Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 5 Section 8

Bhagavat Gita

5.8

జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం నాశిత మాత్మనః {5.16}

తేషా మాదిత్యవద్ జ్ఞానం ప్రకాశయతి తత్పరమ్

ఎవరి అజ్ఞానము జ్ఞానము చేత నశించినదో అట్టివారి జ్ఞానము శ్రేష్ఠమై సూర్యుని వలె ప్రకాశించును.

తద్బుద్ధయ స్తదాత్మాన స్తన్నిష్ఠా స్సత్పరాయణాః {5.17}

గచ్ఛ న్త్యపునరావృత్తి౦ జ్ఞాన నిర్ధూత కల్మషాః

బ్రహ్మమునందే బుద్ధి గలిగి, దాని యందే మనస్సు కలిగి, దానియందే నిష్ఠ కలిగి, దానినే పరమ గతిగ భావించు జ్ఞానులు జ్ఞానముచే పాపములను పోగొట్టు కొనిన వారై పునర్జన్మ లేని మోక్షమును పొందుచున్నారు

విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవి హస్తిని {5.18}

శుని చైవ శ్వపాకే చ పండితా స్సమదర్శినః

విద్యా వినయములుగల బ్రాహ్మణుని యందును, గోవు నందును, కుక్కయందును, చండాలుని యందును పండితులు సమదర్శనము చేయుదురు ఀ

శ్రీకృష్ణుడు సమదర్శిన -- అనగా అందరినీ సమానంగా చూడడం, అందరి యందు సమానమైన ప్రేమ కలిగి యుండడం--అనే పదప్రయోగం చేసేడు. దేవుని నమ్ముకున్న వారు, అందరినీ ప్రేమించి, గౌరవిస్తారు. వేరే మతం, దేశం, జాతి, సంస్కృతి ఉన్నవారిని హేళన చెయ్యరు. జీవైక్య సమానత గురించి తెలిసికొ౦టే, మనము ఇతరులకన్న ఉత్తమమైన వారలమనే భావన -- వారికీ, మనకీ ఎంత తేడా ఉన్నా-- కలుగదు.

ఇతరులని పైపై ప్రేమించి, గౌరవించే పద్దతి మార్చుకోవాలి. మనము అందరినీ అర్థం చేసికొని, దయతో మెలగాలి. కొంత మంది పైపై ఎంతో సంస్కృతి గలవారిగా కనిపించి, లోపల తమ దేశమే, జాతే, మతమే గొప్పదనే భావనలో ఉంటారు. కొన్ని పుస్తకాల రచయితలు, తెలిసో, తెలీకో, ఇతర మతాలను, సంస్కృతులను, దేశాలను హేళన చేస్తారు.

బ్రిటిష్ వారిని మనకన్నా ఉత్తములని భావించి మనము అనేక సమస్యలు ఎదుర్కొన్నాము. వేరొకరి పరిపాలనలో మన యందు ఉన్న నమ్మక౦, గౌరవం క్షీణిస్తుంది. ఈ విధంగా ఆసియా, ఆఫ్రికా లలో వలస రాజ్యాల పరిపాలనలో ఒక రకమైన మనోదౌర్బల్యం ఏర్పడింది. పాశ్చాత్య దేశాలు ఎవరి క్రింద ఏలబడక, వలస రాజ్యాలను స్థాపించడం వలన, వారిని ఆసియా, ఆఫ్రికా వాసులు పూర్తిగా నమ్మరు.

గాంధీజీ వలస రాజ్యాల వలన ఏలబడిన ప్రజలేకాక, ఏలే వారు కూడా నష్టపోతారు అని అన్నారు. చాలామంది బ్రిటిష్ యువకులు పేరు పొందిన విశ్వవిద్యాలయాల్లో పట్టభద్రులయి, ప్రజలకు ఎంతో సేవ చెయ్యాలని ఉవ్విళ్ళూరుతూ, మన దేశానికి వచ్చి, కొంత కాలం తరువాత తామే మనకన్నా ఉత్తమమైన వారలమనే భావ మార్పిడి చేసికొన్నారు. అలాగే కొందరు బ్రిటిష్ ప్రజలు, గాంధీజీ యొక్క స్వాతంత్ర్య ఉద్యమానికి సహకరించి, ఆయనకు అండగా నిలబడ్డారు. అనేకమంది బ్రిటిష్ దేశస్తులు మన దేశంలో స్థిరపడి ఇప్పడికీ ఇక్కడే నివసిస్తున్నారు.

మనం ప్రేమ, గౌరవం మన కుటుంబ సభ్యుల యందు సమానంగా చూపాలని భావిస్తాం. మనకన్నా వేరే స్థిర భావాలు గలవారి గురించి ఆందోళన చెంద౦. తరం మారిన తరువాత మన భావాలను ఎదుర్కొని, మనల్ని, ఇతరులని వారి భావాలతో ముడిపెట్టి చూడడం మనకి భయం కలిగిస్తుంది. అది ఎలాగంటే మన ఒంటి ఛాయలలో బేధం వలన ప్రభావితం కాకూడదు. అది వేర్వేరు రంగుల చొక్కాలు వేసికొన్నట్టే. అలాగే భావాలు కూడా: అవి వేరైనప్పటికీ ఇతరుల యందు ప్రేమ, గౌరవము కలిగి ఉండాలి. తరాల మధ్య ఎంతో బేధమున్నా, క్రొత్త భావాల వలన మన కుటుంబానికి మేలు జరగవచ్చు. వృద్ధులు తమ అనుభవంతో, తమకన్నా చిన్న వారికి మంచి సలహాలు ఇవ్వగలరు. అలాగే యుక్త వయస్కులు క్రొత్త భావాలతో ఇంటికి సజీవత్వము, నూతనత్వము కలిగిస్తారు. చిన్న పిల్లలు తమ అమాయకత్వముతో అందరినీ అలరిస్తారు.

శ్రీకృష్ణుడు భూత దయ కలిగి ఉండమని కూడా బోధిస్తున్నాడు. ఎందుకంటే జంతువులలోనూ దేవుడు ఉన్నాడు. జంతువులు తమని ప్రేమించే వ్యక్తులను గుర్తు పెట్టుకుంటాయి. 319

No comments:

Post a Comment

Atheism in Yoga Vasishtyam?

Sage Vasishta in Book 5, Chapter 13, Verse 9-10: They who place their reliance upon faith in gods and depend upon them to fulfill their de...