Ramana Maharshi Chapt 6

పరమాత్మ జ్ఞానము



మనస్సు అహంకారం దాల్చి,
శరీరాన్ని ఆత్మగా భావించి,
బాహ్య౦గా ప్రసరించి నప్పుడు,
దానిని హృదయ౦ను౦చి సమూలంగా తీసివేసి,
నేను అనే భావనను నియంత్రించి, విచారణ చేస్తే,
"నేను-నేను" అనే ఒక సున్నితమైన అనుభవము
వస్తుంది. అదే హృదయ కమలంలో,
పట్టణమనే శరీరంలో విరాజిల్లే ఆత్మ.
అదే పరమాత్మ కూడా. అప్పుడు మనము
మనస్సు నిశ్చలం చేసి, ఆత్మను అన్నిటిలోనూ--
బాహ్యంలో లేదా అంతరంగ౦లో -- ప్రసరింపజేసి,
సర్వవ్యాపకమైనదిగా, అన్నిటినీ అధిగమించే
పదార్థమైనదిగా అనుభవంలోకి తెచ్చుకోవాలి.
దీన్నే "శివోహం" అనబడే ధ్యానం అంటారు.
నేను శివుడను అనే భావనను నాల్గవ స్థితిగా
భావించాలి.

ఇటువంటి సున్నితమైన భావనే అనేక రీతులుగా
తెలియబడే భగవంతుడు: నాల్గవ స్థితికి అతీతం;
సర్వాంతర్యామి; హృదయంలో దీపంగా విరాజిల్లే
పరమాత్మ; ఏకాగ్రత మరియు ధ్యానంలో
తెలిసికొనబడేవాడు; అష్టాంగ పథంలో ఆరు మరియు ఏడవ
మెట్టు; హృదయాకాశంలో ప్రతిష్ఠి౦పబడినవాడు;
పరిశుద్ధమైన చైతన్యం; ఆత్మ స్వరూపం;
పరిపూర్ణమైన ఆనందం; సమస్త జ్ఞానం గలవాడు.

"నేను పరమాత్మను" అనే భావనతో
దీర్ఘమైన కాలం, సదా ధ్యానం చేస్తే హృదయాన్ని
కప్పిపుచ్చిన అజ్ఞానం తొలగి, సుస్థిరమైన
జ్ఞానోదయం కలుగుతుంది. ఈ విధంగా హృదయ
కమలంలో సత్యాన్ని దర్శించి, శరీరమనే
పురంలో ఉండేది పరమాత్మే అని గ్రహించాలి.
అట్టి పరమాత్మ అన్ని జీవులలోనూ ఉన్నాడు.
ఎందుకంటే హృదయమే అన్నిటికీ మూలం.

మన వాఙ్మయం ఇలా దాని గురించి చెప్పింది:
"ఒక ఋషి నవ ద్వారాలతో కూడిన శరీరంలో
తన్మయత్వముతో ఉంటాడు"; "శరీరం
ఒక గుడి; అక్కడ పూజింపబడేది ఆత్మ.
'నేను పరమాత్మను' అనే భావంతో
ఆ గుడిలో పూజిస్తే ముక్తి తప్పక
ప్రాప్తిస్తుంది. పంచకోశాలతో కూడుకొన్న
శరీరంలో గుహ్యంగా ఒకటుంది. అదే
హృదయాంతరిక్షం; అదే అన్నిటినీ
అధిగమించే పరమాత్మ యొక్క స్థానం. "

ఈవిధంగా పరమాత్మను తెల్పేదాన్ని
దహర విద్య అంటారు. దాన్ని
సూటిగా, తత్ క్షణమే అనుభవంలోకి
తెచ్చుకోవచ్చు.


Comments

Popular posts from this blog

Lalita Sahasra Naamaalu

Syamala Dandakam

Ramana Maharshi Index