Wednesday, December 13, 2023

Patanjali Samaadhi Paada Fourth Prakarana (Sloka 35)

upanishad


  


నాలుగవ ప్రకరణము

35

విషయవతీ నా ప్రవ్నత్తి రుత్సన్నామనసః స్థితినిబంధనీ


విషయవతీనా  = విషయముతొ కూడినదై ననూ
ప్రవృత్తి: = ప్రవృత్తి
ఉత్పన్న = అంకురించినదై 
మనసః = మనస్సుయొక్క
స్థితినిబంధనీ  = స్థిరత్వము కలిగించునది


విషయముతో కూడిన ప్రవృత్తి ఉత్పన్నమై మనస్సునకు 
సిరత్వ్యము కలిగించును.

  





ఒకే తత్వమును మనస్సుపై నాపాదించడంవలన మనస్సు 
విభిన్న తరహాలనుండి విడివడి, ఏకోన్ముఖమౌతుందని పై సూత్రాలలో 
వివరించబడినది. అలాంటి ఒకే తత్వమును మనస్సుకు 
అలవరచాలంటే, మనస్సుకు ఒక (కొత్త కార్యక్రమము అ౦టే 
షనిని, అలవరచాలి. వాటిని గురించి కొన్ని ఉదాహరణములు 
పైన చర్చించబడ్డాయి. అలాంటి నూతన కర్తవ్యము వైపు మనస్సును 
మరలిస్తే  మనస్సులో సంస్కారముల రూపమునున్న 
ప్రవృత్తులన్నీ మనస్సును వదలిపోతాయి. అనేక దైవారాధన 
కార్యక్రమములు, అర్చనలు, యజ్ఞములు,  క్రతువులు, ధ్యాన  
ప్రక్రియలు, మంత్రోపాసనలు ఇలాంటి  నూతన సంస్కారములనుద్దేశించినవే.
అటువంటి కార్యక్రమమొకదానిని ప్రారంభించి శ్రద్దతో అనుష్టిస్తే, 
తనకు తెలియకుండానే పూర్వపు విషయవాసనలు అ౦టే 
దురభ్యాసములు, కామక్రోధాదులు తనను వదలిపోగలవు. నూతన
కార్యక్రమములోని  ఆకర్షణ, ఉత్సాహము మనస్సును మరలుస్తాయి.
అంతకు ముందున్న దురలవాట్లు మొదలైనవి తనకు తెలియకుండానే 
మనస్సునుండి జారిపోతాయి. తన  ప్రవృత్తులు, మానసిక
సంఘర్షణలు, వాటిలోని  సమస్యలు అన్నీ క్రమేణా జారిపోతాయి. 
నిజానికి  సమస్యలనేవి భౌతికములు కావు. ఒకడు
ఇల్లు కట్టడ౦  గురించి సతమతమవుతే , ఇటుకలలోగాని, 
సిమెంటు, ఇసుక మొదలైన వాటిలో  సమస్య
లేదు.  వాటిని గురించి తన ఊహలలో తాను పొందుతున్న
సంఘర్షణే  తనకు సమస్య. ఒకడు రైలెక్కడానికి  అతి తక్కువ
వ్యవధిలో స్టేషనుకు వచ్చినపుడు టికెట్టు తీసుకోడానికి  అనేకమంది 
వేచి ఉంటే  అప్పుడు తనకు కలిగే  ఆందోళన రైలుకు 
గానీ, టికెట్టుకుగాని, టిక్కెట్టుయిచ్చేవాడికి గానీ సంబంధించినది
కాదు. రైలెక్కే వరకూ అతను ఆందోళనతో తల్లడిల్లి పోతాడు. 
ఇక్కడ  రైలెక్కడం అనేది సామాన్య విషయము. ప్రతిదినము
బయలుదేరే ఆ రైలుకు గానీ, స్టేషనుమాష్టరుకు గానీ  గార్డుకు 
గాని రైలు బయలుదేరడం  గురించి  ఆందోళన సంఘర్షణ
లేవు. ఇలాగ  ప్రకృతిలో సామాన్య౦గా  జరిగే  విషయాలను 
గురించి  మానవుడు  ఆందోళన పెంచుకొ౦టాడు. మిగిలిన 
ప్రకృతి జీవులకది లేదు. ఒక చెట్టు నరకబోతే  ఆ చెట్టులో  
ఆందోళనలేదు. అలాగే  జంతువులకు సహితము 
మరుదినము ఆహారము దొరకునా అనే  ఆందోళన లేదు. 
ప్రకృతిలో  మిక్కిలి సహజమైన విషయాలను గురించి తాను
ప్రకృతిలోని  అన్ని జీవరాసులకన్నా వివేకవంతుడనని గర్వపడే 
మానవుడు ఆందోళన చెందుతున్నాడు. పుట్టడం, చనిపోవడం,
వ్యాధి, ఆకలి దప్పులు, ముసలితనము మొదలైనవన్నీ ప్రకృతిలో 
సహజములేయని తెలిసిన మానవుడు ఆందోళన 
పడడం మానలేదు. కాబట్టి ఆందోళన మానసికమే కాని భౌతికము
కాదని తెలుస్తోంది. అలాగే ఆస్తి గురించి కోర్టు కెక్కే  సోదరులకు, 
కోర్టు సమస్య వారి మనస్పులలో ఉంది  కాని ఆస్తి గురించి 
లేదు. అది (ఆస్తి) అనుభవించేవానికి సుఖము కలిగిస్తుంది. 
అది చేతకానివానికి దుఃఖమును కలిగిస్తుంది.

ఇలాగ  ఆందోళనాయుతమైన మనస్సుని ఆందోళనపడవద్దని 
బుద్ది చెప్పి ప్రయోజనములేదు. అలాంటి మనస్సును అంతకన్నా
ఎక్కువ ప్రభావితము చేయగల కర్తవ్యమువైపుకు (తిప్పాలి. 
పైన చెప్పబడినవే గాక సంగీతశాస్త్రము, జ్యోతిశ్సాస్త్రము,
వేదములు, ఉపనిషత్తులు, పురాణములు మొదలైనవెన్నో  
మానవునకు ప్రసాదింపబడ్డాయి. వీటన్నిటి పరమావధి మనస్సును 
అనుదిన సంఘర్తణ నుండి మరల్చడానికి.   మహానుభావులైన 
మహర్షులు  గురువులు మానవజాతిని ఇట్టి దుస్టితినుండి లేవనెత్తడానికి 
అనేక యుగములు తపస్సు చేసి వీటిని కనుగొన్నారు. మనస్సులోని 
సంఘర్షణ నిర్మూలమవ్వాలంటే  ఇంతకన్నా 
వేరే మార్గము లేదు. ఆశ్రమములు నిర్మాణము చేయడం, అడవులలో 
ఒంటరిగా నివసించడం, దేవాలయనిర్మాణము, శిల్పములు 
చెక్కడం, పూలతోటలు పెంచడం మొదలైనవన్నీ ఇదే పరమార్థము 
కలిగినవి. ఇక్కడ  పరమాత్మను ఫూలతోనర్చించడం 
అయనను ఉద్ధరించడానికి  కాదు. తన్నుతాను ఉద్దరించుకోడానికి 
ఆపూలు పూయడానికి  తాను పడిన శ్రమ, దానిని 
గురించి  శ్రద్ధ వహించడం, నిరంతరము శ్రమించడం, మొదలైనవి 
మనస్సుకు వ్యాపకము కల్పించుకోవడం.  దాని వలన
మనస్సులో గూడు కట్టుకొన్న అభిప్రాయములు, ఉద్దేశ్యములు,
సమస్యలు బాధలు క్రమేణా వాటంతట అవే  అంతరిస్తాయి.

కాబట్టి ఏదైనా  తన స్వభావమునకు సరిపడినది,  తనకాసక్తి
కలిగించేది, ఉత్సాహము, ఉత్తేజము, ఆనందము కలిగించేది 
అయిన కర్తవ్యమునొకదానిని ఎన్నుకొనాలి. అది సాధ్యమైనంత
సామాన్యముగా ఉండాలి. ఆడంబరాలికి  ప్రాధాన్యతనివ్వక,
వీలైనంత సులభముగా, చక్కగా నిర్వహంపగలిగేటట్టు చూసు 
కోవాలి. గొప్పదనము, ఇతరులతో పోటీపడడం మొదలైనవి 
వర్జి౦పాలి. దేవాలయ నిర్మాణానికి సంకల్పిస్తే, అది
తన శక్తి సామర్హ్యములననుసరించి స్వీకరించాలి గాని, ఇతరులెవరో 
ఎక్కడో అటువంటి  దేవాలయాన్ని గొప్పగా నిర్మించేరనీ, 
తానంత కన్నా గొప్పగా నిర్మించాలనీ ప్రయత్నించరాదు,.
తన సామర్హ్యము, తన తోటివారి సహకారము మొదలైన  అంశములపై 
ఆధారపడి తన ప్రణాళిక నేర్పరుచుకోవాలి. అంతేకాని
అలాంటి వాటికి పోటీలు మొదలైనవి పనికి రావు. వాటి వలన మరల
మనఃక్లేశములు, అసూయా, ద్వేషములు, స్పర్థ మొదలైనవి
ప్రకోపించి మొదటికే మోసము వస్తుంది. దేవాలయ నిర్మాణము
మొదలైనవి తనలో శాంతము, ఓర్పు మొదలైనవి  కలుగడానికే 
గాని ఆవేశములు, స్పర్ధ మొదలైనవి పెరగడానికి కాదుకదా!

No comments:

Post a Comment

Viveka Sloka 16 Tel Eng

Telugu English All మేధావీ పురుషో విద్వానూహాపోహవిచక్షణః । అధికార్యాత్మవిద్యాయాముక్తలక్షణలక్షితః ॥ 16॥ మేధావీ = మేధావంతుడ...