Wednesday, December 20, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Slokas 37-41)

upanishad


  


రెండవ ప్రకరణము

37

వీతరాగ విషయం వా చిత్తమ్

వీతరాగవిషయః = రాగద్వేషాదులు నశించిన వాని
			యొక్క ప్రవృత్తి

వా = లేక

చిత్తమ్‌ = చిత్తము

  రాగద్వేషాదులు నశించిన వారిచిత్తమును ధారణ చేయుట.
  


తనకు తెలిసినంతలో రాగద్వేషాదులు లేని వానిని గమనించాలి. 
అతను ఎట్టు జీవిస్తున్నాడు,  మాట్లాడుతున్నాడు, ప్రవర్తిస్తున్నాడు 
సూక్ష్మముగా తెలుసుకోవాలి. అతడేయే పరిస్థితులలో 
ఎలా  మెలగుచున్నాడో పరీక్షించాలి. దీనిని గురించి 
తైత్తిరియోపనిషత్‌ నందు
 
“అధయదితే కర్మవిచికిథ్సావావృత్త విచికిథ్సా
 వాస్యాత్‌ | యేతత్రబ్రాహ్మణా సంమ్మర్శినః | యుక్తా 
ఆయుక్తాః | అలూక్షాధర్మ కామాస్స్యుః    | యధాతే 
తత్రవర్తేరన్‌ । తధాత త్రవర్తేధాః |"

అని చెప్పబడినది నీకు పనులాచరించు సందర్భమున 
సందేహాము కలిగినచో అట్టి సమయమున నున్న జ్ఞానస్వరూపులును, 
ధర్మస్వరూపులును, విమర్శచేసి విడమరచి చెప్పువారును, 
యుక్తులైనవారును, క్రూర స్వభావము లేనివారును, అట్టివారు అటువంటి 
సందర్భములలో ప్రవర్తించు విధానమును గమనించి  అట్లు 
ప్రవర్తించుము. కనుక శాంతస్వభావము, మంచి పనులు 
చేసేవాళ్ళు, ప్రేమస్వభావులు, కార్యదక్షులు, వినయవంతులు, ఇతరుల
యెడ తమ కర్తవ్యాన్ని ఏమరుపాటు చెందక నిర్వహించువారు, 
అలాంటివారు నీ ఎరుకలో ఎవరున్నారో గమనించి వారు ఎటువంటి 
సందర్భములలో ఎలా  ప్రవర్తిస్తున్నారో చూడు. అ౦టే 
నీకు ఆందోళన కలిగించే పరిస్థితులపట్ల  కోపము, ద్వేషము 
కలిగించు పరిస్థితుల యందు వారు ఎలాప్రవర్తి౦చేరో, 
జ్ఞాపకమునకు తెచ్చుకో. అదే నీకు మార్గదర్శకము. వారెలా 
చిరునవ్వుతో, ఆదరణతో, (పేమతో, ఉల్లాసముతో తమ పమలను
చక్క పెట్టుకొ౦టూ , తోటివారికి కూడా అట్లే చేసి పెట్టటం 
జ్ఞాపకము౦టే, నీవెలాంటి పరిస్టితులలో  ఎలా ఉ౦డాలనే  విషయములపై
సందేహముండదు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మొదలైనవారు 
తమ జీవితములలోని  సంఘటనలతో, ప్రవర్తనలతో, తమ 
సమకాలికులకే గాక యుగయుగముల పర్యంతము మానవజాతికాదర్శ
పురుషులై నిలిచేరు. అటువంటి వారు అన్నియుగములలో 
అవతరిస్తూనేయున్నారు. వారినే గురువులంటారు. తనకు ఎవని 
ప్రవర్తన ఆదర్శప్రాయము, అనుసరణీయము అగునో అతడే తనకు 
గురువు.  వాని జీవిత సంఘటనలను, ప్రవర్తనలను గమనించి 
తానట్లు ప్రవర్తించటం అభ్యాసము చేయవలెను. దీని వలన తన 
జీవితము తనకు తెలియకుండానే  సంస్కరింపబడుతుంది. నిత్యము 
తన గురువును గూర్చి ఆయన ప్రవర్తనము గూర్చి, గుణ
గణములనుగూర్చి, ఆలోచించడటం వలన  ఆ ప్రభావము తన 
ప్రవర్తనయందు, పనులయందు ప్రతిబింబిస్తుంది. క్రమేణా తన 
యందు తానుండుటమాని తన గురువుండును. ఇదియే గురువు
శిష్యుడుగానగుట, లేక శిష్యుడు గురువగుట. ఇదియే "ఆచార్యః 
పూర్వరూపమ్‌, అంతే వాస్యుత్తర రూపమ్‌" అని కీర్తింపబడినది.
అంటే దీని వలన మనస్సు ఇంద్రియములు నిర్మలములై
తనయందు గురువను జ్యోతి వెలుగును.

38

స్వప్న నిద్రా జ్ఞానాలంబనం వా


స్వప్న = స్వప్నము
నిద్రా = నిద్ర
జ్ఞానాలంబనం = అట్టిజ్ఞానమును కలిగినట్టి
వా = లేక

 నిద్ర,  స్వప్నము ఎట్లుకలుగుచున్నవి అను తెలివిపై నీ
మనస్సు నుంచుము.

  


నీకు కలలెలా  వస్తాయో  గమనించు. నిత్యము కలలో
అనేక మందిని చూడడం, మాట్లాడడం చేస్తాము. అనేక 
విభిన్న తరహాలలోనున్న వ్యక్తులు కనిపించడం  అనేకరకములుగా 
మనయందు ప్రవర్తించడం జరుగుతుంది. వారిలో కొందరు 
కోప్పడడం, పోట్లాడడం, బ్రతిమాలడం, ప్రాధేయపడడం మొదలైన  వివిధ 
ప్రవర్తనలు చూపిస్తారు. అనేక వృత్తులవారు కనిపించవచ్చు.
పోలీసులు, దొంగలు, ఆఫీసర్లు మొదలైన వారెందరో కనిపిస్తారు. 
మనము వారితో ఎలా ఉన్నా, లేక వారు మనతో ఎలా ప్రవర్తించినా 
అది సత్యము కాదని మనకు తెలుసు. అ౦టే  అప్పుడు 
తెలియదు; మెలుకువ వచ్చినపుడు మాత్రము తెలుస్తుంది. కలలో
నున్నవుడు తెలియదు. అ౦టే  అప్పుడు సత్యముగానే మనస్సు 
ప్రవర్తిస్తుంది. వారితో కలసి మనము కూడా కోప్పడడం, ప్రాధేయ 
పడడం, మొదలైన  ప్రవర్తనలకు లోనగుతాం. ఇద అంతా 
మన మనస్సులోని అంతర్భాగమే. అ౦టే అలాంటి   వ్యక్తులు, వారి 
ప్రవర్తనలు మన భయాందోళనలు మొదలైనవన్నీ, మన
మనన్సు అను పదార్థముచే నిర్మాణ మైనట్టి రూపాలే. ఇవన్నీ 
మెలకువ వచ్చినపుడు అసత్యములైనప్పటికీ, కలలోనున్నప్పుడు
సత్యముగానే అనిపించును గదా! కలలో నొకడు కనిపించి కత్తి 
చూపించి, చంపబోవుచున్నాడనుకో. మనము భయముతో
బిగుసుకొనిపోయి, చెమటలు పట్టి, గుండె వేగముగా కొట్టుకొని
కేకలు పెడతాం కదా. అ౦టే కల అసత్యమే అయినా, 
దాని ప్రభావము సత్యముగా ఉంటుంది. ఇలా  సత్యమునే నిర్వచిస్తూ  
మన పెద్దలు "సత్యంచానృతంచ సత్యమభవతి" అని
చెప్పేరు. (సత్యము అబద్ధము అనురెండును కలసియే సత్యముగా
నుండును.) మన కలలోని వ్యక్తుల వంటి వారే మనచుట్టూ
నున్న పరిసరములు, వ్యక్తులు. మన మనస్సునుండి మన కలలోని
వ్యక్తులు తయారై నట్లు భగవంతుడను పదార్థముచే ఈ  ప్రపంచము, 
జీవులు మొదలైనవి నిర్మాణ మైనవి. భగవంతుని యందు
ఈ వ్యక్తులు పరిస్టితులు మొదలైనవి  ఏర్పడి, కలలో జరుగుతున్నట్లు 
జరిగిపోతున్నాయి. మనము కూడా భగవంతుని యందే ఉన్నా  
లేనట్లే  కలగాంచుచున్నాము. అనగా ఈ పరిసరములు, వ్యక్తులు
(కలలో సత్యము లైనట్లు) మనకు సత్యములగుతున్నాయి. మెలకువ 
వచ్చిన వెనుక ఇది అంతా అబద్దమే అని తెలియవస్తుంది. 
కాని కలలో నున్నపుడు మాత్రము అవి సత్యములేకదా! అ౦టే 
అవి అసత్యములేమో అను ఊహ మనలో నుండవచ్చును. గాని, 
కలగను మనస్సుకు, కల యున్నంతసేవు కల ప్రభావము కలుగుతూనే 
ఉంటుంది. ఇక్కడ మన ఊహ కన్నా సత్యమనేది  వేరుగా నున్నది.
 మనము మేలుకొనువరకు కల మనపై 
ప్రభావము కలిగిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ  నమ్ముట,
వూహించుట మొదలైనవాని కన్నా పైన మేలుకొనుట యనునది 
వేరుగా ఉంది. మేలుకొనుట అనుభవమునకు సంబంధించినది.
మేలుకొనుట అను అనుభవము కలగనుచున్నవాడు ఎంత తనను 
కొనుచున్ననూ సంభవించేదికాదు. అనగా మేలు కొలుపు 
వాడు వేరొకరుండాలి. అతనిని గురువు అంటారు.  

అలానే  నిద్రను గమనించు.  నీవు నిద్రిస్తున్నప్పుడు 
నీవుండవు. అ౦టే  మనస్సు, ఇంద్రియములు మొదలైనవి 
ఉండవు. అ౦టే  అవి నీయందున్నా నీవు వానియందుండవు.
గాఢముగా నిద్రించుచున్నవాని ప్రక్కన చక్కని పాట పాడితే 
అది వానికి వినిపిస్తుందా? అలాగే  కొందరికి కండ్లు తెరిచి 
నిద్రించడం అలవాటు. అలాంటి వారికి నిద్రిస్తున్నప్పుడు ఎదురుగా 
చక్కని చిత్ర పటము చూపించినా, వారికి తెలీదు. మెలకువగా 
ఉన్నప్పుడు మన వంటిపై ఏదైనా ప్రాకినట్లనిపిస్తే  అది 
తేలో, పామో అని భయపడతాం. గాఢంగా నిద్రించుచున్నవాడి 
కాలిపై ఒక తేలు పాకితే, అది వాడికి తెలీదు. అంటే తన శరీరము,
మనస్సు, ఇంద్రియములు మొదలైనవానికన్నా వేరుగా 
తాను౦టాడు. నిద్రిస్తున్నప్పుడు గుండె కొట్టుకోవడం,
శ్వాస తీయడం మొదలైనవి జరుగుతాయి. అంటే ఆయా 
భాగములుగా తానే పనిచేస్తున్నాడు. నిద్రించునపుడు తానెట్లున్నాడో 
సృష్టి నశించినప్పుడు పరమాత్మ అలాగే యున్నాడు. అనగా
ఈ  సమస్తలోకములు తనయందే కరిగి, తానొక్కడే ఉంటాడు. 
నిద్రిస్తున్నప్పుడు మన గుండె వూపిరితిత్తులతో  మనము
మేల్కొనియున్నట్లు  ఈ ప్రళయస్థితిలో అతడు మెల్కొని
యుంటాడు.

ఇట్లు కలయందు, నిద్రయందు, మనమున్నట్టు పరమాత్మ
సృష్టియందు, ప్రళయమునందు ఉన్నాడు. ఇటువంటి  ధ్యానము 
మార్కండేయ మహర్షిచేత మానవజాతికి ప్రసాదించబడినది.

40

పరమాణు పరమమవాత్త్వాన్తో అస్య వశీకారః


పరమాణు = పరమాణువు లేక మిక్కిలి
		సూక్ష్మ మైనది
పరమ మహత్వ = మిక్కిలి పెద్దది
అంతః = చివర
అన్య = వీనియొక్క
వశీకారః = వశీకరణము

  
అత్యంత సూక్ష్మమైన స్టితి మరియు పెద్దది అయిన స్టితి
అను రెండును అతనికి వశమగును.

  


పైన చెప్పబడినట్లు ఒక మార్గమున ధ్యానము చేస్తే 
అతడు మిక్కిలి సూక్ష్మ మైనది ఉన్నత మైనది అనే 
రెండు స్థితులకు అధిపతి అవుతాడు. అన్నిటికన్నా సూక్ష్మమైనది 
అలాంటి  పేరే తప్ప మరియొకటికాదు. అణువు, పరమాణువు మొదలైనవి
సూక్ష్మ మైనవని అనిపించవచ్చు. ఇలా ఒకదానికన్నానొకటి
నూక్ష్మ మైనవని గమనించుకుంటూ పోగా, చివరకు సూక్ష్మము అనే 
శబ్దము మాత్రమే మిగులుతుంది. కనుక సూక్ష్మము అనే పదము 
నిజానికి  అర్హరహితము. దీని కర్థమేమ౦టే, "నీవు ఊహించ
గలిగినంత సూక్ష్మము" అని చెప్పవచ్చును. కనుక అన్నిటి కన్నా
ఊహే సూక్ష్మము. అలా  ఊహ నీలోనే ఉంది. అ౦టే  నీలోని
భాగమే. అది నీలోని భాగమైయుండడాన్ని గమనించడమే  దానిని
జయించడం లేక వశవరచుకోవడం. అలాకాక అటువంటిదొకటి 
వేరేగా నున్నదని విశ్వసిస్తే, అప్పుడు నీకూ  దానికీ పొత్తుకుదరదు. 
అంటే నీయందది యుండదు.  దాని యందు నీవుండవు.
కనుక అది నీనుండి  వేరుగానుంటుంది. కనుక నీవు దానికధిపతివి 
కాలేవు, ఇలా ఉన్నతమైనది కూడా  నీవు ఎంతో పెద్దదానిని 
గురించి ఊహించినా, అదికూడా నీ  ఊహే. అటువంటి ఊహాలోనే 
నీవున్నావు. కనుక అటువంటి ఉన్నతమైనది కూడా నీలోని 
భాగమై నీకు వశమవుతోంది. ఇదే అంతర్యామిత్వము. ఇలాగ 
సూక్ష్మము, ఉన్నతము(లేక స్థూలము) అను రెండు స్థితులుగా, 
నీ ఊహగా యున్న పరమాత్మే సత్యము. 
అటువంటి  పరమాత్మను శరణాగతి పొందడం వలన  స్థూలము, సూక్ష్మము 
అనే రెండు స్థితులనూ మానవుడు వశపరుచుకొంటాడు. 

41


క్షీణ వృత్తేరభిజాతస్యేవ మణేర్గృహీతృ 
గ్రహణ గ్రాహ్యేషు తత్స్థ తజ౦జనతా సమాపత్తిః 


క్షీణవృత్తేః  = బాహ్య వృత్తులు నశించిన వానికి 
అభిజాతస్య = ఉత్తమమైన స్టితికి  చెందినట్టి 
మణేః  + ఇవ = మణివలె
గ్రహీతృ =  గ్రహించినవాడు
గ్రహణ = గ్రహించుట
గ్రాహ్యేషు = గ్రహింపబడువిషయముల యందు
తత్‌ + స్థ  = అక్కడనున్నట్టి
తత్‌ + అంజనతా = చూవునందున్నట్టి అంజనము
సమాపత్తిః = ధారణచేయబడుట

  బాహ్య వృత్తులు నశించిన వాని చిత్తము ఉత్తమ జాతికి 
చెందిన మణివలె స స్వచ్ఛమగును. అది గ్రహించు వాడు, [గహిం
చుట గ్రహింపబడునది అను వానిని ప్రభావితము చేయును.
ఆ ప్రభావము మణిది మాత్రము కాదు.

  

ఉత్తమ జాతికిచెందిన మణి స్వచ్చమైన స్ఫటిక౦లా 
నిర్మలముగా ఉంటుంది. దానికి తన స్వ౦త వర్షము లేదు.
అది దేనియందుంటుందో  దాని వర్ణాన్ని  ప్రతిఫలిస్తుంది. అది
(పతి ఫలించు వర్షము దానిని, గ్రహించిన వానిపై 
ఆధారపడిఉంటుంది  గానీ దానికి స్వంతముగా వేరే వర్షము లేదు. అలాంటి 
మణులను ఒక దారముతో కలిపి గ్రుచ్చి, దండలా చేస్తే  ఆ
దండకు  ఆ దారపు రంగు ఉంటుంది. లేక ఎవరైనా ధరిస్తే,
వారి వర్షమే ప్రతిఫలిస్తుంది. అ౦టే మణికి స్వంత వర్ణ౦ 
లేదు. సూర్యకాంతిలో దానిని స్ఫటికములా పట్టుకొ౦టే, 
వర్ణ విశ్లేషణమువలన  అనేక రంగులు వస్తాయి. ఈ రంగులు మణి 
లోనివి కావు. అ౦టే  మణిద్వారా రావచ్చును గానీ, మణి వలన 
వచ్చినవి కావు. అలాగే  నీవొక యోగిని సమీపించి కొన్ని 
విషయముల నడిగితే అతడు చెప్పే సమాధానములు నీకు 
సంబ౦ధించినవి కాని యోగికి సంబంధించినవి కావు. యోగి మనస్సు 
ఎప్పుడునూ స్వచ్చమే. ప్రశ్నలడుగు వాని ప్రవృత్తే  యోగి 
మనస్సు లో ప్రతిఫలించి తగిన సమాధానము ఇస్తుంది. అలాగే  
యోగి మిక్కిలి ఆసక్తికరముగా బోధచేస్తే, ఆసక్తి  అనేది 
వినేవారికి  సంబంధించినది కాని యోగికి సంబ౦ధించినది కాదు. 
యోగికి అసక్తి లేదు. అతడు ఉపన్యసిస్తున్నపుడూ, తరువాత కూడా 
ఒకలాగే ఉంటాడు. అందుచేతనే యోగి అయినవారికి సమస్యలుండవు. 
వానికున్నవి అన్నియూ పరిష్కారములే. వాని యందు సత్యము౦టుంది.  
ఆ సత్యమే (ప్రశ్న) అడిగే వానికి సమాధానముగా వ్యక్త మవుతుంది. 
వాని యందు కారణముండదు. కనుక, వానికి వేరేగా ఫలితము 
లుండవు. వానిలో ఉన్నది ఒక్కటే. అదే సత్యము. అతడటువంటి 
సత్యములో ఉంటాడు.  కనుక, అలాంటి  సత్యమే మిగిలిన
వారికి వివరణగా వస్తుంది. కాని యోగి ఎల్లప్పుడూ వివరణ 
అక్కరలేని స్థితియ౦దుంటాడు. 

No comments:

Post a Comment

Viveka Sloka 16 Tel Eng

Telugu English All మేధావీ పురుషో విద్వానూహాపోహవిచక్షణః । అధికార్యాత్మవిద్యాయాముక్తలక్షణలక్షితః ॥ 16॥ మేధావీ = మేధావంతుడ...