Friday, March 25, 2022

Book3-Index

క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము

13.1
13.2
13.3
13.4
13.5-13.6
13.6
13.7
13.8
13.9
13.10-13.11
13.12
13.13-13.15
13.16-13.17
13.18-13.19
13.20-13.21
13.22-13.23
13.24-13.25
13.26
13.27-13.28
13.29-13.30
13.31-13.34

గుణత్రయ విభాగ యోగము

14.1-14.2
14.3-14.4
14.5
14.6
14.7
14.8
14.9
14.10
14.11
14.12
14.13
14.14-14.15
14.16
14.17
14.18
14.19-14.20
14.21
14.22-14.23
14.24
14.25
14.26
14.27

పురుషోత్తమ ప్రాప్తి యోగము

15.1
15.2
15.3-15.4
15.5
15.6
15.7-15.8
15.9
15.10
15.11
15.12
15.13-15.14
15.15
15.16
15.17-15.19
15.20

దైవాసుర సంపద్విభాగ యోగము

16.1-16.3
16.4
16.5
16.6
16.7-16.9
16.10
16.11
16.12
16.13
16.14-16.15
16.16
16.17-16.20
16.21-16.22
16.23-16.24

శ్రద్ధాత్రయ విభాగ యోగము

17.1
17.2
17.3
17.4
17.5-17.6
17.7-17.10
17.11-17.13
17.14-17.16
17.17-17.19
17.20-17.22
17.23-17.26
17.27-17.28

మోక్ష సన్యాస యోగము

18.1-18.2
18.3-18.4
18.5
18.6-18.10
18.11
18.12
18.13
18.14-18.16
18.17-18.18
18.19-18.22
18.23-18.25
18.26-18.28
18.29-18.32
18.33-18.35
18.36-18.39
18.40-18.44
18.45-18.48
18.49-18.50
18.51-18.52
18.53
18.54-18.56
18.57
18.58
18.59-18.60
18.61-18.62
18.63-18.64
18.65-18.66
18.67
18.68-18.69
18.70-18.71
18.72-18.73
18.74-18.78

Thursday, March 10, 2022

Chapter 18 Section 32

Bhagavat Gita

18.32

సంజయ ఉవాచ:

ఇత్యహం వాసుదేవస్య పార్థస్య చ మహాత్మనః {18.74}

సంవాద మిమ మశ్రౌష౦ అద్బుతం రో మహర్షణమ్

ఈ విధముగ ఆశ్చర్యకరమైనదియు, గగుర్పాటును కలిగించునదియు, మహాత్ముడైన అర్జుననుకును, శ్రీ కృష్ణునకు మధ్య జరిగిన ఈ సంవాదనమును వింటిని

వ్యాసప్రసాదా చ్చృతవాన్ ఏతద్గుహ్యమహం పరం {18.75}

యోగం యోగేశ్వరాత్ కృష్ణాత్ సాక్షాత్కథయత స్స్వయమ్

వ్యాస భగవానుని అనుగ్రహము వలన గుహ్యమైనట్టియు, ఉత్తమమైనట్టియు నగు ఈ యోగ్యశాస్త్రమును యోగీశ్వరుడైన శ్రీ కృష్ణుడు చెప్పుచుండగా నేను ప్రత్యక్షముగా వినగలిగితిని

రాజన్ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య సంవాద మిను మద్భుతం {18.76}

కేశవార్జునయోః పుణ్యం హృష్యామి చ ముహుర్ముహుః

ధృత రాష్ట్ర మహారాజా! శ్రీ కృష్ణార్జునుల కళ్యాణకరమైన, అద్భుతమైన ఈ సంవాదమును భావించుకొలదియు నేను పరవశించి పోతున్నాను

తచ్చ సంస్స్మ్రుత్య సంస్స్మ్రుత్య రూపమత్యద్భుతం హరేః {18.77}

విస్మయో మే మహాన్ రాజన్ హృష్యామి చ పునః పునః

రాజా! శ్రీహరి యొక్క అత్యంత ఆశ్చర్యకరమైన విశ్వరూపమును తలచిన కొలదియు నాకు గొప్ప ఆశ్చర్యము కలుగుచున్నది. ఆనందము కలుగుచున్నది.

యత్ర యోగేశ్వరః కృష్ణో {18.78}

యత్ర పార్థో ధనుర్థరః

తత్ర శ్రీ ర్విజయో భూతిః

ధృవా నీతిర్మతిర్మమ

యోగేశ్వరుడగు శ్రీ కృష్ణుడును, ధనుర్థరుడైన అర్జునుడును ఎచ్చట ఉందురో అచ్చట సంపదయు, విజయము, ఐశ్వర్యము, సుస్థిరమగు నీతి (రీతి) యుండునని నా అభిప్రాయము

ఎక్కడైతే కృష్ణుడు, అర్జునడు వలెనుండి ఈ కాలాతీతమైన సత్యాలచే మార్గదర్శకత్వం పొందుతారో అక్కడ కాంతి వలె నుండెడి శక్తులు విజయవంత మౌతాయి. జీవితము గ్రుడ్డి శక్తులచే మలచబడే గ్రుడ్డి వస్తువు కాదు. భౌతిక శాస్త్రములోని సిద్ధాంతముల వలె, ఆధ్యాత్మిక శాస్త్రములోని సిద్ధాంతాలు మన ఐకమత్యానికై ఉన్నాయి. ఆ ఐకమత్యాన్ని పాటించకపోతే కొన్ని దుష్ఫలితాలు వస్తాయి. అలాగే దానికనుగుణంగా నడిస్తే ప్రపంచం మనకు చేయూత నిస్తుంది. మనం మానవ మాత్రులమే, కానీ విశ్వ శక్తులు మనకు మద్దతు ఇస్తాయి. మహాత్మా గాంధీ ఇట్లు చెప్పెను:

నేను చేసిన శపథం గొప్పదీ కాదు, ప్రత్యేకమైనదీ కాదు. దేవుడు శరణాగతి కోరిన వారందిరినీ రక్షిస్తాడు. గీత చెప్పింది భగవంతుడు త్యాగ౦ చేసిన వారలచే కర్మ చేయిస్తాడు. ఇక్కడ ఎటువంటి భ్రాంతి లేదు. నేను చెప్పినది ఒక సామాన్య శాస్త్రీయ సిద్ధాంతం. ఎవరికైతే ఓర్పు, సంకల్పం ఉందో వారు దీన్ని పరీక్షించవచ్చు. తద్వారా వాళ్ళు అర్హతను సంపాదించవచ్చు. ఇవి తొందరగా అర్థంఅవుతాయి. ధృడత్వం ఉంటే అవి సులభంగా వంటబడతాయి.

గాంధీ దేశానికి తండ్రివంటివాడు అంటారు. ఆయన ప్రపంచ రాజకీయ చరిత్రలో చిరస్మరణీయుడు. ఆయన మనకు చూపినది ఒక సామాన్య మానవుడు తన శక్తిని బహిర్గిత౦ చేసి, దేవుని కృపచే పనిముట్టువలె పనిచేసి, ప్రపంచాన్ని కొంతవరకు మార్చవచ్చు.

గాంధీని అర్థం చేసికోవాలంటే గీతని అర్థం చేసికోవాలి. అలాగే గీతని సులభంగా అర్థం చేసికోవాలంటే, గాంధీని అవగాహనకి తెచ్చుకోవాలి. ఆయని గొప్ప ప్రవచనం ఏమిటంటే చెడుకి శాశ్వతమైన స్థానం లేదు. దేవుడు నిజము. అతడు మన అంతర్గతమైన శక్తుల సముదాయము. అతన్ని తీసి పారేయలేము, మార్చలేము, మోసుకుపోలేము. చెడుకి ఉనికి మనము దానితో సహకరిస్తున్నప్పుడే. మనం సూర్యుని ముందు నుంచుంటే, మన నీడ పడదా? మార్గంలో చీకటి ఉంది. అయినా సూర్యుడు ప్రకాశిస్తాడు. సూర్యుని కాంతికి కలిగే అవరోధాన్ని తీసేస్తే నీడ పోతుంది. చెడు నీడ వంటిది. అది కాంతికి కలిగిన అవరోధాన్ని తీసేస్తే మాయ మౌతుంది. చెడుకు సహకారం చేసే వారికి ఒక భయానకమైన బాధ్యత ఉంది : కొంతకాలం చెడుకు ఉనికి ఉన్నట్లు ప్రవర్తిస్తారు. కానీ దానికి సహకారం ఆపితే --అనగా నిర్దయ, అవినీతి, హింస, యుద్ధం మొదలైనవి--చెడు మాయమౌతుంది.

మనము రాష్ట్రపతులను, ప్రధాన మంత్రులను మన సమస్యలను పరిష్కరించడానికి ఉపయోగించుకోనక్కరలేదు. మనం అంతర్ముఖులమవుతే చాలు. నేను ఐకమత్యాన్ని విఫలం చేసే శక్తికి సహకారం ఆపితే, నేను చెడును కొంత లేకుండా చేసినట్టు. అది మనలో గొప్ప శక్తిని విడుదల చేసి, మన కర్మలను, బాంధవ్యాలను ప్రభావితం చేస్తుంది. ఆ శక్తి క్రమంగా మన చుట్టూ ఉన్నవారి జీవితాల్ని ప్రభావితం చేస్తుంది.

గాంధీ వ్యష్టి యొక్క సామర్థ్యతను వివరిస్తున్నాడు. సత్యానికి ఎందరో అవసరం లేదు. ఎవడు చెడుని మనసా వాచా కర్మా విడనాడితే, వానికి ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంటుంది. గాంధీని "మీరు అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యాన్ని ఎలా ఎదుర్కొని విజయ౦ పొందేరు?" అని అడిగితే, ఆయన సమాధానం: "అది నేనే చేసేనని ఎలా అంటారు? నేను ఒక పనిముట్టును మాత్రమే". ఆయన చెప్పేది దేవుడు --అనగా సత్యము, ప్రేమ, ఐకమత్యము--ఎల్లప్పుడూ ఉన్నాడు. తన అహంకారాన్ని ఖాళీ చేసి, తన అంతర్గత శక్తికి ఒక వాహనంలా పనిచేసేడు. ఇది అయినప్పుడల్లా, కొంత ఆలస్యమైనా--ఇతరుల హృదయాలు స్పందిస్తాయి.

మనముందున్న శక్తులను పరిశీలిస్తే, మన చిన్న వ్యక్తిత్వం ఎలా వాటిని ఎదుర్కోగలదనే అనుమానం రావచ్చు. శ్రీకృష్ణుడు చెప్పేది "నువ్వు ఒక్కడివే పని చేస్తున్నవాని ఎందుకు తలుస్తున్నావు?" గురుత్వాకర్షణ ఎలా సదా భూమ్మీద ఉంటుందో, ప్రేమ, సత్యము, దయ అన్ని చోట్లా ఉంటాయి. అలాగే ప్రేమ, ఐకమత్యము జీవితానికి సహజం. మనమెలా వాటికి స్పందిస్తామో, ఇతరులూ అలాగే స్పందిస్తారు. మనం కర్మ ఫలాన్ని దబాయించి అడగలేము. "నీ కర్మ నువ్వు చెయ్యి. దాని ఫలితం నాకు వదిలిపెట్టు" అని శ్రీకృష్ణుడు చెప్పేడు.

ఆధ్యాత్మిక సాధన చాలా కఠినమైనది. దాని వలన జ్ఞానము పొందడం అతి కష్టం. దైవ కృపవలనే అది సాధ్యం. అదే లేక పోతే ఈ ప్రపంచానికి భవిష్యత్తు లేదు.

మనం ఒక్కళ్ళమే లేము. మన ప్రపంచం యాధృచ్చికంగా ఆనందం, ప్రేమ, కాంతి, దిశ, శాంతి, బాధ నుంచి ఉపశమనం లేక లేదు. మన చుట్టూ గాలి, కాంతి, గురుత్వాకర్షణము ఉన్నట్టే సృజనాత్మక శక్తి ఉన్నది. మనం వాటితో ఏకీభావంతో ఉండక పోతే అవి మనకి సహకరించలేవు. మన ఏకీభావం ఇవ్వగలిగితే, ప్రేమ జయిస్తుంది. ఇది గుర్తు పెట్టుకొంటే విశ్వాసం, ఆశ కలిగి విజయం తప్పక వస్తుంది.

Chapter 18 Section 31

Bhagavat Gita

18.31

కచ్చి దేత చ్చృతం పార్థ త్వయైకాగ్రేణ చేతసా {18.72}

కచ్చి దజ్ఞానసమ్మోహః ప్రణష్ట స్తే ధనంజయ

అర్జునా! నిశ్చల చిత్తముతో నీవు గీతా శాస్త్రమును ఆలకించితివా! అజ్ఞానము వలన కలిగిన నీ మోహము నశించినదా?

అర్జున ఉవాచ :

నష్టో మోహః స్మృతిర్లబ్ధా త్వత్ప్రసాదాన్మయా అచ్యుత

స్థితో అస్మి గతసందేహః కరిషే వచనం తవ

కృష్ణా! నీ అనుగ్రహము వలన నా అజ్ఞానము నశించినది. {18.73}
సంశయ రహితుడ నైతిని. నీ ఆజ్ఞను శిరసావహింతును ఀ

గీత చెప్పేది: యుద్ధం మరియు భక్తి. సంస్కారాలతో, ఎప్పుడూ విడువకుండా, పోరు సల్పి తక్కిన వాటికై భక్తి సల్ప౦డి. అర్జునుడు "నాకు గత స్మృతి కలిగింది. నేనెవరినో తెలిసికొన్నాను" అని చెప్పెను. మన ప్రస్తుత పరిస్థితి మతిమరుపుతో కూడినది. మన దైవత్వాన్ని మరిచిపోయేం. ఒకరికి మతిమరుపు కలిగితే వాని బంధుమిత్రులు వచ్చి వానికి ఎరుక కల్పించరూ? మన౦ ఆధ్యాత్మిక మరపు నుండి లేచి ఇలా గుర్తు తెచ్చుకుంటాము: మనమొక విడిపడిన జీవి కాదు. మనం ఒక రాజ కుమారులం. మన కర్తవ్యం స్వరాజ్యానికి తిరిగి వెళ్ళడం.

శ్రీకృష్ణుడు మనకొక సవాలు ఇచ్చేడు: మీరు క్షమిస్తే, నిర్దయ కు బదులుగా దయ చూపితే, ప్రేమతో స్పర్థను జయించ గలిగితే, వెలుగులో ఉన్నారు. కానీ మీరు క్షమించ లేక పోతే, హింసను హింసతో ఎదుర్కొంటే, ప్రతిపక్షంలో ఉన్నారు. కావున గీత చెప్పేది: ప్రపంచం యొక్క విధి మీ చేతులలో ఉంది. మన ఎన్నిక చేసికొని, ప్రపంచాన్ని మలచుకోవాలి.

మనలోని క్రూరమైన శత్రువును ఎన్నో ఏళ్లు తెలికోలేదు. మన ప్రవృత్తి, తిరుగుబాటు తనము, భయం లేకుండుట ఇందుకని: మనం ప్రపంచాన్ని ఒంటరిగా పడవలో ప్రయాణించే ధైర్యం, ఎవ్వరూ ఎక్కని కొండని ఎక్కే ధైర్యం, ఎందుకంటే మన అహంకారాన్ని జయించడానికి. ఏ పోరూ దీనికి సరి కాదు. ఏ యుద్ధం ఇంత భీకరంగా ఉండదు. కాని యుద్ధం గెలిచిన తరువాత, మన అచేతన మనస్సులోని క్రోధము, భయము, దురాశ సమసి మన చేతనము కాంతితో నిండి యుంటుంది.

ఉపనిషత్లు చెప్పినట్లు: మనము అవాస్తవము నుంచి వాస్తవమునకు, చీకటినుంచి వెలుగుకు, మరణము నుండి అమరత్వమునకు వెళ్తాం. 480

Chapter 18 Section 30

Bhagavat Gita

18.30

అధ్యేష్యతే చ య ఇమం ధర్మ్య౦ సంవాదవయోః {18.70}

జ్ఞానయజ్ఞేన తేనాహం ఇష్టః స్యామితి మే మతిః

మన ఈ ధర్మరూపమైన సంవాదమును ఎవరు చదువునో వాడు జ్ఞాన యజ్ఞముతో నన్ను పూజించిన వాడగుచున్నాడు. ఇది నా అభిప్రాయము

శ్రద్ధావాననసూయశ్చ శృణుయోదపి యో నరః {18.71}

సో అపి ముక్తశ్శుభాన్ లోకాన్ప్రాప్నుయా త్పుణ్యకర్మణామ్

ఈ గీతాజ్ఞానమును శ్రద్ధావంతుడై, అసూయా రహితుడై ఆలకించెడి మనుజుడు పాపరహితుడై పుణ్యాత్ములు పొందెడి లోకములను పొందుచున్నాడు ఀ

సంప్రదాయం ప్రకారం సంతోషమైన ప్రపంచం అనగా స్వర్గం, మరణించిన తరువాత పొందేదని చెప్పబడుచున్నది. గీతా పారాయణం చేసినంత మాత్రాన స్వర్గం వస్తుందని నమ్మేవారిని చూసి పండితులు నవ్వుతారు. ధ్యానం చేయక పోయినా ఒక శాస్త్రాన్ని ఔపాసన భక్తితో, శ్రద్ధతో చేస్తే మనస్సు శుద్ధి చెందుతుంది. ఆ విధంగా మన కర్మలు కూడా శుద్ధమవుతాయి.

శ్రీకృష్ణుడు "ఎవరైతే గీతని భక్తితో, శ్రద్ధతో చదువుతారో, వాళ్ళు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. ఇది మూఢ నమ్మకము కాదు. శ్రద్ధ గలవారు--అనగా తమను భౌతికంగా కాక, ఒక రసాయన సముదాయము కాక చూచువారు -- దానిని నమ్ముతారు. ఇది జ్ఞానమనే ఒక కిటికీని తెరవడానికి చాలు. అటువంటివారు తమకు జీవితం లేదా మనుష్యుని గూర్చి పూర్తి అవగాహన లేదని నిజాయతీగా చెప్తారు. వారు మేమి౦కా వెదుకుతున్నామని చెప్పవచ్చు. హృదయం అంగీకరిస్తే అది చాలు. గీత మొదలైన శాస్త్రాలను నిష్కపటంగా చదివి, వానిని నిజ జీవితంలో పరీక్షిస్తే గొప్ప ఆశను పొందుతారు.

శ్రీకృష్ణుడు వారు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు అని ప్రమాణం చేయలేదు. వారు ప్రపంచ సమస్యలు: పేదరికం, కాలుష్యం, జాత్యాహంకారం, కుటుంబంలో స్పర్థలు, అహంకారం మొదలైనవాటిని స్పష్టంగా చూస్తారు. కానీ ఎన్నిక చేయడానికి అవకాశం ఉందని తెలుసుకొంటారు. వారు తమ జీవితానికి ఒక లక్ష్యం ఉందని, ప్రపంచానికి సహాయ పడగలమని తెలుసుకొంటారు. దానికి కావలసిన పనిముట్లుతో -- ధ్యానం మొదలగునవి-- తమ అంతర్గత శక్తిని వెలికి తీయగలగుతారు. శ్రీకృష్ణుడు "అటువంటివారు ఆహ్లాదకరమైన ప్రపంచాన్ని పొందుతారు" అని చెప్పెను. నేననేది "వారు ప్రపంచాన్ని ఆహ్లాదకరంగా చేస్తారు." బాధల మధ్యలో ఇతరులకు సహాయం చేయడం వలన ఆనందాన్ని పొందుతారు.

విపష్చిత్ అనే ఒక రాజు పూర్వం ఉండేవాడు. అతను అశోకుడి లాగ తన దేశ ప్రజల సౌఖ్యముకై పాటుపడ్డాడు. ప్రజలు అతన్ని ప్రేమించి గౌరవించేవారు. అతను మరణించిన తరువాత శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై స్వర్గానికి తీసికువెళతానన్నాడు. కానీ విపష్చిత్ కు ఒక ప్రశ్న కలిగింది. "దేవా నేను స్వర్గ సుఖాలు అనుభవించే ముందు, నరకంలో కలిగే దుఃఖాలను చూడవచ్చా?"

శ్రీకృష్ణుడు అలాగే అని, ఒక దూతనిచ్చి నరకానికి తీసికెళ్లమన్నాడు. కాని అతడు ఎక్కడకి వెళ్ళినా జనులు ఆనందంతో వచ్చి ఆయనను ఆదరించేరు. ఆయన దూతని "నేను నరకాన్ని చూడాలనుకొన్నాను. నన్ను స్వర్గానికి ఎందుకు తీసికు వచ్చేవు?" అని అడిగేడు.

దూత "మహానుభావా, ఇదే నరకం" అన్నది.

"నాకు అర్థమవ్వటంలేదు. నేను నరకం దుఃఖ మయం అనుకొన్నాను. కానీ ఇక్కడ అందరూ ఎందుకు ఆనందంగా ఉన్నారు?"

"ప్రపంచం దుఃఖంతో కూడియున్నది. నీవు వాళ్ళను చూడడానికి వచ్చినందుకు అంత ఆనందం పొందుతున్నారు"

"నేను ఇంకా ఎక్కడికి వెళ్ళను. నా స్వర్గం ఇక్కడే" అని విపష్చిత్ అన్నాడు 478

Chapter 18 Section 29

Bhagavat Gita

18.29

య ఇమం పరమం గుహ్యం మద్భక్తేష్వ భిధాస్యతి {18.68}

భక్తిం మయి పరాం కృత్వా మామేవైష్య త్యసంశయః

పరమ రహస్యమైన గీతా జ్ఞానమును నా భక్తులకు ఎవ్వడు చెప్పుచున్నాడో వాడు నాయందు ఉత్తమమైన భక్తిని కలిగి, సంశయ రహితుడై నన్నే పొందగలడు

న చ తస్మాన్మనుష్యేషు కశ్చిన్మే ప్రియకృత్తమః {18.69}

భవితా న చమే తస్మాత్ అన్యః ప్రియతరో భువి

మనుష్యులలో అతని కంటెను నాకు ప్రియమైనవాడు మరొకడు లేడు. అతని కంటెను మిక్కిలి ప్రియ మొనర్చువాడు మరి యొకడు ఉండబోడు ఀ

ప్రపంచంలో పేదరికం, కాలుష్యం, అణ్వాశ్త్రములు ఉండగా, మంచివారు కూడా, ధ్యానం అవసరమా అని అడుగుతారు. భౌతిక సమస్యలు కళ్ళకు కనబడతాయి. ధ్యానం నిశ్శబ్దంగా ఉండి దైనిందన కార్యములతో ఎటువంటి సంబంధం లేనట్టు ఉంటుంది. "ధ్యానం రక్తపు పోటును తగ్గించవచ్చు, కానీ అది ప్రపంచ సమస్యలకు ఎలా పరిష్కారం ఇస్తుంది?" అని అడిగేవారున్నారు.

ధ్యానం ఒక పనిముట్టు వంటిది. ఎవ్వరైనా దానిని ఉపయోగించి తమలోని గొప్ప శక్తిని వెలికి తీసి ఇతరుల సేవకై వినియోగించవచ్చు. గీత చెప్పే జ్ఞానం మనలో గుప్తంగా ఉన్న శక్తిని నిస్వార్థమైన కర్మలు, చాకచక్య౦తో నాచరించుకొనడానికి ఉపయోగపడుతుంది. కర్మలు మనిషి మనిషికి తేడాగా ఉంటాయి. ధ్యానం చేయగలగింది మనలోని శక్తిని విడదల చేయడం. శ్రీకృష్ణుడు చెప్పేది: ఇంకొక బోధకు ఇంత విలువ లేదు. ఏ అంశంలో నైనా, అంతర్గతమైన శక్తిని బయట పెట్టడంవలన, మానవాళి సమస్యలను పరిష్కరించడం వీలవుతుంది. అందుకే బుద్ధుడు ఇట్లు చెప్పెను: ఎవరైతే క్రోధం, భయం, దురాశ మన హృదయాల లోంచి దూరం చేస్తారో, అటువంటివారు ప్రపంచానికి అత్యుత్తమ సేవ చేసిన వారవుతారు.

ఎన్నిక చేసుకోవడానికి వీలులేని ప్రపంచంలో అటువంటివారు గొప్ప ఆశను కల్పిస్తారు. యోగులు చెప్పేది మంచితనం, ప్రేమ, భక్తి ప్రపత్తులు గురించి. వారు మనలోని సహజమైన ప్రేమ గూర్చి చెప్తారు. వారు దానిని మనకు చూపిస్తారు కూడా. ఒక ఆధ్యాత్మిక గురువుకు అట్టి ప్రేమ ఉంటుంది. మనం మంచిని మనస్సులోకి ఎక్కించుకోనక్కరలేదు. మనస్సు నుండి చెడుని తీస్తే చాలు. మనం ప్రేమ స్వభావమును ఎక్కడనించో తెచ్చు కొనక్కరలేదు. మనలోని ప్రేమ మీద ఉన్న దుమ్మును దులిపితే చాలు. అలాచేస్తే మానవాళి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. విలియం లా చెప్పినట్లు "సమస్యలు ప్రేమ లేకపోవడం వలన కలుగుతాయి". 476

Chapter 18 Section 28

Bhagavat Gita

18.28

ఇదం తే నాట్యపస్కాయ నా భక్తాయ కదాచన {18.67}

న చాశుశ్రూషవే వాచ్యం న చమా౦ యో అభ్యసూయతి

నేను నీకు బోధించిన ఈ గీతామృతమును తపస్వి కాని వానికి, భక్తుడు కానివానికి, శుశ్రూష చేయని వానికి, నన్ను ద్వేషించినవానికి చెప్పగూడదు

గీత ఎవరైతే శ్రద్ధతో విని, పాటిస్తారో వారి గురించై చెప్పబడినది. గీత జీవితం, మరణం గురించి చెప్పిన జ్ఞానము అనిర్వచనీయము. కాని ఆ జ్ఞానము అక్కరలేదు అనే వారికి గీత బోధించుట వ్యర్థము.

మనము ప్రపంచాన్ని చేతన మనస్సుతో అనుభవిస్తాము. జీవితాన్ని మనమెలా ఉన్నామో అలాగ చూస్తాము. అది మన నడవడికకు మూలము. నిర్దయ, తప్పుగా అర్థం చేసికోవడం, అసహనం మన తప్పుడు అవగాహన వలన కలుగుతాయి.

నా పెంపుడు కుక్క మూకాకు ఆకాశం నీలంగా ఉంది, మొక్కలు పచ్చగా ఉన్నాయి అని చెపితే అంగీకరించదు. ఎందుకంటే అది నలుపు, తెలుపు తప్ప మిగతా రంగులు చూడలేదు. అలాగే ఒక కళాకారుడు, నేను నీలం అనుకునే వస్తువులో, అనేక నీలి ఛాయలు చూస్తాడు. ఎవరి ప్రపంచం నిజం? నేను, మూకా, ఉండే ప్రపంచాలు వేర్వేరు.

నేను సాన్ ఫ్రాన్సిస్ కో వెళితే, నేను చూసే ప్రపంచం, పర్యాటకులు చూసే ప్రపంచం వేర్వేరు. మన మనస్సు అనుభవించే ప్రపంచంలో మనముంటాము. నేను చిన్నప్పుడు చూసిన ప్రపంచం, ఇప్పుడు చూసే ప్రపంచం వేర్వేరు. నేను మనుష్యులను నా మిత్రులు గాను, శత్రువులగాను చూడను. నేను వారిలో భగవంతుడ్ని చూస్తాను. ముఖ్యంగా నేను అర్థవంతమైన ప్రపంచాన్ని చూస్తాను. దాని రూపము కొన్ని శక్తుల వలన కలిగినది. ఆ శక్తులు మన అవగాహనకు వచ్చునవి, మనచే నియంత్రింపబడగలవి. ఎందుకంటే అవి కర్మ సిద్ధాంతానికి అనుగుణంగా ఉంటాయి. నేను చూసే ప్రపంచం యాదృచ్ఛికంగా రాలేదు. నేను అన్ని చోట్లా ఎన్నిక చేసికోవచ్చును. ఒకడు తన ప్రపంచంలో గుడ్డిగా పనిచేసే శక్తులు, అర్థంలేని సంఘటనలు, ఎన్నిక లేకపోవుట చూస్తే నేను ఏ విధంగా అభ్యంతరము చెప్పగలను?

ఈ శ్లోకం చెప్పేది ఆధ్యాత్మిక నిజాలను పరిహసించే వారిని ఖండించ కూడదని. మనం మూకాని రంగులు చూడలేదని శిక్షి౦చలేము. అలాగే అనాసక్తిగా ఉన్నవారికి గీత గురించి చెప్పడంవలన లాభం లేదు. మన చేతన మనస్సులో ఒక కిటికీ ఉంది. దానిని తెరిచి గీతను వినాలి. ఆ కిటికీ తెరవకపోతే గట్టిగా వక్కాణించే శక్తివంతమైన పదాలు ఒక చెవిలో ఎక్కి రెండవ చేవిలో౦చి వెళ్ళిపోతాయి. వాటి మధ్యలో ఎటువంటి జ్ఞానం కలగదు. 475

Chapter 18 Section 27

Bhagavat Gita

18.27

మన్మనా భవ మద్భక్తో మద్యాజీ మాం నమస్కురు {18.65}

మామేవైష్యసి సత్యం తే ప్రతిజానే ప్రియో అసిమే

నా యందు మనస్సు నుంచుము. నా భక్తుడవు కమ్ము. నన్ను అర్చించుము. నాకు నమస్కరింపుము . అట్లు కావించెద వేని నన్నే పొందగలవు. నీవు నాకు ఇష్టుడవు. అందువలన సత్యమును ప్రతిజ్ఞ చేసి చెప్పుచున్నాను

సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ {18.66}

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః

సర్వధర్మములను త్యజించి నన్నొక్కనినే శరణు పొందుము. నేను నిన్ను సకల పాపములనుండి విడిపించెదను. నీవు శోకింపకుము

గాంధీ మహాత్ముని ఒకరడిగేరు: "దేవుడు మనని ఎందుకు సంతృప్తి పరచడు?" ఆయన జవాబు: "అది ప్రేమకాదు. ఒప్పందం." నిజమైన దైవ భక్తుడు తనకున్నదంతా ఇతరులకై దారపోస్తాడు. బదులుగా ప్రేమ తప్ప ఏమీ అడగడు.

అతి తక్కువ యోగులు ఒకేమారు తమ కున్నదంతా త్యజిస్తారు. తక్కినవాళ్ళు ఇంద్రియ సుఖములను ఆశిస్తారు.

ధ్యానంలో మనము అచేతన మనస్సు లోతులకు వెళతాము. అక్కడ అనేక శక్తులు ఉంటాయి. మనస్సులో ఒక చేతనం నుంచి ఉంకొకదానికి వంతెనలు లేవు. మనము చేతనముగా ఉండి, అచేతన మనస్సుని పరిశీలించడం కల్ల, సాధింపలేనది అని మనస్తత్వ శాస్త్రజ్ఞులు అంటారు.

చూడడానికి మత్సరమనే సంస్కారం చిటికెన వేలంత ఉంటుంది. ధ్యానం గాఢమై, ఆ సంస్కారాన్ని లోతుగా పరిశీలిస్తే అది మణికట్టంత పెద్దదిగా కనిపిస్తుంది. ఇంకా లోతులో అది మన చేయంత ఉంటుంది. అది రాత్రి మన కలలలోకి వస్తుంది. ఇదే స్థిర భావం. అది చిత్రహింసలు పెడుతుంది. మనము దానిని విడిపించుకొనుటకై చాలా ప్రయత్నం చేయాలి.

మనకుండాల్సినది మీరా, సెయింట్ తెరెసా లాంటి వారి ప్రేమ. "నేను అంతా పోగొట్టుకున్నా, నిన్నే ప్రేమిస్తాను. వేరొకరిని ప్రేమించను. నీవే నా లక్ష్యం" అని దేవుడ్ని ప్రార్థించాలి. అటువంటి శరణాగతి తప్ప వేరేదేదీ మనను రక్షింపలేదు.

"నీవు నన్ను శరణాగతి కోరితే నిన్ను సర్వ కర్మలనుండి, సర్వ పాపాలనుండి విముక్తిని చేస్తాను" అని శ్రీకృష్ణుడు చెప్పెను. శరణాగతి కోరే ముందు మన మనస్సు నిశ్చలంగా ఉండాలి. అన్ని స్వార్థపూరిత ఆలోచనలినీ వదులుకోవాలి. అలాంటప్పుడు మనమేమి కర్మ చేస్తాము? మనం గతంలో చేసిన పాప కృత్యాలు మన మనస్సునుండి చెరిపివేయబడతాయి. అటు తరువాత మనం శుద్ధుల మవుతాము. మనం ఎంతో గొప్ప యోగులు మొదట నిర్లక్ష్యంగా బ్రతికి సాధన చేసేరని విన్నాము. వారిని ఎవరైనా "మీరు నిజంగా ఇటువంటి పనులు చేసేరా?" అని అడిగితే వారి సమాధానం: "అదొక కల. అది చాలా కాలం క్రింద జరిగింది. నేను అటువంటి వ్యక్తిని ఒకనాడు. కాని వాడు మరణించేడు. శరీరం ఒకటే, కాని అందులో పూర్తిగా మారిన మనిషి ఉన్నాడు". ఒక సినిమా అంతమైనప్పుడు అంతకు ముందు ఒక కాలుతున్న అడవిని చూపించినా తెర ఎలా తెల్లగా మిగులుతుందో, మన గతం మనమీద ఆరోపింపబడదు.

Viveka Sloka 47 Tel Eng

Telugu English All వేదాంతార్థవిచారేణ జాయతే జ్ఞానముత్తమమ్ । తేనాత్యంతికసంసారదుఃఖనాశో భవత్యను ॥ 47 ॥ వేదాంత విచారేణ- ఉపని...