Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 28

Bhagavat Gita

6.28

అర్జున ఉవాచ:

{6.37}
అయతి శ్శ్రద్ధయోపేతే యోగా చ్చలితమానసః

అప్రాప్య యోగ సంసిద్ధం కాం గతిం కృష్ణ గచ్ఛతి

కృష్ణా! శ్రద్ధగలవాడయ్యును, ప్రయత్నము సరిగ చేయనందున యోగము నుండి చలించిన మనస్సు గలవాడైన మనుజుడు యోగసిద్ధిని పొందనపుడు వాని గతి ఏమి?

అర్జునుడు మనందరి అనుమాలను ప్రతిబింబిస్తున్నాడు. "కొన్నాళ్ళు ఆధ్యాత్మిక సాధన చేసి, అటు పిమ్మట గాడి తప్పితే, చేసిన సాధన అంతా వ్యర్థమా?" అని అర్జునుడు అడుగుతున్నాడు.

కొన్నాళ్ళు ధ్యానం చేసి, దానివలన పొందగలిగే ఫలాలు చవి చూస్తాము. ఇంద్రియాలను నియంత్రించి, ఆనందాన్ని పొందుతాము; అహంకారాన్ని జయించి బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పరుచుకుంటాము. ఇలాగ చవి చూసి, ధ్యానాన్ని విరమిస్తే, దానికి సరితూగే దేమీలేదని తెలుసుకొంటాము. మనము భోగాలు, సుఖాలకు అలవాటుపడినా మన అంతరాత్మ "నీవు ఆధ్యాత్మిక పథాన్ని విడనాడేవు" అని చెప్తుంది.

నేటి కాలంలో చాలా మంది మాదక ద్రవ్యాలతో ధ్యానం చేస్తున్నారు. సాధువులు గంజా మొదలగు ద్రవ్యాలను వాడుతారనే అభియోగం, దుష్ప్రచారం ఉన్నాయి. అది పెద్ద అబద్దం. మెహర్ బాబా మాదక ద్రవ్యాలు ఆధ్యాత్మికతను పెంపొందించలేవు; పైపెచ్చు అవి మనకున్న ఆధ్యాత్మికతను చంపుతాయి అని చెప్పిరి. అట్టి రసాయన పదార్థాలతో అడ్డ దారి త్రొక్కితే, కొన్నాళ్ళకు మనకు ధ్యానం చేసే శక్తి పోతుంది. ధ్యానం అంతర్గత ప్రయాణం. దానికై బలమైన దేహం, మంచి నాడీ వ్యవస్థ, ప్రశాంతంగా ఉండే మనస్సు, పదునైన బుద్ధి అవసరం. అవి రసాయనాల వలెనే కాక, అతిగా ఇంద్రియలోలత్వం, అహంకారం వలన క్షీణిస్తాయి. 383

Eknath Gita Chapter 6 Section 27

Bhagavat Gita

6.27

అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః {6.36}

పశ్యాత్మనా తు యతతా శక్యో అవాప్తు ముపాయతః

మనో నిగ్రహము లేనివాడు యోగసిద్ధిని బొందుట దుర్లభము. మనో నిగ్రహము కలిగి ప్రయత్నించువాడు ఉపాయము వలన పొందగలుగుట సాధ్యమని నా అభిప్రాయము

మనము ధ్యానంలో స్థితులై, శ్రీకృష్ణుని బోధను తూచ తప్పకుండా పాటిస్తే, అతనితో ఐక్య౦ నిస్సందేహంగా పొందుతాము. కానీ బద్దకంతో ఆరంభశూరులవలె ఆర్భాటంతో మొదలుపెట్టి, చివరకు పిల్లిలా తయారవుతే అట్టి ఐక్యం పొందలేము.

ఎవరైతే ఆధ్యాత్మిక సాధన పట్టుదలతో చేసి, ఎన్నటికీ దానిని విడువక చేస్తారో వారు విజయవంతులు అవుతారు. వారికి పరిగెత్తడం వీలుకాకపోతే, చిన్న చిన్న అడుగులు వేస్తారు; అదీ వీలుకాకపోతే, డేక్కుంటూ తమ లక్ష్యం వైపు ప్రయాణిస్తారు. వారికి ఎన్ని అవరోధాలు వచ్చినా దాటుకొని, కనబడిన ఊతను తీసికొని ముందుకు సాగుతారు. మొదట్లో ఈ ప్రయత్నం చాలా కష్టం. ఎందుకంటే మనము ముందు అహంకారాన్ని జయించాలి. కానీ మన లక్ష్యం పై స్థిర చిత్తులమైతే కత్తి పోట్లు చిన్న సూది పోట్లుగా మారి; సూది పోట్లు పింఛ౦తో రాసినట్లు మారుతాయి. లక్ష్యం చేరడానికి సంపూర్ణమైన అర్పణ ఉ౦టే, మనము మిక్కిలి ఆనందం పొంది లక్ష్యాన్ని సాధిస్తాము. 381

Eknath Gita Chapter 6 Section 26

Bhagavat Gita

6.26

శ్రీ భాగవానువాచ:

{6.35}
అస౦శయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్

అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే

మహాబాహో! మనస్సు చంచలము, నిగ్రహించుటకు శక్యము కానిది అనుటలో సంశయము లేదు. కానీ, కౌ౦తేయా! అభ్యాస వైరాగ్యముల చేత మనస్సు నిగ్రహింపబడుచున్నది

శ్రీకృష్ణుడు అర్జునుని మహాబాహో -- అనగా చేతులు అంతరిక్షంలోకి చొచ్చుకొని ఉన్నవాడు--అ౦టాడు. మనము మహాబాహువులు అవ్వవచ్చు. కానీ స్వార్థంతో, కోర్కెలతో, ఇతరుల అవసరాలను తెలిసికోక జీవించడం వలన అలా కాలేకున్నాము. మనమందరిని చేతులతో ఆలింగనము చేసి, వారిని శాంత పరిచి, బలపరిస్తే మన చేతులు కూడా అంతరిక్షం దాటి ఉన్నట్లే.

చేతులను అంతరిక్షంలోకి సాగించడానికి గట్టి ప్రయత్నం చేస్తేగాని సాధ్యము కాదు. దానికై ఇతరులు మనను ఎంత బాధించినా, ఓర్పుతో భరించాలి. మొదట మన కుటుంబంతో సామరస్యంగా ఉండాలి. క్రమంగా బంధుమిత్రులతో, సహ ఉద్యోగులతో, తక్కిన వాళ్ళతో సామరస్యంతో మెలగాలి.

నా అమ్మమ్మ నాకు ఈత కొట్టడం నేర్పింది. ఎలాగంటే, తనతో పాటు నీటిలోనికి ప్రవేశించి, తనను అభినయించమని శిక్షణ ఇచ్చింది. నేను మొదటిసారి నీళ్ళు మ్రి౦గి, రెండవ సారి ఆమెకు సరిగా ఈత కోట్టేను. నేడు ఈత కొట్టడ౦ నేర్పే ఉపాధ్యాయులు ఉన్నారు. వారు మొదట ఒక చిన్న కుండీలో ఉంచి నిటారుగా ఉండి చేతులు, కాళ్ళు ఆడించడం నేర్పుతారు. క్రమంగా ఒక కొలనులోకి తీసికెళ్ళి అక్కడ ఈత కొట్టడం అనేక ప్రక్రియలతో నేర్పుతారు. ఇది ఒక క్రమంతో, చిన్న చిన్న అడుగులతో కూడిన పద్దతి. అలాగే మనము ఆధ్యాత్మికతను చిన్న చిన్న మోతాదులలో అలవరచుకోవాలి. తద్వారా మన చేతులను మహాబాహువుగా చేసికొని, ఇళ్ళలో, సమాజంలో సమంగా బ్రతకగలం.

శ్రీకృష్ణుడు మనస్సును నిగ్రహించుకోవడానికి రెండు పద్దతులు బోధిస్తున్నాడు: ఒకటి అభ్యాస౦; నిద్రను౦చి లేచి ధ్యానం చెయ్యాలి; మనమలాగ రోజూ చేస్తే ధ్యానంలో పరిపక్వత పొందుతాము; రెండవది వైరాగ్యం; క్రోధం, అసూయ మనకున్న బలహీనతలు; వాటికి దాసోహమనేకంటే, మనం ఇతరుల సానుకూలతకై కోరక ఉండాలి. ఇతరులు మనము కోరినట్లు స్పందించకపోతే, దానివలన కలిగే నిరాశ, క్రోధాన్ని నియంత్రించాలి. ఈ విధంగా ధ్యానం చేసి, అహంకారాన్ని దూరం చేసికొంటే మనము శ్రీకృష్ణునే పొందగలము. 381

Eknath Gita Chapter 6 Section 25

Bhagavat Gita

6.25

చంచలం హి మనః కృష్ణ ప్రమాథి బలవ ద్ధృఢమ్ {6.34}

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్

కృష్ణా! మనస్సు చంచలమైనది; క్షోభపెట్టునది; బలమైనది; ధృడమైనది. అట్టి మనస్సును నిగ్రహించుట గాలిని బంధించుట వలె దుస్సాధ్యమని నాకు తోచుచున్నది

ఇక్కడ అర్జునడు జీవిత సత్యాలు: నీవు మనస్సును స్వాధీనంలో పెట్టుకోమని చెప్పడం, గాలిని, తుపానుని నియంత్రించమని చెప్పినట్లుగా ఉంది" అ౦టాడు. నిజానికి నేను ఆలోచిస్తున్నాను అనే మాటకు అర్థం: మన౦ ప్రతీదీ ఆలోచించట్లేదు; ఆలోచనలు మనను నడుపుతున్నాయి. మనము ధ్యానం చేద్దామని కూర్చుంటే, మనస్సు తిండిమీదకి, సినిమా మీదకి పోతుంది. మనస్సు దాని కిష్టమొచ్చినట్లు ఆలోచిస్తుంది. ధ్యానం ద్వారా స్వీయ ఆలోచన మన చేతిలో లేదని తెలిసికొని, అహంకారాన్ని పారద్రోలడానికి ప్రయత్నించవచ్చు. పతంజలి ధ్యానాన్ని రాజ యోగము అంటారు: ఎలాగైతే అహంకారాన్ని జయించి, దేవుని దేహాన్ని, మనస్సును నియంత్రించే రాజుగా పట్టాభిషేకం చేసినట్లు. 378

Eknath Gita Chapter 6 Section 24

Bhagavat Gita

6.24

అర్జున ఉవాచ:

{6.33}
యో అయం యోగస్త్వయా ప్రోక్త స్సామ్యేన మధుసూదన

ఏతస్యాహం న పశ్యామి చంచలత్వాత్ స్థితి౦ స్థిరామ్

మధుసూదనా! సమత్వభావనతో కూడిన ఏ యోగమును నీవు ఉపదేసించితివో ఆ యోగము యొక్క స్థిరమైన స్థితిని మనస్సు యొక్క చంచల స్వభావము చేత నేను గ్రహింప లేకున్నాను

మధు ఒక అసురుడు--అనగా అహంకారమనబడేది. అది అన్నిటినీ ధ్వంసం చేసేది. శ్రీకృష్ణుని మధుసూదన --అనగా అహంకారాన్ని సంహరించేవాడు-- అంటారు. అర్జునుడు తనకు చంచలమైన మనస్సును నియంత్రించుకొనే శక్తి లేదని వినమ్రతతో చెప్తాడు.

ధ్యానంచేసి మనము అహంకారాన్ని నిర్మూలించేమని తలుస్తాము. కాని దాని బీజము మనస్సులో ఉండి, మరుసటిరోజు మళ్ళీ మొలకెత్తుతుంది. మనస్సును స్వాధీనం పెట్టుకోవడం హాస్యాస్పదంగా మారినా, మనము నిరుత్సాహ పడక, దానిని మలచుకొని, మన నడవడికను, విధిని మార్చుకోవచ్చు. దానికై బుద్ధి పూర్వకంగా మన క్రియలు, మాటలు, ఆలోచనలు ప్రతిరోజూ చెయ్యాలి.

శ్రీకృష్ణుడు రెండవ అధ్యాయంలో (సాంఖ్య యోగము) చెప్పినట్లుగా మనము జ్ఞానులై, నిస్వార్థ కాములై చేసే ధ్యానము పరిపక్వమవుతుంది. ఈ విధంగా భయం, ఆందోళన, విచారము లతో కూడిన ఆలోచనలను ధైర్యం, ప్రేమ, జ్ఞానముగా మార్చుకొంటాము. 378

Eknath Gita Chapter 6 Section 23

Bhagavat Gita

6.23

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున {6.32}

సుఖం వా యదివా దుఃఖం స యోగీ పరమో మతః

అర్జునా! తన యందును సర్వ భూతముల యందును కలుగు సుఖదుఃఖములను ఒకే రీతిగ సమ దృష్టితో గాంచువాడు పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయము.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన నడవడిక ఎలా ఉండాలో బోధిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే మనకేది బాధ కలిగిస్తుందో, ఇతరులకు కూడా అదే బాధ కలిగిస్తుంది.

మనమొక మిత్రుడు రాకకై ఎదురుచూస్తూ ఉండి, అతడు నియమిత సమయానికి రాకపోతే మనకు చికాకు వేస్తుంది. కానీ మనం ఉంకొకర్ని కలవడానికి ఒక గంట ఆలస్యంగా వెళితే, మనకున్న అనేక సద్గుణాలవలన క్షమింప బడతామని తలుస్తాము. ఇతరులు మన౦ చేసే తప్పులను చూసీ చూడనట్టు ఉండాలని కోరుతాం. కానీ వారి తప్పులను, బలహీనతలను ఎత్తి పొడుస్తాం.

ఆధ్యాత్మికత కలవాడు ఇతరుల తప్పులను మరచిపోయేటట్టు చేస్తాడు. అతడు తుచ్ఛమైన భావనలను వీడి, ఇతరుల అవసరాలకు అనుగుణంగా మెలగుతాడు. మనము సున్నితమైన మనస్తత్వము గలవారమని మరచి, ఇతరుల గురించి పాటుపడితే దేవుడు హర్షిస్తాడు. బుద్ధుడు ఇతరులను అర్థం చేసుకోవాలంటే: మనకు ఏది అవమానకరమో, ఇతరులకూ అది అవమానకరం అని చెప్పెను. కాబట్టి ఇతరులను దెప్పి పోడిచే మాటలు మాట్లాడకూడదు.

దుష్ట ఆలోచనలు, ద్వేష పూరితమైన ఆలోచనలు, ఇతరులను కత్తి పోటుకన్నా ఎక్కువగా బాధ పెట్టగలవు. మన మనస్సులో ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయని గ్రహించక పోవచ్చు. ద్వేష పూరిత ఆలోచనలు -- "నిన్ను నేను అసహ్యించు కొంటున్నాను; పడి చావు" మొదలగునవి-- కత్తి పోట్లవలె ఇతరులను బాధించి, మన చేతన మనస్సును కూడా ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు ఉపశమనం కూడా కలిగిస్తాయి. ఒక కోపిష్టి దుర్భాషలాడితే, మనము మైత్రితో ఉండి, వాని తప్పులను క్షమిస్తే వానిలో మార్పు తెప్పించవచ్చు. ప్రతి ఒక్కరూ సహనానికి, క్షమా గుణానికి స్పందిస్తారు. అది క్షమ ఇచ్చేవారిని, క్షమించబడే వారిని, వారితో బంధాలు ఉన్నవారిని, కరుణిస్తుంది. 377

Eknath Gita Chapter 6 Section 22

Bhagavat Gita

6.22

సర్వ భూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః {6.31}

సర్వథా వర్తమానో అపి స యోగీ మయి వర్తతే

ఎవడు ఏకరూపమై సకల ప్రాణుల యందున్న నన్ను భజించుచున్నాడో అట్టి యోగి సర్వ విధముల ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచున్నాడు

ఆధ్యాత్మిక సంబంధమైన గుడులు సందర్శించుట, యజ్ఞ యాగాదులు చేయుట, ధ్యానమునకు సాటిరావు. అవి చేసినా, ధ్యానం చేయుట ఉత్తమం. ఎందుకంటే ధ్యానం వలననే క్రోధాన్ని దయగా; ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోగలిగే శక్తి వస్తుంది.

ఒక ఇల్లును కూల్చడానికి అనేకమైన పద్దతులు ఉపయోగిస్తారు. వాటిలో ఒక పెద్ద ఇనుప బంతితో ఇల్లు కూల్చడం సర్వ సాధారణం. అలాగే మనం పెద్ద ఇనుప బంతితో మన పాత నడవడికను ధ్యానంలో కూల్చాలి. ఇది విచారముతో కూడినది. కానీ పునరుద్ధరణ చెయ్యడంలో మిక్కిలి ఆనందం వస్తుంది. దానికై మిక్కిలి దూరం ప్రయాణించి వనరులు తెచ్చుకోనక్కరలేదు. దేవుడే మనకు అవి ప్రసాదిస్తాడు. మన అహంకారాన్ని, స్వార్థాన్ని కూలిస్తే, దేవుడు ప్రతిఫలంగా ప్రేమ, జ్ఞానం, సహనం, ఓర్పు ప్రసాదిస్తాడు. వాటితో మనం క్రొత్త నడవడిక అనే ఇల్లును కట్టుకోవచ్చు.

మనము స్వార్థం, భయం, క్రోధం తోకూడి గట్టి పునాది లేని ఇంటిలో నివశిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు మనమీద కూలుతుంది. అది జరిగేముందు, మనమే ఆ ఇంటిని కూల్చి, దేవుడు ప్రసాదించే సద్గుణాలతో మంచి పునాది మీద ఇల్లు కడితే, మనకు భయం, ఆందోళన కలుగదు. అటువంటి ఇంట్లో చుట్టుప్రక్కల వారికి కూడా నీడ నివ్వచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది: బాహ్య వస్తువులు --అనగా డబ్బు, దస్కం, అధికారం లేదా పేరు ప్రఖ్యాతులు--మీద ఆధారపడవద్దు. అవి శాశ్వతమైన సుఖాన్ని, భద్రతను కలిగించలేవు. అవి తాత్కాలికంగా సంతృప్తి నిచ్చి, క్రమంగా క్షీణింపచేస్తాయి. 375

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...