Wednesday, December 27, 2023

Bhagavata Origin King Pareekshit Story






upanishad

ఒకనాడు. పరీక్షిన్మహారాజు వేటాడుటకు వనమున కెళ్ళెను. వేటాడి అలసిపోయెను. శ్రమాధిక్యత వలన దాహము అధికమయ్యెను. ఎంత వెదకినను ఆ ప్రదేశమున జలము లభించలేదు. అన్వేషణ జరుపుచుండగ పరీక్షిత్తునకు ఆశ్రమమొకటి కనిపించెను. తొందరగా ఆశ్రమప్రదేశమున కరుదెంచినాడు. అది శమీక మహాముని ఆశ్రమము. ఆ సమయానికి శమీక మహర్షి ధ్యానమగ్నుడై యుండెను, మనస్సు సంపూర్ణముగ అంతర్ముఖమై యుండెను. సంకల్పాల సందడి అణగియుండెను. నిర్వికల్ప సమాధిలో శమీకుడు నిరంజన రూపుడై నిలచియుండెను. పరీక్షిత్తు బుషిని ప్రశ్నించెను.

క|| తోయములు దెమ్ము మాకీ తోయము వేటాడువేళ దొల్లిపొడమ దీ

తోయము క్రియజల దాహము తోయము వారలును లేరు దుస్సహ మనఘా

పిపాసాపీడితుడైయున్న పరీక్షిత్తుడు మంచినీరివ్వమని మహర్షిని అర్దించాడు. అంతర్ముఖుడై యున్న మహర్షికి బాహ్యశబ్దాలు వినిపించునా? పరీక్షిత్తుని పలుకులు శమీకుని మనస్సును చేరలేకపోయాయి. పరీక్షిత్తుని మనస్సు చివుక్కుమన్నది. చిత్తము వికలమైనది. హృదయము గాయపడింది. మహర్షి తనను అవమానపరచు చున్నట్లు భావన కలిగింది. ఇంద్రియ ప్రకోపములో ఇంద్రుడైనా దారితప్పుట తథ్యము. దాహముచే పీడింపబడుటచే కలవరపడుతున్న పరీక్షిత్తుని చిత్తము ఆలోచనాశక్తిని, అవగాహనను కోల్పోయింది. అవగాహన లోపించిన అంతఃకరణలో ఆవేశము కలుగుటలో ఆశ్చర్యములేదు.

కామాత్క్రో ధోభిజాయతే

తీరని కోరిక (కోధంగా మారింది. ఇంతలో ఋష్యాశ్రమ సమీపమున మృతసర్పమొకటి గోచరించినది. పరీక్షిత్తుని ఆంతర్యంలోని ఆవేశానికి బాహ్యంలో ఆకృతి లభించినట్టైనది. అంతే ఆ మృతసర్పాన్ని తెచ్చి శమీకుని మెడలో వేసినాడు. ఆహా దురవగాహన ఎంతటి దుశ్చర్యను కదిలించినది? ఆవేశము ఎంతటి అనర్ధమును కలిగించినది?

మృతసర్పము మెడలో పడినదని శమీకునికి తెలియలేదు. తెలిసికొనెడి మనస్సు అంతకు పూర్వమే శమీకునిలో చచ్చిపడియుండుటయే ఈ అ గ్రాహ్యస్టితికి కారణము. పరీక్షిత్తుడు దిగ్భ్రాంతి చెందెను. తాను భావించింది వేరు. జరిగింది వేరు. శమీకుడు వాస్తవంగా సమాధిలో నున్నాడా? లేక తనను అవమాన పరచుటకు అలా నటించుచున్నాడా? అని తెలిసికొనేందుకే పరీక్షిత్తుడు అలా ప్రవర్తించాడు. శమీకుని స్టితి నిజసమాధియే నని తెలియగనే బాధా హృదయంతో చేసిన తప్పిదానికి కలత చెందుతూ పశ్చాత్తాపముతో రాజు వెనుదిరిగి వెళ్ళెను.

ఈ సంఘటనను సమీపంలో నున్న కొందరు బ్రహ్మచారులు చూసేరు. వెంటనే వెళ్ళి నదీతీరమున యున్న శమీకుని కువూరుడగు శృంగికి తెలిపారు.

శృంగి మనస్సు కలత పడింది. మహాత్ముడైన తన తండ్రి శమీకునికి జరిగిన అన్యాయానికి ఆవేదన పడ్డాడు. ధర్మమును రక్షింపవలసిన ప్రభువే ధర్మము నుల్లంఘి౦చినాడు. ఇది భయంకరమైన నేరము. ఇది క్షమార్హము గాదని భావించాడు.

"నా తండ్రియగు శమీకుడు భగవత్స్వరూపుడు. దూషణము లెరుగనివాడు. భీషణము తెలియనివాడు. భగవన్నామమునే భూషణముగా సదా ధరించువాడు. తీక్షణమైన ప్రవర్తన తెలియని వాడు. ఈషణ (తయమును దాటినవాడు. విష్ణుభక్తి తప్ప అన్యము లెరుగని పావనాత్ముడు. దానము లాశించడు. ధనము నభిలషింపడు. వనప్రదేశములో మననము సాగించుకొనుచు జీవించుచున్న సాధుసత్తముని గళమున మృతభుజంగమును ఉంచుట ఏమి వైపరీత్యము? ఇది క్షమించరాని దోషము" అని పలుకుచు శృంగి కౌశికీనది వద్దకెళ్ళి ఆచమనం చేసి పరిక్షిత్తునికి శాపము ననుగ్రహించెను.

ఉ ||ఓడక వింటి కోపున మృతోరగమున్‌ గొనివచ్చి మాఱు మా

టాడక యున్న మజ్జనకు నంస తలంబున బెట్టి దుర్మద

క్రీడ జరించురాజు హర కేశవు లాగిన జచ్చు నేటితో

నేడవనాడు తక్షక ఫణీంద్ర విషానల హేతి సంహతిన్‌

“ఈ రాజులు ఉచ్చిష్టములను తిను కాకులవలె బలిసి ఘోరమైన పాపములను చేయుచున్నారు. దాసులై కూడా ఇంటినిగాయు కుక్కలవలె యజమానిని తిరస్కరించుచున్నారు. వీరు క్షమార్షులుగారు. మర్యాదహీనుడు, నా తండ్రికి ద్రోహము చేసిన పరీక్షిత్తుని నేటికి ఏడవనాడు తక్షకుడు కాటు వేయగలడు " అని శృంగి పరీక్షిత్తుని శపించెను.

అంతా జరిగిపోయింది. పరీక్షిత్తుని అంతిమ క్షణము నిర్ణయింపబడింది. క్షణికావేశము బతుకును శ్మశానానికి తరలించింది. నిగ్రహాన్ని కోల్పోవడం వలన నిండుజీవితం నీరుగారి పోయింది. పదిలంగా యున్న పరీక్షిత్తుని (బతుకు ఫణిరాజుకు బలి అయింది.

పరీక్షిత్తుని శాపగ్రస్తుని జేసి శృంగి ఆశ్రమానికి అరుదెంచినాడు. తండ్రి మెడలోని మృత సర్పమును దీసి దూరంగా పారవేశాడు. శృంగిలోని ఆవేశము ఇంకా చల్లారలేదు. ఆగ్రహం అంతరించలేదు.

ఇంతలో తం(డియైన శమీకుడు బహర్ముఖుడయ్యాడు. కళ్ళు తెరిచి చూశాడు. ఆగ్రహో దగ్రుడైయున్న తన కుమారుని గాంచినాడు. ప్రక్కనే అల్లంత దూరాన పడియున్న మృతసర్పాన్ని వీక్షించాడు. జ్ఞానదృష్టి ద్వారా జరిగిన విషయము నంతటిని క్షణంలో అవగత మొనర్చుకున్నాడు. బాధాతప్తుడైనాడు. తన బిడ్డడైన శృంగి చేసిన తప్పిదమునకు చింతించినాడు. పరమభాగవ తోత్తముడైన పరీక్షిత్తుడు శాపమునకు గురియగుట శమీకునికి అపరిమితమైన దుఃఖమును కలిగించినది. జరిగిన దానికి చింతించుచు మహాత్ముడైన శమీకుడు శృంగిని సమీపించి ఇలా పలికెను.

“కుమారా! ఎంత పొరపాటు చేసితివి? శ్రీ కృష్ణభగవానుని నిర్యాణము తరువాత కాపరిలేని గొర్రెల మంద చోరులవాత పడినట్లు ఈ ప్రపంచము ధర్మమును కోల్పోయి చరించుచున్నది. కర్మదేవతకు నూతన సొగసులిచ్చి ధర్మమును చతుష్పాదములతో చరింపజేయు ధీశాలియైన పరీక్షిత్తుడు ధర్మాత్ముడు. అట్టి మహితాత్ముడు చేసిన చిన్న పొరపాటుకు ఇంతటి కఠిన శిక్షను విధించితివా? ధర్మాత్ముని శపించితివా? దుర్మార్గులు దుష్క్రియలకే అలవాటుపడి యుంటారు. సజ్జనాత్ములుగలవారు ప్రారబ్ధాధీనులై ఎప్పుడైనా ఏదో అయోమయ పరిస్టితులలో ఒక అపచారాన్ని చేస్తారు. ఆ తరువాత ఎంతగానో చింతిస్తారు. పశ్చాత్తాపంతో కుమిలిపోతారు. కుమారా! వారు యొనర్చెడి సహస్ర సత్కార్యములను విస్మరించి, వారాచరించిన ఒక దుష్కార్యానికి వారిని శిక్షిస్తే ఆ తరువాత వారిలాగ ధర్మాచరణ జేయువారు భువికి లభించుదురా? ఎంతపొరపాటు చేసితివి? అతిథిగా అరుదెంచిన విమల చరితుని సత్కరించుటకు బదులుగ శాపము నిచ్చితివా? ఇది నీకు ధర్మమా?

కుమారా! పరీక్షిత్తు లాంటి రాజులేనిచో లోకములో చోరులు అధికమయ్యెదరు. హింస ప్రబలి పోవును. పశు, స్త్రీ ధనాదుల నపహరింతురు. తరువాత ధర్మము నశించును. ధర్మము నశించగనే జనులు కుక్కలవలె, కోతులవలె అర్థకామముల యందే అభిరుచి కలిగియుందురు. చూసితివా! ఏ శాపకారణముగ దేశమునకు ఎన్ని అనర్థములు వాటిల్లుచున్నవో గాంచితివా!” అని శమీకుడు పరితపించెను. తన బిడ్డడు ఆవేశములో అనాలోచితముగ చేసిన తప్పిదమును మన్నించమని శ్రీకృమ్ణని ప్రార్ధించెను.

క||భూపతికి నిరపరాధమ శాపము దా నిచ్చె బుద్ది చాపలమున మా

పాపడు వీడొనరించిన పాపము దొలగింవు కృష్ణ! పరమేశ! హరీ!

అని పరమేశ్వరుని శమీకుడు ప్రార్హించాడు. ఆహా! ఇదికదా సాధుహృదయము. తమకు జరిగిన అన్యాయమునకు కర్మ ఫలితంగా భక్తులు భావిస్తారే గాని అన్యాయము చేసిన వారిపై ప్రతీకారమును చేయరు. పగబూనరు.

శమీకుడు మునిబాలురను చేరబిలిచి శృంగి యొసంగిన శాపమును పరీక్షిత్తునకు వివరించమని చెప్పిపంపెను. మునిబాలురు శాప విషయమును పరీక్షిత్తునకు తెలిపిరి. శమీకుని విషయంలో తానొనరించిన తప్పిదమును తలచుకొని మఱల మఱల బాధపడుతున్న పరీక్షిత్తునకు శాపమును గూర్చి తెలియగనే అతని హృదయము తేలికపడెను. తన పాపానికి త్వరలోనే ఫలితము లభించినదని భావించెను. ఏడురోజులలో తన జీవితము సమాప్త మవుతున్నదని గ్రహించెను.

శాంతిని అన్వేషిస్తూ ప్రపంచమనెడి వనములో పరిభ్రమించే జీవుడే పరీక్షిత్తుడు. ప్రాపంచిక విషయానంద మనెడి పిపాస తీరేదిగాదు. పరిక్షిత్తుడు పిపాసా పీడితుడయ్యాడు. విషయపిపాస తీరేదికాదు. తృప్తి నిచ్చేదిలేదు. పరీక్షిత్తు పిపాస కూడా అలాగే తయ్యారైనది.

శాంత్యుపశమనములను పొంద నిచ్చగించిన పరీక్షిత్తు అన్వేషణలో శమీకుని ఆశ్రమాన్ని కనుగొనెను. శమమనగా మనోనిగ్రహమని భావము. మనస్సును నిగ్రహించిన వాడే శమీకుడు. అతడే సద్గురువు. సద్గురువు సదా అంతర్ముఖుడై యుండును. శిష్యుడు ప్రవేశించలేని ఆంతరంగిక హర్మ్యములో గురుదేవుడు నివసించుచుండును. ఆ కారణము చేతనే పరీక్షిత్తుని మాటలు శమీకునికి వినిపించలేదు,

శిష్యుడగువాడు విద్యారంభమున యున్న విద్యార్థియే గనుక ఆరంభశూరత్వము ఆవేశము యనెడి రెండు చక్రముల బండిపై సదా చరించుచుండును. ఆవేశపరుడైన శిష్యుడు ఆత్మాను భవముగల ఆచార్యుని ఆంతర్యాన్ని అర్థం చేసుకోలేడు. పైగా అపార్థము చేసికొనుటకు గూడ వెనుకాడడు. ఆవేశజనిత అపార్థజీవనము ఆచార్యుని అవమానపరచినా, అష్టకష్టములకు గురిచేసినా ఆశ్చర్యపడ నవసరములేదు. శమీకుని మెడలో పరీక్షిత్తు మృతసర్పాన్ని వేసెను. దారితప్పిన శిష్యుడు గురువు మెడకు గుదిబండయై నిలుచును. అంతమాత్రాన గురువు చలించునా? గోవింద పాదారవిందముల యందు చిత్తమును లయమొనర్చి చరించువానిని అయోమయ జీవుల అనర్ధ ఆవేశములు చలింపజేయగలవా? శమీకుడు చలించలేదు.

ఆచార్యుడు ఆగ్రహించక పోవచ్చు. అక్రమజీవనము అప్రతిష్టపాలు గాకపోవునా? కర్మ ఆచరింపబడిన తరువాత ఫలము అందకపోవునా? పరీక్షిత్తుని దోషమును గాంచి శృంగి కదలిపోయెను. శాపము నందించెను. శృంగమనగా కొమ్ముయని అర్థము. దేహమును దాటికొమ్ము పెరుగునట్లు కర్మ ఆగినను కర్మఫలము కదలి ముందుకుపోవును. అనుభవమును తప్పక అందించును. కర్మఫలమే శృంగి యని భావము. కర్మ ఫలానుభవమును అనుభవించక తప్పుదు. శృంగి శాపమూ అంతే.

కర్మఫలితాలు భగవదధీనములు. వాటిని ఎవరూ నివారించలేరు. విడచిన బాణాన్ని వెనుకకు మరలించలేని విధముగ ఆచరింపబడిన కర్మవలన కలిగే ఫలితమును నిరోధించ లేము. అలాగే శృంగి శాపము కూడ అనివార్యమై యున్నది.

పొరపాటు మానవ సహజము. మనిషే పొరపాటు చేస్తాడు. పశ్చాత్తాప హృదయంతో సవరించుకొని జీవిస్తే తాను మనీషి అవుతాడు. మనీషి యైనవానికి మహాత్ముల సహచర్యం లభిస్తుంది. మహాత్ముల సహచర్యం లభించినవాడు మహర్షి అవుతాడు.

తనను గాయపరచిన శిష్యుని గళమునుండి కూడ అమృతనాదమును ఆలకించవలెనని ఆశించువాడే ఆచార్యుడు. ఆచార్యునిది ప్రేమహృదయము. మాతృహృదయము. అమృత హృదయము. అమరజీవనము నందించు అపూర్వహృదయము.

తాను అవమానపరచిన శిష్యుని గూడ ఆ శీర్యదించే అమృతహృదయుడు సద్గురువు. పరీక్తిత్తుని చర్యకు శమీకుడు బాధపడలేదు. పైగా ప్రేమను చిందించాడు. మునిబాలురను పంపి కర్తవ్యమును సూచించినాడు.

దారి తప్పిన శిష్యుని గురువు తృణీకరించడు. విస్మరించడు. తన ప్రేమ వీక్షణములను సదా అతనిపై కురిపించుచునే యుండును. నిరంతరము ప్రవచనము లనెడి ముని బాలుర ద్వారా సత్యసందేశమును అందించుచునే యుండును.

శమీకుని సందేశాన్ని మునిబాలురు పరీక్షిత్తునకు తెలిపారు. పరీక్షిన్మహారాజుకు కనువిప్పు కలిగింది. శాపవార్త తనలో వైరాగ్యజనిత నెైరాశ్యమును నింపింది. ఇహలోక సౌఖ్యాలు, పరలోక భోగాలు తుచ్చమని పించింది. సమస్తమును పరీక్షిత్తు త్యజించాడు. మనస్సును మాధవుని యందే నిలిపినాడు. ప్రాయోపవిష్టు డగుటకు గంగాతీరమున కరుదెంచినాడు. .

మ|| తులసీ సంయుత దైత్య జిత్పద రజస్తోమంబు కంటెన్‌ మహో

జ్జ్వలమై దిక్పతి సంఘ సంయుత జగత్సౌభాగ్య సంవాదియై

కలి దోషావలి నెల్ల బాపెడి వియద్గంగా ప్రవాహంబు లో

పలికింబోయి మరిష్యమాణు డగుచుం (బాయోపవేశంబునన్‌

ముకుందుని చరణకమలముల చెంత అనన్య చింతనావ్రతుడై, సంగత్యము వీడి మునివ్రతు డయ్యెను. గంగానదిలో ధర్మాత్ముడెన పరీక్షిత్తుడు ప్రాయోపవిష్టుడై యున్నాడని తెలియగనే మహాత్ములూ, మహర్షి వర్యులైన మహాత్ములెల్లరు విచ్చేసిరి. విశ్యకళ్యాణ కర్తయగు విశ్చామి తుడు, పవిత్రాత్ముడగు పరశురాముడు, వరిష్టుడగు వశిష్టుడు, నారాయణ నామామృతపాన చిత్తుడగు నారదుడు, భ్రాజిత జ్ఞానరూపుడగు భరధ్వాజుడు, ఆత్మవిదుడైన అగస్త్యుడు, లోకమిత్రుడగు మైత్రేయుడు ఇత్యాది మహానుభావులందరు అరుదెంచిరి.

శమీకుని సందేశ మనెడి గురువచనము నాలకించగనే శిక్షణ యోగ్యుడెన శివ్యుడనెడి పరీక్షిత్తుడు స్ప౦దించెను. గురుబోధ నిజముగ అవగతమైనచో అట్టివరిలో మోహజాడ్యములు, అహంకార మాధ్యములు తల ఎత్తవు. సంగత్వము నశించును. జ్ఞానాభిలాష స్పురించును. అలాగే పరీక్షిత్తుని యందు వైరాగ్యముదయించి జ్ఞాన సముపార్జనకై హృది ఆరాటపడసాగెను. ఇదియే ఆత్మాన్వేషణ. ఆనందాన్వేషణ. ఆత్మకన్నా అన్యమైన విషయముల యందు మనస్సు చరించని, రమించని నైరాశ్య జీవనస్తితి.

విరాగియైన సాధకుడు గృహచ్చిద్రములను విలోకించుచు కూర్చొనడు. జ్ఞానగంగా తిరమును చేరును. ఆత్మార్పణ గొవించుకొని యైనను ఆత్మానుభూతి నొందుటకు 'ప్రయత్నించును. అదియే పరీక్షిత్తుని ప్రాయోపవేశము. పుష్పము విరబూయగనే ఆహ్వానముతో పనిలేకనే తుమ్మెదలు అరుదెంచునట్టు పరిశుద్దాంతకరణ గల సాధకుని ఉద్దరించుటకు మహాత్ములు అరుదెంచుచుందురు. అలాగే గంగాతీరమున ప్రాయోపవిష్టుడగు పరీక్షిత్తుని చెంతకు మహాత్ములు అరుదెంచినారు.

పరీక్షిన్మహారాజు మహాత్ములను అర్చించినాడు. వందన మాచరించినాడు. చేతులు జోడించి నమస్కరించుచు, వినమ్రతతో “మహానుభావులారా! మృతసర్పమును మహర్షి మెడలో అనాలో చితముగ పడవైచి అనర్థమును, అమంగళమును కొనితెచ్చుకొంటిని. ఈ పాపము తొలగు ఉపాయమును సెలవిండు. పవిత్రాత్మ స్వరూపులారా! ఈశ్వర సంకల్పమును ఎవరు కాదనగలరు? విధాత నిర్ణయాలను ఎవరు ఎదిరించి పోరాడగలరు? తక్షకునికి నా దేహమును సమర్పించుటకు సిద్దముగా యున్నాను. కాని రాబోవు జన్మజన్మలకు శ్రీ హరి పదాబ్జములపై చింతనాసక్తి నిలుచునట్లు ఈ భృత్యుని అనుగ్రహింపుడు” అని ప్రార్ధించెను.

తన పుత్రుడైన జనమేజయుని రప్పి౦చెను. రాజ్యభారమును అతని కప్పగించెను. మహాత్ములకు నమస్కరించి భక్తి పరవశుడైన పరీక్షిత్తుడు

క || ఏడు దినంబుల ముక్తిం గూడగ నే రీతి వచ్చు గురు సంసార

క్రీడన మేక్రియ నెడతెగు జూడుడు మా తండ్రులార శ్రుతి వచనములన్‌

అని (పార్ధించెను. అవును. ఏడురోజులలో ముక్తి ఎలా లభిస్తుంది? ఏ సాధన లాచరించిన శీఘ్రఫలము ప్రాప్తిస్తుంది? అని మహాత్ములు పరస్పరము చర్చించుకొనుచుండ, సకలాగమార్థ పారంగుడును, అకలంక గుణాభిరాముండును, అవధూత రూపుండును, సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుండును, వ్యాసపు(తుండును నగు శుకయోగి మహాత్ము డచ్చటికి అరుదెంచెను.

శుకబ్రహ్మ రాక సర్వులను పరవశింపచేసింది. ఆదిత్యుని కిరణ సమూహమును గాంచిన కమలములు విరబూయునట్లు శుకభాస్కరుని జ్ఞానతేజము వలన మహాత్ముల హృదయ పద్మములు విరబూసి ఆనంద మధువును చిందించినవి.

పరీక్షిన్మహారాజు శుకబ్రహ్మను అర్చించినాడు. గృహస్థుల ఇండ్లయందు పండ్రెండు నిముషముల కన్నను ఎక్కువసేపు నిలువని శుకావధూత పరీక్షిత్తుని పుణ్యముల పంటగా నేడులభించెను. చేసిన భక్తి ఎన్నడూ వృధాగాదు. చూపిన ప్రేమ ఎప్పటికీ నశించదు.

పరబ్రహ్మ స్వరూపులైన శుకయోగీంద్రులను పరీక్షిత్తు మనసారా కీర్తించాడు. ఆసన్న మరణు లైనవారు చేయదగిన కార్యమును ఎరుక పరచవలసిందని ఐదు పదిచేసి అర్థించాడు.

సీ ||అవ్యక్త మార్గుండ వైన నీ దర్శన మాఱడి వోనేర దభిమదార్థ

సిద్ధగావించుట సిద్దంబు నే డెల్లి దేహంబు వర్జించు దేహధారి

కేమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన

నేమి సేవించిన నెన్నడు సంసార పద్దతి బాసిన పదవి గలుగు

తే ||నుందు మనరాదు గురుడవు యోగి విభుడ వాపు బితికిన తడవెంత యంతసేపు

గాని యొకదెస నుండవు కరుణతోడ జెప్పవే తండ్రి ముక్తికై జేరు తెరువు

అని పరీక్షిన్న రేంద్రుడు శుకబ్రహ్మ నడిగెను. అభ్యర్థించెను. ప్రార్ధించెను.

King Pareekshit inherited the Pandava kingdom after Pandavas went for Mahaprasthana. One day the king went out for a hunt. After some time he got tired and was very thirsty. He started searching for water in streams and rivers with no avail. As he was searching, he found the asram of Sage Sameeka. At that time the sage was in deep meditation with eyes closed called samadhi. Pareekshit requested the sage for some water. But the sage did not open his eyes no matter how many times Pareekshit beseech him. Pareekshit got hurt and felt the sage was ignoring him. Even Indra is not immune to the needs of the senses. Pareekshit seething with anger decided to teach the sage a lesson.

As he looked around he found a dead snake near the asram. He picked it up and placed it around the neck of the meditating sage. This did not wake him up. Pareekshit was astonished and immediately came to the realization that the sage was not pretending to be meditating. He felt deeply sorry and headed back to his kingdom.

The act of Pareekshit placing the snake around the sage's neck was witnessed by some of the ashram dwellers. They ran to Srungi, the son of Sage Sameeka, and narrated to him what they saw. Srungi got very irate: "My father is divinity personified. He never hurt anyone and was always meditating on God. He never expects anyone to give him alms. How can a king who vowed to protect innocent people, insult my father in this way? Pareekshit should not repeat this mistake in another context."

Srungi went to Kousiki river and placed a curse on Pareekshit. "Nowadays kings have turned into crows that feed on waste matter. They are committing unforgivable sins. They are like dogs that ignore the master. Their transgressions should not be forgiven. I curse that the king will be bitten by the most poisonous snake called Taksha in seven days from now."

Meanwhile Sage Sameeka woke up from his meditation. He saw his irate son and the dead snake and understood what had happened. He felt very sad that Srungi placed a curse on the king. He went to his son and said:"Son, what a foolish act you have done! After Lord Krishna's demise the world has turned into a flock of sheep without a herder that is targeted by the thieves. Dharma is being ignored by the people. In such a circumstance, the great king Pareekshit is trying to restore dharma and morality. By cursing such a king you have done a great harm to this world. Whereas sinful people commit unjust acts without remorse, a pious person, because of prarabdha, after committing a sin feels remorseful. How can we ever replace a pious person like King Pareekshit? You must have invited him as a guest and not cursed him."

"Son, if King Pareekshit dies, this world will be taken over by immoral people. They will steal cows and women. Dharma will be obscure. This will turn people like monkeys and dogs that proliferate on kama. And they will go after wealth and ignore the spiritual path."

The sage felt enormously sad and prayed Lord Krishna to help him. He then commanded the bachelors in the asram who witnessed the King's grave act to inform the king about the curse.

After hearing about the curse, Pareekshit became very remorseful. Realizing the gravity of his sinful act he decided to give up his kingly comforts and renounce his kingdom. Praying to Sri Krishna he arrived at the banks of river Ganga.

Upon hearing that Pareekshit was going to end his life by drowning in Ganga, various sages and rishis came to visit Pareekshit.

Pareekshit prostrated before the sages and said: "By placing the dead snake around the neck of a great sage, I received this deadly curse. Please suggest a way to absolve this sin. Who can stand up to destiny? No one can escape destiny. I am ready to offer my body to Taksha. Kindly advise me on how to receive Lord Krishna's benevolence in the coming births."

He then called his son Janamejaya and abdicated the throne to him.

The sages were discussing how to make Pareekshit fit to receive salvation in seven days. No one knew how. At the time Sage Vyasa's son Suka came to visit them. He was considered as an ambassador of God and the most erudite person in the land. He would not stay at the homes of married couples for more than a few moments. With such piety he commanded utmost respect among the sages. They were relieved to see Suka and sought his intervention. Pareekshit made the oblations and told him his predicament.

No comments:

Post a Comment

Viveka Sloka 16 Tel Eng

Telugu English All మేధావీ పురుషో విద్వానూహాపోహవిచక్షణః । అధికార్యాత్మవిద్యాయాముక్తలక్షణలక్షితః ॥ 16॥ మేధావీ = మేధావంతుడ...