Paramahamsa Upanishat

పరమహంస ఉపనిషత్

పరమహంస ఉపనిషత్ భక్తుడు లేదా భిక్షువు ధరించే వస్తువులు సాధకునికి అవసరంలేదని చెపుతుంది. యజ్ఞయాగాదులు చేసే సంసారికుల వలె, అవి వాని స్వతంత్రకు, ప్రేమకు, జ్ఞానానికి ఊతనిచ్చే సాధనములై అంతర్ముఖుడ్ని చేస్తాయి. ఈ విధంగా ఉపనిషత్ చెప్పే ఆధ్యాత్మిక విషయాలు భౌద్ధులు చెప్పినట్లు లేదా కబీర్ దాస్ చెప్పిన గీతాలవలె ఉంటాయి.

Sloka#1
ఒకసారి నారద మహర్షి బ్రహ్మాన్ని ఇలా సంభోదించెను:
"తమరి పరిస్థితి ఎలా ఉన్నది?"
బ్రహ్మన్ ఇలా జవాబిచ్చెను:
నన్ను చేరడం అతి దుర్లభం. కోటికొక్కరు
నన్ను చేరుతారు. కానీ ఒక్కడైనా చాలు.
ఎందుకంటే అతడు పురాణాల్లో చెప్పబడే
శుద్ధమైన పరమాత్మ. అతడు నిజానికి
మహోత్కృష్టుడు. ఎందుకంటే అతడు
సదా నన్నే తలచి సేవ చేస్తాడు. కాబట్టి
నేను అతని ద్వారా తెలియబడతాను.

Sloka#2
అతడు అన్ని బంధాలను విడనాడి,
ఎటువంటి యజ్ఞాలు, యాగాలు ఆచరించడు.
అతని స్వీయ వస్తువులు అతి తక్కువగా ఉంటాయి.
మరియు పరోపకారనికై జీవిస్తాడు.

Sloka#3
అతనికి దండము, శిరోముండనము, జంధ్యములు లేవు.
అతడు మిక్కిలి చలి లేదా మిక్కిలి ఉష్ణాన్ని,
సుఖదుఃఖాలను, మానావమానాలను
శాంతంగా అనుభవిస్తాడు.
అపనిందలన వలన ప్రభావితుడు కాడు.
గర్వం, మత్సరము, ప్రతిష్ట, సంతోషము
లేదా దుఃఖము, దురాశ, క్రోధము, మోహము,
ఉబలాటము, అహంకారము మొదలగునవి
లేకుండా ఉంటాడు. ఎందుకంటే తను
దేహధారి లేదా మనస్సు కానని తెలుసు కనుక.

Sloka#4
అనుమానాలు లేదా అసత్య జ్ఞానాన్ని విడిచి
బ్రహ్మన్ తో తాదాత్మ్యము చెంది ఉంటాడు.
ఎల్లప్పుడూ నిశ్చింతగా ఉండి, మార్పు చెందక,
అఖండమై, సమస్త ఆహ్లాదానికి మరియు
సుజ్ఞానానికి కారకుడై ఉంటాడు.
బ్రహ్మనే అతని నిజ గృహము, కేశములు,
జంధ్యము. ఎందుకంటే అతడు బ్రహ్మన్ తో
అనుసంధానమై, ఏకమై ఉన్నాడు.

Sloka#5
అతడు స్వార్థానికై ఏదీ కోరుకోకుండా
బ్రహ్మంతో లీనమై శాశ్వతమైన విశ్రాంతి పొందుతాడు.
జ్ఞానము అతనికి దండమువలె ఊతనిస్తుంది.
ఎవరైతే ఇంద్రియాలకు లోబడి, భిక్షువు వలె దండాన్ని
పట్టుకొని ఉంటారో వారికి అనేకమైన బాధలు తప్పవు.
జ్ఞానోదయము పొందిన వాడే జీవన
సత్యాలని గ్రహిస్తాడు.

Sloka#6
వానికి ప్రపంచమే ఆచ్ఛాదనము;
బ్రహ్మన్ తన కంటే వేరుకాడు.
పితృదేవతలకు తర్పణాలు చేయడు;
ఎవ్వరినీ పొగడడు లేదా దూషించడు;
అలాగే ఎవ్వరిమీదా ఆధారపడడు.

Sloka#7
వానికి మంత్రజపము అవసరములేదు;
ధ్యానం చేయనక్కరలేదు.
మార్పు చెందే ప్రపంచము మరియు
మార్పు చెందని సత్యము రెండూ
అతనికి ఒక్కటే. ఎందుకంటే
అతడు సర్వంలో పరమాత్మను దర్శిస్తాడు.

Sloka#8
బ్రహ్మన్ ను పొందదలచే సాధకుడు
బంధుమిత్రులతో, ధనముతో, వస్తువులతో
స్వార్థపూరిత బంధాలను పెట్టుకోకూడదు.
వాని మనస్సు ప్రతి ఒక్క స్వార్థపూరిత ఆలోచనను వదిలిపెడితే,
ద్వంద్వాల నుండి విముక్తుడై, సుఖదుఃఖాలకు అతీతుడై,
ఇంద్రియాలను స్వాధీనంలో ఉంచుతాడు.
అట్టివానికి చెడు భావనలు ఉండవు;
అలాగే ఉల్లాసంలో రమించడు. ఎందుకంటే వాని
ఇంద్రియాలు పరమాత్మయందే కేంద్రీకరింపబడి ఉంటాయి.
అతడు పరమాత్మతో అనుసంధానమై
పరిణామము యొక్క గమ్యాన్ని పొందుతాడు.
నిజంగా అతడు పరిణామము యొక్క లక్ష్యాన్ని చేరుతాడు.

Comments

Popular posts from this blog

Lalita Sahasra Naamaalu

Syamala Dandakam

Ramana Maharshi Index