Sunday, January 22, 2023

Ramana Maharshi Chapt 3-4

సృష్టి




స్మృతులు, శ్రుతుల ముఖ్య ఉద్దేశం
ప్రపంచం మిథ్య, బ్రహ్మన్ సత్యం
అని చెప్పడం. అందుకే సృష్టి
క్రమం చెప్పబడినది. దానిలో
త్రిగుణములతో కలిసి పంచభూత
సృష్టి ఎలా జరగబడినదో తెలపబడింది.
సృష్టి ఒక కలలా ఉండి, ఆ కలలో
ఆత్మను కప్పిపుచ్చి లేనిపోని ఆలోచనలు
కలుగుతాయి. సత్యం తెలపడానికి
సృష్టి మిథ్య అని చెప్పబడుతుంది.
అది జ్ఞానులకు బాగా ఎరుక.


ఆత్మ శుద్ధ చైతన్యం; అన్నిటినీ
గ్రహిస్తుంది; సర్వ ద్రష్ట. అహంకారం,
మనస్సు మొదలగునవి ఆత్మ సాధనాలు.
ఆత్మ వేరొకరికి దృశ్యము కాలేదు. వేరొకరు
దానిని గ్రహించలేరు.

అహంకారం



మనస్సు అంటే "నేను" అనే భావన.
మనస్సు, అహంకారం ఒకటే. బుద్ధి,
అహంకారం, చిత్తం, మొదలగునవి కూడా
మనస్సే. ఒక వ్యక్తి తండ్రి, తమ్ముడు, అన్న,
ఉద్యోగి అని ఎలా పిలువబడుచున్నాడో
అలాగే మనస్సుని వేర్వేరు రకాలుగా
చిత్రీకరిస్తారు. మనస్సు ఆత్మానుభవము
పొందితే కొలిమిలో ఎర్రగా కాలిన ఇనుప
కడ్డీలా ఉంటుంది. ఆత్మకు వేరే సాక్షి
లేరు గనుక అహంకారమే ఆ పని చేస్తుంది.
ఎందుకంటే మనస్సు ప్రజ్వలమైన
చైతన్యానుభవము పొందినది కనుక.
ఆత్మ హృదయంలో ఎర్రగా కాలిన
కడ్డీ లోని అగ్నిలా అసంగమై ఉంటుంది.
కానీ అది ఎల్లలులేనిది. అది స్వయంప్రకాశం.
అన్ని జీవులలోనూ ఉండేది అది ఒక్కటే.
అద్వితీయం. దాన్నే పరమాత్మ అంటాం.


ఎర్రగా కాలిన ఇనుప కడ్డీ జీవి అయితే, అగ్ని
సర్వ సాక్షి అయిన ఆత్మ,; ఇనుప కడ్డీ అహంకారం.
శుద్ధమైన అగ్ని సర్వాంతర్యామి, సర్వజ్ఞమైన
పరమాత్మ.


No comments:

Post a Comment

Juror Types

Before I proceed with juror types on a light-hearted note, I will point out that both current VP JD Vance and his telugu wife have law ...