Ramana Maharshi Chapt 10

అష్టాంగ జ్ఞానము



అష్టాంగ జ్ఞాన విధా నములో:
నిస్శ్వాస అనగా
నామరూపాత్మకములను, దేహమును,
జగత్తును విడిచిపెట్టుట. ఉచ్ఛ్వాస
అనగా నామరూపాత్మకములతో
కూడిన సత్, చిత్, ఆనందములను
ఆస్వాదించుట. కుంభక మనగా
లోపలికి తీసికొనబడిన వాటిని
జీర్ణించుకొనుట. ప్రత్యాహార మనగా
విడిచి పెట్టిన నామరూపాత్మకములు
మనస్సులో మళ్ళీ ప్రవేశించనీయక
మెలకువగా ఉండుట. ధారణ అనగా
మనస్సుని హృదయములో నిశ్చలముగా
నుంచి "నేను సచ్చిదానంద స్వరూపుడను"
అని భావించుట. ధ్యానమనగా అహం స్వరూపం
మీద దృష్టి ఉంచి "నే నెవరిని" అనే సాధనలోని
అంశమైన పంచ కోశాలతో కూడిన దేహాన్ని
నిశ్చలముగా నుంచుట. ఈ పద్దతిలో
ఆసనాలు లేవు. మన మెప్పుడైనా, ఎక్కడైనా
వీటిని పాటించవచ్చు. దీని లక్ష్యం
హృదయంలో వసించే పరమాత్మ
చరణములయందు మనస్సుని లగ్నము
చేసి పరమాత్మను ఎన్నటికీ మరచి
పోవకుండుట. ఆత్మని మరచిపోవడం
సర్వ అనార్థాలకి కారణం. మతిమరుపు వలను
ముక్తి పొందక మరణమునే పొందునని
పెద్దలు చెప్పెదరు. రాజ యోగమువలె
శ్వాసను నియంత్రించే అవసరముందా
అనే అనుమానము రావచ్చు. అది
సాధన చేయున౦త కాలం అక్కరకు రావచ్చు.
కానీ అష్టాంగ జ్ఞానములోని శ్వాస నియంత్రణే
ఉత్తమం. ఈ రెండిటి శ్వాస నియంత్రణ
లక్ష్యం ఉక్కటే: ఆత్మయందు దృష్టిని నిలిపి,
మనస్సును నిశ్చలం చెయ్యడం. అందువలన
మనస్సును శ్వాస నియంత్రణ ద్వారా హృదయంలో
నుంచుటకు లేదా ఆత్మజ్ఞానము కొరకు
సాధన చేయుట ఉపయోగకరం. అంతకంటే దాని ఉపయోగము
లేదు. కేవల కుంభకము అంటే ఉచ్ఛ్వాస, నిస్శ్వాసల
నియంత్రణ అవసరము లేకుండా
హృదయమునందు శ్వాసను ఉంచుట. మనము
అష్టాంగ యోగమును లేదా అష్టాంగ జ్ఞానమును
పాటించవచ్చు.


శాస్త్రము ముక్తి పొందాలంటే మనస్సును నిశ్చలము
చెయ్యాలని చెప్తు౦ది. యోగ శ్వాస నియంత్రణకు
సంబంధించినది. కానీ జ్ఞానము సత్యాన్వేషణకు
లేదా అఖండమైన బ్రహ్మన్ ను పొందుటకు
దోహదమవుతుంది. జ్ఞాన మార్గము ఎద్దుని
గడ్డిని చూపించి మచ్చిక చేసికొనుట అయితే,
యోగ మార్గము ఎద్దుని కొట్టి, బాధించి
వసము చేసికొనుట. దక్షత కలిగిన సాధకులు
వేదాంత జ్ఞానముతో మనస్సుని నియంత్రించి,
ఆత్మ యందు ఎట్టి సంశయము లేక, తమ
స్వస్వరూపాన్ని మరియు
సర్వమునందు బ్రహ్మన్ ను దర్శి౦చెదరు.
అంత సామర్థ్యము లేని సాధకులు శ్వాస
నియంత్రణ, ఆత్మ ధ్యానముల చే మనస్సుని
హృదయంలో లయం చేస్తారు. అంతకన్నా తక్కువ
సామర్థ్యము ఉన్నవారు శ్వాస నియంత్రణ
చేసి, దీర్ఘ కాలము తరువాత తమ లక్ష్యాన్ని
సాధిస్తారు. కేవల కుంభకము సాధించన౦త
వరకు శ్వాస నియంత్రణ అవసరం.


సమాధి భక్తి ద్వారా, ధ్యానము ద్వారా పొందవచ్చును.
దీనికి ఉచ్ఛ్వాస, నిస్శ్వాసల నియంత్రణ
అవసరము లేక, ఆత్మ విచారణతో కూడిన
కేవల కుంభకము తోడ్పడుతుంది. అలా
అనుభవమును పొందినవారు అన్ని వేళల,
అన్ని ప్రదేశములలోనూ తమ సాధనను
చెయ్యవచ్చు. మనస్సు నియంత్రింప
బడితే తక్కినవి అవసరము లేదు.
భగవద్గీతలో కృష్ణుడు "భక్తుడు
యోగికన్నా ఉత్తముడు; ముక్తి ఆత్మ
యందు నిరంతరము ధ్యానం
చేయు భక్తి వలన సాధ్యము" అని చెప్పెను.
కాబట్టి మనము పరమాత్మ యందు మనస్సుని
లగ్నం చెయ్యగలిగితే మిగతావాటిమీద
విచారణ చేయవలసిన అవసరమేముంది?

Comments

Popular posts from this blog

Lalita Sahasra Naamaalu

Syamala Dandakam

Ramana Maharshi Index