్తలకు, సినిమా నిర్మాతలకు ఉద్రేక
పరిచే శృంగార సన్నివేశాలు
ప్రజలు ఆదరిస్తారని తెలుసు.
సంగస్ తేషూ పజాయతే: మనము
దేని గురించై ఎక్కువ చదువుతామో,
ఎక్కువ చూస్తామో, ఎక్కువ వింటామో,
మనమెంత నియంత్రించినా, మనలో
ఒక బీజాన్ని నాటి మొలకెత్తిస్తాయి.
సంగాత్ సంజాయతే కామాః --మనకు
పై చెప్పిన విషయాలు అనుభవించాలనే
కోరిక కలుగుతుంది. అవి అచేతన
మనస్సులో ఉండి, మనను అప్రయత్నంగా
ప్రభావితం చేస్తాయి.
ఇక్కడ గీత నీతి, మతపరంగా బోధ
చెయ్యటం లేదు. పతంజలి కూడా
ఇలాగే చెప్తారు. మనకు ఒక
వస్తువు లేదా అనుభవానికై కోరిక
కలిగితే, దానిని తీర్చుకొంటే, అది
క్షణిక సుఖాన్ని మాత్రమే ఇస్తుంది.
గీత ఇరువురి మధ్య ప్రేమను లేదా శృంగారాన్ని
వ్యతిరేకరించటం లేదు. వారి అనుబంధంలో
కలిగే ఇంద్రియ సుఖాలు వారికి సంతృప్తి
నిస్తాయని తప్పుగా భావిస్తారు. కోరిక
మన సంబంధాలకు మంచిదే. మన
అనుబంధం భౌతిక పరంగా ఉంటే
"ఎందుకు ఆరు నెలల క్రితం నేనీ
వ్యక్తితో జన్మ జన్మల బంధం కోరేను,
ఇప్పుడు ఒక వారం కూడా కలిసి
బ్రతకలేకున్నాను?" అనే అనుమానాలు
వస్తాయి. మనలోనూ, మనం కోరే
వ్యక్తిలోనూ ఎటువంటి లోపం లేదు.
మన కోరిక క్రమ క్రమంగా నశించింది.
ఇంద్రియాలతో ముడిపడిన
కోరిక కొన్నాళ్ళకు క్షీణించి,
అంతంఅవుతుంది.
మనలో చాలామందికి కోర్కెలు స్వాధీనంలో
ఉండవు. ఉపనిషత్తులు మన కోర్కెలను
నియంత్రించగలిగితే, మన విధిని
నిర్ణయించవచ్చు అని చెప్తాయి. కఠోపనిషత్తు ఇలా చెప్పింది:
ఆత్మ రథాన్ని అధిష్టించేది , దేహం రథము
విచక్షణ రథ సారథి, మనస్సు కళ్ళెం,
ఇంద్రియాలు గుర్రాలు; కోరికలు వారు పయనించే మార్గాలు.
ఋషులు చెప్పేది: తప్పుగా ఆత్మని దేహము, మనస్సు, ఇంద్రియాలతో పోలిస్తే,
అది సుఖదుఃఖాలను అనుభవిస్తునట్టు ఉంటుంది.
ఒక వ్యక్తికి విచక్షణా జ్ఞానము లేకపోతే, మనస్సు స్వాధీనంలో లేకపోతే, ఇంద్రియాలు
గమ్యంలేని గుర్రాలవలె అటునిటు పరిగెడితే, కళ్ళెంతో వాటిని స్వాధీనంలో పెట్టుకోవచ్చు
కానీ వానికి విచక్షణా జ్ఞానంఉండి, మనస్సుని కేంద్రీకరించగలగాలి.
విచక్షణా జ్ఞానము లేకపోతే, ఆలోచనలు స్వాధీనంలో లేకపోతే, ఆలోచనలు శుద్ధంగా లేకపోతే,
అమృతత్వాన్ని పొందక, ఒక మరణ౦ నుంచి మరొక మరణానికి మారుతూ ఉంటాడు.
కానీ విచక్షణా జ్ఞాన మున్నవాడు, మనస్సు నిశ్చలం చేసికొని
ప్రయాణం చివరకు వస్తాడు, ఎప్పటికీ మృత్యుబారిన పడడు
రథ సారథి అయ్యి, మనస్సును కళ్ళెంతో చాకచక్యంగా నడిపి,
జీవిత లక్ష్యాన్ని చేరుతాడు, పరమాత్మతో ఏకమౌతాడు
ఇంద్రియాలతో ఎంత ఎక్కువ తాదాత్మ్యం
చెందితే, వాటివలన అంత తక్కువ ఆనందం
పొందగలము. ఆనందం ఎంత తక్కువగా
వస్తే, ఇంద్రియాలతో అంత ఎక్కువగా
తాదాత్మ్యం చెందుతాము. ఇదే
భౌతిక బంధానికే పరిమితమైన ఇద్దరి మధ్య
కలహాలు సృష్టిస్తుంది. వారి మధ్య
బంధం క్షీణించి, విడిపోయే
ప్రయత్నం చేస్తారు. వారి మధ్య
ద్వేషం పెరిగి, బంధం చెడుతుంది.
గతంలో ఆమె చేసిన ప్రతి
క్రియ ఆనందం కలిగిస్తే, ఇప్పుడు
అది జుగుప్స కలిగిస్తుంది. ఈ విధంగా
భౌతిక పరమైన బంధాలు
చెడుతాయి.
ఈ విధమైన ద్వేషం, క్రోధం మన మనస్సులో
నాటుకుపోయి, మనను ప్రలోభ పరుస్తాయి.
క్రోధాద్ భవతి సమ్మోహః -- క్రోధం
నుండి భ్రాంతి కలుగుతుంది. మనము
ఇతరులు చెయ్యని తప్పులు వారిపై
ఆరోపిస్తాము; వారు చెయ్యని పనులు
చేసేరని నిందిస్తాం. సమ్మోహాత్
స్మృతిభ్రమః -- మనము మన తప్పులను
విశ్లేషించే జ్ఞానాన్ని కోల్పోతాము.
మనందరమూ తప్పులు చేస్తాము.
వాటి నుండి పాఠాలు నేర్చుకొంటే
మనము అపరాధులమనుకోనక్కరలేదు.
క్రోధం వలన విచక్షణా జ్ఞానం పోతుంది.
ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అరుదుగా
వాడబడే పద ప్రయోగం చేస్తాడు:
స్మృతిభ్రంశాద్ బుద్ధినాశో
బుద్ధినాశాత్ ప్రణశ్యతి: ఒక వ్యక్తి
చేసిన తప్పులనుండి పాఠాలు
నేర్చుకోలేకపోతే, విచక్షణా
జ్ఞానం కోల్పోతే వాని జీవితం వృధా.
అటువంటి వ్యక్తి జీవితంలో
దుఃఖితుడై, పరులకు కూడా
దుఃఖాన్ని కలిగిస్తాడు. అతడు
ఇతరుల బాగుకై ప్రయత్నించక,
పరులకు భారమై మరణిస్తాడు.
ఈ శ్లోకాలు మనకు చెప్పేది:
ఇంద్రియాలతో మనం "నేను
పరిస్థితులు ప్రతికూలిస్తే
వాటినుంచి విడివడగలను"
అని చాలా కాలం ఆటలు ఆడలేము.
ఇంద్రియాలను స్వాధీనంలో
పెట్టుకోవడం వలన మనం
ఎట్టి ఆనందాన్నీ కోల్పోము.
కానీ వాటితో తాదాత్మ్యం చెందితే
మనం ఆనందం నష్టపోతాం.
అలాగే ఇతరులకు మనకంటే
ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తే
ఆనందం కలుగుతుంది; అలా
కాక పోతే విచారం కలుగుతుంది.
యుక్త వయస్కులు భౌతిక
పరమైన బంధాలను కోరుకుంటారు.
వారికి పరస్పర అవగాహన, ప్రేమ,
గౌరవం తో కూడిన బంధం
కాల క్రమేణా కలగగలదనే
వివేకం లేదు. భౌతిక బంధాలు
ఎన్నో ప్రమాణాలు చేస్తుంది.
కానీ ఆద్యాత్మిక బంధం జీవితాంతం
ఆనందాన్ని ఇస్తుంది.
128