Bhagavat Gita
6.16
సంకల్ప ప్రభవాన్ కామాన్ త్యక్త్వా సర్వా నశేషతః
{6.24}
మనసై వేంద్రియగ్రామం వినియమ్య సమంతతః
శ్శనై శ్శనై రుపరమే ద్భుద్ధ్యా ధృతి గృహీతయా
{6.25}
ఆత్మ సంస్థ౦ మనః కృత్వా న కించదపి చింతయేత్
సంకల్పముల వలన జనించెడి ఇంద్రియములను
ఇంద్రియ విషయముల నుండి మరల్చి, ధైర్యముతో
గూడిన బుద్ధి చేత మనస్సును బాహ్య విషయముల
నుండి మెల్లమెల్లగా మరలించి ఆత్మయందు
ఉంచవలెను. ఆత్మకు అన్యమైన ఏ విషయమును
కూడా చింతింపకూడదు
ఊహాతీతమైన భద్రత, ఆనందం పొందాలంటే
స్వార్థాన్ని వీడాలి. మనలో చాలామందికి
మనస్సులోని సాలె గూడులను తొలగించడానికి
ఒక జీవిత కాలం పడుతుంది.
నా అమ్మమ్మ రోజూ పూజ గదిని చీపురుతో
తుడిచేది. ఆ గదిని నెలకి లేదా సంవత్సరానికి
ఒకమారు తుడుస్తే దుమ్ము దట్టంగా చేరి తుడవడం
కష్టమవుతుంది. అలాగే మన ధ్యానం ప్రతిరోజూ
చెయ్యాలి. దానివలన మన మనస్సులోని సంకల్పాలు
తొలగిపోతాయి. ధ్యానం చెయ్యకపోతే ఇంద్రియాలను
నిగ్రహించుకోవడం చాలా కష్టం. ఇంద్రియాలను
నిగ్రహించుకోలేక పోతే భౌతిక దేహం స్వాధీనంలో
ఉండదు; భౌతిక దేహం స్వాధీనంలో లేకపోతే
జీవైక్య సమానతను అనుభవించలేం.
దేవుడు మనల్ని ఎప్పుడు ఐక్యం చేసుకొంటాడో
అని ఎదురుచూడడం కన్నా ధ్యానం,
ఇంద్రియ నిగ్రహం, నిస్వార్థ సేవ
చెయ్యడం ఉత్తమం. అందువలన మనం
చేతన మనస్సును నియంత్రించగలం.
ఆధ్యాత్మిక సాధనలో తప్పులు చేస్తే,
చిన్న చిన్న అడుగులు వేసి, తప్పులు
సరిదిద్దుకొని లక్ష్యాన్ని చేరవచ్చు.
ఒక్కొక్కప్పుడు మనము స్వార్థ పూరితంగా
ఉండి ఇతరుల అవసారాలను
గ్రహించలేము. మన తప్పులు వెంటాడుతాయి.
అలాటప్పుడు విచారింపక మంత్ర జపం
చెయ్యడం ఉత్తమం.
ఒకప్పుడు నేను మిత్రులతో కలిసి భోజనం చేస్తున్నప్పుడు,
ఇంద్రియాలను నిగ్రహించుకోలేక, అతిగా తినేవాడిని.
ధ్యానంలో శ్రీకృష్ణుడు చెప్పిన "ఎవరైతే ఇంద్రియములను
నిగ్రహించుకోలేడో,
గాలీ వానలో చిక్కుకున్న పడవవలె, ఒడ్డు చేరడు"
గుర్తుకువచ్చేది. ఆ బోధ నన్ను కత్తి పోటువలె
కలత పెట్టేది. అప్పుడు దాన్ని ఎలాగో ఒకలాగ పదే పదే
మననం చేసికొనేవాడిని. ఇంద్రియాలు
మనల్ని తప్పుడు ద్రోవలో నడిపిస్తూ ఉన్నప్పుడు,
అహంకారం బంధాలను చెడిపితే, మనకు
తాత్కాలికంగా సంతృప్తి కలిగినా, మనము
ధ్యానంలో చెయ్యవలసిన కత్తి పోటు వంటి
శ్రీకృష్ణుని బోధ గుర్తు తెచ్చుకొని, స్వార్థ
పూరిత కోరికలను విడనాడాలి.
మనస్సును స్వాధీనంలో పెట్టుకోవాలంటే
మంత్ర జపం చాలా ఉపయోగ పడుతుంది.
మనకి కోపం వచ్చినప్పుడు మనస్సును ప్రశ్నిస్తే
కోపం ఇంకా పెరుగుతుంది. మనస్సు ఒక
పెద్ద కంప్యూటరు లాంటిది. అది ఒక్కమారు
యంత్రంలా పని చెయ్యక ఆగిపోవచ్చు.
అలాగే మనస్సు క్రోధం లేదా భయంతో
ఉంటే, అది ఆత్మను ప్రభావితం చేయలేదు.
క్రోధం, భయం కలిగినప్పుడు, మంత్ర
జపం చేస్తూ, దీర్ఘంగా నడవడం
మంచిది. అలాచేస్తే క్రోధం
దయగా, భయం ధైర్యంగా, ద్వేషం
ప్రేమగా మారుతాయి.
మన అలవాట్లు చిన్నప్పుడు నుంచీ
ఉన్నా వాటిని ధ్యానంతో సరి చెయ్యవచ్చు.
అందుకే ధ్యానం చాలా శక్తివంతమైన ప్రక్రియ.
మొదట్లో కష్టం అనిపించినా, సాధన
చేసి, సంపూర్ణమైన సంతృప్తిని పొందవచ్చు.
మనలో చిన్ననాటి చెడు భావాలు
ఉండవచ్చు. వాటిని నియంత్రించడం
మన చేతులలో లేదని భావించవచ్చు.
కాని ధ్యానం తో అది సాధ్యం.
367