Wednesday, April 6, 2022

Eknath Gita Chapter 6 Section 23

Bhagavat Gita

6.23

ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యో అర్జున {6.32}

సుఖం వా యదివా దుఃఖం స యోగీ పరమో మతః

అర్జునా! తన యందును సర్వ భూతముల యందును కలుగు సుఖదుఃఖములను ఒకే రీతిగ సమ దృష్టితో గాంచువాడు పరమశ్రేష్ఠుడైన యోగి అని నా అభిప్రాయము.

ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు మన నడవడిక ఎలా ఉండాలో బోధిస్తున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే మనకేది బాధ కలిగిస్తుందో, ఇతరులకు కూడా అదే బాధ కలిగిస్తుంది.

మనమొక మిత్రుడు రాకకై ఎదురుచూస్తూ ఉండి, అతడు నియమిత సమయానికి రాకపోతే మనకు చికాకు వేస్తుంది. కానీ మనం ఉంకొకర్ని కలవడానికి ఒక గంట ఆలస్యంగా వెళితే, మనకున్న అనేక సద్గుణాలవలన క్షమింప బడతామని తలుస్తాము. ఇతరులు మన౦ చేసే తప్పులను చూసీ చూడనట్టు ఉండాలని కోరుతాం. కానీ వారి తప్పులను, బలహీనతలను ఎత్తి పొడుస్తాం.

ఆధ్యాత్మికత కలవాడు ఇతరుల తప్పులను మరచిపోయేటట్టు చేస్తాడు. అతడు తుచ్ఛమైన భావనలను వీడి, ఇతరుల అవసరాలకు అనుగుణంగా మెలగుతాడు. మనము సున్నితమైన మనస్తత్వము గలవారమని మరచి, ఇతరుల గురించి పాటుపడితే దేవుడు హర్షిస్తాడు. బుద్ధుడు ఇతరులను అర్థం చేసుకోవాలంటే: మనకు ఏది అవమానకరమో, ఇతరులకూ అది అవమానకరం అని చెప్పెను. కాబట్టి ఇతరులను దెప్పి పోడిచే మాటలు మాట్లాడకూడదు.

దుష్ట ఆలోచనలు, ద్వేష పూరితమైన ఆలోచనలు, ఇతరులను కత్తి పోటుకన్నా ఎక్కువగా బాధ పెట్టగలవు. మన మనస్సులో ఆలోచనలు గందరగోళంగా ఉన్నాయని గ్రహించక పోవచ్చు. ద్వేష పూరిత ఆలోచనలు -- "నిన్ను నేను అసహ్యించు కొంటున్నాను; పడి చావు" మొదలగునవి-- కత్తి పోట్లవలె ఇతరులను బాధించి, మన చేతన మనస్సును కూడా ప్రభావితం చేస్తాయి. ఆలోచనలు ఉపశమనం కూడా కలిగిస్తాయి. ఒక కోపిష్టి దుర్భాషలాడితే, మనము మైత్రితో ఉండి, వాని తప్పులను క్షమిస్తే వానిలో మార్పు తెప్పించవచ్చు. ప్రతి ఒక్కరూ సహనానికి, క్షమా గుణానికి స్పందిస్తారు. అది క్షమ ఇచ్చేవారిని, క్షమించబడే వారిని, వారితో బంధాలు ఉన్నవారిని, కరుణిస్తుంది. 377

Eknath Gita Chapter 6 Section 22

Bhagavat Gita

6.22

సర్వ భూతస్థితం యో మాం భజత్యే కత్వమాస్థితః {6.31}

సర్వథా వర్తమానో అపి స యోగీ మయి వర్తతే

ఎవడు ఏకరూపమై సకల ప్రాణుల యందున్న నన్ను భజించుచున్నాడో అట్టి యోగి సర్వ విధముల ప్రవర్తించుచున్నను నా యందే ప్రవర్తించుచున్నాడు

ఆధ్యాత్మిక సంబంధమైన గుడులు సందర్శించుట, యజ్ఞ యాగాదులు చేయుట, ధ్యానమునకు సాటిరావు. అవి చేసినా, ధ్యానం చేయుట ఉత్తమం. ఎందుకంటే ధ్యానం వలననే క్రోధాన్ని దయగా; ద్వేషాన్ని ప్రేమగా మార్చుకోగలిగే శక్తి వస్తుంది.

ఒక ఇల్లును కూల్చడానికి అనేకమైన పద్దతులు ఉపయోగిస్తారు. వాటిలో ఒక పెద్ద ఇనుప బంతితో ఇల్లు కూల్చడం సర్వ సాధారణం. అలాగే మనం పెద్ద ఇనుప బంతితో మన పాత నడవడికను ధ్యానంలో కూల్చాలి. ఇది విచారముతో కూడినది. కానీ పునరుద్ధరణ చెయ్యడంలో మిక్కిలి ఆనందం వస్తుంది. దానికై మిక్కిలి దూరం ప్రయాణించి వనరులు తెచ్చుకోనక్కరలేదు. దేవుడే మనకు అవి ప్రసాదిస్తాడు. మన అహంకారాన్ని, స్వార్థాన్ని కూలిస్తే, దేవుడు ప్రతిఫలంగా ప్రేమ, జ్ఞానం, సహనం, ఓర్పు ప్రసాదిస్తాడు. వాటితో మనం క్రొత్త నడవడిక అనే ఇల్లును కట్టుకోవచ్చు.

మనము స్వార్థం, భయం, క్రోధం తోకూడి గట్టి పునాది లేని ఇంటిలో నివశిస్తే అది ఎప్పుడో ఒకప్పుడు మనమీద కూలుతుంది. అది జరిగేముందు, మనమే ఆ ఇంటిని కూల్చి, దేవుడు ప్రసాదించే సద్గుణాలతో మంచి పునాది మీద ఇల్లు కడితే, మనకు భయం, ఆందోళన కలుగదు. అటువంటి ఇంట్లో చుట్టుప్రక్కల వారికి కూడా నీడ నివ్వచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది: బాహ్య వస్తువులు --అనగా డబ్బు, దస్కం, అధికారం లేదా పేరు ప్రఖ్యాతులు--మీద ఆధారపడవద్దు. అవి శాశ్వతమైన సుఖాన్ని, భద్రతను కలిగించలేవు. అవి తాత్కాలికంగా సంతృప్తి నిచ్చి, క్రమంగా క్షీణింపచేస్తాయి. 375

Eknath Gita Chapter 6 Section 21

Bhagavat Gita

6.21

యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి {6.30}

తస్యాహం న ప్రణశ్యామి స చ మే ప్రణశ్యతి

ఎవడు నన్ను సర్వభూతముల యందును, సర్వభూతములను నా యందును గాంచుచున్నాడో అట్టి వానికి నేను ప్రత్యక్షమే, నాకు వాడు ప్రత్యక్షమే

శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో ఎవరైతే దేవుని అన్ని జీవులలోనూ దర్శిస్తారో; ఇతరులు తమకేమి చేసినా, వారిని గౌరవంతో చూస్తారో, వారికి ఎన్ని అవాంతరాలు వచ్చినా దేవుని రక్షణను పొందుతారు. దేవుని అన్ని జీవులలోనూ చూస్తే, మనం సమతా దృష్టి కలిగి ఉంటాము.

మనకు సమస్యలు ఎదురైనప్పుడు మంత్ర జపం ఉత్తమం. నిద్రకు ఉపక్రమించే ముందు మంత్ర జపం చేస్తూ పడుకోవాలి. దానివలన మరుసటి రోజు ఆహ్లాదంగా ఉండి ప్రతి సమస్యను పరిష్కరించ గలిగే శక్తిని పొందుతాము. నాకు వందలాది మందిని ధ్యాన మార్గంలో నడిపించే బాధ్యత ఉంది. అది కొన్నేళ్ళగా చేస్తూ, ప్రతి రాత్రీ నిద్ర పోయేముందు, నా బాధ్యతలను దేవునికి అప్పజెప్తాను. మంత్ర జపం నిద్రలో కూడా వినబడుతూ ఉండి, దేవుని దర్శిస్తూ ఉంటాను. మరుసటి రోజు దేహం, మనస్సు ఉత్తేజితమై ఉత్సాహంతో కర్మలు చేస్తాను. ఎందుకంటే నా బరువును దేవుని పాదాలముందు వేసేను కాబట్టి. 374

Eknath Gita Chapter 6 Section 20

Bhagavat Gita

6.20

సర్వభూతస్థ మాత్మానాం సర్వభూతాని చాత్మని {6.29}

ఈక్షతే యోగ యుక్తాత్మా సర్వత్ర సమదర్శనః

ఆత్మయోగి అంతటను సమదృష్టి కలిగి తనను సర్వ భూతముల యందును, సర్వ భూతములను తనయందును దర్శించుచున్నాడు

భారతంలో ఒక కథ చెప్తారు. ధర్మపుత్ర అనే పాండవ వృద్ధుడు తన శునకంతో స్వర్గ లోక ద్వారం వద్ద ఉంటాడు. ద్వారపాలకుడు శునకం స్వర్గ లోకంలోకి రావడానికి వీలు లేదని చెప్తాడు. ధర్మపుత్రుని ఒంటరిగా స్వర్గలోకంలోకి రావాలో లేదా శునకంతో వెనక్కి పోవాలో నిర్ణయించుకోమంటాడు. ధర్మపుత్రుడు శునకంతో తిరిగి వెళ్లిపోవడానికి నిశ్చయించుకుంటాడు. అప్పుడు ఆ శునకం శ్రీకృష్ణునిగా దర్శనమిస్తుంది.

జ్ఞాని దేవుని అన్ని జీవులలోనూ చూస్తాడు. వాటిని తన ఆనందానికి లేదా లాభానికి ఉపయోగించడు. కాబట్టి మాంసాహారం జీవైక్య సమానతకు వ్యతిరేకం. 373

Eknath Gita Chapter 6 Section 19

Bhagavat Gita

6.19

యంజ న్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః {6.28}

సుఖేన బ్రహ్మ సంస్పర్శ మత్యంతం సుఖ మశ్నుతే

ఈ ప్రకారము మనస్సును సదా ఆత్మయందే నిలుపుచు, కల్మష రహితుడైన యోగి బ్రహ్మ సాక్షాత్కార రూపమగు పరమ సుఖమును సులభముగ పొందుచున్నాడు

ఆత్మ శుద్ధమైనది. అనగా మన సహజ స్థితిలో అరిషడ్వర్గాలు, అహంకారం లేవు. కానీ ఈ రోజుల్లో వాటినే మన సహజ స్థితి అని నమ్ముతున్నాం. మన అభిలాషలచే, కోర్కెలచే బందీలుగా ఉన్నాము. ధ్యానం ద్వారా వాటిని అధిగమించవచ్చు.

శ్రీకృష్ణుడు మనల్ని సుఖం, లాభం, అధికారం, ప్రతిష్ఠల నుంచి విడివడి, వాటి వలన కలిగే అపజయాల్ని, బలహీనతలను, అభద్రతను అధిగమించి తనను పొందమని బోధ చేస్తున్నాడు. మన జన్మ సార్థకం చేసికోవాలంటే స్వార్థాన్ని వీడి, దేవునియందు ప్రేమతోనుండి, మన వనరులు, శక్తి సామర్థ్యాలు పరోపకారానకై ఉపయోగించాలి. అలాచేస్తే మన౦ కర్మలు చేయక, దేవుడే మన చేత కర్మలు చేయిస్తాడు.

అహంకారం, స్వార్థం, పగ, ద్వేషాలను వీడి దేవునికి దాసోహమైతే, మనము అందరి క్షేమమునకై పని చెయ్యవచ్చు. 372

Eknath Gita Chapter 6 Section 18

Bhagavat Gita

6.18

ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖ ముత్తమం {6.27}

ఉపైతి శాంతరజసం బ్రహ్మభూత మకల్మషమ్

ప్రశాంత చిత్తుడును, రజోగుణము నశించిన వాడును, బ్రహ్మభూతుడును, పాపరహితుడును అగు ఈ యోగి ఉత్తమ సుఖమును పొందుచున్నాడు

ఎవరైతే దేవుడ్ని అన్ని జీవులయందు దర్శిస్తారో వారిలో స్థిరమైన శక్తి ఉంటుంది. ప్రపంచంలోని ఎటువంటి ప్రమాదాలు వానిని ఆందోళన పరచలేవు. వారిలో భద్రత కలిగి, మనస్సు నిశ్చలంగా ఉండి, ఆలోచనలు నియంత్రింపబడి ఉంటాయి.

ఆందోళనతో కూడిన మనస్సును శాంత పరచాలంటే మంత్రాన్ని కొన్ని వందల సార్లు ఒక పుస్తకంలో వ్రాయాలి. అలాగే ప్రతిఫలం ఆశించకుండా పరోపకారం చేస్తే మనస్సు ఆందోళన పడదు. చిన్నవారు శ్రమటోడ్చి పనిచేసి, మంత్రాన్ని జపిస్తే వారి మనస్సు శాంతింపబడుతుంది.

స్వార్థపూరితమైన కోర్కెలను పారద్రోలితే మనస్సులో మిగిలేది పరిపూర్ణమైన ఆనందం. ఆనందం కోర్కెలచే చెర పట్టబడి యున్నది.

ఆధ్యాత్మిక ఆనందం ఒక పిల్లవాని వలె, మన చుట్టూ చేతులు వేయడానికి, మనమెంత దూరం వెళ్ళినా, ముందుకు వస్తుంది. మన స్వార్థ పూరిత ఆలోచనలు తమకి ముప్పు తప్పదని తెలిసి ఆ పిల్లవానిని దగ్గిరకు రానీకుండా చేస్తాయి. మనము అజ్ఞానా౦ధకారంలో ఉన్నంత కాలము, స్వార్థ పూరిత కోర్కెలు మన మిత్రులని భావిస్తాము. మనకు దుఃఖం కలిగించే పనులు వాటివలననే మనచే చేయింపబడతాయి. ద్వేషము, పగ మనల్ని అతలాకుతలం చేసినా, వాటిచే ప్రభావితమౌతాము. ధ్యానం ద్వారా స్వార్థాన్ని నియంత్రించి ఆనందాన్ని మనలోకి ఆహ్వానిస్తాము. 370

Eknath Gita Chapter 6 Section 17

Bhagavat Gita

6.17

యతో యతో నిశ్చరతి మన శ్చంచల మస్థిరమ్ {6.26}

తత స్తతో నియమ్యైత దాత్మన్యేవ వశం నయేత్

చంచలమైనదియు, నిలకడలేనిదియు నగు మనస్సు ఎచ్ఛటెచ్చట సంచరించునో అచ్చటచ్చట నుండి దానిని మరల్చి ఆత్మయందే నిలుపవలెను

మనస్సు ఒకదాని తరువాత ఇంకొక కోరికను సదా కోరుతూనే ఉంటుంది. దాని వలన పూర్తి ఆనందము పొందలేకున్నాము. అంతర్గత ఆనందాన్ని పొందాలంటే మనస్సును నిశ్చలము చేసికొని స్వార్థపూరిత కోర్కెలు విడనాడాలి. ధ్యానంలో మనస్సు బాహ్యంగా ప్రసరిస్తే దానిని లోపలకు తెచ్చుకోవాలి. క్రమంగా మనస్సు ధ్యానంలో నిలకడగా ఉంటుంది. గాఢమైన ధ్యానంలో మనస్సు మంత్రం మీద కేంద్రీకరించి ఉంటుంది. అప్పుడు మంత్రం మనం వలనించేది కాక, మన చేతన మనస్సులో లీనమైపోతుంది. మనస్సును "ఇతరులను క్షమిస్తే నీవు క్షమింప బడతావు" అనే సెయింట్ ఫ్రాన్సిస్ చెప్పిన మాటలమీద కేంద్రీకరించి ధ్యానం చేస్తే, మన తలిదండ్రులతో, లేదా పిల్లలతో, లేదా మిత్రులతో, విభేదాలు ఉంటే, వాటిని పరిష్కరించే శక్తి వస్తుంది. మనతో విభేదములు వున్నవారల యందు ప్రేమతో, గౌరవముతో మెలిగితే శత్రువులు కూడా మిత్రులవుతారు. 368

Viveka Sloka 68 Tel Eng

Telugu English All తస్మాత్సర్వప్రయత్నేన భవబంధవిముక్తయే । స్వైరేవ యత్నః కర్తవ్యో రోగాదావివ పండితైః ॥ 68 ॥ (పాఠభేదః - రోగాద...