Sunday, January 22, 2023

Ramana Maharshi Chapt 5

పరమాత్మ


సర్వత్రా సత్యమైన సిద్ధాంతం:
మనలోని ఆలోచనలు, ప్రపంచంలోని
వస్తువులతో అనుసంధానమై ఉంటాయి.
ఆ ఆలోచనా సమూహాలనే మనస్సు అంటారు.
కనుక, దేహం, బాహ్య ప్రపంచం నిజానికి
మనస్సులోని ఆలోచనలు. హృదయమే
అన్ని వస్తువుల ఆవిర్భావమునకు ముఖ్య
కారణం. అటువంటి హృదయ మధ్యలో,
అనగా మనస్సు విస్తీర్ణంలో, "నేను" అనే
దివ్య చైతన్యం వశిస్తోంది. అది అన్ని జీవులలోనూ
అంతర్గతమై సర్వమునకు సాక్షియై ఉంది.
అదే వేకువ, కల, సుషుప్తి లకు ఆవల ఉండే
నాల్గవ అవస్థ

అపరిమితమైన సృష్టిలో ఆత్మ సత్యమై,
నిత్యమై, అన్ని జీవులలోనూ "నేను"
అనే స్ఫురణను, చైతన్యమును కలిగిస్తుంది.
నాల్గవ అవస్థకి ఆవల ఉండేది పరమాత్మ
చైతన్యము. అదే నాల్గవ స్థితిని
వెలుగుతో నింపుతోంది. అది ఒక దీపం లోనీ నీలి
మంటనుండి, విస్తారమైన ప్రపంచం వరకు
వ్యాపించే కాంతి వలె ఉంది.
సత్యమైన అవస్థ అనగా
సర్వత్రా కాంతితో నింపే దీపం యొక్క
సర్వ వ్యాపాకత్వము. కాంతిని విస్మరిస్తే,
అహంకారంలేని అవస్థే సత్యమైనది.
ప్రతిఒక్కరు "నేను" అని చెప్పినపుడు
తమ ఛాతీపై చెయ్యివేసి చెప్తారు. ఇదే
పరమాత్మ మన హృదయంలో ఉన్నాడనే
నిజానికి ప్రమాణం.
హృదయంలో "నేను-నేను"
అనే స్ఫురణను ప్రక్కనబెట్టి, ఆత్మను
బాహ్యంలో వెదకడం, ఒక విలువైన వజ్రాన్ని
గులక రాయి కోసం వదులుకోవడం వంటిదని
వశిష్ఠ మహర్షి అన్నారు. వేదాంతులు సృష్టి పరిపాలన
-- ఆవిర్భావము, స్థితి, లయము--చెయ్యడానికి
అనేక దేవతలు -- గణపతి, బ్రహ్మ, విష్ణు,
రుద్ర, మహేశ్వర, సదాశివ --అనవసరమని
నమ్ముతారు.

No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...